
4395 వార్తలు

నవతెలంగాణ-హైదారాబాద్: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్ తూట్లు పొడుస్తుంది. సౌత్ లెబనాన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో ఐదగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు జర్నలిస్టు అని ఆ దేశ మీడియా నేషనల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దక్షిణ లెబనాన్లోని అట్-తిరి గ్రామంలో మొదటగా ఓ వాహనంపై ఇజ్రాయిల్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో రెండు వాహనాలను లక్ష్యంగా దాడులు చేయగా, ముగ్గురు చనిపోగా అందులో ఒక్కరు జర్నలిస్ట్ […] The post లెబనాన్పై ఇజ్రాయిల్ దాడి.. జర్నలిస్టు మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదారాబాద్: ఇవాళ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అంతకముందు ఉదయం ఆరు గంటలకు రెండు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎంల పనితీరును పరిశీలించారు ఎన్నికల అధికారులు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో […] The post పోలింగ్ షురూ appeared first on Navatelangana.











మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని, రేవంత్రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయని, ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. తీర్పు అనంతరం హరీష్రావు విలేకరులతో మా ట్లాడుతూ బిఆర్ఎస్పై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసు లు బనాయిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు ప్రాథమిక హక్కులు, సహ జ న్యాయసూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాం టి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, అందులో పదుల సం ఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పున

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే సిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారం గా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, అప్పటి సంబంధిత ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిపై చర్యలు తీ సుకోవద్దని హైకోర్టు ధర్మాసనం బుధవారం కీలక తీర్పు వెలవరించింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేయడం విశేషం. కాళేశ్వరం కమిషన్ జరిపిన విచారణ సహజ న్యా య సూత్రాలకు విరుద్దంగా జరిగిందని, సెక్షన్ 8 కింద నోటీసులు జారీ చేయకుండా విచారణకు పి లువడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమా ర్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాళేశ్వరం ప్రా జెక్టులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కున్న వి చారణ అర్హతలను సవాల్ చేస్తూ మాజీ సిఎం కెసిఆర్, అప్పటి నీటిపారుదలశాఖ మాజీగా పని చేసి న హరీశ్రావు, అప్పటి ఇరిగేషన్శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి ఎస్కె జోషి, సిఎంఓ అధికారిణి స్మితా సబర్వాల్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖల

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజె క్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో తెలంగాణ ప్రజలు, రైతు లు గెలిచారని, రాజకీయ రాబందులు, పిట్టల దొర కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు. ఈ తీర్పుపై కెటిఆర్ హర్షం వ్య క్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కూలింది కాళేశ్వరం కాదని, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కు ట్రలు కూలిపోయాయని కెటిఆర్ వ్యాఖ్యానించా రు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం పెరిగిందని, నిజాన్ని ఎవరూ దాచలేరని ఈ తీర్పుతో స్ప ష్టమైందని ఆయన అన్నారు. ఇది జస్టిస్ పిసి ఘో ష్ కమిషన్ నివేదిక కాదని, పిసిసి (కాంగ్రెస్) నివేదిక అని తాము అప్పుడే చెప్పామని కెటిఆర్ గుర్తు చేశారు. మేడిగడ్డ కుంగడం వెనుక పెను కు ట్ర దాగి ఉందని, అది కచ్చితంగా కాంగ్రెస్ పనే అయి ఉంటుందని కెటిఆర్ ఆరోపించారు. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే వి శ్రాంత జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాం ధీని బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి ఫొటోలు దిగి, అబద్ధా

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక కోర్టు నిలిపివేయడంతో తదుపరి ఎలా ముందుకెళ్లాల న్న విషయమై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశంతో పాటు లీగల్గా ఎలా ముందుకెళ్లాలన్నా అంశంపై వా రిద్దరూ మాట్లాడుకున్నట్టుగా సమాచారం. దీంతోపాటు సీనియర్ అడ్వకేట్లతోనూ ప్రభుత్వం లీగల్ ఓపినీయన్ తీసుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే, ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని సీనియర్ అడ్వకేట్లు పేర్కొన్నట్టుగా సమాచారం. మొదటిది ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా రెండోది కొత్త కమిషన్ను నియమించడం. ఈ రెండు అంశాల గురించి బుధవారం సిఎం రేవంత్రెడ్డితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కోర్టు తీర్పుపై నేడు కేబినెట్ చర్చించాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతోపాటు కేబినెట్కు అడ్వకేట్ జనరల్ను పిలవాలని అధికారులను రేవంత్రెడ్డి ఆదేశించినట్టుగా తెలిసింది. హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీ

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మం త్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘో ష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రా యం వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. సిబిఐకి ఘోష్ కమిషన్ పంపిన రిపోర్టులో ఎవరి పేర్ల ను పేర్కొనలేదని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. హై కోర్ట్ తీర్పు వెలువడిన తరువాత సిఎం రేవంత్రెడ్డి తో మంత్రి ఉత్తమ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, హై కో ర్టు తీర్పుపై వారిద్దరూ చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 6ను కొట్టివేయాలని పిటీషనర్లు హై కోర్టును ఆశ్రయించారని, కానీ, జ్యుడిషియల్ క మిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదని ఆయ న స్పష్టం చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని ఆయన తెలిపారు. కమిషన్ ఫైండింగ్లను కూడా హైకోర్టు తప్పుపట్టలేదని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం జిఓ ఎంఎస్ నెంబ ర్ 6 ద్వారా

మన తెలంగాణ/హైదరాబాద్: నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఏ) ఛైర్మన్ అనిల్ జైన్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేలా య త్నించిన ఎన్డిఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి బం డి సంజయ్ బుధవారం తన మంత్రివర్గ స హచరుడైన కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్కు లేఖ రాశారు. చైర్మన్ అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్కు రాసిన లేఖను బండి సంజయ్ కార్యాలయం రహస్యంగా ఉంచింది. కాళేశ్వరం విషయంలో అనిల్ జైన్ వ్యవహారశైలి ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వేదికపై అనిల్ జైన్ భాగస్వామి కావడమేంటి? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద వెయ్యి బోర్ హోల్స్ తవ్వాలని ఎన్డీఎస్ నివేదిస్తే... అందుకు భిన్నంగా 100 బోర్ హోల్స్ తవ్వితే సరిపోతుందని చెప్పడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బ్యారేజీల స్థితిపై భూగర్భ, భూభౌతిక పరీక్షలు నిర్వహించాని సూచించి రెండేళ

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్డిఎస్ ఏ) చైర్మన్ ఈ నెల 20న మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శన పూర్తిగా అధికారిక, సాంకేతిక పరమైనదేనని, దానికి రాజకీయ రంగు లేద ని సాగునీటి శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్డిఎస్ఏ చైర్మన్ పర్యటన ఉద్దేశ్యం ప్రస్తుత పరిశోధనల పురోగతిని సమీక్షించడం, అలాగే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బృందాలకు సాం కేతిక మార్గదర్శకత్వం ఇవ్వడమేనని పేర్కొన్నారు. ఈ పర్యటన పూర్తిగా ఎన్డిఎస్ఏ అధికారిక సాంకేతిక పర్యవేక్షణ మాత్రమేనని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ ప్రణాళికా, ప్రామాణిక ప్రమాణాలు, ఇంజినీరింగ్ పద్ధతులు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించడానికే ఉద్దేశించినదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి అగ్రగామి సంస్థ అయిన ఎన్డిఎస్ఏ, మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లర్లు ఘటన అనంతరం గతంలో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.ఎన్డిఎస్ఏ సిఫార్సుల మేరకు కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు పరిశోధన

మన తెలంగాణ/హైదరాబాద్: పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప లు కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్య త్ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఆయన అధికారులకు సూ చించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని, ఎ స్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారుల ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సి ఎం అధికారులకు సూచించారు. పేరున్న బ్రాండ్ సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎంఓయూలు కుదుర్చుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు మొదలు పెట్టేలా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులకు సిఎం సూచించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇతర ఉన

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి కార్మిక సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. అన్ని చోట్ల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్థరాత్రి నుండి కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కాగా బస్స్టేషన్లు బస్సులు లేక వెలవెల బోయాయి. డిపోల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె కారణంగా బస్సులు తిరగక పోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిని అదనుగా భావించి ప్రైవేటు వాహనాలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల అద్దె బస్సులను పోలీసు ఎస్కార్ట్తో తిప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 లోపు అద్దెబస్సులు మాత్రమే పోలీసు బందోబస్తుతో నడిచినట్లు ఆర్టిసి వర్గాలు వెల్లడించాయి. ఆర్టిసిలో మొత్తం 10 వేల బస్సులు ఉండగా వీటిలో మూడున్నర వేల అద్దె బస్సులు ఉన్నాయి. ఉదయం నుంచే కార్మికులు డిపోల ము

దుబాయ్: హార్మూజ్ జలసంధిలో బుధవారం ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులకు దిగింది. ఈ దాడిలో నౌక దెబ్బతినగా, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన చర్చల ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇరాన్కు చెందిన పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియాల్సి ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్ చర్చలకు ముందు టెహ్రాన్ ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు రావడానికి సమయం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. అయితే కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పొడిగింపు దౌత్యపరమైన ప్రయత్నాలకు మరింత సమయం ఇస్తుందని పేర్కొన్నారు.మాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు పాకిస్థాన్ తన నిజాయితీగల ప్రయత్నాలను కొనసాగిస్తుంది అని షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా,