23639 వార్తలు








ఇటీవల జపాన్ ఓపెన్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన భారత షట్లర్ పివి సింధుకు చైనా ఓపెన్లో పరాజయం తప్పలేదు. ప్రిక్వార్టర్స్లో చైనాకు చెందిన చెన్ యుఫీయ్ చేతిలో 16-21, 22-20, 21-18 తేడాతో సింధు ఓటమిపాలైంది. జపాన్ ఓపెన్లో సెమీస్లో యుఫీయ్ని ఓడించి సింధు ఫైనల్స్కి చేరుకుంది. కానీ, చైనా ఓపెన్లో అదే ప్రత్యర్థి చేతిలో చిత్తైంది. దాదాపు గంటన్నర పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్లో 21-16 తేడాతో సింధునే విజయం సాధించింది. ఇక రెండో గేమ్లోనూ సింధు అదే జోరును కొనసాగించింది. కానీ, ఆఖర్లో పుంజుకున్న యుఫీయ్ 22-20 తేడాతో గెలిచి స్కోర్ను (1-1) సమం చేసింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్లోనూ తీవ్ర పోటీ తప్పలేదు. పాయింట్ల కోసం ఇరువురూ తీవ్రంగా శ్రమించారు. చివరికి 21-18 తేడాతో సింధుపై గెలిచిన యుఫీయ్ క్వార్టర్స్కు దూసుకెళ్లింది.















ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నీట్ పేపర్ లీక్ మాఫియాను వదిలే ప్రస్తక్తే లేదన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎక్స్ వేదికగా మోడీ స్పందించారు. నీట్ పేపర్ లీక్ దోషులను, యువతకు హానీ చేస్తున్న వారిని, యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే విడిచిపెట్టే ప్రసక్తే లేదని మోడీ హెచ్చరించారు. యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని, యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని తెలియజేశారు. పేపర్ లీక్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్తు విషయంలో రాజీపడేది లేదని నరేంద్ర మోడీ సూచించారు.