
4378 వార్తలు
నవతెలంగాణ – హైదరాబాద్ : బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. యాపిల్ ఐఫోన్లను అసెంబుల్ చేసే ఫాక్స్కాన్ కంపెనీ ఫ్యాక్టరీలో ఓ యువతి తాను ప్రసవించిన పసికందును దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన దేవనహళ్లిలోని ఫ్యాక్టరీలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే… ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 19 ఏళ్ల రేణుక అనే యువతి టాయిలెట్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన వెంటనే, బిడ్డ గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని ఓ బ్యాగులో పడేసింది. ఈమె అవివాహిత […] The post టాయిలెట్లో ప్రసవించి..పసికందును హత్య చేసిన యువతి appeared first on Navatelangana.

హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల జీవితాలతో యాజమాన్యం, సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుకుంటుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ మెడలు వంచి డిమాండ్లను సాధించుకుందామని అన్నారు. ఆర్టిసి కార్మికుల నిరసనలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు. ఆర్టిసి కార్మికులను విధుల్లోకి రావాలని ఎండి బెదిరిస్తున్నారని, ఆర్టిసిని ప్రైవేటు పరం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని విమర్శించారు. ఆర్టిసి కార్మికులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని, కేబినెట్ భేటీలో ఆర్టిసి కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా ఆర్టిసి డైవర్లతో నడిపించాలని సూచించారు. ఆర్టిసి కార్మికులను రోడ్డున పడేస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, ఆర్టిసి కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సచివాలయం ముట్టడిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘రాకా’. ఈ సినిమాలో అల్లు అర్జున్కు జోడీగా దీపిక పదుకొనే నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా దీపిక ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో ఆమె పలు డేంజరస్ యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి వస్తుంది. అయితే దీపికా ఇటీవలే మరోసారి గర్భం దాల్చారు. దీంతో ఆమె స్టంట్స్ చేయలేరని.. ఆమె స్థానంలో వేరే హీరోయిన్ని తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ని ‘రాకా’ టీమ్ ఖండించింది. సినిమాలో దీపిక పాత్ర నిడివి తగ్గించారనే ప్రచారాన్ని కూడా కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని స్ఫష్టం చేసింది. రూమర్స్ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఇక ఈ సినిమాలో దీపికతో పాటు మరికొందరు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


మేషంసంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. మిధునం నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. కర్కాటకం దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది



నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ కొనసాగున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ‘ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం మాదే. బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయం. డీఎంకే ఈ ఎన్నికల్లో చర్రిత తిరగరాస్తుంది’ అని అన్నారు. The post బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయం: ఉదయనిధి స్టాలిన్ appeared first on Navatelangana.


అమరావతి: వైసిపి హయాంలో పరిశ్రమలు వెనక్కు వెళ్లాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అందిస్తామని హామీ ఇస్తే కూటమిని గెలిపించారని అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో క్లీన్ ఎనర్జి ప్లాంట్ ప్రాజెక్టు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు పాల్గొన్నారు. మొత్తం రూ.5,400 కోట్ల పెట్టుబుడులతో ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..2019- 2024 మధ్య రాష్ట్రంలో విధ్వంసం చేశారని, గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. వైసిపి హయాంలో ఎక్కడ చూసినా అవినీతి అని మండిపడ్డారు. ఉచితంగా సోలార్ ఎనర్జీని వినియోగించుకోలేదని, గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల అదనపు భారం మోపిందని ధ్వజమెత్తారు. భవిష్యత్ లో ఆర్టిసి బస్సులన్నీ వైయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్ లుగా మారుస్తామని, ప్రతీ ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని అన్నారు. రైతులు కూడా పొలం దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని, రూ.20 లక్షల 74 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలియజేశారు. ఎంవొయూ చేసి మూలకు పడేయం తమ పాలసీ కాదని, ఎవరికి ఎంత కరెంటు కావ

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ క్యాంపులో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టులో ఓ సభ్యుడికి కోలుకోలేని దుఃఖం వచ్చింది. జట్టు పేసర్ ముకేశ్ చౌదరికి మాతృవియోగం కలిగింది. అతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సిఎస్కె తమ సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ముకేశ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. కష్ట సమయంలో ముకేశ్తో ఉన్నామని భరోసా ఇచ్చింది. తల్లి అంత్యక్రియల కోసం ముకేశ్ తన స్వస్థలానికి వెళ్లడంతో ఇవాళ ముంబై ఇండియన్స్తో జరిగే కీలక మ్యాచ్కి అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా బలహీనపడిన సిఎస్కె బౌలింగ్ విభాగానికి ఇది మరో భారీ ఎదురుదెబ్బగా మారింది.
నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు రాజస్థాన్ పేసర్ నంద్రే బర్గర్పై మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించారు. అంతేకాకుండా, ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు. ఐపీఎల్ నిర్వాహకుల ప్రకారం, బర్గర్ మ్యాచ్ సమయంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డాడు. ఈ లెవల్-1 […] The post రాజస్థాన్ రాయల్స్ పేసర్ కు షాక్.. appeared first on Navatelangana.

నవతెలంగాణ -ఉప్పల్: డా. ఏఎస్ రావు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇకపై చెల్లుబాటు కాదని, దానిపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్న హైకోర్టు నిర్ణయం సత్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఈ తీర్పుతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని విమర్శించారు. మాజీ […] The post హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి appeared first on Navatelangana.

విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. హారిక అండ్ హాసని క్రియేషనన్స్ బ్యానర్పై ఈ సినిమాను ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ‘హౌస్ నె0.47’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిప చాలా అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి తొలుత హర్షవర్థన్ రామేశ్వర్ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు అతడు సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో తమన్ని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని.. సోషల్మీడియాలో అనుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో పల్లె దావాఖానా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు గురించి ఆ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్.. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కలిసి విన్నవించినట్లు తెలిపారు. తమ విన్నపంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ అశోక్ పటేల్ విలేకరులకు తెలిపారు. సర్పంచ్ వెంట ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్ జుబ్రి ఆయనతో పాటు యువ నాయకులు ఉన్నారు. The post పల్లె దవాఖానాపై ఎమ్మెల్యేకు మేనూర్ సర్పంచ్ అశోక్ వినతి appeared first on Navatelangana.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం జెఎసి, కార్మిక నేతల డిమాండ్లు అంగీకరించాలని టిబిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు సూచించారు. ఆర్టిసి సమ్మెపై కేబినెట్ భేటీలో చర్చించాలని అన్నారు. బిజెపి కార్యాలయంలో భగీరథ మహిర్షి జయంతి కార్యక్రమం జరిగింది. భగీరథ మహర్షి చిత్రసటానికి రామచందర్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 41 రోజుల ముందే కార్మికులు నోటీసులు ఇచ్చారని, ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు సమ్మె చేపట్టారని తెలియజేశారు. ఆర్టిసి ప్రైవేటుపరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, గతంలో 63మంది కార్మికుల మరణానికి బిఆర్ఎస్ కారణమైందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మూడేళ్లయిందని, కొత్త బస్సులు లేవు..ఉన్న బస్సులను ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టిసి కార్మికులకు బిజెపి అండగా ఉంటుందని రామచందర్ రావు భరోసా ఇచ్చారు.
నవతెలంగాణ-మద్నూర్: బడి గంట నేటితో మూగబోనుంది. 2026 ఏప్రిల్ 23 వర్కింగ్ డేగా పాఠశాలలు కొనసాగుతూ జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించామని మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ తెలిపారు. ఏప్రిల్ 23 నుండి జూన్ 12 వరకు సెలవులు దాదాపుగా 50 రోజులపాటు పాఠశాలలకు సెలవులు రావడం బడిగంట 50 రోజులపాటు మూగబోవాల్సిందే. ఏప్రిల్ 23న పాఠశాలలు కొనసాగాయి. ఇకనుండి జూన్ 12 వరకు పాఠశాలలకు తాళాలే ఉంటాయి. 50 రోజులపాటు పాఠశాలల […] The post జూన్ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎస్కే జట్టుకు వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. యువ పేసర్ ముఖేష్ చౌదరి తన తల్లి ప్రేమ్ దేవిని కోల్పోవడంతో జట్టులో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి మంగళవారం రాత్రి కన్నుమూశారు. ముఖేష్ తన స్వగ్రామం రాజస్థాన్లోని భిల్వారాకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్తో జరగనున్న తదుపరి మ్యాచ్కు అతను దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జట్టులో గాయాలు, ఫామ్ లోపం వంటి సమస్యలున్నాయి. ముఖేష్ గైర్హాజరీలో […] The post సీఎస్కే యువ పేసర్ ఇంట విషాదం.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, వీధి బాలల జీవితం చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఏపీలో నైస్ విద్యాసంస్థ ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తోంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఈ నైస్ పేరుతో విద్యాసంస్థను 2003 ఆగస్టు 15న పోపూరి పూర్ణచంద్రరావు ప్రారంభించారు. సీబీఎస్ఈ సిలబస్లో.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక్కడ బాలబాలికలకు ఉచితంగా సకల సౌకర్యాలు […] The post ఈ స్కూల్లో CBSE చదువు ఫ్రీ.. హాస్టల్, ఫుడ్ ఉచితం.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : పదో తరగతి రెండో విడత పరీక్షల తేదీల షెడ్యూల్ను సీబీఎస్ఈ విడుదల చేసింది. మే 15 నుంచి మే 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని సీబీఎస్ఈ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. The post CBSE పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదారాబాద్: పశ్చిమాసియా యుద్ధంలో బాంబుల మోతతో పాటు మీమ్ల దాడులను ఇరాన్ ఉధృత్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ వేదికగా ఏఐ టెక్నాలజీతో ట్రంప్ చేష్టలపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తోంది. తాజాగా నిరవధిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించిన ప్రకటనపై వ్యంగ్యస్త్రాలు సంధించింది. రెండో దఫా శాంతి చర్చల కోసం జేడీ వాన్స్ బృందం వేచి చూస్తుండగా..ఇరాన్ బృందం పాక్కు వెళ్లలేదు. దీంతో పాకిస్థాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటిస్తుండగా..ఇరాన్ ప్రతిస్పందనగా […] The post ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్ సెటైర్లు appeared first on Navatelangana.