21226 వార్తలు

బ్యాకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న మొత్తం 11,403 బ్యాంక్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటీఫికేషన్ ను జారీ చేసింది. తెలంగాణలో 191 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు రూ. 175, ఇతరులకు రూ.850 దరఖాస్తు రుసుముగా నిర్ణయించింది ఐబిపిఎస్. అక్టోబర్ లో ప్రిలిమినరీ పరీక్షలు, డిసెంబర్ మెయిన్స్ పరీక్షలుంటాయి. అర్హులైన అభ్యర్థులు గడువులోగా అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.






అమరావతి: విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నాం ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న ఎపికి ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టారు అని విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాం, రైల్వే జోన్ తీసుకొచ్చామని అన్నారు. ఈ సందర్భంగా భోగాపురం లో ఆయన మీడియాతో ప్రసంగించారు. విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం అని కొనియాడారు. ఉత్తరాంధ్ర విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం తెలియజేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టుకున్నామని, ఉత్తరాంధ్ర శక్తికి ఈ ఎయిర్ పోర్టు నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశాదిశా మారిందని చెప్పారు. ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంస్కృతి కనిపిస్తోందని, భోగాపురానికి కొబ్బరికాయ కొట్టింది తామే, ఇప్పుడు గుమ్మడికాయ కొట్టింది మనమేనని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇకపై ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు అని వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు త్వరలో వలసలు వస్తాయని అన్నారు. ప్రపంచంలో ఐటీ నుంచి ఎఐకి షిప్ట్ అవుతోందని ఉత్తరాంధ్రకు ప్రపంచస్థాయి కంపెనీలు వచ్చాయని, 2027 లో పోలవరాన్ని పూర్తి చేస్తామని అన్నారు. 2028 లో అమరావతి మ



గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం, యశ్వీర్ కాంస్య పతకం సాధించారు. వీరిద్దరిని అభినందిస్తూ.. ప్రధాని మోడీ సోషల్మీడియాలో పోస్టులు పెట్టారు. ‘‘గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు. రజత పతకం అందుకొన్నాడు. నిలకడ, సంయమనం, స్పూర్తిని ప్రదర్శించాడు. అతడి విజయం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. మున్ముందూ ఇదే ఉత్సాహంతో సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా. కంగ్రాట్స్ యశ్వీర్. అద్భుతంగా పతకం సాధించావు. క్రీడపై నీకున్న ఆసక్తి, నిబద్ధతకు ఇదే తార్కాణం. యువ అథ్లెట్లకు స్పూర్తిగా నిలిచావు’’ అని మోడీ పోస్టు చేశారు. ‘‘జూడో 57 కేజీల విభాగంలో రజతం గెలిచిన యామిని మౌర్య, డెకథ్లాన్ ఈవెంట్లో కాంస్యం సాధించిన తేజశ్విన్ శంకర్కు శుభాకాంక్షలు. జూడో పట్ల యామిని అభిరుచి అద్వితీయం. ఎక్కువ మంది యువత జూడో వైపు వచ్చేందుకు ఆమె విజయం బాటలు వేస్తుంది. ఇక పది ఈవెంట్లలో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన తేజశ్విన్ కష్టానికి తగిన ప్రతిఫలం అందింది. మున్ముందూ ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని మోడీ పేర్కొన్నారు.







అమరావతి: భోగాపురం విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు ను జాతికి అంకితం చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని వెంట ఉండి పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఎయిర్ పోర్ట్ పనులను చంద్రబాబు, పవన్ తో కలిసి మోడీ టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు. రికార్డు స్థాయిలో 13 వేల మందితో థింసా నృత్యం జరిగింది. థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ కారులో థింసా నృత్యాన్ని మోడీ తిలకించారు. బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోడీ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు మోడీకి బొబ్బిలి వీణను బహుకరించారు.





