23285 వార్తలు

హైదరాబాద్: గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని విద్యార్థుల జీవితంతో ఆటలాడుతోందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గ్లోబరీనా సంస్థ ఆనాడు విద్యార్థుల చావుకు కారణమైందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా సంస్థ రిపోర్టును బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదు? అని 28 మంది విద్యార్థులు ప్రాణాలు పోవడానికి గ్లోబరీనా సంస్థ కారణం కాదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గ్లోబరీనాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని, నీట్ పేపర్ లీక్ అయిన నెలన్నరకు కెటిఆర్ నిద్రలేచారని విమర్శించారు. బిఆర్ఎస్ డ్రామాలో విద్యార్థులు భాగం కావొద్దు అని మహేష్ గౌడ్ సూచించారు.





పాకిస్థాన్తో స్వదేశంలో జరిగే రెండు టెస్ట్ల సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోస్టన్ ఛేజ్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. జోమెల్ వారియోకన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల బిషప్ మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఏకంగా 91 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో అతడికి తొలిసారి విండీస్ జట్టులోకి పిలుపు వచ్చింది. మరోవైపు న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో తొడకండరాల గాయానికి గురైన ఓపెనర్ జాన్ కాంప్బెల్ పాక్తో టెస్ట్ సిరీస్కి దూరమయ్యాడు. అతడి స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కిర్క్ మెకెంజీకి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఇక ఈ సిరీస్కి వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఇది వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్ అనే చెప్పుకోవాలి. జోసెఫ్ వంటి ఫాస్ట్ బౌలర్ లేకపోవడంతో పాకిస్థాన్ బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్ జూలై 25 నుంచి 29 వర

ఢిల్లీ: బళ్లారి- గుంతకల్లు మధ్య అదనపు లైన్లతో ఎపి, కర్ణాటకకు ఉపయోగం అని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ లైన్ లో వేదవతి నదిపై పెద్ద వంతెన నిర్మిస్తామని అన్నారు. భవ్య రసాయన్ పథకానికి కేబినెట్ ఆమోదించింది. కేంద్రమంత్రి వర్గం నిర్ణయాలు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బళ్లారి- గుంతకల్లు లైన్లు మూడేళ్లలో పూర్తి చేస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు. బళ్లారి- గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్లు, రూ. 1,264 కోట్లతో మూడు, నాలుగో రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తామని, బళ్లారి- గుంతకల్లు మధ్య 46 కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏటా అదనంగా కోటీ 60 లక్షల టన్నుల సరకు రవాణాకు అవకాశం ఉంటుందని, బళ్లారి- గుంతకల్లు లైన్ లో 52 స్మాల్, 7 మేజర్, ఒక మెగా బ్రిడ్జి నిర్మిస్తాం అని చెప్పా రు. మూడు డెడికేటెట్ కెమికల్ పార్కులు ఏర్పాటు చేస్తామని, ఒక్కో కెమికల్ పార్కుకు రూ. వెయ్య కోట్లు కేటాయిస్తామని అన్నారు. రసాయనాల పరిశ్రమల బలోపేతానికి లక్ష్యంగా భవ్య రసాయన్ స్కీమ్ అని రసాయనాల తయారీలో ఆత్మ నిర్భరత సాధనే లక్ష్యంగా ఈ స్కీమ్ అని ఒక్కో పార్కున







నవతెలంగాణ-హైదరాబాద్: సీజేపీ నిరసనలకు సంఘీభావంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆందోళన చేపట్టింది. శుక్రవారం చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల ప్రాంగణంలో కేంద్ర పరిపాలనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పరీక్షల భద్రతా సమస్యలపై, విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర సర్కార్ సరైన రీతిలో వ్యవహరించాలని సూచించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని ఈ వారం ప్రారంభంలో సోమవారం, తమిళనాడు […] The post సీజేపీ నిరసనలకు సంఘీభావంగా SFI ఆందోళన appeared first on Navatelangana.



జపాన్: ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీల్లో క్రికెట్ కూడా ఉండటంతో టి-20 ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్నాయి.ఈ ఈ రెండు జట్లూ నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో భారత్తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక టాప్ సీడ్ జట్లుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు క్వార్టర్ ఫైనల్స్ బెర్తుల కోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. గ్రూప్-ఎ అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్, గ్రూప్-బిలో హాంకాంగ్ చైనా, మలేసియా, ఒమన్ ఉన్నాయి. ప్రతి గ్రూప్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టాప్-8కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 28న భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 1న సెమీ ఫైనల్స్, 3న కాంస్య పతాక మ్యాచ్.. అదే రోజు గోల్డ్ మెడల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో ఎనిమిది జట్లకు డైరెక్ట్ నాకౌట్ విధానంలో సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు మ్యాచ్లు నిర్వహిస్తారు. క్వార్టర్ ఫైనల్స్

నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థులు జంతర్మంతర్ నిరసనలో పాల్గొనవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఢిల్లీ యూనివర్సిటీ (DU), JNU హెచ్చరికలు జారీ చేయడంపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆయా విద్యాసంస్థల ట్వీట్స్పై స్పందించిన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యహక్కులను వినియోగించు కుంటున్న విద్యార్థులను బెదిరించడానికి ఎంత ధైర్యం? అంటూ ఘాటుగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు […] The post యూనివర్సిటీలపై రాహుల్ గాంధీ ఫైర్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రతినిధులతో చర్చలు సాగించింది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు కొనసాగాయి. కాన్ట్సిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ చర్చల్లో డిమాండ్ల నోట్ కేంద్ర మంత్రులకు సీజేపీ నేతలు సమర్పించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. […] The post సీజేపీ ప్రతినిధులతో కేంద్రమంత్రులు చర్చలు appeared first on Navatelangana.



