21963 వార్తలు

నవతెలంగాణ – హైదరాబాద్ : క్వాంటాస్ సంస్థ మార్పులు చేసిన ఎయిర్బస్ A350 విమానంతో, ఫ్రాన్స్లోని టౌలౌస్లో ల్యాండ్ అవడానికి ముందు 24 గంటలకు పైగా గాలిలో ప్రయాణించి, అత్యంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ విమానం జులై 27న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:27 గంటలకు మెల్బోర్న్ నుండి బయలుదేరి, 24 గంటల 23 నిమిషాల పాటు 23,075 కి.మీ. ప్రయాణించి, జులై 28న ఉదయం 9:52 గంటలకు టౌలౌస్లోని ఎయిర్బస్ ప్రధాన కార్యాలయంలో […] The post చరిత్ర సృష్టించిన కాంటాస్ ఎయిర్లైన్స్ బోయింగ్ ఏ350 appeared first on Navatelangana.

జపాన్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు కనీసం 13 మంది మృతి చెందినట్లు ఆ దేశ ప్రధాని సనాయ్ తకాయిచి ధృవీకరించారు. జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషూలోని కుమమోటో ప్రిఫెక్చర్లో మంగళవారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. భూకంపం ధాటికి వందలాది భవనాలు కూలిపోగా, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 350 మందికి పైగా గాయపడ్డారు. కుమామోటోలోని ఒక పెద్ద షాపింగ్ మాల్ లో గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించి భవనం ఒక భాగం కూలిపోయింది. అలాగే యాట్సుషిరో నగరంలోని ఒక పేపర్ ఫ్యాక్టరీలో భారీ చిమ్నీ నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంపం తర్వాత దాదాపు 2.60 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు

నవతెలంగాణ – హైదరాబాద్ : జిల్లా టాపర్ కన్నా ఒక్క మార్కు తక్కువ వచ్చిందన్న కారణంతో లెక్చరర్ అవమానించి, చెంపదెబ్బ కొట్టడంతో ఓ ఇంటర్ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గద్వాల రూరల్ కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 440కి 434 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో […] The post అవమానించిన లెక్చరర్.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య appeared first on Navatelangana.

అమెరికాలోని కాలిఫోర్నియాలో సాంటా క్రూజ్ బీచ్లో అలల్లో చిక్కుకున్న 10 ఏళ్ల బాలుడిని కాపాడిన 16 ఏళ్ల లైఫ్గార్డ్కు అత్యున్నత పౌర పురస్కారం అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.ఆ యువకుడిని, అతని కుటుంబాన్ని, రక్షించబడిన బాలుడితో కలిసి వైట్ హౌస్కు ఆహ్వానించి సత్కరిస్తామని తెలిపారు. ఈ ఘటనలో మరో లైఫ్గార్డ్, బీచ్లో ఉన్నవారు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆ లైఫ్గార్డ్ 16 ఏళ్ల రైడర్ విలియమ్స్ అని కాలిఫోర్నియా స్టేట్ పార్క్స్ ఫాక్స్ న్యూస్ డిజిటల్కు ధృవీకరించింది. శనివారం విడుదలైన ఒక ఉత్కంఠభరితమైన వీడియోలో విలియమ్స్ తాను రక్షిస్తున్న బాలుడిని వదలకుండా గట్టిగా పట్టుకుని భారీ అలలతో పోరాడుతూ పదేపదే వాటి కింద మునిగిపోతున్న దృశ్యం రికార్డ్ అయింది.శనివారం మధ్యాహ్నం 3:32 గంటలకు సీబ్రైట్ స్టేట్ బీచ్ వద్ద విలియమ్స్ భద్రతా విధుల్లో ఉన్నప్పుడు ఒక బాలుడు అలల తాకిడికి కింద పడిపోయి తీరం నుండి సుమారు 15 గజాల దూరంలో సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దీంతో లైఫ్గార్డ్ ఆ బాలుడిని రక్షించి సముద్రం నుండి విజయవంతంగా బయటకు తీసుకువచ్చి అతని తల్లిదండ్రులకు అప్పగించాడు.











నవతెలంగాణ – హైదరాబాద్ : ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను నమ్మించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. దర్యాప్తులో, మహిళ వ్యక్తిగత వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. The post మహిళను వేధించిన జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్ appeared first on Navatelangana.

మల్టీ టాలెంటెడ్ జి.వి.ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ’ఇమ్మోర్టల్’. మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్కి అదిరిపోయే స్పందన వచ్చింది. తాజాగా ’ఇమ్మోర్టల్’ నుంచి రొమాంటిక్ మెలోడీ ’షీ ఈజ్ మై’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు సామ్ సీఎస్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అరవింద్ శ్రీనివాస తన గాత్రంతో పాటకు ప్రాణం పోయగా, రాజశ్రీ సుధాకర్ రాసిన సాహిత్యం ప్రేమలోని భావోద్వేగాలను అందంగా పలికించింది. ఈ పాటలో జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ల మధ్య కెమిస్ట్రీ చాలా ఆసక్తికరంగా ఉంది.






