5560 articles

దౌత్య పరిష్కారానికి మోకాలడ్డుతోంది అమెరికాయే : ఇరాన్వచ్చే వారం ప్రారంభంలో తిరిగి సంప్రదింపులు ? నవతెలంగాణ-జనరల్ డెస్క్ఇరాన్తో శాంతి చర్చలు విఫలమైతే తన ప్రభుత్వం తిరిగి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను చేపడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గల్ఫ్లో ఉద్రిక్తత లు పెరుగుతున్నాయని, హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు చిక్కుబడిపోయాయని, ఇలాంటి పరిస్థితులలో తన ప్రభుత్వం తిరిగి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను ప్రారంభించవచ్చునని ఆయన తెలిపారు. హార్ముజ్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు వీలుగా వాటికి రక్షణ కల్పించేందుకు […] The post శాంతి చర్చలు విఫలమైతేప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస్ : ట్రంప్ appeared first on Navatelangana.

తెలంగాణకు ఏం అభివృద్ధి చేశారని మోడీ వస్తున్నారుకార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న కేంద్రం : వీహెచ్ దీక్షాశిబిరంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీనవతెలంగాణ-అంబర్పేటరాజకీయాలకు అతీతంగా జనాభ ప్రతిపాదికన బీసీ అభ్యున్నతి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించకుండా బీసీలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ చేర్చకపోవడాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలో మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు […] The post బీసీలకు కేంద్రం తీవ్ర అన్యాయం appeared first on Navatelangana.

రెండు మూడడుగులు అటూ ఇటైనా సాంకేతిక సమస్య కొలతల్లో ఏ కొంచెం తేడా వచ్చినా చిక్కులే..!మండలానికి 20-50 మంది లబ్దిదారుల ఇబ్బందులు టెక్నికల్ అంశాలతో నెలల తరబడి నిలుస్తున్న బిల్లులు నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు ‘లొకేషన్’ సమస్య ఇబ్బందికరంగా మారింది. అక్షాంశ రేఖాంశాల్లో ఏ కొంచెం తేడా వచ్చినా సాంకేతిక సమస్య తలెత్తుతోంది. తద్వారా బిల్లులు నిలిచిపోతున్నాయి. పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేసుకొని రెండు నెలలు కావొస్తున్నా […] The post ఇందిరమ్మ ఇండ్లకు లొకేషన్ ప్రాబ్లం appeared first on Navatelangana.

హాజరైన ప్రధాని మోడీ,ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులుకోల్కతా : బెంగాల్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా శనివారం సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు ఇప్పుడు ఆమెనే ఓడించి […] The post బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం appeared first on Navatelangana.

కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసుపేట్బషీరాబాద్ పీఎస్లో బాధితురాలి తల్లి ఫిర్యాదుమా కుమార్తెని లైంగిక వేధింపులకు గురిచేశాడు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం ఆరు గంటల హైడ్రామా తర్వాత కేసు నమోదు..!నాపై హనీట్రాప్ చేశారు : కరీంనగర్ స్టేషన్లో బండి సంజరు కొడుకు భగీరథ్ ఫిర్యాదుొ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నవతెలంగాణ-కొంపల్లి/ కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిబాలికపై లైంగికవేధింపుల ఆరోపణలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజరు కుమారుడిపై పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు […] The post బండికి సన్స్ట్రోక్ appeared first on Navatelangana.

నేడు తమిళనాడు సీఎంగా ప్రమాణం మరో తొమ్మిది మంది మంత్రులు కూడా13న విశ్వాస పరీక్ష 120 మంది మద్దతుతో గవర్నర్ అంగీకారంమా పథకాలను కొనసాగించండి : స్టాలిన్చెన్నై : ఎట్టకేలకు అన్ని రకాల అడ్డంకులు, అనిశ్చితులు తొలగి తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు, టీవీకే అధ్యక్షులు సి.జోసెఫ్ విజయ్ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 9మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. […] The post విజయ్ కి లైన్ క్లియర్ appeared first on Navatelangana.

ఓ భారతీయుడు మృతి, నలుగురికి తీవ్ర గాయాలుటెహ్రాన్ : హార్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులతో వెళ్తున్న ఓ చెక్క పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెక్క పడవ దుబారు నుంచి యెమెన్లోని ముక్కంకు బయలుదేరింది. ఇందులో 18 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అమెరికా- ఇరాన్ బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో భాగంగా ఈ పడవ పైనా కాల్పులు జరపడంతో మంటలు చెలరేగి పడవ […] The post హార్ముజ్ సమీపంలో చెక్క పడవలో మంటలు appeared first on Navatelangana.

సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం, ఉపాధ్యక్షులు తపన్సేన్ కార్మిక వ్యతిరేక కోడ్ల ప్రతులు దగ్ధంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనాలుగు కార్మిక లేబర్ కోడ్లు దేశ కార్మిక వర్గానికి మరణగంట అని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం, ఉపాధ్యక్షులు తపన్సేన్, కార్యదర్శి ఏఆర్ సింధు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్ల నిబంధనలను నోటిఫై చేసిన నేపథ్యంలో శనివారం సీఐటీయూ కేంద్ర కార్యాలయం బీటీఆర్ భవన్లో గెజిట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ […] The post లేబర్కోడ్లు దేశ కార్మికవర్గానికి మరణగంట appeared first on Navatelangana.

భారత దేశం అత్యంత అధునాతన అగ్నిక్షిపణి ప్రయోగాన్ని శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఒడిశా తీరం లోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుండి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ క్షిపణి ఎంఐఆర్వి ( మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికిల్ )సాంకేంతికతను కలిగి ఉంది. ఎంఐఆర్వి అంటే ఒకే క్షిపణి ద్వారా బహుళ లక్షాలను ఒకేసారి ఛేదించడం. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది.

న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) షాక్ ఇచ్చింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో పసిడి పోరుకు చేరినా, పతకం చేజార్చుకున్న వినేశ్ ఫోగట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా.. భారత రెజ్లింగ్ సమాఖ్య రూల్స్ రీ ఎంట్రీని అసాధ్యం చేశాయి!. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యాంటీ డోపీంగ్ రూల్స్ ప్రకారం వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అథ్లెట్లు ఆరు నెలల ముందుగానే యాంటీ […] The post వినేశ్కు షోకాజ్ నోటీసు appeared first on Navatelangana.

దాదాపు 60 సంవత్సరాల ద్రవిడ పార్టీల పట్టు నుండి తమిళనాడు రాష్ట్రాన్ని విడిపించిన ఘనత దక్కించుకొని నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టనున్న విజయ్ జోసెఫ్కు రాజకీయాలు, సినిమా అంత సులభం కావని గత ఐదు రోజుల్లో బాగా అర్థమయి ఉంటుంది. సినిమాల్లో హీరోలు ఒంటి చేత్తో 100మంది తమకంటే బలవంతులైన గూండాలను, విలన్లను మట్టికరిపించేసి సినీ అభిమానుల చేత విజిల్స్ వేయించుకుంటారు. నిజజీవితంలో అందునా రాజకీయాల్లో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని ఈ నెల 4న ఫలితాలు వెలువడిన దగ్గరి నుండి 9వ తేదీ సాయంత్రం వరకు జరిగిన తతంగం వల్ల బాగా అర్థం అయి ఉంటుంది. ఆయన వేసిన ఈల (విజయ్ పార్టీ ఎన్నికల గుర్తు ఈల) 108 నియోజకవర్గాల ప్రజలు మాత్రమే వినడంతో అసలు సమస్య వచ్చిపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మొత్తం శాసన సభ్యుల సంఖ్యలో సగానికి మించి ఒక స్థానం అయినా గెలుచుకోవాలి. అంటే 118 స్థానాలు అవసరం. తాను రెండు స్థానాల నుండి పోటీ చేసి గెలిచాడు కాబట్టి ఒకటి వదులుకుంటే 107 స్థానాలే ఉన్నట్టు, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా 11 స్థానాలు అవసరం. ఇండియా కూటమి ధర్మంలో భాగంగా డిఎంకెతో కలిసి పోటీచేసి అయిదు స

వేర్అబౌట్స్ సమాచారం ఇవ్వటంలో విఫలంన్యూఢిల్లీ : భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షెఫాలీ వర్మకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. రిజస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)లో ఉన్న యశస్వి జైస్వాల్, షెఫాలీ వర్మ నాడా అధికారులకు వేర్అబౌంట్స్ సమాచారం ఇవ్వటంలో విఫలమైనట్టు తెలిసింది. షెడ్యూల్ శాంపిల్ సేకరణకు ఈ ఇద్దరు అందుబాటులో ఉండలేదు. శాంపిల్ సేకరణకు అందుబాటులో లేకపోవటంతో తొలి వేర్ అబౌట్ ఫెయిల్యూర్గా పరిగణించి ఇద్దరు క్రికెటర్లకు నోటీసులు […] The post యశస్వి, షెఫాలీకు నాడా నోటీసులు appeared first on Navatelangana.

క్రీడాశాఖకు జీఎం అభిజిత్ విజ్ఞప్తిన్యూఢిల్లీ : భారత గ్రాండ్మాస్టర్, ఐదు సార్లు కామనెవెల్త్ గేమ్స్ చాంపియన్ అభిజిత్ గుప్త టోర్నమెంట్ ప్రైజ్మనీ కోసం క్రీడామంత్రిత్వ శాఖను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఏడాది జవనరిలో ఒడిశా ఓపెన్ విజేతగా నిలిచిన అభిజిత్ గుప్త రూ.5.5 లక్ష?ల నగదు బహుమతి అందుకోవాల్సి ఉంది. కానీ ఒడిశా చెస్ సోసియేషన్లో అంతర్గత కుమ్ములాటల ఫలితంగా బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు. దీంతో ఒడిశా ఓపెన్ విజేతలకు నగదు బహుమతి అందించటంలో తీవ్ర జాప్యం […] The post ప్రైజ్మనీ ఇప్పించండి appeared first on Navatelangana.

మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది. వ్యాపారపరంగా ఉద్యోగ పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేముందు వెనక ముందు ఆలోచించుకొని ముందుకు వెళ్లాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కాస్త చికాగు కలిగిస్తాయి. అదేవిధంగా సహోదరి సహోదరుల మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది. సంతాన పరమైన అంశాలు చక్కగా ఉన్నాయి. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ముందుకు వెళ్లాలి అనే ఆలోచన అందరికీ నచ్చుతుంది. తద్వారా ముందుకు వెళ్లగలుగుతారు. అదే విధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిరుస్థాయి వ్యాపారస్తులకు ఒక మాదిరిగా ఉంటుంది. ఏదైనా సరే కష్టపడి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని ఆశిస్తారు. కానీ ఏలినాటి శని వలన కొన్ని కార్యక్రమాలు చేయ

ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర రూ.30 లక్షలుమెక్సికోలోనూ సగటు టికెట్ ధర రూ.1 లక్షతీవ్ర అసంతప్తిలో ఫుట్బాల్ అభిమానులు నవతెలంగాణ -క్రీడావిభాగం2026 ఫిఫా ప్రపంచకప్ జూన్ 11 నుంచి ఆరంభం కానుంది. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ మెక్సికోలోని ఎస్టాడియో బెనెర్టె స్టేడియంలో జరుగనుంది. ఆతిథ్య మెక్సికో, దక్షణాఫ్రికాలు ఆరంభ మ్యాచ్లో తలపడనున్నాయి. ప్రపంచకప్లో 104 మ్యాచ్లు జరుగనుండగా.. అమెరికా వేదికగా 11 నగరాల్లో అత్యధిక మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. మెక్సికోలో మూడు స్టేడియాల్లో ప్రపంచకప్ మ్యాచ్లు జరుగుతాయి. […] The post ఫిఫా టికెట్ల దందా appeared first on Navatelangana.

ఐపిఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని అందుకుంది. శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 77 పరుగుల తేడా గెలుపొందింది. బ్యాటింగ్ బౌలింగ్లలో సమష్టిగా రాణించిన టైటాన్స్.. అతిధ్య జట్టును మట్టికరిపించింది. 230 పరుగుల భారీ లక్ష ఛేదనకు దిగిన రాజస్థాన్ను రషీద్ ఖాన్(4/33), కగిసో రబాడ(2/33), జాసన్ హోల్డర్(2/11)లు బాల్ చెలరేగడంతో 152 పరుగులకే చాపచుట్టేసింది రాజస్థాన్. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్లు చెలరేగడంతో రాజస్తాన్ రాయల్స్కు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిబ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థ సెంచరీలతో కధంతొక్కగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ (37 నాటౌట్), రాహుల్ తెవాటియా (14 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో రాణించారు. దీంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ దక్కించుకున్నారు.

ముండిచింత తండాలో విషాదం నెలకొన్నది. దేవరుప్పుల మండలం ధర్మాపురం సమీపంలోని ముండిచింత తండా (లక్ష్మణ్ తండా)లో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పాముల కాటుకు గురై కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్ష్మణ్ తండాకు చెందిన శ్రీయన్ (4) అనే బాలుడు గురువారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో నిద్రలో ఉండగా ఒకే సమయంలో నాగుపాము, రక్తపింజరలు కాటువేసాయి. అయితే ఆ బాలుడు భయంతో తల్లిదండ్రులకు కాటువేసిన విషయం చెప్పలేదు. సుమారు గంట తర్వాత, అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తనను పాములు కరిచాయని బాలుడు చెప్పడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటిన బాలుడిని హన్మకొండలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ అప్పటికే బాలుడి శరీరం అంతటా విషం పాకింది. పరిస్థితి విషమించిన బాలుడు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందాడు. కళ్లముందే కొడుకు శవమై పడి ఉండటంతో తల్లిదండ్రుల రోధనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. బాలుడి తల్లి కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోడు చేశారు.

ఆకాశమంత అనురాగం, అంతరి క్షమంత సహనం, ఎవరెస్టుతో వ్యక్తిత్వం, మహోన్నత ప్రేమ శిఖరం అమ్మ. మాతృమూర్తి త్యాగానికి ప్రత్యామ్నాయం లేదు. 1914లో అమెరికన్ అన్నా జార్వీస్ ప్రారంభించిన మాతృ దినోత్సవం ప్రతియేటా మే రెండో ఆదివారం, అనగా 10 మే 2026 రోజున ప్రపంచవ్యాప్తంగా “జాతీయ మాతృదినోత్సవం” లేదా “నేషనల్ మదర్స్ డే”గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జాతీయ మాతృ దినోత్సవం -2026 ఇతివృత్తంగా “గొప్ప భారం దించడం” అనబడే అంశాన్ని తీసుకొని తల్లి మోస్తున్న భారీ […] The post అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఉందా? appeared first on Navatelangana.

రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావుడి చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు. దూపైనప్పుడే బాయి తవ్వినట్లు కాకుండా ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలి కానీ, అది వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులివ్వడం కాంగ్రెస్ కురచబుద్ధిని తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నదన్నారు. 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పందం జరిగిందని మంత్రి వివేక్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. నిజంగానే ఒప్పందం ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఏడున్నరేండ్లు అధికారంలో ఉండి కూడా తట్టెడు మట్టైనా ఎందుకు తవ్వలేదని ప్రశ్నించారు. 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీని ఎవరాపారు? ఆ రోజు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ అప్పటి సీఎం కిరణ్కుమార్ రెడ్డికి

దుబాయ్ నుంచి శుక్రవారం యెమెన్ లోని ముక్కంకు బయలుదేరిన చెక్కపడవపై హార్ముజ్ జలసంధిలో కాల్పులు జరగడంతో మంటలు చెలరేగి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయని ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. 17 మందిని రక్షించారు. మృతుడు అల్తాఫ్ తలబ్ కేర్గా గుర్తించారు. ఇంజిన్ డ్రైవర్గా పనిచేస్తున్నఅతడు గుజరాత్ లోని ద్వారకా కు చెందిన వాడని తెలుస్తోంది. దుబాయ్లోని భారత దౌత్య కార్యాలయానికి చెందిన అధికారులు గత రాత్రి బాధితులను కలుసుకున్నారు. చెక్కపడవ యజమానితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని అధికారులు చెప్పారు.

వాట్సాప్లో వార్త చూడగానే పుష్పకుమార్ ఎగిరిగంతేశాడు. తన ఆరాధ్యదైవం, అవతారపురుషుడైన పెద్దాయన పేరిట డిల్లీ యూనివర్సిటీలో ఒక పొలిటికల్ సైన్స్ కోర్సు ప్రారంభించారు. ఏ దేశానికైనా ఇంతకన్నా కావాల్సిందేమి ఉంటుందను కున్నాడు! పెద్దాయన జ్ఞానం, భవిష్యద్దర్శనంతో గతంలో వెల్లివిసిరిన విజ్ఞానాన్ని తవ్వితీయడం, పరిపాలనాదక్షత, ఎలాంటి ఎన్నికల్లో నైనా అవలీలగా గెలవటం ఇవన్నీ భవిష్యత్ తరాలకు ఎలా అందుతాయో అని తాను ఎంతో మదనపడేవాడు! ఆ సమస్య ఇక పరిష్కా రమైనట్లే! సమాజానికే కాదు, తన సమస్యకు పరిష్కారం […] The post కొత్త రాజకీయ తత్వశాస్త్రం appeared first on Navatelangana.

అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే ముగిశాయి. భారతదేశ భిన్నత్వానికి అద్దం పడుతూనే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ దుస్తంత్రాలకూ విస్తరిస్తున్న బీజేపీ-ఆరెస్సెస్ అప్రజాస్వామిక వ్యూహాలనూ ప్రజలకు తెలియజెప్పాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు తదనంతర నాటకీయ పరిణామాలపై దృష్టి కేంద్రీకృతమవడం సహజమే. అయినా కేరళలో యూడిఎఫ్ గెలుపు, పశ్చిమ బెంగాల్లో మొదటిసారి బీజేపీ పగ్గాలు చేపట్టడం ఆధారంగా కమ్యూనిస్టు వ్యతిరేకతను పెంచేందుకు కొన్ని శక్తులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. తెలుగు రాష్ట్రాల పాలకపార్టీలు కూడా తమ తమ కోణాల […] The post ఐదు రాష్ర్టాలు – ఒకే హెచ్చరిక appeared first on Navatelangana.

ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మే నాలుగున ప్రకటించారు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ గెలిచింది. కేరళలో యూడీఎఫ్ విజయం సాధించింది. తమిళనాడులో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు. ఇదంతా సాధారణ వార్త. ఎవరెవరు ఎలా గెలిచారు. ‘సర్’ ప్రభావమేమిటి? ఓటు చోరీ స్టోరీలోకి వెళ్లడంలేదు. ఓటర్ చోరీ గురించి, ఎన్నికలలో డబ్బు, కేంద్ర బలగాలు, ఈ.డి, సి.బి.ఐ. ఎలక్షన్ కమిషన్ పాత్రలే కాక, మతతత్వ విద్వేష పాత్రనూ ఇప్పుడు […] The post అనాగరికతారంభం appeared first on Navatelangana.