
4383 వార్తలు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మే చివరలో రవి కిరణ్ కోలా కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో విజయ్ దేవరకొండ పై సాంగ్ ను షూట్ చేయనున్నారని, అనంతరం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ అనుకుంటున్నారు. మరి ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ కనిపిస్తోందో చూడాలి. కాగా ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ పాత్ర లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.





నవతెలంగాణ-హైదారాబాద్: నేడు సాయంత్రం నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. పంజాగుట్టలో సాయంత్రం 4 గంటలకు నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నిన్న మధ్యాహ్నం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాదెండ్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న నాదెండ్ల భాస్కర్ రావు, పరిస్థితి విషమించడంతో మరణించారు. The post సాయంత్రం నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు appeared first on Navatelangana.





కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. తొలివిడతలో 40 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1,75 కోట్ల మంది మహిళలున్నారు. తొలివిడత బరిలో 1,478 మంది అభ్యర్థులు పోలింగ్ లో పాల్గొన్నారు. తొలివిడతలో భవానీ పూర్ నుంచి పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, బిజెపి లోక్ సభ సభ్యుడు సువేందు అధికారి పోటీ చేశారు. బెంగాల్ రెండో విడతలో 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. పోలింగ్ నేపథ్యం లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇసి పటిష్ట చర్యలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

నవతెలంగాణ-హైదారాబాద్: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్ తూట్లు పొడుస్తుంది. సౌత్ లెబనాన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో ఐదగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు జర్నలిస్టు అని ఆ దేశ మీడియా నేషనల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దక్షిణ లెబనాన్లోని అట్-తిరి గ్రామంలో మొదటగా ఓ వాహనంపై ఇజ్రాయిల్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో రెండు వాహనాలను లక్ష్యంగా దాడులు చేయగా, ముగ్గురు చనిపోగా అందులో ఒక్కరు జర్నలిస్ట్ […] The post లెబనాన్పై ఇజ్రాయిల్ దాడి.. జర్నలిస్టు మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదారాబాద్: ఇవాళ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అంతకముందు ఉదయం ఆరు గంటలకు రెండు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎంల పనితీరును పరిశీలించారు ఎన్నికల అధికారులు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో […] The post పోలింగ్ షురూ appeared first on Navatelangana.







