21976 వార్తలు




నవతెలంగాణ – హైదరాబాద్ : ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను నమ్మించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. దర్యాప్తులో, మహిళ వ్యక్తిగత వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. The post మహిళను వేధించిన జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్ appeared first on Navatelangana.

మల్టీ టాలెంటెడ్ జి.వి.ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ’ఇమ్మోర్టల్’. మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్కి అదిరిపోయే స్పందన వచ్చింది. తాజాగా ’ఇమ్మోర్టల్’ నుంచి రొమాంటిక్ మెలోడీ ’షీ ఈజ్ మై’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు సామ్ సీఎస్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అరవింద్ శ్రీనివాస తన గాత్రంతో పాటకు ప్రాణం పోయగా, రాజశ్రీ సుధాకర్ రాసిన సాహిత్యం ప్రేమలోని భావోద్వేగాలను అందంగా పలికించింది. ఈ పాటలో జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ల మధ్య కెమిస్ట్రీ చాలా ఆసక్తికరంగా ఉంది.











లక్నో: అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓ వివాహిత తన ప్రియుడితో మాట్లాడుతుండగా మూడేళ్ల కుమారుడు ఏడుస్తుండడంతో అతడి గొంతు నులిమి చంపేసింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మథుర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రుచి జిందాల్(32) అనే మహిళ తన భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి బల్దేవ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్త మెడికల్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నెల రోజుల క్రితం అకస్మాత్తుగా కుమారుడు చనిపోవడంతో దహనసంస్కారాలు నిర్వహించారు. కుమారుడిని ఏడుస్తుండగా గొంతు నులిమి చంపిన విషయం ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండగా భర్త చాటుగా విన్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి రుచి జిందాల్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడి మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని మియాపూర్లో వైశాలినగర్ రైల్వే అండర్పాస్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. బాధితుడు హఫీజ్పేట్ ప్రేమ్నగర్ నివాసి బాలయ్య(70) అనే వృద్ధుడిగా గుర్తించారు. సమాచారం మేరకు క్కడికి చేరుకున్న పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నాలా మరమ్మత్తుల సమయంలో ఈ ఘటన జరగినట్లు తెలుస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై బాధితుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The post మ్యాన్హోల్లో పడి వ్యక్తి గల్లంతు appeared first on Navatelangana.

ముంబై: శ్రీలంకతో జరిగే రెండు మ్యా చ్ల టెస్టు సిరీస్ కో సం టీమిండియాను ఎంపిక చేశారు. శ్రీ లంక గడ్డపై ఆగస్టు 15 నుంచి ఈ సిరీస్ జరుగనుంది. ఇందు కోసం 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. శుభ్మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. కెఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆఫ్ స్పిన్నర్ సరాంశ్ జైన్ తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సరాంశ్ను జట్టులోకి తీసుకున్నారు. సీనియర్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా కూడా సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితేనే అతను సిరీస్లో పాల్గొంటాడు. ఇక సాయి సుదర్శన్ కూడా ఫిట్నెస్లో నెగ్గితేనే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఇక హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు జట్టులో చోటు లభించింది. జట్టు వివరాలు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా, సిరాజ్, గుర్నూర్ బ్రార్, పడిక్కల్, సరాంశ్ జైన్.

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో పారా అథ్లెట్ షర్మిలా ధన్ఖడ్ షాట్పుట్ విభాగంలో స్వర్ణం సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది. 40 ఏళ్ల వయసులో షర్మిలా ధన్ఖడ్ ఏకంగా పసిడి పతకం గెలిచి ఔరా అనిపించింది. పారా అథ్లెటిక్స్ షాట్పుట్ ఎఫ్ 57విభాగం ఫైనల్లో షర్మిలా 9.81 మీటర్ల దూరంలో త్రోను విసిరి స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్కు పతకం సాధించి పెట్టింది. హర్యానాకు చెందిన షర్మిల జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. ఒకవైపు కుటుంబ కలహాలు మరోవైపు పోలియో, ఆర్థిక సమస్యలు దాటుకుని కామన్వెల్త్ వంటి అగ్రశ్రేణి క్రీడల్లో స్వర్ణం సాధించి నయా చరిత్ర సృష్టించింది. ఇదే విభాగంలో భారత్కు చెందిన మరో అథ్లెట్ శిల్పా శైల కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఎఫ్ 57 ఈవెంట్లో శిల్ప అద్భుత ఆటతో అలరించింది. ఈ క్రమంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దకించుకుంది. కాగా, అసాధారణ ఆటతో పసడి పతకాన్ని సాధించి భారత ఖ్యాతిని చాటిన షర్మిలాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు అభినందించారు.అజయ్కు సిల్వర్ కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు కుర్రాడ



