23811 వార్తలు


శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదలు కాల్పులకు తెగబడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. వాహనంపై వెళ్తూనే తుపాకులతో కాల్పులు జరిపరారు. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆషిఖ్ హుస్సేన్ తీవ్రంగా గాయపడగా సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిచారు. చికిత్స పొందూ ఆయన తుది శ్వాస విడిచినట్లు అధికారలు వెల్లడించారు. మృతుడు బుద్గామ్ జిల్లాలోని బీర్వా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టాయి.









కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎఐసిసి, టిపిసిసి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యారంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. నిరసనలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ఎంపి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న బిజెపి కార్యకర్తలు అక్కడకు చేరుకుని కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను లాఠీలు ఝులిపించి చెదరగొట్టి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డిసిసి కార్యాలయాలనికి వెళ్లేందుకు సిద్ధమైన బిజెపి రాజేందర్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఎంపి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించా

హైదరాబాద్: ఢిల్లీలో మంగళవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో లోక్భవన్ కార్యకర్మం చేపట్టారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి లోక్భవన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పిసిసి అధ్యక్షుడు, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మరి వెంకట్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ లోక్భవన్కు చేరుకున్న వెంటనే మంత్రులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దీంతో సినిమాను కావాలనే లీక్ చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. సినిమా దర్శకుడు హెచ్ వినోద్ స్పందించారు. భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమాను ఎవరైనా లీక్ చేసుకుంటారా? అని ప్రశ్నించాడు. దురుద్దేశంతో లీక్ చేస్తే అధికారులు కొన్ని గంటలు, రోజుల్లోనే తెలిపిపోతుందని వివరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ గెలుపు కోసమే మూవీని లీక్ చేశానడంలో నిజం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఆరోపణలు సరికాదని దుయ్యబట్టారు. విజయ్ అప్పుడే స్పందించి ఉంటే విమర్శలు వచ్చేవి కావన్నారు. ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని, సినిమా లీక్పై నిర్మాతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేస నమోదు చేసి చర్యలు కూడా తీసుకున్నారని వినోద్ పేర్కొన్నారు. గత ఆరు నెలల తనకు ఎంతో కష్టంగా అనిపించిందని, శ్రమకు తగిన ఫలితం లభిస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.








మేషంఅనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి సర్దుకుపోవడం మంచిది. ఖర్చులు పెరిగినప్పటికీ సమయానికి చేతికి డబ్బు అందుతుంది. వృషభం ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. పాత మిత్రుల లేదా సహోద్యోగుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. సాయంత్రం విందు వినోదాల్లో పాల్గొంటారు. మిధునం మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబంలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. కర్కాటకం ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ ఎక్కువైనా అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు లేదా భూగృహ వ్యవహారాలు మీకు సానుకూలంగా మారే అవకాశం ఉంది. సింహం ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. అనుకున్న పనులు అనుకున్నట్టు సాగక కాస్త నిరాశ కలిగినా, ఓపిక పట్టడం మంచిది. పిల్లల ప్రవర్తన మరియు చదువు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. కన్య సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా రోజులుగా ఉన్న ఆర్థిక

