
3978 వార్తలు

జిహెచ్ఎంసీ సహకారంతో ఉప్పల్ డిస్ట్రిక్ట్ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు నల్లచెరువు డిస్టిక్ బస్టాండ్ సందర్శించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉప్పల్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో జిహెచ్ఎంసి సహకారంతో ఉప్పల్ డిస్ట్రిక్ట్ బస్టాండ్ అభివృద్ధి దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఉప్పల్ తిప్పల్ ఎన్నాళ్లీ అవస్థలు మన తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తపై ఆర్టీసీ స్పందించింది. వరంగల్ హనుమకొండ డిపో మేనేజర్ల తో పాటు ఇతర అధికారులు సోమవారం ఉదయం ఉప్పల్ డిస్ట్రిక్ట్ నల్లచెరువు బస్టాండ్ ను సందర్శించారు. సమస్యల నేపథ్యంలో బస్టాండ్లో ఉన్న లోపాలను గుర్తించి వాటి పరిష్కారానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ వరంగల్ డిపోకు చెందిన మేనేజర్లు, సంబంధిత అధికారులు ఉప్పల్ పరిధిలోని నల్లచెరువు బస్టాండ్ను సందర్శించారు. సందర్శన సందర్భంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి సదుపాయాల స్థితిగతులను అంచనా వేశారు. అధికారులు మాట్లాడుతూ... బస్టాండ్లో ప్రాథమిక సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. తొమ్మిది డిపోల నుండి నిత్యం 400 బస్సులు హైదరాబాద్

ఇపుడిపుడే అనిపిస్తుంది నాదనుకునే ఈ చోటు ఒక అనుభూతి మాత్రమేనని ఎపుడెపుడో జరిగినవి గుర్తొస్తున్నాయి కాలానికి గాలం వేసి ఎంత లాగినా శూన్య హస్తం గుండెను తడుముతోంది అప్పటికప్పుడు నిశ్శబ్దం వాకిట మనసు, గంటలతరబడి వేలాడుతుంది శబ్దాలను ఎవ్వరికీ వినబడని చిరు సవ్వడి చేస్తూ, ఎప్పటికప్పుడు నన్ను నేను దర్శించుకుంటాను అసూయ తరగ తన్నుకొస్తుంది చిలికే హోరులో ముసుగేసి మరీ ఆలోచనలను నిద్రబుచ్చుతాను నిన్నటికి నిన్న వెన్ననుకున్న తోడు మాయమై చిన్న వెలుగులోనూ వెంటగా వస్తూ నా నీడ నన్ను సముదాయించ యత్నిస్తుంటుంది ఎన్ననుకున్నా ఇప్పుడేం లాభం? ఉండీ లేని కన్ను చూపిన దారి కొస మలుపున నేనూ మరో మైలురాయిగా మిగలడం తప్ప! - గుడ్లదొన సాయి చంద్రశేఖర్

కరీంనగర్: ఓ పోలీస్ అధికారిని అన్నా అని పిలిచినందుకు సెలూన్ వర్కర్పై ఎస్ఐ దాడి చేసిన సంఘటన కరీంనగర్లో జరిగింది. త్రీటౌన్ ఎస్ఐ చందర్ సేవింగ్ కోసం సెలూన్కు వెళ్లాడు. రాము అనే బార్బర్ సదరు ఎస్ఐని కూర్చో అన్నా అని ముద్దుగా పిలిచాడు. వెంటనే ఎస్ఐ తనని అన్నా అంటావురా? అని బండ బూతులు తిట్టాడు. జాతి నుంచి మొదటు పెడితే ఇష్టారీతిన తిట్టడంతో పాటు బార్బర్పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రైనింగ్లో ఎస్ఐకి బండబూతులే నేర్పించారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక వైపు ఉన్నతాధికారులు ప్రజలను సర్ అని పిలువాలని ఆదేశాలు జారీ చేసినప్పటికి కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడంలేదని వాపోయారు. నిందితులతో కర్కశంగా ఉండాల్సిన పోలీసులు సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఉమర్! నీ కోసం నేను కవితలు రాయలేను నన్ను నీకు కథలు చెప్పనీ రూపం లోనూ,సారం లోనూ పరిణామాలు చెందే కథల్ని చూడు, మన వసంతం వెళ్ళిపోయింది వేసవి వొడిలో, నదులన్నీ మన అత్యాసకి ప్రేతాత్మలుగా మారిపోయాయి అడుగడుగునా కొత్తవి, తాజావీ అయిన స్వంత ఆస్తులను సూచించే వీధి బోర్డులు వెలిశాయి చేపలన్నీ ఎటు పోయాయో మరి? చెట్లను రక్షిద్దాం అనే పేరున్న ఫలకాలు బాగా కండ పుష్టితో బలిసి ఉన్నాయి తెల్లని వాటి కళ్ళు కడుపు నిండా తిని త్రేన్చిన సంప్తృప్తితో మెరుస్తున్నాయి తరువాత ఒక పొడవైన తాఖీదు వాటికి చదివి వినిపిస్తారెవరో అవునూ ఉమర్? చచ్చిన చేపలకి చెవులుంటాయా ఏంటి? చూడెట్లా బాహుమూలాలు గీసుకున్నట్లు వాళ్ళు చెట్లను చెక్కేసారో శుభ్రంగా తవ్వబడిన నేల కూడా రోజూ బద్దలయ్యే అగ్నిపర్వతంగా మారిపోతుంది ఇక గత వెయ్యి రోజులుగా పార్లమెంట్ నటులే లేని ఒక రంగస్థలంగా మారిపోయింది ఇక మేమంతా,ప్రశ్నించే మా నాలుకలకి కనిపించని సంకెళ్ళతో, గోదాముల్లో నిలువ చేసే ఖైదీలుగా మారిపోయాము విచిత్రంగా ఈ మే నెలలో నా కూతురు ఒక ప్రశ్న అడిగింది ప్రభుత్వాన్ని షాజహాను నడుపుతున్నాడా ఏంటమ్మా అంటూ! ఉమర్! నాకు తెలిసిన వాళ

రమణ జీవి కవిత్వం వచన కవితా రంగంలో ఒక విలక్షణమైన ముద్రను కలిగి ఉంది. తాత్వికత, అంతర్మథనమే మూలస్తంభాలుగా సాగే ఆయన రచనల్లో వాస్తవానికి, ఊహకు మధ్య సరిహద్దులు చెరిగిపోయి అధివాస్తవికత తొంగిచూస్తుం ది. సాధారణ తర్కానికి అందని చిత్రణలతో జీవితం, మరణం, కాలం పట్ల ఆయనకు ఒక ప్రత్యేక దృష్టి ఉంది. తనను తాను సగం మౌనంగా, సగం వాక్యంగా భావిం చే రమణ జీవి, సామాజిక అంశాల నుండి వ్యక్తిగత అనుభూతుల వరకు కవిత్వ వస్తువును విస్తరించారు. ఆయన పద చిత్రాల్లో మనుషులకే కాక ప్రకృతిలోని ప్రతి చిన్న జీవికి చోటు ఉంటుంది. సాధారణ విషయాలను అసాధారణ ప్రతీకలతో చెప్పడం ఆయన శైలి. ‘పూర్తవడం’ కవితలో మనిషిలోని ద్వంద్వ స్వభావాన్ని, పరిపూర్ణత కోసం సాగే అన్వేషణను ఆవిష్కరించారు. మౌనానికి, మాటకు మధ్య ఉండే సందిగ్ధతను పక్షి కలలోని నిద్రతో పోల్చడం ఇందులో విశేషం. గమ్యం కంటే పయన మే ముఖ్యమని, అసంపూర్ణతలను అంగీకరించి కలుపుకున్నప్పు డే జీవితం నిజంగా పూర్తవుతుందని ఆయ న తాత్వికార్థాన్ని పలికించారు.రమణ జీవి రాసిన ‘ఇల్లు వూడవడానికి ముందు’ కవిత దైనందిన పనుల వెను క దాగి ఉండే అతీతమైన తా త్వికతను ఆవిష్కరిస్తుంది. మరణం తర్వాత వచ్చే ఉదయా న్ని ఊహిస్తూ, శ్రమ
నవతెలంగాణ- హైదరాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. టెర్మినల్ లోపల, ప్రయాణికుల లగేజీలో బాంబులు అమర్చినట్లు వచ్చిన ఈ-మెయిల్తో CISF, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో విమానాశ్రయం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీని పూర్తిగా పరిశీలిస్తూ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. The post రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు appeared first on Navatelangana.

నేను నా సాహితీ యాత్ర : (14) స్త్రీల పట్ల పురుషుల దృక్పథంలో మార్పుకై రచనలు1948 అక్టోబర్ 24న నేను జగ్గంపేట అనే గ్రామంలో పుట్టాను. అప్పటికది తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం తాలూకాలో ఉండేది. అదే ప్రాంతంలో మరికొన్ని జగ్గంపేటలు ఉండడం వల్ల - రామానుజులు ప్రతిష్ఠించిన వైష్ణవాలయం ఉన్న చిన్న గ్రామం తాళ్లూరును కలిపి తాళ్లూరి జగ్గంపేట అనేవారు. నా తల్లిదండ్రులు శ్రీమతి బంగారమ్మ, శ్రీ పల్లా వెంకటరమణ. మా ఊరి హైస్కూల్లో పదవతరగతి చదువుతూండగానే అప్పటి పద్ధతుల ప్రకారం నాకు కె. రామమోహనరావు గారితో వివాహం జరిపించారు మా పెద్దవాళ్లు. మరో ఏడాది చదువుకుని S.S.L.C (11వ తరగతి) పాసయ్యాను. మరో పదేళ్ల తర్వాత మళ్లీ ఇంటర్మీడియేట్ నుంచి ప్రారంభించి M.A. చేసాను. మావారి ఉద్యోగరీత్యా అప్పటికి మేమున్న జగ్గంపేటలోనే ఓ చిన్న ప్రైవేటు స్కూలు నడుపుతూ దాన్లోనే టీచర్ గా పనిచేసాను. మొదట్లో చాలానే కవితలు రాసినా ప్రచురణా 8వ తరగతి చదువుతు న్నప్పు డు ఆంధ్రపత్రిక వీక్లీలో వచ్చిన ‘కాఫీ కాదు’ అనే చిన్న కథ - పెద్దయ్యాక చాన్నాళ్లకి జ్యోతి మంత్లీలో వచ్చిన ‘రిక్షా’ అనే కథ నా మొదటి కథలు. మా ఇంట్లో ఎలాంటి సాహిత్య వాతావరణం ఉండేదికాదు. బహుశా
నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీవకోన సమీపంలో ప్రారంభమైన మంటలు మొండోడికోన నుంచి తిమ్మినాయుడుకోన వరకు వ్యాపించి సుమారు 2 కిలోమీటర్ల మేర అడవి దగ్ధమైంది. ఈ ఘటనలో విలువైన వృక్షాలు, వనమూలికలు నాశనమయ్యాయి. వన్యప్రాణులు భయంతో పరుగులు తీశాయి. అటవీ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. The post తిరుమల శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలని, లేదంటే మే 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అల్టిమేటం ఇచ్చారు. ప్రస్తుతం రెంటల్ విధానంతో నష్టపోతున్నామని, మల్టీప్లెక్సుల్లో అమలు చేస్తున్నట్లే తమకూ పర్సంటేజీ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30 లోగా నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ ధరల నియంత్రణ, పన్నులు, విద్యుత్ చార్జీలపై సడలింపు ఇవ్వాలని […] The post మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత appeared first on Navatelangana.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో పెనుమాకలో టిడిపి నాయకుడు కత్తితో హల్ చల్ చేశాడు. ఉండవల్లి తెలుగుదేశం పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు ప్రదీప్ రాత్రి కత్తి తీసుకుని నరుకుతా అంటూ హల్ చల్ చేయడంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికి వాళ్లు పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. తమకు ఇప్పటివరకు ఎవరు సమాచారం ఇవ్వలేదని తాడేపల్లి పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. అబ్దుల్ అలియాస్ బండాను దుండగులు నరికి చంపారు. తాడిపత్రి పట్టణంలోని ఏటిగడ్డపాళ్యంలో పట్టపగలు నడిరోడ్డుపై అబ్దుల్ నరికి చంపారు. అబ్దుల్ ఇంటికి వెళ్తుండగా మాటువేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి పాలనలో వైసిపి కార్యకర్తలు ప్రాణ భయంతో వణికిపోతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి కార్యకర్తలు ప్రాణ భయంతో గ్రామాల్లోకి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎపిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా? భాస్కర్ రెడ్డి అనే నెటిజన్ కామెంట్లు చేశాడు.








హైదరాబాద్: నల్లగొండలో ఆర్ టిసి డ్రైవర్ పై దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. టిజి 05 యు 3219 ఆర్టీసీ బస్సు ను డ్రైవర్ టి.రామ్ కుమార్ నల్గొండ - దిల్ సుఖ్ నగర్ మధ్య నడిపిస్తున్నాడు. నల్గొండ నుండి వివిధ స్టాప్ ల వద్ద ఆగుతూ ప్రయాణికులను తీసుకొని వస్తున్న బస్సు వెనకాల బైక్ పై వస్తున్న వ్యక్తి తన భార్యను తీసుకొని వస్తు నల్గొండ ఐటి టవర్ వద్దకు రాగానే బస్సు ఎక్కించే ఉద్దేశ్యంతో బస్సును ఓవర్ టెక్ చేసి అడ్డగించాడు. అనంతరం డ్రైవర్ రామ్ కుమార్ పై దాడి చేశాడన్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసి సిబ్బంది పై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని పొన్నం హెచ్చరించారు. డ్రైవర్ రామ్ కుమార్ పై దాడి చేసిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని తెలియజేశారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని పొన్నం పేర్కొన్నారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రయివేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ప్రయివేటు ట్రావెల్ బస్సు దగ్ధం appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్ విద్యార్థి గల్లంతైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లిన యువకుడు, ప్రమాదవశాత్తు అలకనంద నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన పౌరీ గర్వాల్ జిల్లాలోని శ్రీనగర్లో నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్కు చెందిన ఆనంద్ మోహన్ (21), శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న సాయంత్రం 4 గంటల […] The post అలకనంద నదిలో తెలంగాణ విద్యార్థి గల్లంతు appeared first on Navatelangana.