23795 వార్తలు

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తాజా ఓ షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్లోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బుధవారం డాక్టర్లు ఆయన హెల్త్ బులిటిన్ను విడుదల చేశారు. బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడం, వాపు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బాలకృష్ణ మోకాలి కండరాల్లో చీలిక ఏర్పడి ఉండొచ్చని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ‘‘ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో బాలకృష్ణకు విస్తృతస్థాయిలో క్లినికల్, డయోగ్నస్టిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’’ అని అసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నాయి.



న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ కేంద్రానికి లేఖ రాశారు. బుధవారం ఆస్పత్రి నుంచి సోనమ్ పలు డిమాండ్లను లేఖ ద్వారా తెలియజేశారు. తన డిమాండ్లపై హమీ ఇస్తే..నిరసన దీక్షను విరమిస్తానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు వాంగ్చుక్ను కలిశారు. ఆయనను దీక్ష విరమించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సోనమ్ కేంద్రానికి లేఖ రాశారు.ఆసుపత్రిలో తనను పరామర్శించి, దీక్ష విరమించాలని కోరినందుకు వాంగ్చుక్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, జవాబుదారీతనంపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని.. కేసులు పెట్టి వేధించొద్దని.. అలాగే, నీట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. తన డిమాండ్లపై కేంద్రం స్పష్టమైన హామి ఇస్తే.. వెంటనే దీక్ష విరమిస్తానని సోనమ్ వెల్లడించారు.


ఛార్జింగ్ లేకపోవడంతో ఓ అమ్మాయి ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ కారు మార్గ మద్యంలోనే ఆగిపోయింది. అప్పుడు భారత సైన్యానికి చెందిన ఓ జవాను ఆమెకు మర్చిపోలేని సాయం చేసి.. రియల్ హీరో అనిపించుకున్నాడు. దీపికా శర్మ అనే వ్లాగర్ సోషల్మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో తాను ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఇవి వాహనంలో 60 శాతం వరకు చార్జింగ్ ఉందని.. కొంత సమయం తర్వాత అది 10 శాతానికి పడిపోయిందని పేర్కొంది. స్థానికంగా ఓ ఛార్జింగ్ స్టేషన్ ఉందని తెలుసుకుని అక్కడి వెళ్తుండగా.. అప్పటికే బ్యాటరీ 2 శాతానికి పడిపోవడంతో వాహనం నిలిచిపోయింది. దీంతో చేసేదేం లేక ఆమె అక్కడే ఉన్న సైనికుడిని సాయం అడిగింది. వెంటనే స్పందించిన జవాన్ ఆమెను కారులో కూర్చొబెట్టి ఛార్జింగ్ స్టేషన్ వరకూ కారు తోసుకుంటూ వెళ్లారు. అంతేకాకుండా ఛార్జింగ్ పూర్తయ్యే వరకూ అక్కడే ఉండి.. ఆమె అక్కడి నుంచి బయలు దేరిన తర్వాత తిరిగి వెళ్లారు. ఈ ఘటన రికార్డు చేసిన దీపికా శర్మ.. జవాన్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజల కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న జవాన్లకు కృతజ్ఞతలు తెలిపింది.



హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24న విద్యాసంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేవర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎన్ఎస్యుఐ, ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎఐఎఫ్డిఎస్, ఎఐఎస్బి, ఎఐపిఎస్యు సంఘాలు డిమాండ్ చేశాయి. ఢిల్లీలో యువతపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్ను ఆయా సంఘాల నేతలు ఖండించారు. బంద్కు అన్ని విద్యాసంస్థలు సహకరించి విజయవంతం చేయాలని ఎన్ఎస్యుఐ తెలంగాణ అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి కోరారు. విద్యార్థుల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపాలన్నారు.


వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ హారర్, కామెడీ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ని వినూత్నంగా ప్రారంభించారు. వరుణ్ తేజ్, హాస్య నటుడు సత్య మధ్య సాగే ఓ సరదా ప్రమోషనల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇందులో వరుణ్, సత్య సినిమాలోని విలన్ క్యారెక్టర్ డబ్బింగ్ గురించి మాట్లాడుతుంటారు. ‘‘ఆ విలన్ పాత్ర కోసం నేను ఏకంగా ఓ కొరియన్ నటుడిని రంగంలోకి దించాను. కానీ, అతడి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ మరీ సాఫ్ట్గా ఉంటుంది. ఇదొక పక్కా కమర్షియల్ సినిమా. విలన్ గట్టిగా అరవాలి. ఎప్పుడూ కోపంగా ఉండాలి’’ అని వరుణ్, సత్యతో అంటాడు. దీంతో, ఆ కొరియన్ నటుడి చేత ఎలాగైనా గట్టిగా అరిపిస్తానని సత్య ఆ కొరియన్ యాక్టర్ దగ్గరలకు వెళ్తాడు. అతను చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా చూస్తుంటాడు. అప్పుడు సత్య ‘‘సినిమాలు చూస్తే నీకు నటన రాదు. ఆ ఫీలింగ్ కడుపులో నుంచి రావాలి’ అని చెప్పి ఓ ప్రయోగం చేస్తాడు. చాలా ఘాటైన కడప కిమ్చీ కారాన్ని ఆ విలన్







ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అల్లరి నరేశ్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తన జానర్ వదిలేసి ఈ మధ్య సీరియస్ సినిమాలు కూడా చేశాడు. ఇప్పుడు మరో సూపర్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు నరేష్. ఆ సినిమానే ‘రంభ ఊర్వశీ మేనక’. చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. ‘నా కంటి మీద కునుకే’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ అలపించారు. ఈ సాంగ్ను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హస్య మూవీస్ బ్యానర్లో రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.





తమిళనాడు సిఎం విజయ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు దాటుకొని ఈ సినిమా జులై 23న విడుదలకు సిద్ధమైంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ‘బాలకృష్ణ - అనిల్ రావిపూడి’ కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఇది రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమానే ఈ చిత్రానికి స్ఫూర్తి అని చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ ఇటీవల చెప్పారు. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ‘జన నాయగన్’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భగవంత్ కేసరి’లోని కొన్ని సినిమాలు మాత్రమే ‘జన నాయగన్’ కోసం తీసుకున్నారని చెప్పారు. విజయ్ స్టార్డమ్కి తగ్గట్టు సినిమాను తెరకెక్కించారని తెలిపారు. అనిల్ రావిపూడి, ‘జన నాయగన్’ నిర్మాత వెంకట్ కె. నారాయణ కలిసి మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.