
4513 వార్తలు







హైదరాబాద్: కాళేశ్వరంపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును హై కోర్టు నిలిపివేసింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై చర్యలు తీసుకోవద్దని హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. కెసిఆర్ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కెసిఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్కు కాళేశ్వరం నిదర్శనమి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ పెద్దలకు మూటలు వెళ్తున్నాయి.. ఇక్కడ కేసులు మూసేస్తున్నారు. కెసిఆర్, రేవంత్ క్విడ్ ప్రోకోను ప్రజలు గమనిస్తున్నారు’’ అని సంజయ్ అన్నారు.
నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శుభవాతావరణంలో గ్రామపాలక వర్గం,ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు,పంచాయితీ సెక్రెటరీ పాల్గొని వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా బుధవారం పిల్లలమర్రి లావణ్య (భాస్కర్ భార్య) నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.అనంతరం ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాలక వర్గం తరఫున నూతన వస్త్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరిమార్తి రేణుక నరసయ్య, ఉప సర్పంచ్ పద్మ శ్రీ, శశిరేఖ సుదర్శన్, జిల్లా యూత్ […] The post ఘనంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం appeared first on Navatelangana.
– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ నవతెలంగాణ-కమ్మర్ పల్లి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు హాజరుకావాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని నాగాపూర్ గ్రామ పరిధిలోని మంజీర చెరువు వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి, కూలీల హాజరు తీసుకున్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులకు హాజరవడం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం […] The post జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పనులకు హాజరు కావాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో ఐకేపి మహిళ క్రాంతి ప్రథం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ఇస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. […] The post హాస కొత్తూర్ లో ఐకేపి కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్మండలంలోని దోస్త్ పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దాత స్పోర్ట్స్ యూనిఫామ్ లను గురువారం నాడు వితరణ చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాత విద్యార్థులకు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శంకర్ మాట్లాడుతూ.. దోస్త్ పల్లి గ్రామ నివాసి అయినా పండరి అనే యువకుడు ప్రాథమిక పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి కావడం విశేషం. పండరి ఎమ్మెస్సీ […] The post విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణ appeared first on Navatelangana.



పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ సిఇవొ వాసిమ్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆయన వైదొలిగారు. ఐసిసి జనరల్ మేనేజర్ పదవికి గుడ్బై చెప్పేశారు. నాలుగేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇప్పుడు ఆ పదవిని వీడారు. జెఫ్ అల్లార్డస్ నుంచి 2022లో వాసిమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు ఆయన పిసిబి సిఇవొగా మూడేళ్లు పనిచేశారు. ఇప్పుడు వైదొలిగినా.. మరో పదవీబ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వారి అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని రేవంత్ గుర్తుచేశారు. ఈ దుఃఖ సమయంలో నాదెండ్ల గారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి మరణంపట్ల కుటుంబ సభ్యులకు రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఎపికి 11వ సిఎంగా నాదెండ్ల పనిచేశారు.

న్యూఢిల్లీ: ప్రధాని మోడీని ఉగ్రవాది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బిజెపి చర్యలు తీసుకోవాలని బిజెపి కేంద్ర ఎన్నికల సంఘాన్నికోరింది. బుధవారం నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ తదితర బిజెపి నాయకులు భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు.అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. "మల్లికార్జున ఖర్గే, ప్రధాని మోడీని అవమానించినందుకు ఇసిని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. మేము ఎంతో బాధతో, ఆగ్రహంతో కమిషన్ను కలిశాము. ప్రధానిని ఉగ్రవాది అని పిలవడం యావత్ దేశానికే అవమానం" అని పేర్కొన్నారు.కాగా, మంగళవారం మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బిజెపి ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడమేనని లేఖలో ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 175 కింద నేరంగా పరిగణించబడతాయని.. అంతేకాకుండా, ఇది పరువు నష్టం కేసు కిందకు కూడా వస్తుందని పేర్కొంది.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఈసిని కోరుతూ.. ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశాలు జారీ చే
నవతెలంగాణ – హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దాసోజు శ్రవణ్ సహా మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీలు కోదండరాం, అజారుద్దీన్పై తెలంగాణ కొత్త గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ కోరారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. The post గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై విచారణ వాయిదా appeared first on Navatelangana.


గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మధ్యరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగింది. డిపో నుంచి పట్టణ పుర వీధుల వరకు భారీ ర్యాలీ చేపట్టిన ఉద్యోగులు, అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవ హారం ఏర్పాటుచేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉదయము 11.00 గంటల వరకు సమ్మె సాఫీగా కొనసాగుతున్నప్పటికీ 11.00 గంటల తర్వాత ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్ల తో పోలీస్ పహార మధ్య ఆర్టిసి బస్సులు బయటకు కదిలాయి. గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి పోలీస్ పహార మధ్య బస్సులు బయటకి కదులుతున్నాయి.

నవతెలంగాణ–కుషాయిగూడ: వ్యాపార దిగ్గజం, బ్రిటన్లో అత్యంత సంపన్నుడు గోపీచంద్ పి.హిందూజా (85) కన్నుమూశారు. గత కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీచంద్, లండన్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. హిందూజాకు భార్య (సునీత), ఇద్దరు కుమారులు (సంజయ్, ధీరజ్), ఒక కుమార్తె (రీటా) ఉన్నారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరొందిన గోపీచంద్ 1940లో జన్మించారు. ఆటోమోటివ్, ఎనర్జీ, బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో తమ గ్రూప్ను అగ్రగామిగా విస్తరించిన […] The post వ్యాపార దిగ్గజం గోపీచంద్ పి.హిందూజా కన్నుమూత appeared first on Navatelangana.
