23301 వార్తలు






నవతెలంగాణ-హైదరాబాద్: సీజేపీ నిరసనలకు సంఘీభావంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆందోళన చేపట్టింది. శుక్రవారం చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల ప్రాంగణంలో కేంద్ర పరిపాలనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పరీక్షల భద్రతా సమస్యలపై, విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర సర్కార్ సరైన రీతిలో వ్యవహరించాలని సూచించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని ఈ వారం ప్రారంభంలో సోమవారం, తమిళనాడు […] The post సీజేపీ నిరసనలకు సంఘీభావంగా SFI ఆందోళన appeared first on Navatelangana.



జపాన్: ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీల్లో క్రికెట్ కూడా ఉండటంతో టి-20 ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్నాయి.ఈ ఈ రెండు జట్లూ నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో భారత్తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక టాప్ సీడ్ జట్లుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు క్వార్టర్ ఫైనల్స్ బెర్తుల కోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. గ్రూప్-ఎ అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్, గ్రూప్-బిలో హాంకాంగ్ చైనా, మలేసియా, ఒమన్ ఉన్నాయి. ప్రతి గ్రూప్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టాప్-8కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 28న భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 1న సెమీ ఫైనల్స్, 3న కాంస్య పతాక మ్యాచ్.. అదే రోజు గోల్డ్ మెడల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో ఎనిమిది జట్లకు డైరెక్ట్ నాకౌట్ విధానంలో సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు మ్యాచ్లు నిర్వహిస్తారు. క్వార్టర్ ఫైనల్స్

నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థులు జంతర్మంతర్ నిరసనలో పాల్గొనవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఢిల్లీ యూనివర్సిటీ (DU), JNU హెచ్చరికలు జారీ చేయడంపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆయా విద్యాసంస్థల ట్వీట్స్పై స్పందించిన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యహక్కులను వినియోగించు కుంటున్న విద్యార్థులను బెదిరించడానికి ఎంత ధైర్యం? అంటూ ఘాటుగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు […] The post యూనివర్సిటీలపై రాహుల్ గాంధీ ఫైర్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రతినిధులతో చర్చలు సాగించింది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు కొనసాగాయి. కాన్ట్సిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ చర్చల్లో డిమాండ్ల నోట్ కేంద్ర మంత్రులకు సీజేపీ నేతలు సమర్పించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. […] The post సీజేపీ ప్రతినిధులతో కేంద్రమంత్రులు చర్చలు appeared first on Navatelangana.









ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్ - 2026లోని తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియాల మధ్య క్రీడా భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఈ డిసెంబర్లో ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మరో సిరీస్ కూడా భారత్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్లోని మ్యాచ్లను భారత్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్ బర్గ్ వెల్లడించారు. ‘‘అన్ని ఆప్షన్లను పరిశీలించడానికి మేం సిద్ధంగా ఉండాలి. ఇసిబితోనే కాకుండా బిసిసిఐతో కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్లో కొన్ని ప్రాంతాల్లో మరింత క్రికెట్ వినోదాన్ని పంచే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి (భారత్లో యాషెస్) మేం ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికా సిద్ధం చేయనప్పటికీ.. భవిష్యత్తులో కచ్చితంగా పరిశీలించే అవకాశముంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్ట్ క్రికెట్కు ఎంతో ఆదరణ ఉంది. దీనిని మరింత బలోపేతం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అని టాడ్ గ్రీన్ బర్గ్ తెలిపారు.



నవతెలంగాణ – హైదరాబాద్ :నీట్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, యువకులు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని నల్లచొక్కా ధరించి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది […] The post విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి: కేటీఆర్ appeared first on Navatelangana.