
4505 వార్తలు



వారం రోజుల్లో తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి....కోటి అశాలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువతి సమీప వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. కళ్యాణ వేడుకల నిర్వహణలో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా నెలకొన్న ఈ విషాదం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న, వినోదలకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కూతురు పెళ్లి అయింది. భూక్య సంగీత (19)ను తాను ప్రేమించిన మరిపెడ శివారు కొత్త తండాకు చెందిన అజ్మీర అరవింద్కు ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాను వివాహం చేసుకోనున్న అరవింద్తో కలిసి సంగీత ఇటుగలగడ్డ తండాలోని వ్యవసాయ బావి వద్ద కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సంగీత ఇంటికి రాకవపోటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తండావాసులు బావిలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్సై కోటేశ్వర రావు బావిలో ఉన్న మృతదేహం వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస


ప్రధాని మోడీని ఉగ్రవాదిగా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం బుధవారం తీవ్రస్థాయి నోటిసు వెలువరించింది. తమిళనాడు , పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. చెన్నైలో విలేకరుల సమావేశం దశలో ఖర్గే ప్రధాని మోడీ టెర్రరిస్టు వంటి వారని విమర్శించారు. ప్రతిపక్షాల అణచివేతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార యంత్రాంగాలను వాడుకొంటోందని, ఈ క్రమంలో ఆయన టెర్రరిస్టు వంటి వారేనని ఖర్గే తెలిపారు. దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఖర్గేకు నోటిసు ఇస్తూ దీనికి 24 గంటల్లో సమాదానం ఇచ్చుకోవల్సి ఉందని హెచ్చరించింది. ప్రజలను, పార్టీలను తన చర్యలతో భయభ్రాంతులను చేస్తున్న వ్యక్తి టెర్రరిస్టు కాక మరెవ్వరు అని ఖర్గే ఆ తరువాత వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈసికి ఆయన ఎటువంటి జవాబు ఇస్తారనేది చూడాల్సి ఉంది.

నవతెలంగాణ – హైదరాబాద్: అనంతపురంలో హనీట్రాప్ ముఠాకు చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఈ ముఠా.. మహిళలను ఎరగా వేసి రూ.లక్షలు దోచుకుంటోంది. పలు స్టేషన్లలో హనీట్రాప్ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాకు అనుకూలంగా వ్యవహరించారని ఇద్దరు సీఐలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐలు రాజేంద్రనాథ్, శ్రీహర్షను కర్నూలు వీఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. హనీట్రాప్ ముఠాతో సంబంధాలున్న మరో 10 మందిని శిక్షణ […] The post హనీట్రాప్.. సీఐలపై చర్యలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – మద్నూర్ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డోంగ్లి మండలంలోని మదన్ హిప్పర్గా గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ బాచా వార్ లక్ష్మణ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రైవేటు వద్దు ప్రభుత్వమే ముద్దు తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువులు నేర్పించాలని గ్రామస్తులను కోరారు. ఈ బడిబాట కార్యక్రమంలో మండల ఎంఈఓ శ్రీనివాస్ ఆ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండలంలోని ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థిని […] The post మదన్ ఇప్పర్గాలో బడిబాట appeared first on Navatelangana.

నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లమ్మ గల్లి నుండి అవల్గావ్ బీటి రోడ్డు గత 40 ఏండ్లుగా పూర్తిగా మూసుకుయింది. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఎట్టకేలకు ఈ రోడ్డుకు మొక్షం లభించింది. ఆయన సహకారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల రావాణా సులభైంది. ఏండ్లుగా రహదారికి నోచుకోని దారికి ఓ రూపును తీసుకొచ్చారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీ కృషితోనే ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం […] The post 40 ఏండ్ల రోడ్డు సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేకు ఘన సన్మానం appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఆర్మూర్తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమనిబీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూబీఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ […] The post బీఆర్ఎస్ వీడే ప్రసక్తే లేదు: జీవన్ రెడ్డి appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్పై దుష్ప్రచారం చేసిన వారి చెంప చెళ్లుమనిపించేలా హైకోర్టు తీర్పు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పు ద్వారా కూలింది కాళేశ్వరం కాదని, కాంగ్రెస్ చేసిన కుట్రలు అని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుతో ఈరోజు […] The post కాళేశ్వరం ప్రాజెక్టు తీర్పు.. స్పందించిన కేటీఆర్ appeared first on Navatelangana.



హార్మూజ్ జలసంధిలో తాజా ఉద్రిక్తతల మధ్య, గత వారం కూడా రెండు భారత నౌకలు ఇరాన్ నౌకాదళ దాడులకు గురైన విషయం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని టెహ్రాన్ హామీ ఇచ్చినప్పటికీ ఈ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ జెండాతో ప్రయాణిస్తున్న ‘జాగ్ అర్నవ్’ అనే బల్క్ క్యారియర్ సౌదీ అరేబియా నుంచి భారత్కు వస్తుండగా దాడికి గురైంది. అలాగే ‘సాన్మార్ హెరాల్డ్’ అనే మరో నౌక ఇరాక్ నుంచి భారత్కు చమురు రవాణా చేస్తుండగా లక్ష్యంగా మారింది. ఏప్రిల్ నెలలో సుమారు పది భారత నౌకలు ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సమాచారం. ఈ ఘటనలతో ఇరాన్లో అసలు అధికార నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రభావం పెరిగి, రాజకీయ నాయకత్వాన్ని పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి తన ఆందోళనను తెలియజేస్తూ ఇరాన్ రాయబారిని భారత ప్రభుత్వం పిలిపించి వివరణ కోరింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈ ఏడాది జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన దాడి సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఈడీ కోరింది.ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులు ఇప్పటికే అసాధారణంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు కూడా అత్యంత అసాధారణమైనదిగా భావిస్తున్నామని తెలిపింది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు జరుగుతున్న సమయంలో నేరుగా అక్కడికి వెళ్లి జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. ఆ తరువాత దీనిని రాష్ట్రం-, కేంద్రం మధ్య వివాదంగా

హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపిఎల్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డిజి)గా పదోన్నతులు కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో అదనపు డిజిలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాస రావు, చారు సిన్హా, అనిల్ కుమార్, విసి సజ్జనార్ ఉన్నారు. మహేశ్ భగవత్ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డిజిగా ఉండగా.. స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజిగా ఉన్నారు. వివి శ్రీనివాస రావు తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్గా వ్యవహరిస్తుండగా.. సిఐడి, మహిళ భద్రతా విభాగం, ఎసిబి ఎడిజిగా చారు సిన్హా విధులు నిర్వర్తిస్తున్నారు. అనిల్ కుమార్ గ్రే హౌండ్స్ ఎడిజిగా ఉండగా.. విసి సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్నారు. ఈ ఆరుగురు ఐపిఎల్ అధికారులు.. పదోన్నతి పొందినా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు.

చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డుల ఏర్పాటు మన తెలంగాణ/సిటీబ్యూరో : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, గ్రామంలోని 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. ఈ భూమి విలువ రూ. 90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల వివరాల ప్రకారం సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిపోగా అక్కడ 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలింది. ఖస్రా పహాణీ (గ్రామ పాత రికార్డుల) ప్రకారం మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదై ఉంది. అందులోని 9.05 ఎకరాలను సీఎస్ 14 (నిజాంలకు చెందిన) భూములుగా పేర్కొంటూ కొంతమంది హక్కులు క్లైమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకూ ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ను పట్టించుకోకుండా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి అభూమిని చదును చేసి లే ఔట్గా మార్చినట్టు రంగరెడ్డి కలెక్టర
నవతెలంగాన – హైదరాబాద్ : కేరళంలోని త్రిస్సూర్ లో బాణా సంచా పేలుడు ఘటనను విజయన్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. ఈ ఘటనను రాష్ట్ర విపత్తుగా కేరళం మంత్రివర్గం బుధవారం విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్ డి ఎంఎ)ని ఆదేశించింది. ఈ ప్రమాదంపై న్యాయవిచారణకు ఆదేశించింది. జస్టిస్ సి.ఎన్. రామచంద్రన్ నాయర్ నేతృత్వంలో న్యాయ కమిషన్ పర్యవేక్షించనుంది. మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల అత్యవసర ఆర్థిక సహాయం అందించనున్నట్లు విజయన్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర […] The post త్రిస్సూర్ లో బాణా సంచా పేలుడు.. రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళం ప్రభుత్వం appeared first on Navatelangana.
మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం నవతెలంగాణ – చండూరు చేనేత కార్మికుల పట్ల, చేనేత సహకార సంఘాల పట్ల, చేనేత పరిశ్రమ పట్ల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూపడం తగదని చండూరు మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం విమర్శించారు. బుధవారం ఆయన గట్టుప్పల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేనేత సహకార సంఘాలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. చేనేత సహకార సంఘాల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదల చేసిన […] The post చేనేతపట్ల ప్రభుత్వం చిన్న చూపు తగదు appeared first on Navatelangana.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై దాఖలైన పిటిషన్ల కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 22వ తేదీకి వాయిదా వేయడంతో మంత్రి అజహరుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠత నెలకొంది. అజర్ మంత్రి పదవి ఉంటుందా? లేక ఊడుతుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అందుకు కారణం ఈ నెలాఖరుతో మంత్రి పదవి గడువు ముగియనున్నది. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కాకుండానే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజర్ ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అలా జరగకపోతే రాజ్యాంగంలోని ఎన్నికల నియమావళి ప్రకారం ఆరు నెలలు దాటగానే సదరు మంత్రి ‘మాజీ’ అవుతారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీల (అజర్, ప్రొఫెసర్ కోదండరాం) నియామకాన్ని సవాల్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్తో పాటు మరి కొందరు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో బుధవారం కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో అజర్ను తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య రావడంతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్తో సమావేశమై పరిస్థితిని అధిగమించడానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైలును క్లియర్ చేయాల్సిందిగా కోరినట్లు
-హాజరు కాని కౌన్సిలర్లు… వాయిదా పడిన సమావేశం– బయటపడుతున్న అంతర్గత గణితంనవతెలంగాణ-రాయికల్రాయికల్ పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఉదయం ఒక ముఖ్యమైన ప్రక్రియ జరగాల్సి ఉంది.కో-ఆప్షన్ మెంబర్ల ఎన్నిక-సాధారణంగా చూస్తే ఇది పరిపాలనా వ్యవహారం మాత్రమే. కానీ ఆ సమావేశ మందిరంలో కనిపించిన ఖాళీ కుర్చీలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి.నిర్ణయానికి వేదిక కావాల్సిన ఆ గది,చివరికి రాజకీయ మౌనానికి ప్రతీకగా మారింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం… అరగంట గడిచినా ఒక్క కౌన్సిలర్ […] The post ఖాళీ కుర్చీల సందేశం..కో-ఆప్షన్ ఎన్నికలో రాజకీయ మౌనం appeared first on Navatelangana.