3220 వార్తలు


సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ 2026 -27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ టిజిఎస్డబ్లుఆర్జెసి సెట్ హాల్టికెట్లు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష మే 15న శుక్రవారం నిర్వహించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ హాల్ టికెట్లు మే 5 నుండి 14 వరకు అధికారిక వెబ్సైట్ rjcet.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట(D) కుకునూర్పల్లి(M) లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసి బస్సు సిద్దిపేట నుండి వెళ్తుండగా మార్గమధ్యలో లకుడారం స్టేజీ వద్దకు రాగానే ఓవర్ టేక్ చేయబోయి, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. The post లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు appeared first on Navatelangana.

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం పరాజయం పాలవడంతో, ఐదు దశాబ్దాల తర్వాత భారత్లో కమ్యూనిస్టు ముఖ్యమంత్రి లేని పరిస్థితి ఏర్పడింది. 2016లో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, దేశంలో మిగిలిన చివరి కమ్యూనిస్టు పాలనగా నిలిచింది.సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ప్రభుత్వానికి కేరళలో ఎదురైన ఈ ఓటమి, తరతరాలుగా పార్టీతో అనుబంధం ఉన్న కార్యకర్తలు ఇప్పటివరకు చూడని రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు. ఈ ఫలితంతో దేశ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీల ప్రభావం గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది.చరిత్రను పరిశీలిస్తే, పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు లెఫ్ట్ ఫ్రంట్ నిరంతరంగా అధికారంలో కొనసాగింది. త్రిపురలో 1993 నుంచి 2018 వరకు లెఫ్ట్ పాలన కొనసాగింది. కేరళలో మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారంలోకి వచ్చి, 2021లో ఆ ట్రెండ్ను అధిగమిస్తూ వరుసగా రెండోసారి గెలిచి ప్రత్యేకతను సాధించింది. అయితే 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు తెరదించింది. అదే విధంగా 2018లో త్రిపురలో 25 ఏళ్ల లెఫ్ట్ పాలనను బీజేపీ అప్రతిహతంగా ముగించింద

వస్తూ వస్తూనే తమిళనాడులో హిట్ కొట్టిన విజయ్ వెనువెంటనే తమ టివికె పార్టీ ఎన్నికల వాగ్దానాలపై దృష్టి సారించారు. ముందుగా తమిళ ఆడపడుచులకు ప్రకటించిన కానుకల విషయంపై పట్టుదలతో ఉన్నారని వెల్లడైంది. పెళ్లి సమయంలో వధువుకు 8 గ్రాముల బంగారం, కుటుంబంలో మహిళ పేరిట ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాసు సిలిండర్లు, 60 ఏండ్ల లోపు మహిళలకు మాసానికి రూ 2500 వరకూ ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన విజయ్ ఇప్పుడు దీనిని నిలబెట్టుకునే దిశలో ఇప్పటి నుంచే కార్యాచరణకు దిగారు. 22 క్యారట్ల బంగారం ధర ఇప్పుడు గ్రాముకు రూ 14000 వరకూ పలుకుతుంది. పెళ్లి అప్పుడు మహిళలకు అందించే బంగారం అపార విశ్వాసం పాదుకునేలా చేస్తుంది. వధువుకు నాణ్యమైన పట్టు చీర, తమిళ సాంప్రదాయాల మధ్య అందించడం జరుగుతుందని కూడా విజయ్ పార్టీ హామీ ఇచ్చింది. బంగారం, పట్టుచీర సెంటిమెంట్ ఎన్నికలలో బాగా పండిందనే విషయాన్ని విజయ్ తెరవెనుక వారు తేల్చిచెపుతున్నారు.సోమవారం మధ్యాహ్నానికి వెలువడ్డ ఫలితాలతో విజయ్ పార్టీ సాధారణ మెజార్టీ బలం 118 కన్నా అతి కొద్దిగా తక్కువ స్థానాలు వచ్చాయి. అయితే తరువాతి ముఖ్యమంత్రి విజయ్ అనేది స్పష్టం అయింది. ఎన్నికల పత్రంలో విజయ్ పార్టీ అందరికి నా
నవతెలంగాణ – హైదరాబాద్ : రూ.లక్ష లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారిని ఏసీబీకి పట్టుబడింది. బోరబండ జీహెచ్ యంసీ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శ్రీలత ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు బాధితుడి నుండి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసింది. అందులో భాగంగా రూ.లక్ష తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. The post లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పందించింది. కేరళంలో ప్రజాతీర్పును గౌరవీస్తామని పేర్కొంది. పదేండ్ల సీపీఐ(ఎం) పాలనలో ప్రజాసంక్షేమానికి పాటుబడ్డామని, ఆర్థికంగా కేంద్రంలోని బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విద్యా, వైద్య, వ్యవసాయ, ఉపాధి కల్పనలో కేరళంలో ఆమోగమైన అభివృద్ధిని చేసి చూపించామని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ(ఎం)తో పాటు మిత్రపక్షాలకు ఓటు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతిపక్షంలో ప్రజా సమస్యల సాధనకోసం నిరంతరం పోరాటం చేస్తామని వెల్లడించింది. అధిక […] The post ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పందన appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన వేల్పుల రాజలక్ష్మీ ప్రముఖ జానపద గాయానికి ఆనందో బ్రహ్మ స్వర్ణనంది పురస్కారాన్ని ఆదివారం హైదరాబాద్ లోని రవింద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రముఖ హాస్య నటుడు బాబుమోహన్ చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో అవార్డ్ అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. The post వళ్లెంకుంట వాసికి స్వర్ణనంది పురస్కారం appeared first on Navatelangana.
మెండుగా పోహకాలు.. పీచు పదార్థాలునవతెలంగాణ – మల్హర్ రావురోజురోజుకూ మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం అవడానికి తాటిముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి.మండే ఎండలకు విరుగుడుగా పని చేసే తాటిముంజలు కూడా సీజన్ కూడా ప్రారంభమైంది.తాటిముంజలు,నీటిముంజలు,పాలముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలం వచ్చిందంటేచాలు పల్లె,పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్లతెల్ల ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తూ,నోరూరిస్తాయి.తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే ప్రత్యేకం.తాటి ముంజలకు అంతర్జాతీయంగానూ ఎంతో పేరుంది.ఐస్ ఆపిల్ […] The post వేసవి తాపానికి చల్లటి ఉపశమనం తాటిముంజలు appeared first on Navatelangana.
ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్నవతెలంగాణ – మల్హర్ రావుదళితులు బాంధవుడు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. మంథని నియోజకవర్గంలోని దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు,సైడ్ డ్రైన్స్ నిర్మాణాల కోసం రూ.15 కోట్లు సీఆర్ఆర్ ఎస్ సి కంపోనెంట్ నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి […] The post దళిత బాంధవుడు మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.

నవతెలంగాణ – మల్హర్ రావుప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక స్థాయిలో రైతు వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 సోమవారం నుంచి 9 శనివారం వరకు రైతు వారం కింద వివిధ రైతు అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా చెప్పటం జరుగుతుందన్నారు. కొయ్యూరు రైతు వేదికలో […] The post ఈ నెల 9 వరకు రైతు వారోత్సవాలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుఅంతర్జాతీయ కార్మికుల మేడే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ జెఏసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత అవిష్కరించినట్లుగా జీపీ ఎంప్లాయిస్ యునైటేడ్ రాష్ట్ర నాయకుడు సాదుల శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా డిపిఓ జిల్లాలోని జీపీ ఉద్యోగ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీపీ ఉద్యోగుల, కార్మికులు, జెఏసీ నాయకులు పాల్గొన్నారు. The post జీపీ ఎంప్లాయిస్ జెఏసి క్యాలెండర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్డోంగ్లీ మండల కేంద్రంలో జొన్న పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, రైతులు సోమవారం తహశీల్దార్ రంజిత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంవత్సరం వానాకాలం సీజన్లో రైతులు పెద్ద ఎత్తున జొన్న పంట సాగు చేశారు. జొన్న సాగు వివరాలు: మొత్తం సాగు విస్తీర్ణం 1325 ఎకరాలు. అంచనా దిగుబడి 2650 టన్నులు, ప్రస్తుతం మా మండలంలో జొన్న కొనుగోలు కేంద్రం లేని కారణంగా, రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మద్నూర్ మార్కెట్ […] The post జొన్నపంట కొనుగోలు చేయాలని తహశీల్దార్ కు వినతి appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్వ్యవసాయ రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, పంట సాగులో రసాయన ఎరువులు తగ్గిస్తూ మోతాదులో వాడుకోవాలని వ్యవసాయ అధికారులు వ్యవసాయ రైతులకు సూచనలు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని ప్రతి రైతు వేదికలో క్లస్టర్ల పరిధి రైతులతో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతు వారోత్సవాల్లో భాగంగా వ్యవసాయ రైతులకు వ్యవసాయం గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు […] The post భూసార పరీక్షలు చేయించుకోండి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లోని భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద హైటెన్షన్ నెలకొంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భవానిపూర్ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి సువేద అధికారి పోటీ చేస్తున్నారు. ఇరువురు మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో 12 రౌండ్లు ముగియగా..మమత ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈక్రమంలోనే ఆ నియోజకవర్గానికి సంబంధించిన కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ కౌంటింగ్ హాల్ను మమతా బెనర్జీ సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియను […] The post భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద హైటెన్షన్ appeared first on Navatelangana.
నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. పశ్చిమబెంగాల్ లో పోటీ తృణమూల్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లకు టీవీకే గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలో కొనసాగుతుంది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. అస్సాంలో బీజేపీ, పుదిచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే 108 చోట్ల […] The post Assembly Elections: ఓట్ల లెక్కింపు…అప్ డేట్స్.. appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు రైతులకు కీలక సూచనలు చేశారు. రసాయన ఎరువులు మోతాదులో వాడుకోవాలని, భూసార పరీక్షలు చేసుకోవాలని, ముఖ్యంగా సాగులో అధికారుల సలహాలు పాటించాలని తెలిపారు. అనంతరం కొంతమంది రైతులు భూసార పరీక్షలు చేయించుకున్నారని, వాటికి సంబంధించిన పత్రాలను సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ చేతుల మీదుగా పంపిణీ […] The post భూసార పరీక్ష పత్రాలు అందజేసిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి appeared first on Navatelangana.

పార్టీ స్థాపించిన తర్వాత తొలి ఎన్నికల్లోనే టివికె చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికార డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలను వెనక్కి నెట్టి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు, విజయ్ పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్.. రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. మరోవైపు, ఆయన పార్టీ టివికె..110కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. దీంతో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పనున్నారు. మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం తక్కువగా ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టివికె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
