🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4499 వార్తలు

ఏం సందేశమిచ్చారు…?
పాత
రాజస్థాన్ క్లాస్–మాస్ ఫర్ఫామెన్స్ .. చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్
పాత
అంగారకుడిపై జీవానికి మూలమైన సేంద్రియ అణువులు గుర్తింపు
పాత
తెలంగాణ

అంగారకుడిపై జీవానికి మూలమైన సేంద్రియ అణువులు గుర్తింపు

అంగారక గ్రహంపై జీవం ఉనికి గురించి దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో కీలక ముందడుగు వేసింది. క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి భూమధ్యరేఖకు సమీపంలో ఒకప్పుడు సరస్సుగా ఉండి ఎండిపో యిన ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్ ఈ పరిశోధన జరిపింది. ఇక్కడ ఏడు వేర్వేరు సేంద్రియ సమ్మేళనాలను రోవర్ గుర్తించగా, వాటిలో ఐదింటిని మార్స్‌పై కనుగొనడం ఇదే తొలిసారి. ఈ సేంద్రియ పదార్థాలు పురాతన జీవుల నుంచి వచ్చాయా?ఉల్కల ద్వారా గ్రహానికి చేరాయా? లేక భౌగోళిక ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఒకవేళ అంగారకుడిపై జీవం ఉండి ఉంటే, దానికి సంబంధించిన రసాయన ఆనవాళ్లు ఇప్పటికీ భద్రంగా ఉండే అవకాశం ఉందని ఈ ఆవిష్కరణ సూచిస్తోంది. ఈ ప్రయోగానికి నేతృత్వం వహిం చిన ఫ్లోరిడా యూనివర్సిటీ ఆస్ట్రోజియాలజిస్ట్ ప్రొఫెసర్ అమీ విలియమ్స్ మాట్లాడుతూ ‘మేము 350 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై భద్రపరచబడిన సేంద్రియ పదార్థాలను చూస్తున్నామని భావిస్తున్నాం. అయితే ఇది జీవానికి సంబంధించినదేనా? అన్నది ప్రస్తుత సమాచారంతో చెప్పలేం‘ అని వివరించారు. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట మార్స్‌పై జీవం వృద్ధి చ

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కియా కారు, బైక్ ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్
పాత
పుస్త‌కాలు దారి దీపాలు
పాత
తెలంగాణ

పుస్త‌కాలు దారి దీపాలు

పుస్తకం మిమ్మల్ని స్వేచ్ఛా లోకంలో విహరించేలా చేస్తుంది. సజీవ పాత్రలుఉండే ప్రపంచానికి తీసుకెళుతుంది. వాటి గురించి చదివేటప్పుడు మీ మెదడు ఆ సమాచారాన్ని విజువల్స్‌ రూపంలో ప్రాసెస్‌ చేసుకుంటుంది. దీంతో మీరు చదివే టాపిక్‌లో లోతుగా లీనమయ్యేలా చేస్తుంది. అందుకే పుస్తక ప్రేమికులకు చదవడం ఏనాడూ బోర్‌ కొట్టదు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నేడు ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ సందర్భంగా పుస్తకంతో తమ అనుభవాలను కొందరు రచయిత్రులు మనతో ఇలా పంచుకున్నారు… పుస్తకం […] The post పుస్త‌కాలు దారి దీపాలు appeared first on Navatelangana.

కాళేశ్వరం పై సిబిఐ విచారణకు సిద్ధమా?: మంత్రి పొంగులేటి
పాత
తెలంగాణ

కాళేశ్వరం పై సిబిఐ విచారణకు సిద్ధమా?: మంత్రి పొంగులేటి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని పదే పదే చెబుతున్న బిఆర్‌ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే, వెంటనే స్వయంగా సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవార ఓ ప్రకటనలో సవాల్ విసిరారు. కాళేశ్వరం అంశంపై హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తీవ్రంగా విమర్శించారు. నిజంగా ఎలాంటి అవకతవకలు జరగలేదంటే, స్వతంత్ర సంస్థ ద్వారా విచారణకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే బిఆర్‌ఎస్ నాయకత్వం వెనుకడుగు వేస్తోందని, భారీ ఆర్థిక దోపిడీ, కమీషన్ల వ్యవహారం, కాంట్రాక్టుల లోపాలు అన్నీ బహిర్గతమవుతాయనే భయమే వారిని వెంటాడుతోందని మంత్రి ఆరోపించారు. ఇదే భయంతో బిజెపితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని, విచారణను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతపై ఇప్పటికే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాల

హైదరాబాద్లో NCB భారీ ఆపరేషన్.. రెండు డ్రమ్ముల డ్రగ్స్ సీజ్.. రూ.17.40 కోట్ల సరుకు !
పాత
కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల దాడులు
పాత
తెలంగాణ

కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల దాడులు

కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. 10 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం ఆకస్మికదాడి చేశారు. అనంతరం ఆసుపత్రిలోని డ్యూటీ చార్ట్ ప్రకారం ఉండాల్సిన వైద్యులు విధుల్లో ఉన్నారా లేదా అని బయోమెట్రిక్ యంత్రాలు, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొందరు వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం ప్రభుత్వ విధులకు డుమ్మా కొడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశామన్నారు. ఆసుపత్రిలో ఉచితంగా జరగాల్సిన ల్యాబ్ పరీక్షల ప్రక్రియ పరిశీలన చేయడం జరిగిందన్నారు. రోగులను బయట ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తున్నారా అనే కోణంలో రికార్డుల తనిఖీ, ఫార్మసీలో స్టాక్ రిజిస్టర్ పరిశీలన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత మందులు రోగులకు అందుతున్నాయా లేదా బయట మెడికల్ షాపులకు రాసిస్తున్నారా అన్నది తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారం నాణ్యతను, క్యాంటీన్ నిర్వహణ పరిశీలన, వార్డులలో పారిశుధ్యలోపాల గుర్తిచడం జరిగిందన్నారు. తనిఖీల్లో భాగంగా కొన్ని కీలక రికార్డులను, రిజిస్టర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

ఎలక్షన్ ముందు హామీలు... గెలిచాక ఎగనామాలు: హరీశ్‌రావు
పాత
తెలంగాణ

ఎలక్షన్ ముందు హామీలు... గెలిచాక ఎగనామాలు: హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి గెలిచాక ఎగనామాలు పెట్టారని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి వెళ్లి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని మరి ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వారికి వచ్చే బెనిఫిట్స్ అన్ని అందివాలని కోర్టు తీర్పు ఇచ్చిన రేవంత్ రెడ్డి కోర్టు తీర్పును బేకారత్ చేశారని మండిపడ్డారు. తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లను పెట్టి బస్సులు నడపడం వల్ల ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి సమ్

పెళ్లయిపోయింది.. అప్పగింతల వీడియో తీస్తుండగా ఘోరం.. పాపం కెమెరామెన్ !
పాత
పెవిలియన్కి క్యూ కట్టిన లక్నో బ్యాటర్లు.. 11 పరుగులకే 3 వికెట్లు లాస్
పాత
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిలిచిపోయిన పల్నాడు ఎక్స్ప్రెస్... ప్రయాణికుల పడిగాపులు..
పాత
ఆద్యంతం నవ్వించే ‘జెట్లీ’
పాత
తెలంగాణ

ఆద్యంతం నవ్వించే ‘జెట్లీ’

హాస్యనటుడు సత్య హీరోగా, దర్శకుడు రితేష్‌ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్‌లీ’. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పిస్తున్నారు.మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.హీరో సత్య మాట్లాడుతూ,’రితేష్‌ కథ చెప్పగానే చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్‌ చాలా నచ్చి సినిమా చేశాను. ఇందులో క్యారెక్టర్‌ హీరోలా కాకుండా కామెడీ స్పేస్‌లోనే ఉంటుంది. యాక్షన్‌ కామికల్‌గానే ఉంటుంది. […] The post ఆద్యంతం నవ్వించే ‘జెట్లీ’ appeared first on Navatelangana.

‘గేదెల రాజు’ హిట్‌ ఖాయం
పాత
బైక్‌ను ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి
పాత
తెలంగాణ

బైక్‌ను ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి

కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన విషాధ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చింతగూడెంకు చెందిన మారెడ్డి బాల్‌రెడ్డి (70) , భార్య అలివేలమ్మ, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె, వెంకటమ్మ, మాలె మంజుల కారులో నల్లగొండలో తమ సమీప బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరై తిరిగి స్వస్థలానికి వెళుతున్న క్రమంలో కనగల్ మండలానికి చెందిన మధుబాబు, నర్సింగ్ ధనుంజయ బైక్‌పై పాల్వాయి ధాన్యం మిల్లు నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు తీసుకుని తిరిగి దేవరకొండ వైపు వెళుతుండగా చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద కారు బలంగా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సింగ్ మధుబాబు (38), ధనుంజయగౌడ్ (45) కారులో ప్రయాణిస్తున్న మారెడ్డి బాల్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు కారులోని మిగతా వారికి గాయాలు కాగా 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీల

నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
పాత
తెలంగాణ

నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు త్రిపురనేని చిట్టిబాబు (71) ఇకలేరు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసు పత్రికి తరలించారు. మంగళవారం గుండెపోటుతో చిట్టిబాబు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.ప్రముఖ రచయిత త్రిపురనేని మహారధి కుమారుడే చిట్టిబాబు. 1955లో ఆయన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. 17 ఏళ్ళ వయసులోనే ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఆయన దాదాపు 47 చిత్రాలకు సహ […] The post నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత appeared first on Navatelangana.

లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యం 160
పాత
రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
పాత
లక్నో బౌలర్ల ధాటికి రాజస్థాన్ విలవిల.. LSG టార్గెట్ ఎంతంటే!
పాత
శుక్రవారం లోపు గుడ్ న్యూస్.. ట్రంప్ కీలక ప్రకటన
పాత
వారంలో పెళ్లి అంతలోనే బావిలో శవమై తేలిన యువతి
పాత
తెలంగాణ

వారంలో పెళ్లి అంతలోనే బావిలో శవమై తేలిన యువతి

వారం రోజుల్లో తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి....కోటి అశాలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువతి సమీప వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. కళ్యాణ వేడుకల నిర్వహణలో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా నెలకొన్న ఈ విషాదం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న, వినోదలకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కూతురు పెళ్లి అయింది. భూక్య సంగీత (19)ను తాను ప్రేమించిన మరిపెడ శివారు కొత్త తండాకు చెందిన అజ్మీర అరవింద్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాను వివాహం చేసుకోనున్న అరవింద్‌తో కలిసి సంగీత ఇటుగలగడ్డ తండాలోని వ్యవసాయ బావి వద్ద కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సంగీత ఇంటికి రాకవపోటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తండావాసులు బావిలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్సై కోటేశ్వర రావు బావిలో ఉన్న మృతదేహం వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస

తిరుమలలో పీఏసీ-1, ఆస్థాన మండపాల ఆదునీకారణ.. భక్తులకు మెరుగైన సదుపాయాలు..
పాత
ఖర్గేకు ఇసి నోటీసు
పాత
తెలంగాణ

ఖర్గేకు ఇసి నోటీసు

ప్రధాని మోడీని ఉగ్రవాదిగా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం బుధవారం తీవ్రస్థాయి నోటిసు వెలువరించింది. తమిళనాడు , పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. చెన్నైలో విలేకరుల సమావేశం దశలో ఖర్గే ప్రధాని మోడీ టెర్రరిస్టు వంటి వారని విమర్శించారు. ప్రతిపక్షాల అణచివేతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార యంత్రాంగాలను వాడుకొంటోందని, ఈ క్రమంలో ఆయన టెర్రరిస్టు వంటి వారేనని ఖర్గే తెలిపారు. దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఖర్గేకు నోటిసు ఇస్తూ దీనికి 24 గంటల్లో సమాదానం ఇచ్చుకోవల్సి ఉందని హెచ్చరించింది. ప్రజలను, పార్టీలను తన చర్యలతో భయభ్రాంతులను చేస్తున్న వ్యక్తి టెర్రరిస్టు కాక మరెవ్వరు అని ఖర్గే ఆ తరువాత వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈసికి ఆయన ఎటువంటి జవాబు ఇస్తారనేది చూడాల్సి ఉంది.

Advertisement
Sponsored by ATA – American Telugu Association