
4523 వార్తలు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ సిఇవొ వాసిమ్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆయన వైదొలిగారు. ఐసిసి జనరల్ మేనేజర్ పదవికి గుడ్బై చెప్పేశారు. నాలుగేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇప్పుడు ఆ పదవిని వీడారు. జెఫ్ అల్లార్డస్ నుంచి 2022లో వాసిమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు ఆయన పిసిబి సిఇవొగా మూడేళ్లు పనిచేశారు. ఇప్పుడు వైదొలిగినా.. మరో పదవీబ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వారి అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని రేవంత్ గుర్తుచేశారు. ఈ దుఃఖ సమయంలో నాదెండ్ల గారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి మరణంపట్ల కుటుంబ సభ్యులకు రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఎపికి 11వ సిఎంగా నాదెండ్ల పనిచేశారు.

న్యూఢిల్లీ: ప్రధాని మోడీని ఉగ్రవాది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బిజెపి చర్యలు తీసుకోవాలని బిజెపి కేంద్ర ఎన్నికల సంఘాన్నికోరింది. బుధవారం నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ తదితర బిజెపి నాయకులు భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు.అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. "మల్లికార్జున ఖర్గే, ప్రధాని మోడీని అవమానించినందుకు ఇసిని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. మేము ఎంతో బాధతో, ఆగ్రహంతో కమిషన్ను కలిశాము. ప్రధానిని ఉగ్రవాది అని పిలవడం యావత్ దేశానికే అవమానం" అని పేర్కొన్నారు.కాగా, మంగళవారం మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బిజెపి ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడమేనని లేఖలో ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 175 కింద నేరంగా పరిగణించబడతాయని.. అంతేకాకుండా, ఇది పరువు నష్టం కేసు కిందకు కూడా వస్తుందని పేర్కొంది.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఈసిని కోరుతూ.. ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశాలు జారీ చే
నవతెలంగాణ – హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దాసోజు శ్రవణ్ సహా మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీలు కోదండరాం, అజారుద్దీన్పై తెలంగాణ కొత్త గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ కోరారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. The post గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై విచారణ వాయిదా appeared first on Navatelangana.


గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మధ్యరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగింది. డిపో నుంచి పట్టణ పుర వీధుల వరకు భారీ ర్యాలీ చేపట్టిన ఉద్యోగులు, అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవ హారం ఏర్పాటుచేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉదయము 11.00 గంటల వరకు సమ్మె సాఫీగా కొనసాగుతున్నప్పటికీ 11.00 గంటల తర్వాత ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్ల తో పోలీస్ పహార మధ్య ఆర్టిసి బస్సులు బయటకు కదిలాయి. గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి పోలీస్ పహార మధ్య బస్సులు బయటకి కదులుతున్నాయి.

నవతెలంగాణ–కుషాయిగూడ: వ్యాపార దిగ్గజం, బ్రిటన్లో అత్యంత సంపన్నుడు గోపీచంద్ పి.హిందూజా (85) కన్నుమూశారు. గత కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీచంద్, లండన్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. హిందూజాకు భార్య (సునీత), ఇద్దరు కుమారులు (సంజయ్, ధీరజ్), ఒక కుమార్తె (రీటా) ఉన్నారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరొందిన గోపీచంద్ 1940లో జన్మించారు. ఆటోమోటివ్, ఎనర్జీ, బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో తమ గ్రూప్ను అగ్రగామిగా విస్తరించిన […] The post వ్యాపార దిగ్గజం గోపీచంద్ పి.హిందూజా కన్నుమూత appeared first on Navatelangana.


నవతెలంగాణ–కుషాయిగూడ: ఆర్టీసీ పరిరక్షణతో పాటు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. కార్మికులు సమ్మెలోకి దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.డిపోల ఎదుట కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రైవేటు బస్సులను అడ్డుకునే ప్రయత్నాలు జరగడంతో పోలీసులు అప్రమత్తమై డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రజలకు తీవ్ర ఇబ్బందులుసమ్మె ప్రభావంతో కుషాయిగూడ డిపో పరిధిలో నడిచే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. […] The post డిపోల వద్ద భారీ బందోబస్తు appeared first on Navatelangana.


నవతెలంగాణ-మిరుదొడ్డి: టీపీటీఎఫ్ (తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సు పోస్టర్ను మిరుదొడ్డి మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మిరుదొడ్డి మండల అధ్యక్షులు అందే రామచంద్రం మాట్లాడుతూ.. విద్యాసదస్సు ఏప్రిల్ 30న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమరశీలతత్వాన్ని చాటుకుందాం – విద్యా సమానత్వం సాధిద్దాం” అనే నినాదంతో […] The post టీపీటీఎఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయండి appeared first on Navatelangana.

నవతెలంగాణ-మల్హర్రావు: మండుతున్న ఎండల నేపథ్యంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు,బాటసారులు దాహార్తి కోసం అల్లాడుతున్నారు.ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో బుధవారం సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,వార్డు సభ్యుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడారు. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రయాణికులు వేసవి తాపానికి గురికాకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ సౌకర్యాన్ని కల్పించామని,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, సారయ్య,వొన్న తిరుపతి రావు,నారమల్ల రాజేశ్వరి,పైడాకుల […] The post తాడిచెర్లలో చలివేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.

లక్నో: 17 ఏళ్ల విద్యారిపై ఓ మహిళ లైంగికగా దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 17 ఏళ్ల బాలుడు తన స్నేహితుడు ఇంటికి వెళ్లేవాడు. ఫిబ్రవరి 17 నుంచి బాలుడు కనిపించకపోవడంతో ఆమె అతడి స్నేహితులను ప్రశ్నించింది. ఒక స్నేహితుడి ఇంటికి పలుమార్లు వెళ్లాడని చెప్పడంతో అతడి దగ్గరికి వెళ్లాడు. తన వదినతో కలిసి అతడు వెళ్లిపోయాడని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మార్గం మధ్యలో ఫోన్ సిమ్ తీసేసి బయట పారేసింది. సదరు మహిళ బాలుడిని తీసుకొని నైనిటాల్ కు తీసుకెళ్లింది. అక్కడి ఓ హోటల్ రూమ్ లో బాలుడిపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు వీడియోలు, ఫొటోలు తీసింది. పది లక్షలు రూపాయలు ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బాలుడిని బెదిరించింది. పోలీసులు విచారణ చేసి వాళ్లు ఆచూకీ కనిపెట్టారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి నిందితురాలును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి సమ్మె కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పలుచోట్ల డిపోల ముందు ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో వినూత్న నిరసన చేపట్టారు. బస్సు డిపో ముందు మహిళా కార్మికులు బతుకమ్మ ఆడుతూ.. నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను తెలియజేస్తూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు. కాగా, ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇక, హైదరాబాద్ నగరంలో అద్దె బస్సులు యదావిధిగా నడుస్తున్నాయి. సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని.. 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. అలాగే, నాగోల్-రాయదుర్గం మార్గంలో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకు ఒక మెట్రో సర్వీసు నడుస్తుంది. ఈ చర్యతో ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. The post ఆర్టీసీ సమ్మె.. మెట్రో సర్వీసుల పెంపు appeared first on Navatelangana.

ఐపిఎల్-2026లో ఆర్సిబి ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా హాట్ టాపిక్గా మారాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కృనాల్.. తన తమ్ముడు హార్థిక్ని ఔట్ చేశాడు. అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున ఆ వికెట్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. హార్థిక్ కూడా కృనాల్ పైపు చూస్తూ డగౌట్కి వెళ్లాడు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయని కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే ఆర్సిబి ఇన్సైడర్ షోలో కృనాల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ షోలో మిస్టర్ నాగ్స్ ‘‘మీ ఇద్దరి బంధం బాగుంది కాదా? లేకపోతే ఏదైనా గొడవా?’’ అని ప్రశ్నించాడు. దీనిపై కృనాల్ మాట్లాడుతూ.. అంతా బాగుందని సమాధానం ఇచ్చాడు. ఇక లక్నో ఆటగాడు ముకుల్ చౌదరిని స్లెడ్జ్ చేశాడంటూ వస్తున్న ఆరోపణలపై కృనాల్ స్పందించాడు. ‘‘ఓ కుర్రాడిని నేను స్లెడ్జ్ చేశానంటూ బయట చాలా మంది విమర్శిస్తున్నారు. నేను అతడికి బౌలింగ్ చేశా. తొలి బంతికే ప్యాడ్స్ తాకిన వెంటనే ఔట్ కోసం అప్పీల్ చేశా. ఆ తర్వాత ‘ముకుల్ నువ్వు కుర్రాడివి. నా బౌలింగ్లో నువ్వు సిక్సు కొట్టగలవు. అయితే, లాంగాఫ్ లేదా లాంగాన్ మీదుగా స్టాండ్స్లోకి పంపించు’

మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్రావు (90) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాదేండ్ల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, 1984లో టిడిపి ప్రభుత్వం హయాంలో సిఎం ఎన్టీఆర్ గుండె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు.. ఒక నెల రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాదేండ్ల ముఖ్యమంత్రిగా పని చేశారు.

ఉప్పల్: తెలంగాణలో ఆర్ టిసి కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు లేక ఉప్పల్ రింగ్ రోడ్డు వెలవెలబోతుంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వరంగల్ రూట్ లో బస్సులు లేకపోవడంతో నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లు ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కూడా బస్సుల సరిపోవడం లేదు. బస్సుల కోసం బస్టాండుల్లో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఊళ్లకు జనం బయల్దేరారు. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెను ప్రైవేట్ టాక్సీలు, ఆటోలు క్యాష్ చేసుకుంటున్నాయి.

కుత్బుల్లాపూర్: అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సు రవాణా పూర్తిగా స్థంభించింది. జీడిమెట్ల డిపో లో ఉన్న 139 బస్సుల్లో ఒక్కటి కూడా బయటకు రాకపోవడంతో అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు జీడిమెట్ల డిపో కు చెందిన 700 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే సెలవులను ఉపయోగించుకుని స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జరిపిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తరువాతే ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, తమ సమస్యలను వివరించినప్పటికీ సరైన పరిష్కారం చూపలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.