23805 వార్తలు




ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అల్లరి నరేశ్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తన జానర్ వదిలేసి ఈ మధ్య సీరియస్ సినిమాలు కూడా చేశాడు. ఇప్పుడు మరో సూపర్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు నరేష్. ఆ సినిమానే ‘రంభ ఊర్వశీ మేనక’. చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. ‘నా కంటి మీద కునుకే’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ అలపించారు. ఈ సాంగ్ను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హస్య మూవీస్ బ్యానర్లో రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.





తమిళనాడు సిఎం విజయ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు దాటుకొని ఈ సినిమా జులై 23న విడుదలకు సిద్ధమైంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ‘బాలకృష్ణ - అనిల్ రావిపూడి’ కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఇది రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమానే ఈ చిత్రానికి స్ఫూర్తి అని చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ ఇటీవల చెప్పారు. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ‘జన నాయగన్’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భగవంత్ కేసరి’లోని కొన్ని సినిమాలు మాత్రమే ‘జన నాయగన్’ కోసం తీసుకున్నారని చెప్పారు. విజయ్ స్టార్డమ్కి తగ్గట్టు సినిమాను తెరకెక్కించారని తెలిపారు. అనిల్ రావిపూడి, ‘జన నాయగన్’ నిర్మాత వెంకట్ కె. నారాయణ కలిసి మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.











శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదలు కాల్పులకు తెగబడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. వాహనంపై వెళ్తూనే తుపాకులతో కాల్పులు జరిపరారు. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆషిఖ్ హుస్సేన్ తీవ్రంగా గాయపడగా సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిచారు. చికిత్స పొందూ ఆయన తుది శ్వాస విడిచినట్లు అధికారలు వెల్లడించారు. మృతుడు బుద్గామ్ జిల్లాలోని బీర్వా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టాయి.


