23641 వార్తలు





బీజింగ్: చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు శుభారంభం చేసింది. యంగ్ షట్లర్ ఉన్నతి హుడాపై విజయం సాధించి ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. మరోవైపు పురుషుల విభాగంలో ఆయుష్ శెట్టి.. వరల్డ్ 11వ ర్యాంకర్ అల్వి ఫర్హాన్(ఇండోనేషియా)ను 2117, 521, 2117 ఓడించి రెండో రౌండ్కు చేరగా, మరో స్టార్ షట్లర్ జపాన్కు చెందిన ఆటగాడు యుషి తనకపై 2220, 1521, 2114 తేడాతో చెమటోడ్చి విజయం సాధించి ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో సింధు.. ఉన్నతి నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. ఇటీవలె జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సింధు, 18 ఏళ్ల ఉన్నతితో జరిగిన పోరులో 56 నిమిషాల హోరాహోరీ సాగించి 21-14, 9-21, 21-10 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్లో ప్రారంభం నుంచే గట్టి పోటీని ఎదుర్కొన్న స్టార్ షట్లర్ అద్భుత ఆటతీరుతో వరుసగా ఐదు పాయింట్లు సాధించి 12-8 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరకు 21-14తో ఆ గేమ్ను కైవసం చేసుకుంది. అనంతరం ఉన్నతి చేతిలో చిత్తయి, 921తో గేమ్ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో తొలి నుంచే దూకుడైన ప్రదర్శనతో క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ స్కోరును 6-3 నుండి 10-5, ఆపై 15-8కి చేర్చి





నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై, సీజేపీ చేపట్టిన ఉద్యమానికి బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ తన మద్దతు తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విద్యార్థి దశకు సంబంధించిన ఫొటోను పంచుకుంటూ, ఈ వివాదంపై ఆయన భావోద్వేగపూరిత సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ అనేది అత్యంత తీవ్రమైన సమస్య అని, మెరుగైన విద్యా వ్యవస్థ సాధన కోసం విద్యార్థులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయడం అభినందనీయమని సల్మాన్ పేర్కొన్నారు. అయితే, […] The post సీజేపీ ఉద్యమానికి సల్మాన్ మద్దతు.. appeared first on Navatelangana.


మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్ -డ్రామా ’మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర నిర్మాతలు సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. కొత్తగా విడుదలైన పోస్టర్లో మాధవ్ యుద్ధంలో పోరాడి వచ్చినట్టుగా ఇంటెన్స్ అవతార్లో ఆకట్టుకుంటున్నారు. హీరోకు, పవిత్రమైన ఆవుకు మధ్య కనిపించే పేస్ ఆఫ్, ఈ సినిమా కథా నేపథ్యాన్ని ఆసక్తికరంగా చూపిస్తోంది. మారెమ్మ చిత్రంతో మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పా టలతో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెం చడంలో మేకర్స్ విజయవంతమయ్యారు.’మారెమ్మ’ సినిమా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, బలమైన భావోద్వేగాలతో మేళవించిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. మాధవ్ నటనకు అవకాశం ఉన్న పాత్రలో యాక్షన్తో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో దీప





ఇవాళ్టి ( జులై 23 ) నుంచి కామన్ వెల్త్ గేమ్స్.. బాక్సింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ పైనే ఆశలు..


తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి శిలాతోరణం వరకు క్యూలైన్ లో భక్కులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 77,874 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు, శ్రీవారికి తలనీలాలు 35,302 మంది భక్తులు సమర్పించినట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.



