
4531 వార్తలు


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి సమ్మె కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పలుచోట్ల డిపోల ముందు ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో వినూత్న నిరసన చేపట్టారు. బస్సు డిపో ముందు మహిళా కార్మికులు బతుకమ్మ ఆడుతూ.. నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను తెలియజేస్తూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు. కాగా, ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇక, హైదరాబాద్ నగరంలో అద్దె బస్సులు యదావిధిగా నడుస్తున్నాయి. సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని.. 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. అలాగే, నాగోల్-రాయదుర్గం మార్గంలో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకు ఒక మెట్రో సర్వీసు నడుస్తుంది. ఈ చర్యతో ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. The post ఆర్టీసీ సమ్మె.. మెట్రో సర్వీసుల పెంపు appeared first on Navatelangana.

ఐపిఎల్-2026లో ఆర్సిబి ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా హాట్ టాపిక్గా మారాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కృనాల్.. తన తమ్ముడు హార్థిక్ని ఔట్ చేశాడు. అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున ఆ వికెట్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. హార్థిక్ కూడా కృనాల్ పైపు చూస్తూ డగౌట్కి వెళ్లాడు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయని కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే ఆర్సిబి ఇన్సైడర్ షోలో కృనాల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ షోలో మిస్టర్ నాగ్స్ ‘‘మీ ఇద్దరి బంధం బాగుంది కాదా? లేకపోతే ఏదైనా గొడవా?’’ అని ప్రశ్నించాడు. దీనిపై కృనాల్ మాట్లాడుతూ.. అంతా బాగుందని సమాధానం ఇచ్చాడు. ఇక లక్నో ఆటగాడు ముకుల్ చౌదరిని స్లెడ్జ్ చేశాడంటూ వస్తున్న ఆరోపణలపై కృనాల్ స్పందించాడు. ‘‘ఓ కుర్రాడిని నేను స్లెడ్జ్ చేశానంటూ బయట చాలా మంది విమర్శిస్తున్నారు. నేను అతడికి బౌలింగ్ చేశా. తొలి బంతికే ప్యాడ్స్ తాకిన వెంటనే ఔట్ కోసం అప్పీల్ చేశా. ఆ తర్వాత ‘ముకుల్ నువ్వు కుర్రాడివి. నా బౌలింగ్లో నువ్వు సిక్సు కొట్టగలవు. అయితే, లాంగాఫ్ లేదా లాంగాన్ మీదుగా స్టాండ్స్లోకి పంపించు’

మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్రావు (90) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాదేండ్ల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, 1984లో టిడిపి ప్రభుత్వం హయాంలో సిఎం ఎన్టీఆర్ గుండె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు.. ఒక నెల రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాదేండ్ల ముఖ్యమంత్రిగా పని చేశారు.

ఉప్పల్: తెలంగాణలో ఆర్ టిసి కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు లేక ఉప్పల్ రింగ్ రోడ్డు వెలవెలబోతుంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వరంగల్ రూట్ లో బస్సులు లేకపోవడంతో నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లు ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కూడా బస్సుల సరిపోవడం లేదు. బస్సుల కోసం బస్టాండుల్లో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఊళ్లకు జనం బయల్దేరారు. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెను ప్రైవేట్ టాక్సీలు, ఆటోలు క్యాష్ చేసుకుంటున్నాయి.

కుత్బుల్లాపూర్: అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సు రవాణా పూర్తిగా స్థంభించింది. జీడిమెట్ల డిపో లో ఉన్న 139 బస్సుల్లో ఒక్కటి కూడా బయటకు రాకపోవడంతో అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు జీడిమెట్ల డిపో కు చెందిన 700 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే సెలవులను ఉపయోగించుకుని స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జరిపిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తరువాతే ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, తమ సమస్యలను వివరించినప్పటికీ సరైన పరిష్కారం చూపలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-కేవైసీ వల్ల చాలామంది కూలీలు ఉపాధికి దూరమవుతున్నారనీ వెంటనే ఉపాధి హామీ ఈ- కేవైసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో మౌలిక వసతులను కల్పించి, ప్రమాద బీమా సౌకర్యం కూడా కూలీలకు అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. కల్లుగీత కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు మాట్లాడుతూ మోటకొండూరు మండలం సాగునీరు వసతి లేక వ్యవసాయం లేక చాలామంది […] The post ధరలకు అనుగుణంగా ‘ఉపాధి’ కూలి పెంచాలి appeared first on Navatelangana.

న్యూఢిల్లీ: కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ పారామిలిటరీ దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(UKMTO) బుధవారం హోర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరపింది. కాల్పుల్లో ఆ నౌక ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై స్పందించిన యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(UKMTO).. ఉదయం 7.55 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గార్డ్ గన్బోట్ ఒకటి నౌకను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు, పర్యావరణ నష్టం జరగలేదని ఇరాన్ పారామిలిటరీ దళం వెల్లడించింది. ఇటీవల అమెరికా ఓ ఇరాన్ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.


నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని పట్టణాలు, నగరాల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించిన రూల్స్ మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫేషియల్ రికగ్నేషన్ (ముఖ ఆధారిత గుర్తింపు) విధానంలో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రజాభవన్లో మున్సిపల్శాఖ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్ విధానంపై జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, […] The post తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు మరియు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై మాజీ మంత్రి హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అంతిమంగా ధర్మం గెలిచిందన్నారు. న్యాయసూత్రాలకు విరుద్దంగా కమిషన్ను ఏర్పాటు చేశారని, […] The post రేవంత్రెడ్డి నిజస్వరూపం బయటపడింది: హారీష్ రావు appeared first on Navatelangana.







నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా ఆల్రౌండర్లు, సోదరులైన కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా మధ్య సత్సంబంధాలు లేవంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున కృనాల్, ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ తలపడిన తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తన తమ్ముడితో ఉన్న విభేదాల వార్తలపై కృనాల్ పాండ్యా ఎట్టకేలకు స్పందించాడు. అవన్నీ నిరాధారమైన పుకార్లని కొట్టిపారేశాడు. ఇటీవల ఆర్సీబీ పాడ్కాస్ట్లో హోస్ట్ […] The post తమ్ముడితో విభేదాలు..స్పందించిన కృనాల్ పాండ్యా appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: మహిళ రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో మోడీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విపక్షాలు సదురు బిల్లులను వ్యతిరేకించాయి. దీంతో లోక్సభలో ఆ బిల్లు వీగిపోయింది. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపక్షాల తీరును నిరసిస్తూ ర్యాలీ తీస్తుండగా మహారాష్ట్ర(Maharashtra) జలవనరుల శాఖ మంత్రి గిరీశ్ మహాజన్కు చేదు అనుభవం ఎదురైంది. ఓర్లీ ప్రాంతంలో నడిరోడ్డుపై బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. దీంతో రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. గంటల కొద్ది వాహనాలు ఎక్కడికక్కడ […] The post రోడ్డుపై బీజేపీ నేతల ర్యాలీ..మహిళ తీవ్ర ఆగ్రహం appeared first on Navatelangana.