23134 వార్తలు



ఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని సిజెపి నేతలు తెలిపారు. మిగతా 3 డిమాండ్లు కూడా నెరవేరేవరకు వేచి ఉందాం అని అన్నారు. ఈ సందర్భంగా సిజెపి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిజెపి నేతలు సూచించారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు పూర్తిగా ఎత్తివేయాలని, దాడిచేసిన పోలీసు అధికారులు తమకు క్షమాపణ చెప్పాలని కోరారు. విద్యావ్యవస్థ ప్రక్షాళన చేసేవరకు ఈ ఉద్యమం ఆగదని, సాయంత్రం 6.గం.లకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని తమకు రాజకీయాలు అవసరం లేదని సిజెపి నేతలు పేర్కొన్నారు.













ఢిల్లీ: నీట్ విద్యార్థులు జరిపిన ఆందోళనకు స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీ తో కేంద్రంపై సిజెపి ఒత్తిడి తెచ్చింది. సిజెపి డిమాండ్లతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. సిజెపిలో చర్చలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీక్ వివాదంతో విద్యార్థులు రోడ్డెక్కారు. సిజెపి జంతర్ మంతర్ దగ్గర నెలరోజులుగా నిరసనలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామాకు సిజెపి పట్టుబట్టారు. తదుపరి సిజెపి పోరాటం ఫలించింది.ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 10 రోజులుగా వరుస ఘటనలు తనను బాధించాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి అని కొనియాడారు. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశానని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని, దేశ ఐక్యత కొనసాగాలని, యువత తమ చదువు కోసమే సమయం కేటాయించాలని సూచించారు. మంత్రిగా ఇన్నాళ్లు నాకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ సేవకు తన అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నానని, నీట్ అక్రమాలు వెలుగులోకి ర



హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై ఎంఎల్ఎ మందు సామేలు తీవ్ర విమర్శలు చేశారు. తనకు ఎవరూ టికెట్ ఇప్పించలేదని, తుంగతుర్తి ఎంఎల్ఎ టికెట్ తన చేతిలో, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఉండదని, కాంగ్రెస్ అధిష్ఠానం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చారని తెలిపారు. తనను ఎవరూ గెలిపించలేదని, కాంగ్రెస్ పార్టీ గెలిపించిందని తెలియజేశారు. మునుగోడులో రాజగోపాల్రెడ్డిని గెలిపించి తప్పు చేశామని తన అభిమానులు అనుకుంటున్నారని, తాను ఎన్నోసార్లు మంత్రిని కలిసినా రోడ్డు ఇవ్వలేదని మందుల సామేల్ ధ్వజమెత్తారు. సమాచారం ఇవ్వకుండానే తన నియోజకవర్గం ఎలా వస్తారని ప్రశ్నించారు. మంత్రి వచ్చినప్పుడు అటెండర్తో ఫోన్ చేయించినా వెళ్లి కలిసేవాడినని, తన నియోజకవర్గం విషయంలో ఇన్వాల్వ్ కావొద్దని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పినా కూడా వినడం లేదన్నారు. నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి రాజ్యం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తన గురించి హీనంగా మాట్లాడుతున్నారని, వీరేశం, తనని ప్రజలు 50,000 పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. తుంగతుర్తి, నకరేకల్ నియోజకవర్గాలు బాగోలేవని రాజగోపాల్ రెడ్డి అంటున్నారని, అసులు మునుగోడు సంగతికి చూసుకోవాల




హైదరాబాద్: ప్రతి నీటి చుక్క సంరక్షించుకోవాలి - పర్యావరణాన్ని కాపాడాలనే నినాదం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ తో పాటు మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జలమండలి ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణ పై అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వర్షపు నీటిని సంరక్షించి జలవనరులు కాపాడుకోవాలని ప్రతిజ్ఞా చేయించారు. వర్షపు నీటి సంరక్షణ లో భాగంగా సైఫాబాద్ సైన్స్ కాలేజీ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజక్షన్ పాయింట్ , రెయిన్ వాటర్ ఫిట్స్, హార్వెస్టింగ్ బోర్ వెల్స్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, వాటర్ వర్క్ ఎండీ అశోక్ రెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు.