19510 వార్తలు


ఖేర్సన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. తాజాగా ఖేర్సన్ నగరంలో ఓ కూరగాయల వ్యాపారిపై డ్రోన్ దాడి చేసింది. డ్రోన్ వ్యాపారిని వెంబడించి మరీ దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన భాయానక వీడియోని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ ఇందుకు సంబంధించిన భయానక వీడియోని సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. అమాయక పౌరులపై రష్యా దళాలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని.. ఇది కచ్చితంగా యుద్ధ నేరమని పేర్కొన్నారు. డ్రోన్ రావడాన్ని గమనించి యూరి (52) తన భార్యను సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించాడు. డ్రోన్ అతడిని వెంబడించడంతో భయంతో వ్యాన్ చుట్టు పరుగులు తీశాడు. అయితే చాలా సేపు యూరి చివరకు డ్రోన్ చేతికి చిక్కాడు. డ్రోన్ ఆ వాహననానికి ఢీకొట్టగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యూరికి తీవ్ర గాయాలయ్యాయి.









డబ్భయ్కిపైగా దేశాలు పాల్గొన్న గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పదమూడు స్వర్ణాలు, పదిహేడు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలతో భారతదేశం నాలుగో స్థానంలో నిలబడటం గర్వించదగిన విషయం. నాలుగేళ్ల క్రితం బర్మింగ్ హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే ఈసారి పతకాలు తగ్గాయి. అప్పుడు 61 పతకాలను గెలుచుకుంటే ఇప్పుడు మనం సాధించినవి 39 మాత్రమే. అంతమాత్రాన మన క్రీడాకారులను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, నిరుడు కామన్వెల్త్ క్రీడల్లో 21 క్రీడాంశాలలో పోటీలు జరిగితే, ఈసారి వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు కేవలం పది అంశాలలోనే పోటీలు నిర్వహించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధారణంగా భారత్కు పతకాల పంట పండించే హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ వంటి క్రీడలు ఈసారి లేవు. అయినా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోవడం మన క్రీడాకారులు సాధించిన ఘన విజయంగానే చెప్పుకోవాలి.ఈసారి భారత బాక్సర్లు ప్రదర్శించిన ప్రతిభాపాటవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏడు స్వర్ణాలు సహా మొత్తం పది పతకాలను సాధించి, మన బాక్సింగ్ యోధులు సత్తాచాటారు. జూడోలోనూ రెండు స్వర్ణాలు గెలుచుకోవడం విశేషం. అథ్లెటిక్స్ లోనూ మనవాళ్లు నిలక


ఈ సమావేశాల్లో పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలన్న మోడీ ప్రభుత్వ బృహత్ ప్రణాళికకు ఆటంకం కలిగింది. నైతిక విలువలు కోల్పోయిన ఎంపిలను పోగుచేసే వారి నీచమైన ఆట విఫలమవడం వల్ల ఈ విధంగా జరగలేదు. ఆర్థిక వర్గాలకు, సంప్రదాయ భావజాలాలకు అతీతంగా దేశ ప్రజల ఊహలను, సానుభూతిని ఆకట్టుకున్న ఒక ఆకస్మిక ఉద్యమం శక్తి వల్ల అత్యంత బలవంతుడైన నాయకుడిగా పేరొందిన ప్రధాని నేడు ఆత్మరక్షణలో కనిపిస్తున్నారు. బిజెపికి చెందిన వయోవృద్ధ నాయకుడు మురళీ మనోహర్ జోషి కూడా తమ మద్దతును జెన్ జెడ్కు తెలిపారు. స్వేచ్ఛాయుతమైన ఈ మార్పు అసంబద్ధమైన మీమ్స్, ఆకట్టుకునే ఇన్స్టాగ్రామ్ రీల్స్తో, మార్కెట్ ఒత్తిళ్లు, పంపిణీ వ్యవస్థలచే పరిమితమైన సంప్రదాయ మీడియాను మించిపోయింది. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన బిల్లును తీసుకు రావడం, నందన్ నీలేకని నాయకత్వంలో పరీక్షల సంస్కరణల కోసం ఒక ‘హై-పవర్డ్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు వంటి చర్యలు కీలక సమస్యలనుండి యువత దృష్టిని మార్చలేరు. ఈ బిల్లు రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన బిల్లుకు సవరణలు మాత్రమే. రెండేళ్ల క్రితమే సుప్రీం కోర్టు ఆదేశంపై ఏర్పాటు చేసిన ఇస్రో మాజ





అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15)కు ప్రత్యేక గుర్తింపు లభించింది. మసాచుసెట్స్ రాష్ట్రం ఆ రోజును ‘ఇండియా డే’గా ప్రకటించింది. తమ రాష్ట్రానికి భారత సంతతి ప్రజటు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ మౌరా హీలీ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ‘‘భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. విభిన్న జాతులు, మతాలు భాషలు, ఆచారాలు అక్కడ ఉన్నాయి. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ భారతీయులు అందరిలో ఐక్యత కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో 3.6 కోట్ల మంది భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. అమెరికాలోనే 50 లక్షలకు పైగా భారతీయ ప్రజలు ఉన్నారు. సామాజిక, పౌర, ఆర్థిక రంగాల్లో అమెరికాకు వీరు విశేష సేవలు అందిస్తున్నారు. వైద్యం, విజ్ఞానం, సాంకేతికత, విద్య, వ్యాపారం, ప్రజాసేవలో కీలక పాత్ర పోషిస్తున్నారు’’ అని మసాచుసెట్స్ గవర్నర్ పేర్కొన్నారు.





ఝార్ఖండ్: టీం ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్.. క్రికెట్కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. బ్యాంక్ ఉద్యోగిగా అవతారమెత్తాడు. అవును ఇది నిజం. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉగ్యోగం వచ్చింది. ప్రస్తుతం అతడు అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఎలాగో టీం ఇండియా రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక వెళ్లింది. ఈ జట్టులో ఇషాన్కి లేడు. దీంతో వచ్చే నెల వరకూ అతడు ఎలాంటి క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు. దీంతో అసిస్టెంట్ మేనేజర్ హోదాలో విధులు నిర్వర్తించడానికి ఝార్ఖండ్ బ్రాంచ్కు వెళ్లాడు. ఫార్మల్ డ్రెస్సింగ్ ధరించి ఐడి కార్డుతో వెళ్లిన ఇషాన్.. మిగితా ఉద్యోగులతో కలిసి విధులు నిర్వర్తించాడు. బ్యాటింగ్లోనే కాదు.. డెస్క్ జాబ్లోనూ తానేం తక్కువ కాదని నిరూపించాడు. ఇషాన్ బ్యాంకుకు రాగానే తోటి ఉద్యోగులంతా అతడితో కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.