
4513 వార్తలు

దోసకాయ దాని తాజా రుచికి, పోషక గుణాలకు ప్రసిద్ధి చెందింది. సాధారణంగా దీనిని సలాడ్లలో భాగంగా ఉపయోగిస్తారు. దోసకాయ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. అంతేకాదు, శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.శరీరాన్ని హైడ్రేటెడ్గాదోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దోసకాయలో ఉండే మూలకాలు శరీర నీటి సమతుల్యతను కాపాడతాయి. వేసవిలో అలసట, నీరసాన్ని నివారిస్తాయి.బరువు తగ్గడంలో ఇప్పటికే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిరోజూ దోసకాయ తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోసకాయ కడుపును ఎక్కువసేపు నింపిన భావన కలిగిస్తుంది. దోసకాయలలోని ఉండే నీరు, ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యందోసకాయలలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు


నవతెలంగాణ – హైదరాబాద్: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న సమ్మెకు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించిది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, ఔట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ తదితర 32 డిమాండ్ల వరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన ఐఏఎన్ అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరడం సమ్మెను […] The post ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు: జాన్ వెస్లీ appeared first on Navatelangana.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దుపిల్లల కదలికలు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల]జిల్లా స్పీ మహేష్ బి. గితేనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లవేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు,యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా మారకూడదనీ జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఈత రానివారు […] The post ఈత విషాదంగా మారకుండా జాగ్రత్త పడాలి appeared first on Navatelangana.

– ఇబ్బందుల్లో సీనియర్ ఉపాధ్యాయులు– మండల విద్యాధికారుల ఇష్టారాజ్యం ,ఏమి పట్టనట్లు తహశీల్దార్లునవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి జిల్లాలోని కొన్ని మండల్లాకు చెందిన మండల విద్యాశాఖ కొన్ని యూనియన్ నాయకులకు వారికి నచ్చిన చోట జనగణన విధులను కేటాయించారని సీనియర్ ఉపాధ్యాయులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జనగణన విధుల కేటాయింపులో పారదర్శకత లేని కారణంగా అనేకమంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి కలెక్టర్ కు ముందు తమకు జరిగిన అన్యాయం తెలుపుతూ […] The post పారదర్శకత లేని జనగణన.. విధుల కేటాయింపులు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఐ ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ఆమె వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ విచారణను మమత అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ఆధ్వర్యంలోని బెంచ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. జనవరిలో కోల్కతాలోని ఐప్యాక్ సంస్థ కో ఫౌండర్ ప్రతీక్ జైన్ […] The post సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్ appeared first on Navatelangana.


నవతెలంగాణ -హైదరాబాద్ కాప్రా సర్కిల్ వంపుగూడ డివిజన్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు ప్రజా ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పలు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి ప్రారంభమైన ఈ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో పరిశుభ్రత, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సాయినాథపురం మురికిగుంటలలో దోమల నివారణ కార్యక్రమాన్ని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంటమాలజీ విభాగం సిబ్బంది నిల్వ […] The post వంపుగూడలో దోమల నివారణ, ప్రమాదకర కేబుల్ వైర్ల తొలగింపు appeared first on Navatelangana.
నవతెలంగాణ- ఆర్మూర్ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని టిఎస్ ఆర్టిసి యూనియన్ నాయకులు బుధవారం తెలిపారు. పట్టణ డిపో ఎదుట నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మొండి వైఖరి నశించాలని, గత రెండు సంవత్సరాల నుండి తమ సమస్యలు పరిష్కారం కాలేవని అన్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాలేదని, రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో […] The post పట్టణ టీఎస్ ఆర్టిసీ డిపో ఎదుట సమ్మె appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని జగదాంబ తండ గ్రామపంచాయతీ పరిధిలో లో వోల్టేజి సమస్యను తీర్చడానికి నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసిన విద్యుత్ సిబ్బందికి బుధవారం గ్రామపంచాయతీ పాలకవర్గం తరపున శాలువాలతో సన్మానించారు. భవిష్యత్తులో ఇలాంటి సహకారం అందించాలని విద్యుత్ సిబ్బందికి గ్రామపంచాయతీ పాలకవర్గం కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్య లతా బాయ్ నంద, ఉపసర్పంచ్ పూర్ణ రాజు నాయక్, పాలకవర్గ సభ్యులు, విద్యుత్ సిబ్బంది, తాండ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. The post విద్యుత్ సిబ్బందికి సన్మానం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశానికి గ్రామ సర్పంచ్ లత శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్ తోపాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లత శ్రీనివాస్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంత ఇంటి కలను సహకారం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కీసరి లక్ష్మణ్, సత్యం, చంద్రం, గంగమణి, పంచాయతీ […] The post గృహప్రవేశానికి నూతన వస్త్రాలు అందజేత appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్-శ్రీలంక వేదికలుగా జరిగిన T20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నవాజ్ వినోదం కోసం మాదకద్రవ్యాలు ఉపయోగించినట్లు తేలింది. ఈ వివాదం కారణంగా ఇంగ్లాండ్లో జరగబోయే T20 బ్లాస్ట్ టోర్నీలో ఆడే అవకాశాన్ని నవాజ్ కోల్పోయాడు. ఐసీసీ ఈ విషయాన్ని పీసీబీ దృష్టికి తీసుకువెళ్లగా, బోర్డు విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యాక ఫలితాలను ఐసీసీకి నివేదిస్తామని పీసీబీ ప్రతినిధి తెలిపారు. 32 ఏళ్ల […] The post డ్రగ్స్ టెస్టులో దొరికిన పాక్ క్రికెటర్ నవాజ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. బుధవారం మండలంలోని గొల్లపల్లిలో ఐదు సంవత్సరాలు నిండిన విద్యార్థుల పట్టికను అంగన్వాడి ద్వారా తీసుకొని, విద్యార్థి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని స్థానిక ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన ఉంటుందని, తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్, సిఆర్పి మహమ్మద్, అంగన్వాడి టీచర్ జ్యోతి తదితరులు ఉన్నారు. The post ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్చండి appeared first on Navatelangana.





