
4380 వార్తలు
నవతెలంగాణ-హైదారాబాద్: పశ్చిమాసియా యుద్ధంలో బాంబుల మోతతో పాటు మీమ్ల దాడులను ఇరాన్ ఉధృత్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ వేదికగా ఏఐ టెక్నాలజీతో ట్రంప్ చేష్టలపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తోంది. తాజాగా నిరవధిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించిన ప్రకటనపై వ్యంగ్యస్త్రాలు సంధించింది. రెండో దఫా శాంతి చర్చల కోసం జేడీ వాన్స్ బృందం వేచి చూస్తుండగా..ఇరాన్ బృందం పాక్కు వెళ్లలేదు. దీంతో పాకిస్థాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటిస్తుండగా..ఇరాన్ ప్రతిస్పందనగా […] The post ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్ సెటైర్లు appeared first on Navatelangana.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి టేబుల్లో 9వ స్థానానికి పరిమితమైంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్ జట్టుపై జరిగిన మ్యాచ్లో విజయానికి మార్గం సులభంగా ఉన్నా.. దాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. బ్యాటింగ్లో మూడు బంతులు ఎదురుకొని డకౌట్ అయ్యాడు. దీంతో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన వికెట్ కీపర్ బ్యాటర్ల జాబితాలో ధోనీ(6) రికార్డను పంత్ దాటేశాడు. నిన్నటి దానితో కలిపి పంత్ మొత్తంగా 7 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో గిల్క్రిస్ట్తో కలిపి సంయుక్తంగా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. డక్ మాస్టర్ల జాబితాలో దినేశ్ కార్తిక్(16), పార్థివ్ పటేల్ (10), నమన్ ఓఝా(8) టాప్-3లో ఉన్నారు. ఇక నిన్నటి మ్యాచ్లో లక్నో బౌలింగ్లో శభాష్ అనిపించింది. ఆర్ఆర్ను కేవలం 159 పరుగులకే కట్టడి చేసింది. కానీ, ఈ స్వల్ప లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం విఫలమైంది. ఆర్చర్ (3 వికెట్లు), బర్గర్ (2 వికెట్లు), బ్రిజేశ
నవతెలంగాణ – హైదరాబాద్: స్టార్ కమెడియన్గా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన సత్య, ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’. రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ ట్రైలర్, చూసిన వారిని కడుపుబ్బా నవ్విస్తోంది. ట్రైలర్ ఆద్యంతం సత్య తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని […] The post ‘జెట్లీ’ ట్రైలర్ విడుదల.. appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదారాబాద్: బెంగాల్ తొలి విడత పోలింగ్లో ఘర్షణ నెలకొంది. ముర్షిదాబాద్లో పోలింగ్ ఎదుట టీఎంసీ, మాజీ తృణమూల్ నాయకుడు, ప్రస్తుతం ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏయూజేపీ) వ్యవస్థాపకుడైన కబీర్ హుమాయున్ కబీర్కు మధ్య గొడవ జరిగింది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఇరువర్గాల అనుచరులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు హుమాయున్ కబీర్ను పోలింగ్ పరిసర ప్రాంతాల నుంచి పంపించారు. కాగా, ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్లో ప్రజలు ఉత్సహంగా పాల్గొంటున్నారు. ఉదయం 9గంటలకు పోలింగ్ శాతం […] The post బెంగాల్ ఎన్నికలు..ముర్షిదాబాద్లో ఉద్రిక్తత appeared first on Navatelangana.










మొత్తం 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దఫా 152 నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే డార్జిలింగ్ నియోజకవర్గంతోపాటు సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న తూర్పు మిడ్నపూర్ నియోజకవర్గాలు కూడా మొదటి దఫా ఎన్నికలకు సిద్ధమయ్యాయి. తొమ్మిది జిల్లాల్లోని ఏడు జిల్లాలు బంగ్లాదేశ్ సరిహద్దులో భాగంగా ఉంటున్నాయి. అవి ముర్షీదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్, కూచ్ బీహార్, జలపాయ్గురి, డార్జిలింగ్ నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి. అంచనాలకు విరుద్ధంగా స్థానిక ప్రభుత్వంపై వ్యతిరేకత గత 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి కన్నా ఇప్పుడు బలంగానే కనిపిస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో అది ప్రాధాన్యమైన అంశం కాదు. ఇప్పుడు ఓటర్ల దృష్టి సన్నిహితం, వ్యక్తిగతంపైనే కేంద్రీకరించబడింది. ఓటర్ల జాబితాల్లోంచి ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా కొన్ని లక్షల మంది ఓటర్ల పేర్లను పాత నిబంధనలను పక్కన పెట్టి కొత్త నిబంధనలతో ఎన్నికల కమిషన్ తొలగించడం, వారికి ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును లేకుండా చేయడంపైనే ఓటర్లు చాలా తీవ్రంగా ఉన్నారు

ఆధునిక ప్రపంచంలో పర్యావరణ స్పృహ, చేతన మొదలై 56 సంవత్సరాలు. రాచెల్ కార్సన్ పుస్తకం ‘ది సైలెంట్ స్ప్రింగ్’ సంచలనం సృష్టించింది. మానవ చర్యలు, ప్రమేయాలవల్ల వాతావరణ కాలుష్యాలతో ప్రకృతి సమతుల్యత నాశనమై పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోందనే చేతన అప్పుడప్పుడే మొదలైంది. కాలుష్యాలవల్ల జరుగుతున్న హాని, చేపట్టవలసిన సత్వర చర్యల అవసరం- అవగాహనను రాజకీయ ఎజెండా మీదికి తీసుకురావాలని అమెరికా సెనెటర్ గెలార్డ్ నెల్సన్ చేసిన ప్రయత్నమే ‘ధాత్రి దినోత్సవం’ (22 ఏప్రిల్ 1970) పుట్టుకకు కారణం. యుద్ధ వ్యతిరేకోద్యమం, జ్వాలలు రేపుతున్న నాటి యువశక్తి ప్రభావాన్ని గుర్తించి, దాన్ని పర్యావరణ చేతన వైపు కూడా మళ్లిస్తే అద్భుత ఫలితాలుంటాయనేది నెల్సన్ ఆనాటి తలంపు. ఆ దృష్టితోనే యువ విద్యార్థి నాయకుడిగా ఉన్న ‘డెన్నిస్ హెయిన్స్’పై దృష్టి పడింది! సదరు యువకున్ని కేంద్రకం చేసి రగిల్చిన అగ్ని- స్వల్ప సమయంలోనే దావాణంలా అంటుకుంది.సరైన రవాణా- కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ కూడా లేని ఆ రోజుల్లో ఇద్దరే ఇద్దరి కృషి అమెరికా, యూరప్, ఇతర దేశాల్లోని రెండు వందల నగరాలు-పట్టణాల్లో రెండు కోట్ల (20 మిలియన్ల) మందిని కదిలించింది. తొలిసారి ఐక్యరాజ్యసమితి

తమిళనాడు రాజకీయాల్లో సినీనటుడు విజయ్ ప్రవేశం కొత్త ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, ఓటర్ల అభిప్రాయం మాత్రం ఏకపక్షంగా లేదు. పట్టణాల్లో యువతలో కొంత ఉత్సాహం కనిపిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం జాగ్రత్తగా చూసే ధోరణి ఉంది. స్టార్ పవర్ కంటే పాలన అనుభవం ముఖ్యమని చాలా మంది భావిస్తున్నారు. విజయ్ సినిమాలు మాకు చాలా ఇష్టం.కానీ రాష్ట్రాన్ని నడపడం సినిమా కథలా కాదు. ఆయన చెప్పేవిధానాలు ఏమిటో ముందుగా చూడాలి. - చెన్నైలో ఓ యువ ఓటరు కొత్త వాళ్లు రావడం మంచిదే. కానీ మా సమస్యలు - వ్యవసాయం, ఉపాధి -ఇవి ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. అప్పుడే మేము నమ్ముతాం. తిరుచిరాపల్లి జిల్లాలో ఓ రైతు. రాజకీయాల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఓ నాయకుడు అధికారంలోకి రాకపోయినా, అధికారాన్ని ఎవరికిస్తాడో నిర్ణయించే స్థాయికి చేరుకుంటాడు. తమిళనాడు రాజకీయాల్లో 2026 ఎన్నికలు అలాంటి మలుపు వద్ద నిలిచాయి. సినీనటుడు విజయ్ ప్రవేశం ఈ ఎన్నికలను సాధారణ పోటీ నుంచి ఒక రాజకీయ ప్రయోగంగా మార్చింది.దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు రెండు ప్రధాన శక్తుల చుట్టూ తిరిగాయి. ఒక వైపు అధికారంలో ఉన్న డిఎంకె, మరో వైపు అధికారాన్ని కోల్పోయిన కానీ ఇంకా ప్రాతిపదిక ఉన్న

‘ఉద్యమాలెన్నీ వచ్చినా, సంపద, అధికారం మాత్రం ఆధిపత్య వర్గాలదే -కుల సర్వే రిపోర్ట్ ఒక ఉదాహరణ. -తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం భూమికోసం, నీటికోసం, ఉద్యోగాలకోసం జరిగినవే ఈ పోరాటాల ఫలితాలు మాత్రం సాంప్రదాయంగా అధికారం, భూమి, మూలధనం కలిగి ఉన్న ఆధిపత్య కులాలు చేజిక్కించ్చుకున్నవి. దీంతో సంఖ్య లో మెజారిటీగా ఉన్న బిసి, ఎస్సి, ఎస్టి వర్గాలు పోరాటాల్లో ముందుండి కూడా, ఫలితాల్లో మాత్రం వెనుకబడిపోయారు. ఇదే నిజాన్ని కుల సర్వే స్పష్టంగా అసలు స్వరూపం బయటపెట్టింది. సంఖ్యలో మెజారిటీ అయిన.. బహుజనులు సంపదలో, అధికారంలో మాత్రం మైనారిటీగా మిగిలిపోయిన వాస్తవాన్ని అది వెల్లడించింది. శ్రమ బహుజనులది, భోగాలు మాత్రం ఆధిపత్య కులాలవే అన్న చారిత్రక అసమానతను ఈ గణాంకాలు అద్దంలా చూపించాయి. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే రిపోర్టు (కులసర్వే రిపోర్ట్) -అర్ధసత్యాల రిపోర్ట్. తెలంగాణలో ఇటీవల విడుదలైన కులసర్వే రిపోర్ట్ ఒక సాధారణ గణాంక పత్రం కాదు. ఇది రాష్ట్రంలోని శక్తి సమీకరణాలను, వనరుల పంపిణీని, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని ప్రతిబింబించిన కీలక పత్రం. బహుజన సమాజం శతాబ్దాలుగా అనుభవిస్తున్న అసమ

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ వరుస విజయాలతో దూసుకు పోతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ నాలుగు విజయాలను అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లతో జరిగిన మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత సారథ్యంతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు.బ్యాట్తోనే కాకుండా తన అద్భుత కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతూ జట్టును ముందుకు తీసుకెళుతున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా జట్టు విజయాల్లో తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. విధ్వంసక బ్యాటింగ్తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్లో కళ్లు చెదిరే శతకం సాధించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తూ అ

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. బుధవారం మేకర్స్ ‘గోదారి గట్టుపైన’ నుంచి ’నేను నా పల్లెటూరు’ పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందాన్ని అద్భుతంగా చూపించింది. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఈ సాంగ్లో సుమంత్ ప్రభాస్ తన ఫ్రెండ్స్తో గడిపే సరదా క్షణాలని, పల్లెటూరి సింపుల్ లైఫ్ను ఎంతో సహజంగా చూపించారు. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
నవతెలంగాణ-హైదారాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కారైకుడి అనే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. యువత ఓటు హక్కును సద్వినియోగించుకొని సమాఖ్య వాదాన్ని రక్షించాలని, కొత్త ఓటర్లు ఉత్సహంగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. తమిళనాడులో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ సాగనుంది. మరో వైపు బెంగాల్లో కూడా తొలి […] The post ఓటు వేసిన మాజీ ఆర్థిక మంత్రి appeared first on Navatelangana.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మే చివరలో రవి కిరణ్ కోలా కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో విజయ్ దేవరకొండ పై సాంగ్ ను షూట్ చేయనున్నారని, అనంతరం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ అనుకుంటున్నారు. మరి ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ కనిపిస్తోందో చూడాలి. కాగా ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ పాత్ర లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.
