
4531 వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తున్నట్లు బుధవారం హైకోర్టు వెల్లడించింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో కెసిఆర్, హరీష్ రావులకు ఊరట లభించింది.కాగా, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ కెసిఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి కోర్టు.. అలాంటి తీర్పే ఇచ్చింది.
నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇరు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న కోర్టు నివేదిక తయారుచేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీకోవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ […] The post కేసీఆర్, హరీశ్రావులకు హైకోర్టులో ఊరట.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – బజార్హత్నూర్: మండలం దేగామా గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బొడ్డు భోజన్న తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన గోదుమాల లక్ష్మణ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు. లక్ష్మణ్ అనారోగ్యంతో మంచానికే పరిమితమవడం, అలాగే కుటుంబానికి ఆదారంగా ఉన్న కుమారులు మరణించడం వల్ల ఆ కుటుంబం దయనీయ స్థితిలోకి చేరింది. ఈ పరిస్థితిని గమనించిన ఉప సర్పంచ్ భోజన్న తన వంతుగా రూ.5,000 నగదు […] The post మానవత్వం చాటుకున్న దేగామా ఉప సర్పంచ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-మిరుదొడ్డి: దుబ్బాక మండల పరిధిలోని పెద్ద చికోడ్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో నాందిరి మల్లేశం మరణించారు. బాధిత కుటుంబానికి మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాందిరి బిక్షపతి, నాందిరి రామయ్య, నాందిరి చిత్తారి (డుబ్బులు),నాందిరి పెద్ద బిక్షపతి, బొందన్నగారి యాదగిరి, బొంగురపు వెంకటరెడ్డి, మాడ అశోక్, అలుగుల యాదగిరి, అలుగుల ప్రకాశ్, పున్న స్వామి […] The post బాధిత కుటుంబానికి మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ సాయం appeared first on Navatelangana.

గాంధీనగర్: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి అతడిని కాలువలో పడిసింది. భర్త కాలువలో ఈదుతూ నిర్మాణాన్ని పట్టుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చానీ ప్రాంతంలో గిరీష్ పటేల్, పాల్గుణీ పటేల్ అనే దంపతులు నివసిస్తున్నారు. గిరష్ పార్లర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఖేడాకు చెందిన సెలూన్ యజమాని కౌశిక్ శర్మతో పల్గూణి అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని హత్య చేయాలని ప్రణాళిక వేశారు. కౌశిక్ తన స్నేహితుడు నికుల్ గోస్వామితో హత్య చేసి ఒప్పందం చేసుకున్నాడు. తొలుత ముప్పై ఐదు వేల రూపాయలు సుపారీ గ్యాంగ్ కు ఇచ్చారు. ఏప్రిల్ 15న రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గిరీష్ ను కిడ్నాప్ చేశాడు. కత్తితో బెదిరించి వివిధ ప్రాంతాలలో తిప్పి సోజిత్ర శివారులోని ఓ కాలువలో అతడిని పడేశారు. గిరీష్ చనిపోయాడని భావించి అక్కడి నుంచి దుండగులు వెళ్లిపోయారు. కాలువలో కొట్టుకొని పోతూ ఒక నిర్మాణాన్ని గట్టిగా పట్టుకొని బయటకు వచ్చాడు. మూడు గంటల పాటు
నవతెలంగాణ-ఆలేరు టౌన్: రెండు రోజుల క్రితం ఆలేరులో కోలనుపాక రోడ్డు వద్ద విద్యుత్ పోల్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కేవలం వైర్ల సహాయంతోనే తేలియాడుతూ, కూలడానికి సిద్ధంగా పోల్ ఉండడంతో, స్థానికులు విద్యుత్ అధికారులు ఏడి రాజ శేఖర్, ఏఈ వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి, నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. పాత విద్యుత్ పోల్ను తొలగించి, లైన్మెన్ యాదగిరి, రమేష్ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు […] The post నూతన విద్యుత్ పోల్ ఏర్పాటు appeared first on Navatelangana.

వేధింపుల కారణంగా ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. నగరంలోని మట్టెవాడ పరిధిలో నివాసం ఉంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో సంగీత(33) అనే మహిళ, కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బందోబస్తు విధులు ముగించుకుని మంగళవారం మట్టెవాడలోని తన నివాసానికి చేరుకున్న సంగీత.. రాత్రి సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.అయితే, శ్రీధర్ అనే కానిస్టేబుల్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంగీత, సూసైడ్ లెటర్ రాసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మట్టేవాడ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ బోడుప్పల్ : ఆర్టీసి కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆర్టీసి కార్మికుల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది.దీంతో బుధవారం ఉప్పల్ డిపో ముందు సమ్మె నిర్వహించారు.ఈ సమ్మె కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. ఆర్టీసి కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో బుధవారం నుంచి ఆర్టీసి జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు ఆర్టీసి కార్మికులు ఉప్పల్ డిపో ముందు సమ్మెకు దిగారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళకుండా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ...ఆర్టీసి కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. ఆర్టీసి కార్మికుల వల్లే తెలంగాణ వచ్చిందని, ఆర్టీసితో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ ప్రభుత్వానికి పడుతుందని విమర్శించారు. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం వలన కరీంనగర్ లో ప్రమాదం జరిగిందని, తృటిలో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అని మండిపడ్డారు. కార్మికుల

హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో ఆర్ టిసి జెఎసి నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఐఎఎస్ అధికారుల కమిటీతో జెఎసి నేతలు సుదీర్థంగా చర్చలు జరిపినప్పటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కార్మికులు డిపోల ముందు ధర్నాకు దిగారు. ఈ రోజు నుంచి ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపు నివ్వడంతో ఆర్ టిసి ఎండి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్ టిసి కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, కార్మికులు డిమాండ్లను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. రాజకీయ లబ్ది కోసమే కార్మికులను నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. ఇప్పటికే కార్మికులు డిపోలకు చేరుకొని ధర్నాకు దిగారు. మాటలు వద్దు అని చేతలే ముద్దు అంటూ నినాదాలు చేస్తన్నారు. కానీ ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపించడానికి ప్రయత్నిస్తోంది. పోలీసుల భద్రతాలో బస్సులు నడిపిస్తుండడగా ఆర్ టి

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి.. కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా, ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. ప్రజా రవాణా స్తంభించకుండా అద్దె బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా అన్ని జిల్లాల నుంచి ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీఏ అధికారులను రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు తగిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రైవేటు బస్సులను రోడ్డుపైకి […] The post సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు..ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి appeared first on Navatelangana.

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం తెల్లవారు జామునుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది.ఇక, తిరుమల వెంకన్నను 73,324 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 22,955 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఆర్ టిసి కార్మికులు సమ్మె చేపట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను బంద్ చేశారు. ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్ల సాయంతో బస్సులను నడుపుతోంది. కరీంనగర్ 2కు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి ఓ ప్రైవేటు డ్రైవర్ సహాయంతో వరంగల్ కు పంపించారు. అల్గూనుర్ సమీపంలోకి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ వణికిపోయారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి భారతదేశం ఎప్పటికీ తలొగ్గదని, అటువంటి హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఏప్రిల్ 22, 2025న ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు."గత ఏడాది ఇదే రోజున జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నాను. వారిని ఎన్నటికీ మరచిపోలేము. ఈ నష్టం నుండి కోలుకుంటున్న బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక దేశంగా, మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా ఉన్నాము. భారతదేశం ఏ రకమైన ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావు" అని ప్రధాని పేర్కొన్నారుకాగా, గత ఏడాది ఏప్రిల్ 22న, దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్, ప్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వీరవల్లి టోల్ ప్లాజా వద్ద సూచిక బోర్డును కారు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమేప్రమాదానికికారమనిపోలీసులుభావిస్తున్నారు.



నవతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సులు డిపోకే పరిమితమైయ్యాయి. అయితే కిరాయి డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రభుత్వం నీచ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఓ అనుభవం లేని డ్రైవర్ ఆర్టీసీ బస్సు నడపడంతో కరీంనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నా ప్రయాణికులకు తీవ్ర గాయాలైయ్యాయి. బాధితులను వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కార్మికులు మండిపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ప్రభుత్వం అనవసర […] The post కిరాయి డ్రైవర్లతో బస్సుల డ్రైవింగ్..కరీంనగర్లో రోడ్డు ప్రమాదం appeared first on Navatelangana.




