23812 వార్తలు


కొడంగల్: నీట్ పశ్న పత్రాల లీకేజీ కేసుకు సంబంధించి మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్నేతలు చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆందోళన పోలీసులు కాంగ్రెస్ కరీలకా నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాందీలను అరెస్ట్ చేశారు. దీనిపై సిఎం రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు. బుధవారం ఆయన కొడంగల్లదవ అంబేద్కర్ కూడలి వద్ద నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రాలను పల్లిబఠానీల్లా అమ్ముకున్నారని ఆరోపించారు. ‘‘లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ధర్మేంద్రప్రధాన్ చెలగాటం ఆడారు. ఆయన రాజీనామా చేయాలని యువత ఆందోళన చేపట్టింది. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా సమస్యల్ని ప్రస్తావించడం ప్రజా ప్రతినిధుల బాధ్యత. 20వ తేదీ నుంచి ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభల్లో.. ప్రశ్నా పత్రాల లీకేజీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అడిగినా ప్రభుత్వం అనుమతించలేదు. లోక్సభ స్పీకర్ అంగీకరించలేదు. ప్రజాస్వామ్యానికి ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని కొడితే ఆయన ముక్కు నుంచి రక్తం వచ్చింది. దేశం కోసం రక్తం చిందించడంలో రాహుల్ గాంధీ మొదటివారు కాదు. చివ





ఢిల్లీ: భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపేది త్రివర్ణ పతాకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ జెండా ఆమోద దినోత్సవం రోజున దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. మన త్రివర్ణ పతాకం వారి త్యాగాలకు, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీక అని ప్రశంసించారు. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను ప్రతిరోజూ ఆచరిస్తూనే ఉండాలని, మన జాతీయ పతాకానికి నిజమైన గౌరవాన్ని అందిద్దాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.












రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టిపిసి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని డిసిఎం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. డిసిఎం ముందుబాగం నుజ్జునుజ్జుగా మారడంతో డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. డిసిఎం క్యాబిన్లో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



