21940 వార్తలు


పోలీసు చర్యపై రాజ్యసభలోనూ దుమారంవిద్యార్థులపై దాడి చేసిన వారు బహిరంగంగా తిరుగుతున్నారన్న ఖర్గే పోలీసు చర్య కేవలం సాధారణ శాంతి భద్రతల సమస్యేనన్న జేపీ నడ్డా ఎమర్జెన్సీ కాలాన్ని మరిచిపోయారా అంటూ నిలదీసిన మంత్రి న్యూఢిల్లీ: సీజేపీ, విదార్థులు జూలై 20న జరిపిన ఛలో పార్లమెంటు మార్చ్పై పోలీసుల లాఠీచార్జి వివాదం రాజ్యసభలోనూ బుధవారం తీవ్ర దుమారం రేపింది. పోలీసుల దౌర్జనాన్ని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఖండించగా, పోలీసుల చర్య చట్టబద్ధమేనని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమర్ధించారు. దీంతో ఇటు అధికారపక్ష సభ్యులు, అటు విపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.శాంతియుతంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి, బలప్రయోగం చేశారని, విద్యార్థులపై దాడి చేసిన వారు రోడ్లపై బహిరంగంగా తిరుగుతున్నారని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. నిరసనకారులపై పోలీసులు పెల్లెట్ గన్లు ప్రయోగించారంటూ వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై హోం మంత్రి అమిత్షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి జరిపి

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకూ భారత్ 12 పతకాల(2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు మరో పతకం ఖాయమైంది. మహిళల బాక్సింగ్ 51 కెజిల విభాగంలో సాక్షి చౌదరి ఈ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను 5-0 తేడాతో మట్టికరిపించి సెమీ ఫైనల్స్కి దూసుకెళ్లింది. దీంతో భారత్కు కనీసం కాంస్య పతకం ఖరారైంది. ఈ బౌట్లో ఆరంభం నుంచి సాక్షి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు రౌండ్లలోనూ ఏకగ్రీవంగా 5-0 స్కోరుతో విజయం సాధించింది. ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్తో సాక్షి తలపడనుంది.




టీం ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐసిసి టి-20 ర్యాంకింగ్స్లో టాప్-50లోకి అడుగుపెట్టాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే సిరీస్లో వైభవ్ అదరగొట్టాడు. మూడు వన్డేల్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. దీంతో తాజాగా ప్రకటించిన ఐసిసి టి-20 ర్యాంకింగ్స్లో ఏకంగా 230 స్థానాలను ఎగబాకి 536 రేటింగ్ పాయింట్లతో 48 స్థానానికి చేరుకున్నాడు. ఇక తాజా ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్లో భారత క్రికెటరే ఉన్నాడు. 910 పాయింట్లతో ఇషాన్ కిషన్ నెం.1గా నిలిచాడు. అయితే ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో ఫర్వాలేదు అనిపించిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే సిరీస్లో తేలిపోయాడు. దీంతో ఒక స్థానం కోల్పోయి 819 పాయింట్లతో మూడో ర్యాంకుకు పడిపోయాడు. పాకిస్థాన్ ఆటగాడు సహిబ్జాద ఫర్హాన్ (848) రెండో ర్యాంకుకు చేరాడు. తిలక్ వర్మ (750) రెండు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకులో నిలిచాడు. ఇక టి-20 బౌలింగ్లో టాప్-10లో కేవలం ఒక ఆటగాడు మాత్రమే ఉన్నాడు. 663 పాయింట్లతో మూడు స్థానాలు కోల్పోయి వరుణ్ చక్రవర్తి 9వ ర్యాంకులో స్థిరపడ్డాడు. బుమ్రా ఐదు స్థానాలను కోల్పోయి 17వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.


న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హెచ్చరిస్తున్నట్లు సృష్టించిన వీడియో వైరల్గా మారింది. అయితే ఆ వీడియో ఫేక్ అని పిఐబి క్లారిటీ ఇచ్చింది. అది పూర్తిగా ఎఐతో సృష్టించారని స్పష్టం చేసింది. అందులో చూపినట్లు ప్రధాని విద్యార్థులకు ఎటువంటి హెచ్చరికలు చేయలేదని పేర్కొంది. పరీక్షా విధానంలో సంస్కరణలపై సిఫార్సులకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థఆపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు ఇటీవల మోడీ ప్రకటిస్తూ.. ఓ వీడియో షేర్ చేశారు. కొన్ని నెట్వర్క్లు దాదాని ఎఐతో మార్ఫింగ్ చేసి.. సోషల్మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాయని పిఐబి తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా అనుమానాస్పద, ఫేక్ కంటెంట్ ప్రజల దృష్టికి వస్తే తమకు రిపోర్టు చేయాలని కోరింది.









పవిత్ర గ్రంథం ‘భాగవత మహాపురాణం’ త్వరలో వెండితెరపైకి రానుంది. గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా బాలీవుడ్కు చెందిన నిర్మాణ సంస్థ ‘సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్’ ఈ భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ‘శ్రీమద్భాగవతం’ పేరుతో లైవ్ యాక్షన్ ఫిల్మ్ సిరీస్ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ పురాణగాథను మొత్తం ఏడు భాగాలుగా తెరకెక్కించనున్నారు. శతాబ్దాలుగా వస్తున్న ఏడు రోజుల భాగవత పారాయణ సంప్రదాయం స్పూర్తిగా ఈ సిరీస్ని రూపొందిస్తున్నారు. దీనికి ‘సప్తి’ అని నామకరణం చేశారు. ఈ ఫ్రాంచైజీలోని ఏడు భాగాలు ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.

న్యూఢిల్లీ: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ది పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లుకు ఆమోదం లభించింది. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ.. అవి వీగిపోయాయి. పేవర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి బిల్లులో నిబంధనలు రూపొందించామని తెలిపింది. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది.



