19518 వార్తలు




ది హండ్రెడ్ మెన్స్ లీగ్లో సన్రైజర్స్ లీడ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. మంగళవారం హెడింగ్లే వేదికగా లండన్ స్పిరిట్స్తో జరిగిన మ్యాచ్లో 100 బంతుల్లోనే 241 పరుగులు చేశారు. దీంతో సన్రైజర్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కి దిగిన సన్రైజర్స్ జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ర్యాన్ రికెల్టన్ శుభారంభం అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 54 బంతుల్లోనే 131 పరుగులు జత చేశారు. పురుషుల హండ్రెడ్ లీగ్2లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మార్ష్ 24 బంతుల్లో అర్థశతకం సాధించగా.. రికెల్టన్ కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే మార్ష్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో 76 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ, రికెల్టన్ మాత్రం దూకుడుగా ఆడాడు. 42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేశాడు. దీంతో సన్రైజర్స్ నిర్ణీత 100 బంతులలో 2 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అయితే లండన్ స్పిరిట్కి లక్ష్య చేధనలో ఆరంభంలోనే షాక్ తగిలింది. జానీ బెయిర్స్ట

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడేచూరు-బాడియాల పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో ఇవాళ వేకువజామున రసాయన వాయువు లీకై ముగ్గురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్తో పాటు మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్లుగా గుర్తించారు. వీరంతా 20 నుంచి 25 ఏండ్ల లోపు యువకులే. ఈ […] The post పరిశ్రమలో రసాయన వాయువు లీక్.. ఊపిరాడక ముగ్గురి మృతి appeared first on Navatelangana.



బెంగళూరు: కర్నాటక రాష్ట్రం యాద్గిర్ మండలంలో ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. కడేచూరు పరిశ్రమలో రసాయన వాయువు లీక్ కావడంతో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. మృతుల్లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన గణేశ్ ఉన్నాడు.


ముంబై: భారత జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న అజింక్య రహానెకు ప్రతిభకు తగినట్టు గుర్తింపు దక్కలేదని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా టెస్టుల్లో రహానె అత్యంత ప్రతిభావంతుడైన బ్యాట్స్మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. చటేశ్వర్ పుజారాతో కలిసి అతను టెస్టుల్లో నెలకొల్పిన పార్ట్నర్షిప్లే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చన్నాడు. రాహుల్ ద్రవిడ్కు సమకాలికుడిగా రహానెను గవాస్కర్ అభివర్ణించాడు. ద్రవిడ్ మాదిరిగానే రహానెకు కూడా టీమిండియాలో తగిన గుర్తింపు దక్కలేదన్నాడు. రోహిత్ శర్మ, ధోనీ, విరాట్ కోహ్లి, పుజారా తదితరులకు లభించినంత ఆదరణ, గౌరవం రహానెకు లభించలేదన్నాడు. అందుబాటులో ఉన్న వారితో జట్టును ముందుకు నడిపించిన తీరు భారత క్రికెట్ చరిత్రలోనే చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలి పోతుందని గవాస్కర్ పేర్కొన్నాడు.


నవతెలంగాణ – హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ సవరించకపోవడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన సమీక్షల్లోనూ ఈ వడ్డీరేట్లను రిజర్వ్బ్యాంక్ యథాతథంగా ఉంచింది. The post యథాతథంగా ఆర్బీఐ వడ్డిరేట్లు appeared first on Navatelangana.




నవతెలంగాణ – హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్ ప్రశాంతంగా ముగిసిపోవడంతో అక్కడినుంచి అథ్లెట్లు తమతమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కాని ఇంకా కొందరు అథ్లెట్లు ఇప్పటికీ వారి స్వస్థలాలకు వెళ్లకపోవడంపై గందరగోళం నెలకొంది. క్రీడలు ముగిసిన తర్వాత పాక్ బాక్సర్తో సహా ఏడుగురు ఆటగాళ్లు అదృశ్యమయ్యారని అప్పటినుంచి వారి ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. దీనిపై స్కాట్లాండ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. The post కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నుంచి ఏడుగురు అథ్లెట్స్ అదృశ్యం appeared first on Navatelangana.




ముంబై: శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం నలుగురు స్పిన్నర్లను భారత క్రికెట్ బోర్డు నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. స్పిన్కు అనుకూలించి లంక పిచ్లపై భారత బ్యాటర్లకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నలుగురిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. స్పిన్నర్లు విప్రాజ్ నిగమ్, తనుష్ కొటియన్, హర్ష్ దూబె, శివాంగ్ కుమార్లను నెట్ బౌలర్లుగా జట్టులోకి తీసుకున్నారు. వీరందరూ జట్టుతో పాటు ఇప్పటికే శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని బిసిసిఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కాగా, లంక టూర్లో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలెలో, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరుగనుంది. అంతకుముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 7 నుంచి జరిగే ఈ మ్యాచ్లో శ్రీలంక ఎలెవన్ టీమ్తో భారత్ తలపడుతోంది. కొలంబోలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులోని టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వం నేడు శాసనసభలో తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల దృష్ట్యా, ఎన్నికల హామీలు, అభివృద్ధి లక్ష్యాల మధ్య సమతుల్యత పాటిస్తూ ఈ బడ్జెట్ను రూపొందించడం ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఆర్థిక, ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వ విధానాలకు, ప్రాధాన్యతలకు ఈ […] The post నేడు టీవీకే తొలి బడ్జెట్.. appeared first on Navatelangana.


హైదరాబాద్: మోహన్లాల్ కూతురు విస్మయ మోహన్ లాల్ నటించి సినిమా తుడక్కం. ఈ సినిమాలో విస్మయకు తోడుగా ఆశిష్ జో ఆంటోనీ నటించారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న భావోద్వేగ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా ఆగస్టు 7న థీయేటర్లలో విడుదల కానుంది. మంచిగా చదువుకోమ్మని కూతురుకు తండ్రి చెబుతాడు. తుడక్కం సినిమా సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ప్రియ రాసిని ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధిస్తుందని తండ్రీకూతుళ్ల సంభాషణ సినిమాకే హైలెట్గా ఉంటుంది. జరిగిన విషయాలు మరిచిపోవాలని, మళ్లీ పొరపాటు రాకుండా చూస్తానని, నోరు అదుపులో పెట్టుకోకపోతే కష్టాలు తప్పవని హెచ్చరించాడు. ఈ సినిమాలో మనోజ్, అశ్విన్, సాయి కుమార్, బాబీ కురియన్, కెబి గణేష్ తదితరలు నటించారు.