23638 వార్తలు

మన తెలంగాణ/మోత్కూర్: కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీక్ నిరుద్యోగం విద్యార్ధుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన లోక్ సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిఅరెస్టు చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ బాలరాజు మండల మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తు వాటి ద్వారా ప్రతిపక్ష నాయకులను వేధించడం వారికి పరిపాటిగా మారిందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంత ల విమల వెంకటేశ్వర్లు, సింగిల్విండో చైర్మన్ పేలంపూడి వెంకటేశ్వర్లు , మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్

మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎలుగు పార్వతమ్మ–యాదయ్య దంపతుల కుమారుడు సందీప్ గత నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడు సందీప్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తాను కుటుంబానికి అండగా ఉంటానని, అధైర్యపడవద్దని యాదయ్య, పార్వతమ్మలను రాజగోపాల్ రెడ్డి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు పైల్ల సోమిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, నాయకులు పర్రెపాటి యుగంధర్, తండ సత్తయ్య, నారగొని అంజయ్య, కారుపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

భువనేశ్వర్: ఒడిశాలో విషాదం చోటు చేసుకుంది. దేంకానాల్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని మహిషానపుటాలో వద్ద గురువారం తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. అయితే, అప్పటికే కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని దేంకానిల్ ఆసుపత్రికి తరలించారు. మృతులు బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్, అవినాష్ సాహు, అభిషేక్ సాహు, రాకేశ్ సాహు, రామ్ రాహులుగా గుర్తించారు. బుధవారం రాత్రి వీరు ఓ వివాహానికి హాజరై, స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ్రమాంం చోటుచేసుకుంది.


హైదరాబాద్: ఓటు ప్రక్షాళన ముఖ్యమని పార్టీ నాయకులకు గట్టిగా చెప్పానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 70 శాతం ఎస్ఐఆర్ పూర్తి..మరో 30 శాతం చేయాలని ఆదేశించానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్నచిన్న తేడాలు ఉన్నా ఓటరు సవరణ సరికాదని, తనకు రెండు ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదు ఇవ్వమనండి అని అన్నారు. తప్పుడు ఫిర్యాదు అయితే లోపల వేయిస్తానని హెచ్చరించారు. తన ఓటు బదిలీ చేయించుకున్నానని, కలెక్టర్ కు దరఖాస్తు చేసే బదిలీ చేయించుకున్నానని తెలియజేశారు. గతంలో కర్ణాటకలో కొడంగల్ ఉందని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినపుడు తెలంగాణలోకి వచ్చిందని అన్నారు. బిఎల్ వొలకు అనుసంధానంగా పార్టీ వాళ్లు ఓట్లు పోకుండా చూస్తున్నారని, ఎస్ఐఆర్ పై అవగాహనారాహిత్యం వల్లే బిఎల్ ఎలను పెట్టామని అన్నారు. బిఎల్ఎలు పరిశీలన చేసి ఓట్లు పోకుండా చేస్తారని, ఓట్లు లేకుండా ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు? ప్రక్షాళన పేరుతో ఓట్లను తొలగించే అవకాశం ఉందని, గతంలో జిహెచ్ ఎంసి పరిధిలో ఆంధ్ర ఓట్లన్ని తొలగించారని అన్నారు. కాంగ్రెస్ కోర్టుకెళితే నాటి జిహెచ్ఎంసి కమీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్




టీం ఇండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం టీం ఇండియా జంబాబ్వే పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టి-20ల్లో తలపడనుంది. తొలి మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయిత ఈ మ్యాచ్లో అభిషేక్ ఓ రికార్డు సాధించే అవకాశం ఉంది. అభిషేక్ ఈ మ్యాచ్లో 16 పరుగులు చేస్తే. టి-20ల్లో 6వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో భలుగో భారత క్రికెటర్గా మారుతాడు. అతడి కంటే ముదు కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్మాన్ గిల్ మాత్రమే ఈ ఫీట్ని సాధించారు. ప్రస్తుతం అభిషేక్ 203 మ్యాచుల్లో 199 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 53 మ్యాచులు భారత తరఫున ఆడాడు.


హైదరాబాద్: తెలంగాణలో నీట్ లో చాలా మందికి మంచి ర్యాంకులు వచ్చాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పరీక్ష రాసిన ఒక్క విద్యార్థి కూడా నీట్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టడంతో ఎలాంటి వ్యతిరేకత లేదని, పేపర్ లీక్ పై చట్టం వచ్చిందని..నిందితులకు శిక్షతో పాటు రూ. కోటి జరిమానా విధించిందని తెలియజేశారు. 2014కు ముందు పేపర్ లీక్ అయితే 420 కింద కేసు పెట్టి వదిలిపెట్టేవారని రామచందర్ రావు పేర్కొన్నారు.












ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ పై చర్చ విషయమై కాంగ్రెస్ సహా విపక్షాలతో మాట్లాడామని బిజెపి నేత కిరణ్ రిజిజు తెలిపారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ఇవాళ చర్చ జరుపుదామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్ష సభ్యుల షరతులు విధించడం మొదలు పెట్టారని, యువత భవిష్యత్తు విషయంలో రాజీపడేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పారని కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర ఏజెన్సీ పేపర్ లీక్ సహా ఎన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయ్యాయనే దానిపై చర్చిద్దామని, నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని, నీట్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దు అని కిరణ్ రిజిజు కోరారు.