
3216 వార్తలు
సమాజాన్ని మార్చడానికి కలిసి పనిచేసిన వారిలో కార్ల్మార్క్స్ – ఫ్రెడరిక్ ఎంగెల్స్, మావో -ఛూటే (చైనా సైన్యాధికారి, రాజకీయ విప్లవకారుడు), ఫిడెల్ కాస్ట్రో- చేగువేరా జంటలు, జ్యోతిరావు ఫూలే -సావిత్రిబాయి ఫూలే దంపతులు చరిత్రను సృష్టించారు. కార్ల్ – జెన్ని మార్క్స్ దంపతుల కృషి ప్రత్యేకం. వామపక్ష విప్లవోద్యమంలో కలిసి పనిచేసిన దంపతులు, ఉద్యమంలో దంపతులుగా మారినవారు చాలామంది ఉన్నారు. కలిసి కషిచేయడంలో వ్యక్తుల విడివిడి శక్తులు కలిసి ఎక్కువ మోతాదు సమాహార శక్తిగా మారుతుంది. జీవిత […] The post “వాళ్లు” వ్యవస్థనెలా ఎదిరించగలిగారు? appeared first on Navatelangana.

లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబైకి రోహిత్, రికెల్టన్ మెరుపు ఆరంభాన్ని అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రికెల్టన్ 32 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. రోహిత్ 44 బంతుల్లోనే 83 పరుగులు సాధించాడు. నమన్ ధిర్ 23 (నాటౌట్), విల్ జాక్స్ 10 (నాటౌట్)లు కూడా తమవంతు సహకారం అందించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్కు స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ విధ్వంసక ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పూరన్ వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన పూరన్ 15 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓపెనర్ మిఛెల్ మార్ష్ కూడా మెరుగైన బ్యాటింగ్తో అలరించాడు. జోష్ ఇంగ్లిస్ 3 ఫోర్లతో వేగంగా 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత పూరన్, మార్ష్లు స్కోరును పరిగెత్తించారు. చెలరేగి ఆడిన మార్ష్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రె

ఇరాన్ క్షిపణి డ్రోన్ల దాడుల్లో గాయపడ్డ ముగ్గురు భారతీయులుదుబాయ్ ః అరబ్ ఏమిరేట్స్పై సోమవారం ఇరాన్ క్షిపణుల దాడికి దిగింది. యుఎఇలోని ఫుజెయిరాలో జరిగిన ఈ సైనిక చర్యలో ముగ్గురు భారతీయ పౌరులు గాయపడ్డారు. కొద్దిరోజుల విరామం తరువాత ఇరాన్ ఈ గల్ఫ్దేశంపై అందులోనూ కీలకమైన చమురు క్షేత్ర ప్రాంతంపై విరుచుకుపడింది. ఈ పరిణామం తిరిగి కలకలానికి దారితీసింది. సోమవారం రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత జరిగిన ఈ మిస్సైల్స్ , డ్రోన్ల దాడి ఘటన వివరాలు తెలియలేదు. దాడి జరిగిన ప్రాంతంలోని ఎమిరేట్స్ లోని చమురు స్థావరానికి నష్టం వాటిల్లిందీ లేనిది తెలియలేదు.

రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన మూస పద్ధతులను, సంప్రదాయ రాజకీయ సూత్రాలను చెరిపివేస్తూ తమిళగ వెట్రి కళగం (టివికె) అధినేత విజయ్ సృష్టించిన ప్రభంజనం అసాధారణం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్కు కెటిఆర్ ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సమకాలీన రాజకీయాల్లో “సంచలనం” అనే పదానికి నిలువెత్తు రూపం నేటి పరిణామాలు అని వ్యాఖ్యానించారు. మీ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని, సరికొత్త పుంతలు తొక్కుతూ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను అంటూ టివికె అధినేత విజయ్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.విజయ్కు హరీష్రావు శుభాకాంక్షలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టివికె అధినేత, నటుడు విజయ్కు మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో దళపతి విజయ్ అనూహ్య విజయాన్ని దక్కించుకున్నారు. రెండేళ్ళ క్రితం తాను పెట్టిన ’తమిళక వెట్రి కళగం’ (టివికె) పార్టీని ఒంటి చేతితో గెలిపించి, తన సత్తాను చాటుకున్నారు. ఇక విజయ్ పార్టీ ఊహించని విజయాన్ని అందుకోవడంతో తెలుగు, తమిళ సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు అతన్ని అభినందనలతో ముంచెత్తారు. తమిళ స్టార్స్ కమల్హాసన్, సూర్య, విక్రమ్, శివకార్తికేయన్, వరలక్ష్మీ శరత్కుమార్, జివి ప్రకాష్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నాని, రవితేజ, శర్వానంద్, విజయ్ దేవరకొండ, నిఖిల్, సాయి దుర్గాతేజ్, రామ్ పోతినేని, సందీప్ కిషన్, మంచు మనోజ్, డా.రాజశేఖర్, అనిల్ రావిపూడి తదితరులు విజయ్ను ఎక్స్ వేదికగా అభినందించారు. “మీ తొలి ఎన్నికల్లో సాధించిన ఈ అద్భుతమైన, సముచితమైన విజయానికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే నిరంతరం ప్రేరణనిస్తూ, దృఢమైన సంకల్పంతో నాయకత్వం వహిస్తూ, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. తమిళనాడు రాష్ట్రం, అక్కడి ప్రజలకు మీరు అందించే ప్రజాసేవలో విజయవంతం కావాలని నా శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తన ప్రియమైన స్నేహితుడై

తిరువనంతపురం : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ సారి ముచ్చగా ముగ్గురు బిజెపి ఎంఎల్ఎలుగా ఎన్నికయ్యారు. పేదళ్ల తర్వాత తిరిగి కమలం నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో కాళకూటం, చాతన్నూర్, నేమోం అసెంబ్లీ స్థానాల నుంచి బిజెపి అభ్యర్థులు గెలుపొందారు. నేమోం నుంచి కేరళం బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, చాతన్నూర్ నుంచి గోపకుమార్, కాళకూటం నుంచి కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ విజయం సాధించారు. వీరు ముగ్గురు స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కినప్పటికీ ఒక్క సీటు కూడా కేరళంలో బిజెపి గెలవబోదన్న విపక్షాల వ్యాఖ్యలకు తాము దీటైన సమాధానం ఇచ్చామని బిజెపి వర్గాలు సమర్థించుకున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో -ఫాంటసీ మూవీ ’విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్, వంశీ, ప్రమోద్లు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు దగ్గరవుతోంది. చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్కు అద్భుతమైన స్పందన లభించడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో హీరోయిన్ అవని పాత్ర పోషించిన త్రిషా కృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం చిత్ర బృందం ఒక అద్భుతమైన కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో త్రిషా వెలుగుతున్న దీపాల పళ్ళెం పట్టుకుని ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. దర్శకుడు వశిష్ట విజువల్ వండర్గా ’విశ్వంభర’ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా, మౌని రాయ్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలు విఎఫ్ఎక్స్ వర్క్ నిర్వహిస్తున్నాయి. ’విశ్వంభర’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఘనంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. భబానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఓటమిపాలయ్యారు. ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,105 ఓట్ల తేడాతో మమత ఓడిపోయారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, మమతకు 58,812 ఓట్లు లభించగా, సువేందు 73,917 ఓట్లను సాధించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు శ్రీజీబ్ బిస్వాస్ 3,556 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. దీంతో టిఎంసికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరనుంది.కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసి పార్టీని చిత్తుగా ఓడిస్తూ బిజెపి ఘన విజయం సాధించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి 208 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, టిఎంసి కేవలం 79 స్థానాల్లో ముందంజలో ఉంది.


చైన్నై: సేలం జిల్లా ఈడప్పాడి నియోజకవర్గం నుంచి ఎఐఎడిఎంకె చీఫ్ పళనిస్వామి సమీప అభ్యర్థిపై 98,110 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించారు. పళనిస్వామి మొత్తం 1,48, 933 ఓట్లు సాధించుకుని ప్రత్యర్థి , ఇండిపెండెంట్ ప్రేమకుమార్ కెను ఓడించారు. ఈ నియోజకవర్గంలో 1989 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుసగా ఆరోసారి పళనిస్వామి విజయం సాధించడం విశేషం. 44011 ఓట్లు తెచ్చుకున్న డిఎంకె అభ్యర్థి కాశీ కేను కూడా పళనిస్వామి ఓడించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మరో 12 మంది శాసససభ్యులు అవసరంకాంగ్రెస్, పిఎంకె, డిఎండికె, వామపక్షాలు మద్దతు ఇచ్చేనా? అన్నాడిఎంకెతో కలిసి నడిస్తే పటిష్టంగా ప్రభుత్వం కింగ్ మేకర్ అవుతాడనుకుంటే కింగే అవుతున్న టివికె అధినేత చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టివికె పార్టీకి ప్రభుత ఏర్పాటు ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. 234 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత ఏర్పాటుకు 118 మంది శాసనసభ్యుల బలం అవసరం. టివికె ఇప్పుడు 106 సీట్లను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. అధికార డిఎంకె 74 మంది తర్వాతి స్థానంలో నిలవగా, అన్నాడిఎంకె 54మందిని గెలుచుకుని మూడో స్థానానికి పరిమితమైంది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 12 మంది అవసరం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, పిఎంకె, డిఎండికె, వామపక్షాలు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే విజయ్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. డిఎంకె కూటమితో పొత్తు పెట్టుకోవడానికి ముందు ఒక దశలో టివికెతో కూడా కాంగ్రెస్ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక నేతలు కూడా విజయ్

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈనెల 8న చౌదరిగూడెం వద్ద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ నిర్వహించనున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతానని ప్రకటించిన కల్వకుంట్ల కవిత అన్నట్టుగానే ఈనెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణా జలాల సాధనకు శంఖారావం పూరించనున్నారు. 8న ఉదయం జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకోనున్న కవిత అదే రోజు సాయంత్రం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు సోమవారం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు సాధన పోస్టర్ను ఆవిష్కరించారు.

ఎన్నికల ముంగిట దళపతిని వెన్నాడిన సమస్యలు వ్యూహాత్మకంగా అధిగమించిన విజయ్ తక్కువ సమయంలోనే ఓటర్లను ఆకట్టుకున్న సినీ స్టార్ చెన్నై : తమిళ వెట్రి కజగం(టివికె) స్థాపించింది మొదలు దళపతి విజయ్ చుట్టూ సమస్యలు ముసురుకున్నాయి. రెండు జాతీయ పార్టీలతో పాటు తమిళనాడు వేళ్లూనుకుపోయిన ప్రాంతీయ శక్తులైన అధికార డిఎంకె, విపక్ష అన్నాడిఎంకెలతో సరికొత్త ప్రాంతీయ శక్తిగా రంగంలోకి దిగి బరిగీసి నిలిచాడు విజయ్. కరూర్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగి పలువురు అభిమానులు దుర్మరణం చెందడంతో ఆయన తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. వారి కుటుంబాలను కలిసి వారికి ధైర్యాన్నిచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటానని భరోసా కల్పించాడు. తోచినంత ఆర్థిక సాయం చేసి వారికి అండగా నిలిచాడు. అయితే కరూర్ ఘటనపై సిబిఐ విచారణ పేరిట విజయ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ పలుమార్లు విచారణకు పిలిచి సుదీర్ఘంగా దర్యాప్తు జరిగింది. కీలక ఎన్నికల ప్రచార సమయం, అభ్యర్థుల ఎంపిక తదితర షెడ్యూళ్ల నడుమ ఆయన పలుమార్లు హస్తినకు వెళ్లి రావాల్సి వచ్చింది. దీనికి తోడు తన భార్య విడాకుల అంశం తెరపైకి వచ్చింది. అందుకోసం కోర్టుకు సమయం కేటాయించడం, స్వయంగా హాజరుకాలేనని విన్నవిం

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో హజ్ యాత్ర భారంగా మారిన నేపథ్యంలో యాత్రికులపై పడే భారాన్ని భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి ప్రతి ఏటా పిలిగ్రిమ్స్ పెద్ద సంఖ్యలో మక్కాకు హజ్ యాత్రకు వెళతారు. ఈ ఏడాది సుమారు 7 వేల మంది హజ్ యాత్రకు నమోదు చేయించుకున్నారు. పేద ముస్లింలు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్కు వెళ్లాలనే లక్ష్యంతో ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచుకుంటారు. ఆ మొత్తాన్ని ఉపయోగించుకొని హజ్ యాత్రకు వెళుతుంటారు. కాని ఇరాన్-, అమెరికా యుద్ధంతో ఇంధన ధరలు పెరగడంతో ఆ ప్రభావం హజ్ యాత్రపై పడి యాత్రికులపై భారం పెరిగింది. కేంద్ర హజ్ కమిటీ ప్రతి యాత్రికుడు అదనంగా రూ. 10 వేలు చెల్లించాలని సర్కులర్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజ్ యాత్రికుల భారం భరించాలని నిర్ణయం తీసుకున్నారు.


రోహిణి కార్తె రాకముందే రాష్ట్రంలో సూర్యుడు మంటెక్కిస్తున్నాడు. వడ గాలులు తీవ్రతతో ఎండ వేడిమి తారా స్థాయి చేరుకుంది. అనేక ప్రాంతాల్లో గత పది రోజులుగా 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం గరిష్టంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది. ఆదివారం భారీ వర్షాలు కురిసిన జిల్లాల్లోనే కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం రాష్ట్రంలోని విచిత్ర వాతావరణ పరిస్థితికి అద్దం పడుతుంది. మరో రెండు రోజుల పాటు ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, తరువాత క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీట

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేర్కొన్నారు. ఈనెల 5న ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ ద్వారా సిరిసిల్ల పర్యటన ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12:15 గంటలకు గంభీరావుపేట గ్రామానికి మంత్రుల బృందం చేరుకుని, గంభీరావుపేటలో […] The post రేపు సిరిసిల్లకు డిప్యూటీ సీఎం భట్టి appeared first on Navatelangana.

ఆర్జి కర్ ఘటన, సందేశ్ ఖలీ అమానుషాలతో జనంలో పలచననేతల అవినీతి, నిరుద్యోగ యువతలో నైరాశ్యం సర్తో టిఎంసి మరింత చతికిల బిజెపికి కలిసి వచ్చిన ప్రభుత్వంపై సహజ వ్యతిరేకత కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా మూడు పర్యాయాలు ఏలిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 15 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసిని అధికారం నుంచి భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు గద్దె దించగలిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి అగ్ర నాయకుల ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన ఈ కాషాయ పార్టీ, అత్యధిక కాలం వామపక్ష రాజకీయాల ఆధిపత్యం కొనసాగిన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో ప్రజల్లో ఇంతగా ఆదరణ కోల్పోవడానికి మమతా బెనర్జీ చేసిన తప్పులే ఆమె పార్టీ మెడకు చుట్టుకున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓటమికి తానే స్వయంగా దారులు పరుచుకున్నరాని పేర్కొంటున్నారు. ఆర్జి కర్ ఘటన నుంచి మొదలు పశ్చిమ బెంగాల్లో టిఎంసి పతనానికి నాంది పడింది. ఒక యువ వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటన
నవతెలంగాణ – మైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని MK స్టాలిన్ తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల కోసం అనేక ప్రాజెక్టులు, మంచి పాలన అందించామని, ప్రతి దశలోనూ తమిళనాడు ముందుండేలా చూశామని డీఎంకే నాయకుడు తెలిపారు. తాము సాధించిన విజయాలను మాత్రమే ప్రజల ముందు ఉంచి ఓట్లు అభ్యర్థించామని, ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ వాటిని కొనసాగిస్తామని హామీ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. The post ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం: ఎంకే స్టాలిన్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని పదవ వార్డు కౌన్సిలర్ బోల్గాం వైష్ణవి, మాజీ కౌన్సిలర్ బోల్గాం నాగరాజు లు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారక రామారావు వారికి బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ తుల ఉమ, గూడూరి ప్రవీణ్, గాజుల శ్రీనివాస్, గుండ్ల పెళ్లి పూర్ణచందర్, సంపత్, కొండ […] The post 10వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ లో చేరిక appeared first on Navatelangana.