24310 వార్తలు



అమరావతి: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ అంటూ వైసిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఎన్ ఎఫ్ డిబి ప్రాంతీయ కార్యాలయం అవసరం అని అన్నారు. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ పై సిఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తామని, మెరుగైన సేవల కోసమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. దీపం-2.0 లబ్ధిదారులకు నిర్ధారిత తేదీల్లో నగదు జమ అవుతుందని, పాస్ పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఏర్పాటు చేస్తామని, ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యత అధికారులదేనని చంద్రబాబు సూచించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల లాభాలను ప్రజలకు వివరించాలని, డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చంద్రబాబు పేర్కొన్నారు.





హైదరాబాద్: సూపర్స్టార్ మహేశ్ బాబు తన కుమార్తె సితారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను ప్రేమతో ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన మహేశ్ ఎంత ఎదిగినా సితార తన లిటిల్ స్టారేనంటూ ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘నువ్వు ఎంత పెద్దదానివైనా.. నాకు మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్వే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మహేశ్ చేసిన ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టారు. ‘మా జీవితాల్లో ఎంతో ఆనందం, ప్రేమను నింపిన నా అందాల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు నీ ఎదుగుదలను చూస్తుండటం నాకు దక్కిన అతి పెద్ద వరం. హ్యాపీ బర్త్ డే. ప్రేమతో..’’ అని ఆమె పేర్కొన్నారు.




హైదరాబాద్: ఏ ఒక్క ఊరిలో కాంగ్రెస్ వందశాతం రుణమాఫీ చేసినట్టు చూపెట్టాలని అడిగానని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. వందశాతం రుణమాఫీ చూపెడితే రాజీనామా చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని, షాపులో లేని యూరియా యాప్ లో దొరుకుతదా అని ప్రశ్నించారు. కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ధాన్యం బస్తాలు కూడా దొరకడం లేదని విమర్శించారు. సంచులన్నీ ఢిల్లీకి పంపుతున్నారని, 4 సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని కెటిఆర్ మండిపడ్డారు. కౌలు రైతులకు రూ. 15 వేలు ఇస్తానని మోసం చేశారని, మహిళలకు రూ.2,500 ఇస్తానని దగా చేశారని ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్ ఇవ్వలేదని, ఒక ఎకరానికి ఒక మీటింగ్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం దగ్గర నీళ్లు సముద్రం లోకి వెళ్తున్నాయని, పంప్ ఆన్ చేస్తే నిజాం సాగర్ నిండుతుందని సూచించారు. సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధమే ఆయనకు అడ్డం వస్తుందని దుయ్యబట్టారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందని, రైతులంటే రేవంత్ కు పట్టింపు లేదని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.










భారత షట్లర్ పివి సింధు ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు రాజమౌళి పోస్ట్కు సింధు ఇచ్చిన రిప్లై అందరినీ ఆకర్షిస్తూనే నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించావు. మంచి కమ్బ్యాక్ ఇచ్చావు. కంగ్రాట్స్ సింధు. నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన సింధు.. ‘‘ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ వారణాసి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ మీరు తెరకెక్కించే ఏ సినిమాలో అయినా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే.. మీ పరిచయ నటిగా మారడానికి నేను ఎంతో సంతోషిస్తాను’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పంచుకున్నారు.
