
4505 వార్తలు
ఖాళీ బిందెలతో మహిళల నిరసననవతెలంగాణ – మల్హర్ రావుమండలం ఆన్సాన్ పల్లి గ్రామంలోని పాతపల్లిలో గత నెల రోజులుగా తాగు నీటి కటకట ఏర్పడిందని స్థానిక మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన , ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. గత కొద్దీ రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడిందని, వెంటనే సమస్యను తీర్చాలని పంచాయతీ పాలకవర్గానికి, సంబంధించిన పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రికార్డు […] The post ఆన్సాన్ పల్లిలో నీటి కటకట.! appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్/ కుషాయిగూడమల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీదర్ (కర్ణాటక)కు చెందిన రాజేందర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేందర్ సింగ్ కుమార్తె సోనం ఠాకూర్ (26) ను మౌలాలి ఇందిరానగర్కు చెందిన యోగేష్ ఠాకూర్కు 2020లో వివాహం చేశారు. అనంతరం దంపతులు మౌలాలి హెచ్బీ కాలనీలో నివసిస్తూ ఉండగా, వారికి ఒక కుమార్తె […] The post కుషాయిగూడలో వివాహిత ఆత్మహత్య appeared first on Navatelangana.


కొత్త జీఎస్టీ శ్లాబ్ ప్రయోజనాన్ని పొందడానికి బజాజ్ మోటార్సైకిల్స్ తమ ఇంజిన్ల పరిమాణాన్ని తగ్గించడం ప్రారంభించింది. ఈ శ్లాబ్ ప్రకారం 350 cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, కంపెనీ ఇటీవల తమ బజాజ్ NS400Z చిన్న వేరియంట్ను విడుదల చేసింది. ఇక అంతకుముందు బజాజ్ యాజమాన్యంలోని కేటీఎం, కేటీఎం 390 డ్యూక్ 349 cc వేరియంట్ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ రెండు మోటార్సైకిళ్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, బజాజ్ NS400Z, KTM 390 డ్యూక్ లో ఏది కొంటె బెటర్ గా ఉంటుందో ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ఇంజిన్, పనితీరుబజాజ్ పల్సర్ NS400Z, KTM 390 డ్యూక్ రెండూ కొత్త 349.13 cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్తో వస్తాయి. ఇది మునుపటి 373 cc ఇంజిన్ స్థానంలో వచ్చాయి. బజాజ్ NS400Z ఇప్పుడు 9,000 rpm వద్ద 40 హార్స్పవర్, 7,500 rpm వద్ద 33.2 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి కంటే కొద్దిగా తక్కువ. మరోవైపు..కొత్త 350 cc ఇంజిన్తో వచ్చిన కేటీఎం 390 డ్యూక్, 41.5 hp గరిష్ట శక్తిని, 33.5
– పలు విభాగాల్లో తనిఖీలు నవతెలంగాణ – అశ్వారావుపేట అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యశాలను బుధవారం కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం సందర్శించింది. ఈ బృందంలో డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జ్యోత్స్న తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న సేవలను సమగ్రంగా పరిశీలించిన ఈ టీం, వివిధ విభాగాల పనితీరును నిశితంగా అధ్యయనం చేసింది. రోగులకు అందుతున్న సౌకర్యాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, ల్యాబ్ సేవలు, నర్సింగ్ సేవలు, మెడికల్ రికార్డులు, డాక్టర్ల పనితీరు తదితర అంశాలను […] The post ఏరియా ఆస్పత్రిని సంబంధించిన కాయ కల్ప బృందం appeared first on Navatelangana.
– నేటితో ముగియనున్న విద్యాసంవత్సరం– వార్షిక సమీక్ష లో అశ్వారావుపేట పై జిల్లా అధికారులు ప్రశంసలునవతెలంగాణ – అశ్వారావుపేట గతేడాదితో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో అశ్వారావుపేట మండలం విద్యా రంగంలో గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. మంగళవారం నిర్వహించిన విద్యాశాఖ వార్షిక సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులు మండల విద్యా విభాగంపై ప్రశంసలు కురిపించారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గతేడాదితో పోలిస్తే 197 మంది విద్యార్థులు పెరగడం విశేషం. ఎన్రోల్మెంట్ విషయంలో మండలం […] The post పురోగతి దిశగా మండల విద్యా విభాగం appeared first on Navatelangana.



లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎకనా స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్తో జరుగులున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఆడిన గత రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలు కాగా.. లక్నో వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో లక్నో రెండు మార్పులు చేయగా.. రాజస్థాన్ గత మ్యాచ్లోని జట్టుతో బరిలోకి దిగుతోంది. తుది జట్లు: ఎల్ఎస్జి: మిచెల్ మార్ష్, ఆయుష్ బదోనీ, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఐయిడెన్ మార్క్రమ్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, మయాంక్ యాదవ్. ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డొనావాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాండ్రే బర్గర్.
నవతెలంగాణ – బజార్ హత్నూర్మండలంలోని ఏసాపూర్ గ్రామానికి చెందిన మడావి పూజ (23), భర్త గజానంద్కు రెండవ కాన్పు సమయంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం 11:59 గంటలకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు తీవ్రంగా పెరగడంతో పాటు శిశువు మెడ చుట్టూ బొడ్డు తాడు చుట్టుకుపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఏసాపూర్ గ్రామంలోనే అంబులెన్స్లో అత్యవసర ప్రసవం […] The post అంబులెన్స్లో ప్రసవం – తల్లీ శిశువు క్షేమం appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్లో భాగంగా లఖ్నవూ వేదికగా ఎల్ఎస్జీ, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన లఖ్నవూ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో రెండు జట్లు ఇప్పటివరకు చెరో ఆరు మ్యాచులు ఆడగా.. ఆర్ఆర్ 4, లఖ్నవూ 2 మ్యాచ్లు గెలిచాయి.జట్లుఎల్ఎస్జీ: మార్ష్, ఆయుష్ బదోని, పంత్, పూరన్, మార్క్రమ్, ముకుల్ చౌదరి, షమీ, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ సింగ్ రాఠి, మయాంక్ యాదవ్. ఆర్ఆర్: యశస్వి జైస్వాల్, వైభవ్ […] The post LSG vs RR: టాస్ గెలిచిన లఖ్నవూ..ఆర్ఆర్ బ్యాటింగ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ పదోన్నతులు కల్పించింది. 1995, 1996 బ్యాచ్లకు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హోదా పొందిన వారిలో ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వీవీ శ్రీనివాసరావు, చారు సిన్హా, అనిల్కుమార్, వీసీ సజ్జనార్ ఉన్నారు. The post ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు డీజీ హోదా appeared first on Navatelangana.



హైదరాబాద్: కెసిఆర్పై దుష్ప్రచారం చేసిన వారి చెంపచెల్లుమనిపించే తీర్పు హైకోర్టు ఇచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్ను నిలిపివేయాలని తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజినీర్లు గెలిచారని తెలిపారు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ చేసిన కుట్రలు కూలాయని ఎద్దేవా చేశారు. ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకునేది లేదని హైకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కెసిఆర్ కృషే అని కెటిఆర్ పేర్కొన్నారు. ‘‘భూమిపై గోదావరి పారినన్ని రోజులూ కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. అది పిసి ఘోష్ కమిషన్ కాదు.. పిసిసి నివేదిక అని నేను అప్పుడే చెప్పాను. హైకోర్టు తీర్పుతో అందరికీ ఇవాళ జ్ఞానోదయం కలిగి ఉంటుంది. కాళేశ్వరం కచ్చితంగా తెలంగాణకు వరప్రదాయని. రూ.94 వేల కోట్లు ఖర్చు అయితే.. రూ.లక

దోసకాయ దాని తాజా రుచికి, పోషక గుణాలకు ప్రసిద్ధి చెందింది. సాధారణంగా దీనిని సలాడ్లలో భాగంగా ఉపయోగిస్తారు. దోసకాయ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. అంతేకాదు, శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.శరీరాన్ని హైడ్రేటెడ్గాదోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దోసకాయలో ఉండే మూలకాలు శరీర నీటి సమతుల్యతను కాపాడతాయి. వేసవిలో అలసట, నీరసాన్ని నివారిస్తాయి.బరువు తగ్గడంలో ఇప్పటికే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిరోజూ దోసకాయ తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోసకాయ కడుపును ఎక్కువసేపు నింపిన భావన కలిగిస్తుంది. దోసకాయలలోని ఉండే నీరు, ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యందోసకాయలలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు


నవతెలంగాణ – హైదరాబాద్: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న సమ్మెకు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించిది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, ఔట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ తదితర 32 డిమాండ్ల వరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన ఐఏఎన్ అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరడం సమ్మెను […] The post ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు: జాన్ వెస్లీ appeared first on Navatelangana.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దుపిల్లల కదలికలు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల]జిల్లా స్పీ మహేష్ బి. గితేనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లవేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు,యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా మారకూడదనీ జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఈత రానివారు […] The post ఈత విషాదంగా మారకుండా జాగ్రత్త పడాలి appeared first on Navatelangana.

– ఇబ్బందుల్లో సీనియర్ ఉపాధ్యాయులు– మండల విద్యాధికారుల ఇష్టారాజ్యం ,ఏమి పట్టనట్లు తహశీల్దార్లునవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి జిల్లాలోని కొన్ని మండల్లాకు చెందిన మండల విద్యాశాఖ కొన్ని యూనియన్ నాయకులకు వారికి నచ్చిన చోట జనగణన విధులను కేటాయించారని సీనియర్ ఉపాధ్యాయులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జనగణన విధుల కేటాయింపులో పారదర్శకత లేని కారణంగా అనేకమంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి కలెక్టర్ కు ముందు తమకు జరిగిన అన్యాయం తెలుపుతూ […] The post పారదర్శకత లేని జనగణన.. విధుల కేటాయింపులు appeared first on Navatelangana.