
4019 వార్తలు
నవతెలంగాణ- హైదరాబాద్ : తెలంగాణలో ఎండ వేడి రోజురోజుకు పెరిగిపోతుంది. తీవ్రమైన వడగాలుల నేపథ్యంలో IMD రాష్ట్రంలోని పలు జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు ఉత్తర, మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44-46°C వరకు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయంది. హైదరాబాద్లో కూడా రేపు, ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. […] The post నేడు తీవ్ర వడగాల్పులు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ appeared first on Navatelangana.

సురక్షిత ప్రాంతానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి తరలింపుకాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్ నిందితుడు అలెన్గా గుర్తింపు శ్వేతసౌధం కరస్పాండెంట్ల వార్షిక విందులో ఘటన టేబుళ్లు, కుర్చీల కింద నక్కిన అతిథులు, నేతలు, జర్నలిస్టులుభయంతో విఐపిల పరుగులు నేను భయపడే రకంకాదు.. ఈ పదవి ముప్పుతో కూడుకున్నదని తెలుసుడొనాల్ట్ ట్రంప్ ప్రకటన, మళ్లీ విందు నిర్వహిస్తామని వెల్లడి ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు: ప్రధాని మోడీ ట్రంప్కు బాసట వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, కీలక మంత్రులు, ఉన్నతాధికారులకు పెను ముప్పు తప్పింది. ట్రంప్ పాల్గొన్న వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు కార్యక్రమంలో సాయుధుడు కా ల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన కాసేపు కలకలం సృష్టించింది. హోటల్ బాల్రూమ్ బయట ఓ వ్యక్తి పలు ఆయుధాలతో చొరబడి తుపాకీతో కాల్పులు జరపడంతో అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఇతర ప్ర ముఖులను భద్రతా సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనలో ఎవరికీ గా యాలు కాలేదని అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.34 గంటల సమయంలో విందు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకు

ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీ, కమిషనర్ మధ్య తీవ్ర విభేదాలు కానిస్టేబుళ్ల బదిలీల తరువాత మరింత ముదిరిన వివాదం త్వరలో జరగబోయే బదిలీలపై పట్టుకు పేషీ అధికారుల ప్రయత్నాలుకమిషనర్కు స్థానచలనం కలిగించేందుకు పావులు‘మన తెలంగాణ’ వరుస కథనాల నేపథ్యంలో విచారణకు సిఎంఓ ఆదేశంమన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీ వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ల (ఐఏఎస్)ల మధ్య అంతర్గతంగా వార్ నడుస్తోంది. ఎక్సైజ్ కమిషనర్గా హరికిరణ్ తీసుకునే నిర్ణయాలు పేషీ అధికారులకు మింగుడుపడడం లేదని తెలిసింది. 15 రోజుల క్రితం జరిగి న ఎక్సైజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ఫోకల్ టు నాన్ ఫోకల్, నాన్ఫోకల్ టు ఫోకల్గా కానిస్టేబుళ్లను కమిషనర్ బది లీ చేయడంతో ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీలో కొం దరికి ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. దీం తో కమిషనర్కు వ్యతిరేకంగా కొన్ని గ్రూపుల్లో ఆ యనకు వ్యతిరేకంగా మంత్రి పేషీలో పనిచేసే అ ధికారులు పోస్టులు పెట్టించినట్టుగా ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో జరుగను న్న ఎస్ఐ టు డిసి స్థాయి అధికారుల బదిలీల్లోనూ ఫోకల్ టు నాన్ ఫో కల్, నాన్ఫోకల్ టు ఫోకల్ విధానాన్ని అమలు చేయాలని ఆ శాఖ ఉన్

ప్రతి నియోజకవర్గంలో వెయ్యిమందికి ఆటోమేటిక్ యంత్రాల పంపిణీ 100 శాతం సబ్సిడీతో మంజూరుబిసి సంక్షేమ శాఖ ఉత్తర్వులు త్వరలో దరఖాస్తులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మహిళల స్వయం ఉపాధికి ఇది మరింత దోహదం చేస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నైపు ణ్యం కలిగిన బిసి మహిళలకు టైలరింగ్ ఆధారి త స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి ఉత్పాదకతను పెంచి, టైలరిం గ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని నిర్ణయించింది. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. పథకం అమలుపై బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, బిసి కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వ యం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సి

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు హోంశాఖ లేఖలు మావోయిస్టుల అధ్యాయం దాదాపుగా ముగియడంతో కీలక మార్పుల దిశగా కేంద్రం అడుగులుతెలంగాణ నక్సల్ రహిత రాష్ట్రమని ఇప్పటికే ప్రకటించిన డిజిపి మన తెలంగాణ/హైదరాబాద్: నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన మావోయిస్టు అధ్యాయం దాదాపుగా ముగియడంతో, పోలీసు శాఖలో చారిత్రక మార్పులకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టు ల పాలిట సింహస్వప్నంగా నిలిచిన కమాండో దళం గ్రేహౌండ్స్, నిఘా విభాగం ఎస్ఐబిలను క్రమంగా రద్దు చేసే ప్రక్రియ మొదలయినట్లు తెలుస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై పోరాటం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలను ర ద్దు చేయాలని కేంద్ర హోం శాఖ అన్ని ప్రభావి త రాష్ట్రాలకు ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచా రం. ఇన్నేళ్లుగా ఈ విభాగాల కోసం ఇస్తున్న ప్ర త్యేక నిధులను కూడా నిలిపివేస్తున్నట్లు అనధికారికంగా తెలిపినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు లేనప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు అనే ప్ర శ్న ఉన్నతస్థాయి భద్రతా సమీక్షలో తలెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం నలుగురు మా వోయిస్టులు మాత్రమే మిగిలారని, రాష్ట్రం మా వోయిస్టు రహిత రాష్ట్రం అని డిజిపి ఇప్పటికే ప లుమార్లు మీడియా

వేసవి తీవ్రత దృష్ట్యా ప్లీనరీకి బదులు కార్యవర్గ సమావేశం మ.2 గంటలకు అధినేత కెసిఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి భేటీ నియోజకవర్గాల్లోనే ఘనంగా వేడుకలు నిర్వహించాలి పార్టీ శ్రేణులతో కెటిఆర్ టెలీ కాన్ఫరెన్స్ మన తెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన సోమవారం (ఏప్రిల్ 27) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో మధ్యా హ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ఎలా ముందు కు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితోపాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్స

మన తెలంగాణ/హైదరాబాద్: జనగణన -2027 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో స్వీయ నమోదు ప్రక్రియను ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆన్లైన్ ద్వారా స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జనాభా గణన ఒక కీలక జాతీయ కార్యక్రమమని పేర్కొన్నారు. ఇది దేశంలోని జనాభా, వారి సామాజిక-, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించడంతో పాటు, సమర్థవంతమైన ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాదిగా నిలుస్తుందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో విధానాల రూపకల్పనలో జనగణన ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు. కచ్చితమైన సమాచారంతో లక్ష్యిత సంక్షేమ పథకాలు రూపొందించడమే కాకుండా, దేశ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి ఇది సహకరిస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో ఇదే మొదటి జనాభా గణన కావడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం ఖచ్చితమైన డేటా సేకరణ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. రా

వివాహం చేసుకుంటానని నా కుమారుడి నుంచి రూ.9.88 కోట్లు వసూలు చేసిందిసాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదుమన తెలంగాణ/సిటీ బ్యూరో: సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహం చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిందనే ఫిర్యాదు మేరకు సినీనటి అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి తండ్రి తన కుమారుడి వద్ద అషురెడ్డి, ఆమె సోదరి దివ్యారెడ్డి, కుటుంబ సభ్యులు రూ.9.83కోట్లు తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. హైదరాబాద్, షేక్పేట్కు చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ధర్మేంద్ర 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో వెంకట అశ్విని రెడ్డి కొయ్య(అషు రెడ్డి) పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్లు చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే అషురెడ్డి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించింది, తరచూ అవసరాల పేరుతో డబ్బులు అడగటం ప్రారంభించారు. ధర్మేంద్ర వద్ద తీసుకున్న డబ్బులతో కారు, బంగారం,
రైతు సంఘం పధాన కార్యదర్శి టి.సాగర్నవతెలంగాణ-నారాయణపేటకేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ రైతులు ఈ యాసంగి పంటలో రూ.4వేల కోట్లు నష్టపోయారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి చట్టబద్ధంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేనందున ప్రస్తుతం రైతులు రూ.4వేల కోట్ల మేర నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు […] The post యాసంగిలో రూ.4వేల కోట్లు నష్టపోయిన రైతులు appeared first on Navatelangana.
– ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు– కేసీఆర్ ఎంపీ అయ్యేవారే కాదు : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్టీఆర్ఎస్ నిజమైన హక్కుదారు కల్వకుంట్ల కవితనే అని తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) నాయకులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తెలంగాణ జాగతి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్.రూప్సింగ్, రంగు నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్, గొంగళ్ల రంజిత్ కుమార్, మంచాల వరలక్ష్మీ, నరేశ్ ప్రజాపతి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ […] The post టీఆర్ఎస్ హక్కుదారు కవితనే appeared first on Navatelangana.
కేంద్రం సహకరించాలి : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సామాజిక న్యాయం, సమగ్ర సంక్షేమం, బలహీన వర్గాల సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చండీగఢ్లో ఆదివారం నిర్వహించిన చింతన్ శివిర్-2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల […] The post తెలంగాణ సంక్షేమ నమూనా దేశానికే మార్గదర్శి appeared first on Navatelangana.
ఆఫ్ టైప్ మొక్కలు, అవినీతిపై పోరాటంప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే కోర్టులనూ ఆశ్రయించాంపామాయిల్ రైతుల సమస్యలపైమహాసభలో కార్యాచరణతెలంగాణ పామాయిల్ రైతు సంఘంరాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్యతోకొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఫేస్ టూ ఫేస్ రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణ గణనీయంగా పెరుగుతోంది.. సమస్యలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి.. తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) పామాయిల్ రైతుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోంది.. అనేక విజయాలు సాధిస్తోందని తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆఫ్ […] The post పామాయిల్ రైతుల సమస్యలపై ఉద్యమం appeared first on Navatelangana.
టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితఎక్స్లో ఆసక్తికరపోస్టుహైదరాబాద్: పార్టీ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ అధినేత్రి కవిత ‘ఎక్స్’ లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. #TRS’ అంటూ పోస్టు పెట్టారు. శనివా రం మునీరాబాద్లోని ఓ ఫంక్షన్ హాలు లో జరిగిన సభలో తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యంగా కవిత విమర్శలు గుప్పించారు. The post మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది appeared first on Navatelangana.
మరో 50 మంది బాధితుల నుంచి వాంగ్మూలం సేకరణనవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో ఛార్జిషీట్ ను వచ్చే నెల 15లోగా కోర్టులో సమర్పించటానికి సిట్ అధికారులు సమాయత్తమవుతున్నారు. అదే సమయ ంలో ఈ కేసులో బాధితులైన మరో 50 మందిని అధికారులు దశలవారీగా పిలిచి, వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. గత కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను మరోసారి సిట్ అధికారులు పట్టాలెక్కించనున్నారు. ఇప్పటివరకు […] The post మే 15లోగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో చార్జిషీట్ appeared first on Navatelangana.
రాజ్యసభ చైర్మెన్కు ఆప్ వినతినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్కు ఆప్ సీనియర్ నేత సంజరు సింగ్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎంపీల ఫిరాయింపులు ప్రజా తీర్పునకు ద్రోహం చేయడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ముఖ్యంగా […] The post ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయండి appeared first on Navatelangana.
వివరాలు నమోదు చేసుకున్న గవర్నర్, సీఎంమార్చి 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కు అవకాశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో జనగణన-2027 తొలివిడత ప్రారంభమైంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ కే.రామకృష్ణరావు తదితరులు ఆదివారం సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వీయ గణన) చేసుకున్నారు. అధికారుల సమక్షంలో గవర్నర్ జనగణన నమోదు చేసుకున్నారు. తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతి హొళికెరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమక్షంలో సీఎం ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియ పూర్తి […] The post రాష్ట్రంలో తొలి విడత జనగణన ప్రారంభం appeared first on Navatelangana.
20 లక్షల మంది అన్ఫాలోసోషల్ మీడియా వేదికగా షాకిస్తున్న జెన్ జీరెండు రోజుల్లో రెండు మిలియన్లు తగ్గిన ఫాలోవర్లునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోబీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా షాక్ తగిలింది. మధ్యతరగతి వర్గాల సమస్యలను పార్లమెంటు వేదికగా లేవనెత్తుతున్న ఎంపీగా ప్రశంసలు పొందుతున్న రాఘవ్ చద్దాకు అధికార బీజేపీలో చేరిన రెండు రోజుల్లోనే అదే మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు షాక్ ఇచ్చారు. ఆయన బీజేపీలో చేరడం పట్ల సోషల్ మీడియా వేదికగా జెన్జీ విముఖత వ్యక్తం […] The post రాఘవ్ చద్దాకు షాక్ appeared first on Navatelangana.
అయినా మానవ అప్రమత్తత అవసరం : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్భివానీ : కృత్రిమ మేధ న్యాయ సామర్ధ్యాన్ని పెంచుతుంది. అయినా మానవ అప్రమత్తత అవసరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. హర్యానాలోని భివానీలో జరిగిన చౌదరి బన్సీలాల్ విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) పాత్రను వివరించారు.న్యాయవ్యవస్థలో ఏఐ వ్యూహాత్మక అనుసంధానంసాంకేతికత పరివర్తనాత్మక సామర్థ్యంపై దృష్టి సారిస్తూ, న్యాయ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో […] The post న్యాయ సామర్థ్యాన్ని ఏఐ పెంచుతుంది appeared first on Navatelangana.
– ఎమర్జెన్సీ ప్రకటించిన ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులున్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతుండగా విమాన ఇంజిన్లో సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఢిల్లీ విమానాశ్రయం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.అసలేం జరిగిదంటే?అధికారుల వివరాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జరిగింది. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన స్విస్ ఎయిర్ ఫ్లైట్ ఎల్ఎక్స్147 […] The post టేకాఫ్ అవుతుండగా స్విస్ విమానంలో మంటలు appeared first on Navatelangana.
ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలెఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ సందర్భంగాఉయ్యూరులో భారీ ప్రదర్శనఉయ్యూరు : కష్టపడి పంటలు పండిస్తున్న కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండో తరగతి పౌరులుగానే పరిగణిస్తున్నాయని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) అధ్యక్షులు అశోక్ ధావలే అన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి, వారికి ప్రయోజనం చేకూర్చే చట్టాల సాధనకు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు రోజులపాటు జరిగే ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు […] The post కౌలు రైతుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం appeared first on Navatelangana.
– చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అవసరం ‘సర్’తో ప్రజాస్వామ్య హక్కులు లాక్కోవాలని చూస్తున్న బీజేపీ– ఓటుహక్కు పునరుద్ధరణకు వామపక్షాల పోరాటం: సీపీఐ(ఎం) పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీంనవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోపేదలు, శ్రామిక ప్రజల కోసం నిలిచేది వామపక్షాలేనని సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో వామపక్ష ప్రతినిధులు లేకపోవ డంతో పేదలు, శ్రామిక ప్రజలపై అణచివేత పెరిగిందన్నారు. సర్ పేరుతో ప్రజలను భయపెట్టి వారి ప్రజాస్వామ్య హక్కులను […] The post పేదలు, శ్రామికుల పక్షాన నిలిచేది వామపక్షాలే appeared first on Navatelangana.
పాల్గొన్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీనియర్ నాయకురాలు బృందాకరత్నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోసాయంకాలం అవుతోంది. మధ్యాహ్నపు సూర్యుడు ఆకాశంలో కనిపించకపోయినా పశ్చిమబెంగాల్లోని బెహలా కూడలి ఎర్రగా వెలిగిపోతోంది. వందలాది మంది ప్రజలు చేతుల్లో ఎర్ర జెండాలు పట్టుకుని ఊరేగింపు కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నారు. ఎర్ర జెండాలతో పాటు, కొందరి చేతుల్లో ఎర్ర బెలూన్లు కూడా ఉన్నాయి. అక్కడ జనసమూహం ఎంత భారీగా ఉందంటే, దాన్ని మొదలు నుంచి చివరి వరకు ఒక్కచూపులో చూడటం […] The post బెహలాలో ఉత్సాహభరితమైన రోడ్షో appeared first on Navatelangana.
వాషింగ్టన్ : ట్రంప్ ప్రభుత్వం మరో ఉన్నత స్థాయి అధికారికి ఉద్వాసన పలకబోతోంది. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్పై అమెరికా ప్రభుత్వం వేటు వేయబోతోందని తెలుస్తోంది. వైట్హౌస్ కరస్పాండెంట్ల విందు కార్యక్రమంలో కాల్పుల ఘటన జరగడానికి ముందు ఈ వార్త బయటికి వచ్చింది. తొలగింపు అనివార్యమని, అది ఎప్పుడైనా జరగవచ్చునని శ్వేతసౌధం అధికారిని ఉటంకిస్తూ పొలిటికో వార్తా సంస్థ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ చుట్టూ ఇటీవలి కాలంలో వివాదాలు అలముకున్నాయి. పటేల్ చుట్టూ […] The post ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎఫ్బీఐ డైరెక్టర్కు ఉద్వాసన ? appeared first on Navatelangana.