23812 వార్తలు







కరీంగనర్: మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లో జరిగిన దోపిడీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. న్యూఢిల్లీ నుండి కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు కేంద్ర మంత్రి సంజయ్ ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నాడు. దోపిడీ దొంగలపై ఉక్కుపాదం మోపాలని సిపిని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుల కోసం క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయని సిపి చెప్పారు. విచారణను ముమ్మరం చేశామని, నిందితులను అదుపులోకి తీసుకుంటామని సిపి చెప్పారు.కరీంనగర్ నగరంలోని భగత్నగర్ చౌరస్తాలో ఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఎనిమిది మంది సాయుధ దుండగులు ఇంట్లోకి చొరబడి సుమారు 66 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.21 లక్షల నగదును దోచుకెళ్లారు. అలాగే ఇంటి కింద పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను కూడా అపహరించిన విషయం తెలిసిందే.

66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు అపహరణకుటుంబ సభ్యులను బంధించి.. రెండు బైకులతో పరారైన దుండగులుకరీంనగర్ : కరీంనగర్ నగరంలోని భగత్నగర్ చౌరస్తాలో ఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఎనిమిది మంది సాయుధ దుండగులు ఇంట్లోకి చొరబడి సుమారు 66 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.21 లక్షల నగదును దోచుకెళ్లారు. అలాగే ఇంటి కింద పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను కూడా అపహరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అర్ధరాత్రి సమయంలో ఇంటి యజమాని బయట లైట్ ఆఫ్ చేసేందుకు రాగా, వెనుక నుంచి వచ్చిన దుండగులు అతడిని అదుపులోకి తీసుకుని బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న వృద్ధులతో సహా నలుగురు కుటుంబ సభ్యులను కత్తులు, తుపాకులతో బెదిరించి సుమారు గంటన్నర పాటు కట్టేసి ఉంచారు. బాధితుల అరుపులు బయటకు వినిపించకుండా టీవీ శబ్దాన్ని భారీగా పెంచిన దుండగులు వారి మెడలోని గొలుసులు, చేతి ఉంగరాలు, చెవి కమ్మలు కూడా లాక్కెళ్లారు. అనంతరం రూ.21 లక్షల నగదు, 66 తులాల బంగారం, వెండి వస్తువులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం చిలకలగూడలో కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చాయి. అత్తపై కోడలి కత్తితో దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యెరుకల బస్తీలో నివాసముంటున్న 65 ఏళ్ల పద్మావతిపై ఆమె కోడలు విజయలక్ష్మి కత్తితో దాడి చేసింది. కేకలు వినపడడంతో స్థానికులు వెంటనే రక్తపు మడుగులోే ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.








పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో భారీగా మోహరించిన పోలీసులునవతెలంగాణ–సంగారెడ్డిఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి జాతీయ రహదారి-65పై బైఠాయించి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి పిలుపు నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి […] The post రాహుల్ అరెస్టు.. ఎన్హెచ్-65పై బైఠాయింపునకు జగ్గారెడ్డి పిలుపు appeared first on Navatelangana.




నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని హుణమూరు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూమారుతి బరంగాయ్కు చెందిన హరీశ్ (49), నిష్ట (36) దంపతులు. వీరికి నిక్షా (12), రక్ష (8) పిల్లలు ఉన్నారు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేస్తూ హరీశ్ జీవితం సాధిస్తుంటారు. సోమవారం రాత్రి భార్య, పిల్లలకు ఊపిరాడకుండా చంపి.. అనంతరం హరీశ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. వ్యాపారంలో నష్టాలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. The post దారుణం..భార్య, పిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య appeared first on Navatelangana.


హైదరాబాద్: ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగింది. ఓ యువతి ఇండిగో కంపెనీలో జాబ్ చేస్తోంది. రాత్రి విధులకు క్యాబ్లో వెళ్తుండగా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి కారు ఆపాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.