21758 వార్తలు

కిలో రూ.550 లకు అమ్మిన వ్యాపారులునవతెలంగాణ -అచ్చంపేటవిశాఖ నుంచి కొందరు చేపల వ్యాపారులు బుధవారం అచ్చం పేటకు ట్యూనా అనే సముద్రపు చేపలు విక్రయించడానికి తీసుకొచ్చారు. ఒక్కొక్క చేప 60 కిలోల పైగా ఉంటుంది. కిలో 550 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయించారు. పట్టణ ప్రజలు చేపల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మనిషి బరువు, గుండెజబ్బులను నియంత్రించే పోషకాలు ట్యూనా చేప మాంసంలో ఉంటాయని వ్యాపారులు వినియోగదారులకు వివరించారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడానికి […] The post అచ్చంపేటలో సముద్రపు చేపల విక్రయాలు appeared first on Navatelangana.

మేషంఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన ఋణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. మిధునం చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది. కర్కాటకం చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. సింహం ఋణదాతల ఒత్తిడులు చికాకు కలిగి

న్యూఢిల్లీ: జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాజ్యసభ బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈనెల 24న పెద్దలసభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభ ఆమోదముద్ర వేసింది. సవరించిన బిల్లు ప్రకారం ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, ఆలపించే సమయంలో ఎవరైనా ఆటంకం కలిగించినా క్రిమినల్ చర్యగా భావించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.వందేమాతరం బిల్లులో భాగంగా ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్-1971’లో సవరణలు చేయాలని కేంద్రం ఇటీవల ప్రతిపాదించింది. జాతీయ గీతమైన ‘జనగణమన’ ప్రస్తుతం ఈ చట్టపరమైన రక్షణ లభిస్తోంది. తాజాగా సవరించిన వందేమాతరం బిల్లుతో ఈ చట్టపరమైన రక్షణ వందేమాతరానికీ వర్తిస్తుంది. వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించడంతో పాటు దోషులకు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు.వందేమాతర 150వ వార్షికోత్సవం సందర్భంగా బిల్లుకు సవరణలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ గేయాన్ని బకించంద్ర ఛటోపాధ్యాయ రచించగా, ఆ తర్వాత ఆయన నవల ‘ఆనందమఠ్’లో దానిని చేర్చారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో శక్

న్యూఢిల్లీ: జనన మరణాలు నమోదులో జాప్యం జరుగుతుండటంపై కేంద్రం మరింత కఠిన నిబంధనలను తెచ్చింది. ఈ జాప్యాన్ని నివారించి సకాలంలో వీటిని రిజిస్టర్ చేసేలా పౌరులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొంది. ఇందుకు సంబంధించి ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ బరత్స్ అండ్ డెత్స్ (సవరణ) బిల్లు-2026’ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ విపక్ష సభ్యుల నిరసనల మధ్య బుధవారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనల ప్రకారం జనన మరణాల రిజిస్ట్రేషన్లో ఏడాది నుంచి రెండేళ్లు జాప్యం చోటుచేసుకుంటే జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం), సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం) లేదా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. వారి సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2 సంవత్సరాలకు మించి జాప్యం జరిగితే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి. జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం-1969 ప్రకారం వీటి నమోదు తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం జారీ చేసే సర్టిఫికెట్కు లీగల్ ఐడెంటిటీ ఉంటుంది. 2023లో దీనిని సవరించారు. సవరించిన చట్ట నిబంధనలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వీటిని సమర్ధవంతంగా అడ్డుకున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్పై శక్తివంతమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ‘శత్రువులను మనం అత్యంత ఘోరంగా దెబ్బకొట్టబోతున్నాం.. వారికి గట్టిగా బుద్ధి చెబుతాం’ అని ట్రంప్ ఒక ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో తెలిపారు. సంఘటన వివరాల ప్రకారం, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గారడ్స్ కారప్స్ అర్ధరాత్రి వేళ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ వెంటనే వాటిని గాల్లోనే కూల్చేసింది. ఈ దాడిలో అమెరికా సైనిక సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దౌత్యపరమైన చర్చలకు అవకాశం కల్పించేందుకు ఇరాన్పై అమెరికా తాత్కాలికంగా దాడులు నిలివేసిన తర్వాత యూఎస్ స్థావరంపై టెహ్రాన్ దాడి చేయడం ఇదే ప్రథమం, కాగా, జోర్డాన్ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ దాడిని కువైట్, ఖతార్ దేశా


మన తెలంగాణ/హైదరాబాద్ : గోల్డ్ స్కామ్ కేసులో టాలీవుడ్ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఐదు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే రూ.2.21 కోట్ల గోల్ స్కామ్ కేసులో ’లఫూట్ గ్యాంగ్’ నిర్మాత కే.లక్ష్మీకాంత్ రెడ్డిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నాంపల్లి 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బాధితుడు రాకేష్ బలరాం గౌడ్ తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగూర్బాబు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి, విడతల వారీగా రూ.2.21 కోట్లు తీసుకుని, బంగారం ఇవ్వకుండా, డబ్బు తిరిగి చెల్లించకుండా మో సం చేసినట్లు కంప్లైంట్లో ఆరోపించారు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే... తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో తగిన చర్యలు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించ గా రూ.2.21 కోట్లు కావడంతో దర్యాప్తును ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కు


మన తెలంగాణ/హైదరాబాద్ః జెన్-జి మహిళలను అవమానించిన బిజెపి ఎంపీ కంగనా రనౌత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేసిన జెన్-జి ఉద్యమ మహిళలపై మండి నియోజకవర్గం ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అక్కడ ఉన్న మహిళలు చదువుకోలేదు, అన్పడ్, గవార్, మంచి గృహిణి కూడా కాలేరు వంటి వ్యాఖ్యలు కంగన చేశారని ఆమె తెలిపారు. జెన్ జి అమ్మాయిలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే పోలీసులు అమానుషంగా లాఠీ చార్జ్ చేశారని ఆమె విమర్శించారు. ఎంపీ కంగన ఒక మహిళగా ఉండి మహిళలపై ఇలా మాట్లాడడం సిగు చేటని అన్నారు. ఎంపీ కంగన వెంటనే క్షమాపణ చెప్పి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు.


షర్మిలా ధన్ఖడ్… యువతరం మాత్రమే క్రీడల్లో రాణించి పతకాలు సాధించగలదనే అపోహను పటాపంచలు చేసింది. క్రీడల్లో సత్తా చాటడానికి వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపించింది. తనను శారీరకంగా కుంగదీసిన పోలియో మహమ్మారిని ఎదిరించి గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. నలభై ఏండ్ల వయసులో షాట్పుట్ ఎఫ్57 విభాగం ఫైనల్లో ఏకంగా 9.81 మీటర్ల దూరం గుండును విసిరి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కామన్వెల్త్ క్రీడల పారా అథ్లెటిక్స్లో భారత […] The post విధిరాతను ఎదిరించి..స్వర్ణ చరిత్రను లిఖించి appeared first on Navatelangana.

వర్షాకాలంలో పాదాలు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి. ఈ సీజన్లో రోడ్లపైకి బురద వచ్చి చేరుతుంది, కాళ్లకు బురద అంటుకోవడంతో పాటు.. ప్రమాదకరమైన క్రిములు సైతం మన పాదాల మీదకు చేరుకుంటాయి. ఈ కాలంలో పాదాలను రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి. క్లీన్గా ఉంచుకోండి..పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోతే.. ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. వర్షాకాలం బయట నుంచి రాగానే.. పాదాలను లిక్విడ్ వాష్తో శుభ్రం చేసుకోవాలి. లేకపోతే.. నీటితో […] The post వర్షాకాలంలో ఇలా…. appeared first on Navatelangana.

హీరో రవితేజ నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందు తోంది. ఫస్ట్ గ్లింప్స్, చార్ట్బస్టర్ అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అప్డేట్తో ముందుకొచ్చింది. విడుదల తేదీకి సంబంధించి నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ అనుకున్న సమయానికే అంటే ఆగస్టు 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. […] The post ‘ఇరుముడి’ రిలీజ్ ఎప్పుడంటే? appeared first on Navatelangana.

శర్వా హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి లక్ష్మి రాధామోహన్ సమర్పణ. తాజాగా చిత్ర యూనిట్ భారీగా రూపొందించిన 22 రోజుల క్లైమాక్స్ షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన భారీ సెట్లో ఈ క్లైమాక్స్ను చిత్రీకరించారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్లో 800 మందికి పైగా జూనియర్ […] The post ‘భోగి’ భారీ క్లైమాక్స్ పూర్తి appeared first on Navatelangana.


సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో పరిచయం అవుతు న్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషించారు. నిర్మాత పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై […] The post సర్ర్పైజ్ అవుతారు appeared first on Navatelangana.

హీరో అక్కినేని నాగ చైతన్య ‘పళ్ళబురుసు’ టీజర్ను లాంచ్ చేశారు. ఫోక్ చార్ట్బస్టర్ ‘కొత్త సోకు’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, ఈ చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ను విడుదల చేసింది. నాగచైతన్య లాంచ్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ, ప్రేక్షకులకు వినోదభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది.వేపపుల్లతో పళ్లు తోముకుంటున్న హీరోను చూసి గ్రామస్థులు ‘పళ్ళబురుసు తెలీదా?’ అని ప్రశ్నిం చడంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ […] The post ‘పళ్ళబురుసు’ తెలీదా? appeared first on Navatelangana.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరంజ్ అలర్ట్ జారీచేసింది. దీంతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో రైతులు పొలాల్లో నిల్వ నీరు తొలగించేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలని, వర్షాలు తగ్గే వరకు ఎరువులు, పురుగుమందుల పిచికారీని తాత్కాలికంగా నిలిపివేయాలని వ్యవసాయ వాతావరణ కేంద్రం సూచించింది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలవకూడదని, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.


రాష్ట్రంలో మెగా పోలీసు నియామకాలుపోలీసు, ఎస్పిఎఫ్, ఫైర్, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల త్వరలో ఆన్లైన్ దరఖాస్తుల షెడ్యూల్ వెల్లడించిన పోలీస్ నియామక మండలి బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పిఎఫ్), ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్, జైళ్లు, దిద్దుబాటు సేవల శాఖల్లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టిఎస్ఎల్పిఆర్బి) చైర్మన్ వి.వి శ్రీనివాసరావు బుధవారం నాలుగు వేర్వేరు నియామక నోటిఫికేషన్లు విడుదల చేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ బలోపేతంతో పాటు వివిధ భద్రతా విభాగాల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు చైర్మన్ తెలిపారు. ఈ నియామకాల్లో పోలీసు శాఖకే అత్యధిక పోస్టులు కేటాయించారు. 148 సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్),14 రిజర్వ్ ఎస్ఐ (ఏఆర్), 12 రిజర్వ్ ఎస్ఐ (టిజిఎస్పి), మూడు రిజర్వ్ ఎస్ఐ (ఎస్ఏఆర్సిపిఎల్),27 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఫ్పిబి) పో


నవతెలంగాణ-హైదరాబాద్ : ద ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ (ఒడిషా AM/NS KHPC), పూరీ ఎంతో వైభవోపేతమైన వేడుకతో తమ రెండవ వార్షికోత్సవాన్ని సంబరం చేసింది. దీనిలో భాగంగా జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై తమ సామర్థ్యం ప్రదర్శించిన సెంటర్ యొక్క అథ్లెట్స్ కు సత్కారం మరియు ఖో ఖో ఎంపిక ట్రయల్స్ 2026 ద్వారా ఆశాజనక అథ్లెట్స్ యొక్క కొత్త బ్యాచ్ ను చేర్చుకోవడం వంటివి ఉన్నాయి. భారతదేశపు భవిష్య […] The post ఒడిషా AM/NS ఇండియా ఖో ఖో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న మైక్రో డ్రామా ప్లాట్ఫామ్ స్టోరీ టీవీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన అడుగులను మరింత బలోపేతం చేస్తోంది. ఎలోఎలో గ్రూప్కు చెందిన ఈ సంస్థ 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందులో తెలుగు కంటెంట్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈరోజు ప్రేక్షకులు మొబైల్లోనే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో తమ భాషలో, తమ సంస్కృతికి, […] The post దక్షిణాదిపై స్టోరీ టీవీ భారీ అడుగు appeared first on Navatelangana.