
5026 వార్తలు
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్-శ్రీలంక వేదికలుగా జరిగిన T20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నవాజ్ వినోదం కోసం మాదకద్రవ్యాలు ఉపయోగించినట్లు తేలింది. ఈ వివాదం కారణంగా ఇంగ్లాండ్లో జరగబోయే T20 బ్లాస్ట్ టోర్నీలో ఆడే అవకాశాన్ని నవాజ్ కోల్పోయాడు. ఐసీసీ ఈ విషయాన్ని పీసీబీ దృష్టికి తీసుకువెళ్లగా, బోర్డు విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యాక ఫలితాలను ఐసీసీకి నివేదిస్తామని పీసీబీ ప్రతినిధి తెలిపారు. 32 ఏళ్ల […] The post డ్రగ్స్ టెస్టులో దొరికిన పాక్ క్రికెటర్ నవాజ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. బుధవారం మండలంలోని గొల్లపల్లిలో ఐదు సంవత్సరాలు నిండిన విద్యార్థుల పట్టికను అంగన్వాడి ద్వారా తీసుకొని, విద్యార్థి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని స్థానిక ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన ఉంటుందని, తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్, సిఆర్పి మహమ్మద్, అంగన్వాడి టీచర్ జ్యోతి తదితరులు ఉన్నారు. The post ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్చండి appeared first on Navatelangana.














హైదరాబాద్: కాళేశ్వరంపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును హై కోర్టు నిలిపివేసింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై చర్యలు తీసుకోవద్దని హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. కెసిఆర్ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కెసిఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్కు కాళేశ్వరం నిదర్శనమి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ పెద్దలకు మూటలు వెళ్తున్నాయి.. ఇక్కడ కేసులు మూసేస్తున్నారు. కెసిఆర్, రేవంత్ క్విడ్ ప్రోకోను ప్రజలు గమనిస్తున్నారు’’ అని సంజయ్ అన్నారు.
నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శుభవాతావరణంలో గ్రామపాలక వర్గం,ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు,పంచాయితీ సెక్రెటరీ పాల్గొని వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా బుధవారం పిల్లలమర్రి లావణ్య (భాస్కర్ భార్య) నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.అనంతరం ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాలక వర్గం తరఫున నూతన వస్త్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరిమార్తి రేణుక నరసయ్య, ఉప సర్పంచ్ పద్మ శ్రీ, శశిరేఖ సుదర్శన్, జిల్లా యూత్ […] The post ఘనంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం appeared first on Navatelangana.
– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ నవతెలంగాణ-కమ్మర్ పల్లి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు హాజరుకావాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని నాగాపూర్ గ్రామ పరిధిలోని మంజీర చెరువు వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి, కూలీల హాజరు తీసుకున్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులకు హాజరవడం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం […] The post జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పనులకు హాజరు కావాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో ఐకేపి మహిళ క్రాంతి ప్రథం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ఇస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. […] The post హాస కొత్తూర్ లో ఐకేపి కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్మండలంలోని దోస్త్ పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దాత స్పోర్ట్స్ యూనిఫామ్ లను గురువారం నాడు వితరణ చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాత విద్యార్థులకు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శంకర్ మాట్లాడుతూ.. దోస్త్ పల్లి గ్రామ నివాసి అయినా పండరి అనే యువకుడు ప్రాథమిక పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి కావడం విశేషం. పండరి ఎమ్మెస్సీ […] The post విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణ appeared first on Navatelangana.

