24464 వార్తలు








గుడిలోని విగ్రహంతో చెరువులో దూకినట్లు గుర్తింపు మృతదేహం లభ్యం.. విగ్రహం కోసం డీఆర్ఎఫ్ బలగాల గాలింపు ఫ్లాట్పై పోలీసుల అనుమానాలు ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం మన తెలంగాణ/బోడుప్పల్ : మేడిపల్లిలో శనివారం రాత్రి నగ్నంగా పరిగెత్తి విగ్రహంతో పాటు చెరువు లోకి దూకిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని ఆత్మహత్య కేసులో వింత మలుపు తిరిగింది. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసులో ఆమె తీవ్ర మానసిక క్షోభతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తల్లిదండ్రుల విడాకులు తీసుకోవడంతో తల్లి దగ్గరే ఉంటుంది.తరచూ వచ్చే భయానక కలల వల్ల ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసుల కథనం ప్రకారం.. తేజస్విని తన దుస్తులు విప్పేసి, దిగంబరంగా సమీపంలోని ఒక గుడిలోకి ప్రవేశించింది.అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని నేరుగా సమీపంలోని చెరువు వైపు నడిచి, నీటిలోకి దూకింది. ఆ తర్వాత ఆమె మృతదేహం లభ్యమవగా, ఆమె తీసుకెళ్లిన విగ్రహం మాత్రం ఇంకా దొరకలేదు. ఈ కేసులో ఆ విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉ

హైదరాబాద్: ఫుట్బాల్ ప్రపంచ కప్ను స్పెయిన్ కైవసం చేసుకుంది. స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై గోల్స్ చేసి ప్రపంచ కప్ను ముద్దాడింది. అదనపు సమయంలో స్పెయిన్కు చెందిన ఆటగాడు టోరెస్ గోల్ చేశాడు. దీంతో ఆదేశపు ఆటగాళ్లు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ మ్యాచ్లో మొదటి నుంచి స్పెయిన్ ఆధిపత్యం చెలాయించింది. స్పెయిన్ దిగ్గజ ఆటగాడు అర్జెంటీనా ఒత్తిడిలోకి నెట్టేశాడు. అర్జెంటీనా రక్షణ డిఫెన్స్ను చివరి వరకు పరీక్షిస్తూనే స్పెయిన్ ముందుకు సాగి విజయం సాధించింది. అర్జెంటీనా ఆత్మరక్షణకే పరిమితమైంది కానీ ఎక్కడా గోల్ చేయడానికి ప్రయత్నించలేదు. ఈ మ్యాచ్లో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సి పెద్ద ప్రభావం చూపలేదు. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినేజ్ విరోచితంగా పోరాటం చేయడంతో పాటు అదనపు సమయానికి తీసుకెళ్లాడు. మార్టినేజ్ అని సేవ్లు చేయకపోతే అర్జెంటీనా జట్టు తొలుత అర్ధ భాగంలోనే ఓటమిని చవిచూసేది. అర్జెంటీనా జట్టు ఆటగాడు ఫెర్నాండేజ్ రెడ్ కార్డుతో మైదానం వీడడంతో ఆ జట్టు పది మందిలో ఆడాల్సి వచ్చింది. ఈ విషయంలో స్పెయిన్కు కలిసి రావడంతో పెరాన్ టోరెస్ గోల్ చేసి స్పెయిన్ విజయాన్ని అందించాడు. ఫిపా వరల్











లార్డ్స్: మూడో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్పై ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో మూడో వన్డేలో విజయం సాధించింది. రోహిత్ శర్మ భారీ సెంచరీ చేసినప్పటి చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ 388 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. రోహిత్ శర్మ 110 బంతుల్లో 138, శుభ్మన్ గిల్ 84 బంతుల్లో 77 పరుగులు, విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్మెన్లు ఒత్తిడికి గురికావడంతో భారత జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్లో శ్యామ్ కరన్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, జాకోబ్ బెతెల్ తలో ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ వికెట్ తీసి 91 పరుగులు చేసిన జాకబ్ బెతెల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 249 పరుగులు చేసిన జోయ్ రూట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నాడు.

డెహ్రాడూన్: చిరుత పులి ఇంట్లోకి తండ్రిపై దాడి చేస్తుండగా అతడిని కూతురు కాపాడిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం చంపావత్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సిమల్టా గ్రామంలో సురేశ్ చంద్ర పాండే(64) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి కిరణ్ పాండే(35) అనే కూతురు ఉంది. సురేశ్ భోజనం చేసి టివి చూస్తుండగా అతడిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. వెంటనే కిరణ్ పాండే గట్టిగా కేకలు వేయడంతో పాటు తండ్రి ఇంట్లో నుంచి బయటకు లాగి డోర్ మూసింది. వెంటనే తండ్రిని స్థానిక ఆస్పత్రికి తరలించింది. స్థానికుల సమాచారం మేరకు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుత మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులో బంధించారు. చాకచక్యంతో చిరుతను ఇంట్లో బంధించిన కిరణ్ పాండేను పోలీసులు, గ్రామస్థులు, అటవీ సిబ్బంది ప్రశంసించారు.

