23305 వార్తలు



నవతెలంగాణ – హైదరాబాద్ :నీట్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, యువకులు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని నల్లచొక్కా ధరించి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది […] The post విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి: కేటీఆర్ appeared first on Navatelangana.

అమరావతి: పిల్లలను పెంచే బాధ్యత తల్లిదండ్రులదని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇద్దరు బిడ్డలను సమానంగా చూసుకోవాలని అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో చంద్రబాబు పర్యటించారు. మెగా పిటిఎంకు సిఎం, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని తెలియజేశారు. లోకేష్ విద్యా శాఖను ఏరికోరి తీసుకున్నారని, విద్యాశాఖలో విజయాలను చూసి తానెంతో గర్వపడుతున్నానని చంద్రబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎపిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, అయితే రెండేళ్ల నుంచి పరిస్థితి మారిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని అన్నారు. చేపలు ఇవ్వడం కాదని..చేపలు పట్టడం నేర్పాలని..సంక్షేమ కార్యక్రమాలు అవసరం..అలాగే అభివృద్ధి జరగాలని అధికారులకు సూచించారు. అప్పులు తీసుకువచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.



నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో పేపర్ లీక్పై చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పేపర్లీక్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు వీలుగా బిల్లు ముసాయిదా, ఫాస్ట్ట్రాక్ కోర్టులు, కఠినశిక్షల నిబంధనల ముసాయిదా పైనా చర్చించనున్నారు. క్యాబినెట్ సహచరుల సూచనల మేరకు ముసాయిదా బిల్లుకు తుదిరూపం ఇవ్వనున్నారు. వీలైనంత త్వరగా బిల్లు ఆమోదానికి ప్రయత్నిస్తామని, వచ్చే వారమే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధాని మోడీ తెలిపారు. సీజేపీ నాయకులతోను కేంద్రం చర్చలు […] The post పేపర్ లీక్పై చర్చకు కేంద్ర మంత్రివర్గం సమావేశం appeared first on Navatelangana.




నవతెలంగాణ – హైదరాబాద్ : రేషన్ కార్డులో పేరు ఉండి, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న గ్రామీణ యువతకు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ శుభవార్త తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళలకు బ్యూటీ పార్లర్, టైలరింగ్ కోర్సుల్లో 30 రోజుల ఉచిత శిక్షణ, వసతి, భోజనం, శిక్షణ సామగ్రి అందించనుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్తో పాటు స్వయం ఉపాధి కోసం ముద్ర లోన్ సదుపాయం కూడా […] The post రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్న్యూస్.. appeared first on Navatelangana.


హైదరాబాద్: యువతపై జరుగుతున్న దాడులు దారుణం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఉద్యమ పార్టీగా తమకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంని అన్నారు. ఇందిరాపార్కు దగ్గర బిఆర్ఎస్ వి నిరసనలు చేపట్టారు. నల్లచొక్కా ధరించి నిరసనలో కెటిఆర్ పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కెటిఆర్ నినాదాలు చేశారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీకతీతంగా యువత పోరాడుతున్నారని, యువతకు అండగా నిలబడేందుకే ఈ కార్యక్రమం అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం మాట్లాడాలని.. వారికి అండగా ఉండాలని నిరసన చేపడుతున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషమని, పిల్లలపై పోలీసులు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఢిల్లీ ఘటన చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయని, మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసిందని అన్నారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోడీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యమా ఉలికిపడు అని పిలుపునిచ్చారు. ఈ జనరేషన్ చావుకు భయపడే జనరేషన్ కాదని.. ఈ జనరేషన్ ఐటీ, ఇడి, సోదాలకు భయపడేవారు కాదని సూచించారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యో


నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళ నటుడు, నిర్మాత విమల్ చెక్ బౌన్స్ కేసులో చెన్నై చిన్న కేసుల పరిష్కార న్యాయస్థానం ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ‘మన్నర్ వాగైయరా’ చిత్రం నిర్మాణం కోసం ఫైనాన్షియర్ గోపి వద్ద నుంచి తీసుకున్న సుమారు రూ.4.5 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విమల్ విఫలమయ్యారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో గోపి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు విచారణ అనంతరం విమల్కు శిక్ష పడింది. అయితే, […] The post చెక్ బౌన్స్ కేసులో హీరోకు ఏడాది జైలు శిక్ష appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానంద రెడ్డి (26) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. అనంతరం మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్లో నివాసం ఉంటూ ఉద్యోగం […] The post అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలంగాణ యువకుడి మృతి.. appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : జంతర్మంతర్లో జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థులకు జారీ చేసిన సూచనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించే హక్కు యూనివర్సిటీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘సమయం వచ్చినప్పుడు మీరే జవాబు చెప్పాల్సి ఉంటుంది’’ అన్నారు. The post యూనివర్సిటీలపై రాహుల్ ఫైర్ appeared first on Navatelangana.

హరారే: టీం ఇండియా టి-20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలి విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టి-20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అర్థశతకంతో రాణించగా బౌలింగ్లో కూడా భారత్ అద్భుతంగా రాణించింది. దీంతో కెప్టెన్గా శ్రేయస్ ఫుల్ ఖుషీ అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘దీని కంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు. మా కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. ప్రణాళికలను చక్కగా అమలు పరిచరాు. కెప్టెన్గా నా మొదటి విజయం అందుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది. వైభవ్ సూర్యవంశీ నిర్భంగా ఆడాడు. అతడి ఇన్నింగ్స్ అసాధారణమైనది. గతంలో వైభవ్ ఇక్కడ ఆడాడు. ఇక్కడి పిచ్లపై అతడికి మంచి అవగాహన ఉంది. అండర్-19 ఫైనల్లో 175 పరుగులు సాధించిన అనుభవం ఉండటంతో మైదానంలోకి అడుగు పెట్టినప్పుడల్లా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ఈ మ్యాచ్లో అది స్పష్టంగా కనిపించింది. పునరాగమనం చేసిన మయాంక్ యాదవ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు .సరైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేసి ప్రత్యర్థికి పరుగుల రాబట్టే అవకాశం ఇవ్వలేదు’’ అని శ్రేయస్ అన్నాడు.

ఢిల్లీ: విద్యార్థులకు మూడు డిమాండ్లు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ ను విద్యామంత్రి పదవి నుంచి తొలగించాలని, విద్యార్థులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించే వరకు చర్చలు చేపట్టేది లేదని రాహుల్ గాంధీ సూచించారు.


