21206 వార్తలు

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్లో భారత్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. తొలుత మహిళల 54 కెజిల విభాగంలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోను ప్రీతి చిత్తు చేసింది. ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించి ఏకగ్రీవంగా విజయం సాధించింది. అనంతరం మహిళల 57 కెజిల విభాగంలో భారత్కు మరో పసిడి పతకం దక్కింది. ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్కు చెందిన మైఖేలా వాల్ష్పై జైస్మిన్ లాంబోరిమయా ఘన విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మరోవైపు పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రావెల్ (16.58 మీటర్లు) రజతం సొంతం చేసుకోగా.. సెల్వ ప్రభు తిరుమరన్ (16.52 మీటర్లు) కాంస్య పతకం సాధించాడు.


హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఎవరితో పెట్టుకోవద్దో వారితో పెట్టుకున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కొత్తతరానికి సమాజంపై ఎక్కువగా కమిట్ మెంట్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతరం కొత్త తరహాలో ఢిల్లీలో కదం తొక్కిందని కొనియాడారు. స్వేఛ్చకు పరిమితులు ఉండకూడదని సూచించారు. సోషల్ మీడియా లేకపోతే జవాబుదారీతనం వచ్చేది కాదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే ఔట్ డేట్ అయిపోతామని కెటిఆర్ హెచ్చరించారు.దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ ఎవరో ఒకరికి వత్తాసు పలుకుతున్నాయని, వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదని విమర్శించారు. కేంద్రమంత్రి తనయుడి లైంగిక దాడిని ఏ మీడియా కవర్ చేయలేదని, లగచర్ల దాడిలో రైతులపై కేసులు పెడితే ఏ మీడియా రాయలేదని మండిపడ్డారు. వాట్సాప్ అంకుల్స్.. ఇన్ స్టా పిల్లల్లో ఎవరూ గెలిచారో చూశామని, వచ్చే ఎన్నికల్లో 50 శాతం పైగా జెన్ జి ఓట్లు వేయబోతున్నారని అన్నారు. తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి దేశంలో ఉందని కెటిఆర్ ఎద్దేవా చేశారు.










దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ నవ్విస్తూ.. భయపెడుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు వరుణ్ ఖాతాలో మరో హిట్ పడటం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఇక కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.



హైడ్రా పునరుద్ధరించిన ఉప్పల్ నల్ల చెరువు జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పల్ నల్లచెరువు వరద నీరుతో నిండింది. భారీ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి మురికి కూపంగా మారిన ఈ చెరువును హైడ్రా పునరుద్ధరిస్తున్న విషయం అందరికీ విదితమే. ఈ క్రమంలో వర్షాలు పడినప్పుడు వరద నీరు చెరువులోకి చేరేలా తక్కువ మొత్తంలో పారే మురుగు నీరు బైపాస్ చేసిన కాలువ లోంచి బయటకు పోయేలా కాలువలను హైడ్రా అభివృద్ధి చేసింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువున ఉన్న ప్రాంతాలు నీట మునగకుండా వరద నీరు నల్ల చెరువుకు చేరింది. ఉప్పల్ నల్ల చెరువులో 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించి 70 ఎకరాల వరకు విస్తరించిన విషయం విదితమే. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో హైడ్రా ఈ చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది.ఉప్పల్ నల్ల చెరువుకు ఎగువున ఉన్న నాచారం చెరువుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరేలా రెండు ఇన్లెట్లను హైడ్రా అభివృద్ధి చేసింది. అలాగే చెరువు నిందిన తర్వాత వరద నీరు సాఫీగా మూసీకి చేరేలా ఔట్ లెట్ కూడా తీర్చిదిద్దింది. నీటి నిల్వకే పరిమితం కాకుండా, ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదం కల్పించేలా చెరువు చుట్

లండన్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండర్ ఆశుతోష్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. అక్కడి వన్డే కప్లో హ్యాంప్షైర్కు అశుతోష్ 4 మ్యాచుల్లో 13 వికెట్ల పడగొట్టాడు. ఇంగ్లండ్లోని వైవిధ్యభరితమైన పిచ్లపై తన మీడియం పేస్ బౌలింగ్తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా ఎసెక్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. దీనికి ముందు మ్యాచ్లో ఓ వికెట్ తీసిన అశుతోష్ అంతకు ముందు మ్యాచ్లో 4 వికెట్లు, దానికి ముందు మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలతో ఆశుతోష్ ఈ సీజన్లో హ్యాంప్షైర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్లో మాత్రం తేలిపోతున్నాడు. 4 మ్యాచ్ల్లో కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఒకటి రెండు మెరుపులతో సరిపెట్టాడు. ఈ టోర్నీలో అశుతోష్ స్కోర్లు వరుసగా 10, 0, 11, 16 పరుగులుగా ఉన్నాయి.





