
3971 వార్తలు

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కుమారుడు హీరోగా నటించిన చిత్రం ‘ఏక్ దిన్’. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో సౌత్ ఇండియన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాని ప్రత్యేక షోలో అమిర్ ఖాన్ చూశారు. ఈ సినిమా చూస్తూ అమిర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న సాయి పల్లవి అమిర్ను ఓదార్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆయనకు కన్నీళ్లు ఆగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి అమిర్ ఖానే నిర్మాత కావడం మరో విశేషం.#AamirKhan cried after watching his son Junaid Khan’s acting in #EkDin 😭😭#SaiPallavi #JunaidKhan pic.twitter.com/g5aRAiXDXG— Random Cine Mood (@RandomCineMood) April 26, 2026

హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ఎంఎల్సిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఎలు పాల్గొన్నారు. గవర్నర్ కోటాలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్లను ఎంఎల్సిలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో ముస్లింల ఓట్ల కోసమే తనకు మంత్రి పదవి ఇచ్చారనేది నిజం కాదు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి మైనార్టీల సంక్షేమం కోసం పని చేస్తోందని ప్రశంసించారు. ఎంఎల్సిగా తనని ప్రతిపాదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, మంత్రి మండలికి, పిసిసికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. మైనార్టీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని అజారుద్దీన్ హామీ ఇచ్చారు.

జగద్గిరి గుట్ట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి సాయి నగర్ లోని రెస్క్యూ హోమ్ నుంచి ఏడుగురు మహిళల పారిపోయారు. రోడ్లపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మహిళలను పోలీసులు రక్షించి రెస్క్యూ హోమ్ లో ఉంచారు. రెస్క్యూ హోమ్ నిర్వాహకుల కళ్ళు కప్పి అక్కడ నుంచి సాల్మా(ఢిల్లీ), స్వేత(తెలంగాణ), కమలమ్మ(తెలంగాణ), ప్రియాంక(తెలంగాణ), సంధ్య(ఎపి), చాందిని(పశ్చిమ బెంగాల్), బీట్రైస్(కెన్యా) అనే మహిళలు పారిపోయారు. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పారిపోయిన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్: త్యాగాల పునాదుల మీద పార్టీ బిఆర్ఎస్ ఏర్పడిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. దశాబ్దాలుగా, అన్యాయానికి గురై నెత్తురు మండిన జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా అని కొనియాడారు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండా కెటిఆర్ ఆవిష్కరించారు. సీనియర్ నేతలు పాల్గొన్నారు. జై కెసిఆర్, జై బిఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగుతుంది. కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాల్లో అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బిఆర్ఎస్ అని స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే సమస్యలకు చరమగీతం పాడవచ్చని కెటిఆర్ తెలియజేశారు. మాజీ సిఎం కెసిఆర్ 25 ఏళ్ల క్రితం జలదృశ్యంలో గులాబీ జెండా ఎత్తారని, 14 సంవత్సరాలు తెలంగాణ జాతిని పార్టీ ఐక్యం చేసిందని అన్నారు. అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బిఆర్ఎస్ అని రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు అధికార బాధ్యతలు ఇచ్చారని, రాష్ట్ర అవశ్యకతను బోధించి ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కెసిఆర్ ది అని ప్రశంసించారు. పదేళ్ల పాటు అధికారమిస్తే బాధ్యతగా భావించి రా
నవతెలంగాణ-హైదరాబాద్: ఆప్ పాలిత రాష్ట్రం పంజాబ్లో ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఏక కాలంలో విస్తృత దాడులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మది ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది.పంజాబ్ మాజీ DIG హర్చరణ్ సింగ్ భుల్లార్, ఇతరులకు సంబంధించిన కేసుల విషయంలో, PMLA చట్టం-2002 కింద చండీగఢ్, లూథియానా, పాటియాలా, నాభా, జలంధర్తో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ED తెలిపిన వివరాల ప్రకారం, బినామీ ఆస్తులను వెలికితీయడం, మనీ లాండరింగ్కు సంబంధించిన ఆధారాలను సేకరించడమే ఈ […] The post పంజాబ్లో ఈడీ సోదాలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. The post ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మైనింగ్ ఇంజినీరింగ్ విద్యార్థి వినీశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన వినీశ్ను ఓయూ సిబ్బంది గాంధీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఈ ఘటప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ఓయూలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం appeared first on Navatelangana.

సూపర్స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్.. ప్రముఖ దర్శకుడు వెంకటేశ్ మహా దర్శకత్వం లో, వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ ప్లస్ఎస్ మూ వీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ‘రావు బహదూర్’ జూన్ 5న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్లో సత్యదేవ్ రాయల్ అవతార్లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్కు అద్భుతమైన స్పందన రాగా, ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ చార్ట్బస్టర్గా నిలిచింది. కథ, దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ బాధ్యతలను స్వయంగా తీసుకున్న వెంకటేష్ మహా యూనివర్సల్ ఎమోషన్స్ను కలిపిన కథను అద్భుతంగా తెరకెక్కించారు.

హైదరాబాద్: బిసి గురుకుల విద్యాసంస్థల్లో చదివి, ప్రతిభతో వివిధ ఉద్యోగాలను సాధించిన విద్యార్థులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సోమవారం తన ఫేస్ బుక్ ఖాతాలో పొన్నం పోస్టు చేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణకు ఇది ప్రతిఫలం అని, గ్రామీణ, పేద కుటుంబాల నుండి వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం అని ప్రశంసించారు. విద్యార్థులు సాధించిన విజయాలు మీ కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం బిసి సమాజానికి గర్వకారణమన్నారు. ఈ విజయాలు మరెంతో మంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని, ఇంకా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం బిసి విద్యార్థుల విద్య, ఉపాధి, సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, గురుకుల వ్యవస్థ ద్వారా నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు మార్గదర్శకత్వం అందిస్తున్నామని పొన్నం తెలియజేశారు. ఇలాంటి విజయాలను విద్యార్థులకు మరింతగా చేరువ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల అందరి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరోసారి పొన్నం అభినందనలు తెలిపారు.
నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీలో ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల చేరికను రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హర్బజన్ సింగ్, విక్రమ్ సాహ్నే, రాజేందర్ గుప్తా, సందీప్ పాఠక్ బీజేపీ ఎంపీలుగా పరిగణిస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం అనూహ్యంగా పుంజుకుంది. 106 నుంచి 113కు చేరుకుంది. అదే సమయంలో ఆప్ ఎంపీల సంఖ్య 3కు పడిపోయింది. గత శుక్రవారం ఆప్ […] The post బీజేపీలో ఏడుగురు ఆప్ ఎంపీల చేరిక..రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న విచారణకు తాను వ్యక్తిగతంగా గానీ, తన లాయర్ ద్వారా గానీ హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం విచారణ జరుపుతున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మకు ఆయన నేరుగా లేఖ రాశారు. “జస్టిస్ స్వర్ణకాంత గారి నుంచి నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం […] The post కోర్టు విచారణకు హాజరుకాను: కేజ్రీవాల్ appeared first on Navatelangana.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన వినీశ్ ఓయూలో మైనింగ్ చదువుతున్నాడు. రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన అతడిని గాంధీ ఆస్పత్రికి తరిలించారు. ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో టమాటా ధరలు కిలో రూ. 40 నుండి రూ. 60కి పెరిగాయి. తక్కువ సాగు మరియు అధిక డిమాండ్ కారణంగా ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుంది. ఈ పరిస్థితిలో టమాటా రైతుల జేబులు నిండుతాయా లేక దళారులకే లాభం దక్కుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వినియోగదారులు మాత్రం ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారు. The post భారీగా పెరిగిన టమాటా ధరలు appeared first on Navatelangana.

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక గీతంలో హీరోయిన్ రాశి కన్నా కనిపించనుందని టాక్. గతంలో రాశి, వరుణ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్లో వరుణ్ తేజ్ ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ కొరియన్ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.

కామారెడ్డి: మాంసం కూర వండలేదని భార్యతో భర్త గొడవకు దిగాడు. దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కోడవలి తీసుకొని భర్తపైకి భార్య విసరడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గోసంగి కాలనీలో కోదండం శివాజీ(28), లక్ష్మీ(23) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శివాజీ పాతసామాన్ల వ్యాపారం చేస్తుండగా లక్ష్మీ ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన తరువాత భార్య మాంసం కూర వండవా? అని భర్త అడిగాడు. ఆమె వండలేదని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోడవలి తీసుకొని భర్తపైకి విసిరింది. కోడవలి భర్త మెడకు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మెడ నరం తెగిపోవడంతోనే అతడు అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. క్షణికావేశంలో భర్తను పొట్టనపెట్టుకున్నానని, ఇప్పుడు తాను జైలుకు వెళ్తే తన కూతుళ్లను ఎవరు చూసుకుంటారని ఆమె కన్నీంటి పర్యంతమైంది. శివాజీ సోద
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది. అలాగే డిజిటల్ లావాదేవీల్లో భాగంగా ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ 99 శాతానికి చేరుకున్నాయని స్పష్టం చేసింది. ఓటీపీ ఆధారిత డెలివరీలు 94.5 శాతానికి చేరినట్లు పేర్కొంది. అంతేకాక పీఎన్జీ కనెక్షన్ల సంఖ్య […] The post మే 1 నుంచి LPG బుకింగ్స్ లో భారీ మార్పులు..? appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో తండ్రీకుమార్తె చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఖమ్మం(D) నేలకొండపల్లి(M) కోనాయిగూడేనికి చెందిన కణతాల రాము(30) భార్య రమ్య(28), దివ్యశ్రీ (5), రితిక (3) ఇద్దరు కుమార్తెలతో కలిసి ఖమ్మం సిటీలోని మామిళ్లగూడెంలో నివసిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం అతను ఉండే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో సమీపంలోని వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా రాము, అతని పెద్దకుమార్తె దివ్యశ్రీ చనిపోయి ఉన్నారు. […] The post ఖమ్మంలో విషాదం..అనుమానాస్పద స్థితిలో తండ్రీకుమార్తె మృతి appeared first on Navatelangana.

జిహెచ్ఎంసీ సహకారంతో ఉప్పల్ డిస్ట్రిక్ట్ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు నల్లచెరువు డిస్టిక్ బస్టాండ్ సందర్శించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉప్పల్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో జిహెచ్ఎంసి సహకారంతో ఉప్పల్ డిస్ట్రిక్ట్ బస్టాండ్ అభివృద్ధి దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఉప్పల్ తిప్పల్ ఎన్నాళ్లీ అవస్థలు మన తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తపై ఆర్టీసీ స్పందించింది. వరంగల్ హనుమకొండ డిపో మేనేజర్ల తో పాటు ఇతర అధికారులు సోమవారం ఉదయం ఉప్పల్ డిస్ట్రిక్ట్ నల్లచెరువు బస్టాండ్ ను సందర్శించారు. సమస్యల నేపథ్యంలో బస్టాండ్లో ఉన్న లోపాలను గుర్తించి వాటి పరిష్కారానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ వరంగల్ డిపోకు చెందిన మేనేజర్లు, సంబంధిత అధికారులు ఉప్పల్ పరిధిలోని నల్లచెరువు బస్టాండ్ను సందర్శించారు. సందర్శన సందర్భంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి సదుపాయాల స్థితిగతులను అంచనా వేశారు. అధికారులు మాట్లాడుతూ... బస్టాండ్లో ప్రాథమిక సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. తొమ్మిది డిపోల నుండి నిత్యం 400 బస్సులు హైదరాబాద్

ఇపుడిపుడే అనిపిస్తుంది నాదనుకునే ఈ చోటు ఒక అనుభూతి మాత్రమేనని ఎపుడెపుడో జరిగినవి గుర్తొస్తున్నాయి కాలానికి గాలం వేసి ఎంత లాగినా శూన్య హస్తం గుండెను తడుముతోంది అప్పటికప్పుడు నిశ్శబ్దం వాకిట మనసు, గంటలతరబడి వేలాడుతుంది శబ్దాలను ఎవ్వరికీ వినబడని చిరు సవ్వడి చేస్తూ, ఎప్పటికప్పుడు నన్ను నేను దర్శించుకుంటాను అసూయ తరగ తన్నుకొస్తుంది చిలికే హోరులో ముసుగేసి మరీ ఆలోచనలను నిద్రబుచ్చుతాను నిన్నటికి నిన్న వెన్ననుకున్న తోడు మాయమై చిన్న వెలుగులోనూ వెంటగా వస్తూ నా నీడ నన్ను సముదాయించ యత్నిస్తుంటుంది ఎన్ననుకున్నా ఇప్పుడేం లాభం? ఉండీ లేని కన్ను చూపిన దారి కొస మలుపున నేనూ మరో మైలురాయిగా మిగలడం తప్ప! - గుడ్లదొన సాయి చంద్రశేఖర్

కరీంనగర్: ఓ పోలీస్ అధికారిని అన్నా అని పిలిచినందుకు సెలూన్ వర్కర్పై ఎస్ఐ దాడి చేసిన సంఘటన కరీంనగర్లో జరిగింది. త్రీటౌన్ ఎస్ఐ చందర్ సేవింగ్ కోసం సెలూన్కు వెళ్లాడు. రాము అనే బార్బర్ సదరు ఎస్ఐని కూర్చో అన్నా అని ముద్దుగా పిలిచాడు. వెంటనే ఎస్ఐ తనని అన్నా అంటావురా? అని బండ బూతులు తిట్టాడు. జాతి నుంచి మొదటు పెడితే ఇష్టారీతిన తిట్టడంతో పాటు బార్బర్పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రైనింగ్లో ఎస్ఐకి బండబూతులే నేర్పించారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక వైపు ఉన్నతాధికారులు ప్రజలను సర్ అని పిలువాలని ఆదేశాలు జారీ చేసినప్పటికి కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడంలేదని వాపోయారు. నిందితులతో కర్కశంగా ఉండాల్సిన పోలీసులు సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఉమర్! నీ కోసం నేను కవితలు రాయలేను నన్ను నీకు కథలు చెప్పనీ రూపం లోనూ,సారం లోనూ పరిణామాలు చెందే కథల్ని చూడు, మన వసంతం వెళ్ళిపోయింది వేసవి వొడిలో, నదులన్నీ మన అత్యాసకి ప్రేతాత్మలుగా మారిపోయాయి అడుగడుగునా కొత్తవి, తాజావీ అయిన స్వంత ఆస్తులను సూచించే వీధి బోర్డులు వెలిశాయి చేపలన్నీ ఎటు పోయాయో మరి? చెట్లను రక్షిద్దాం అనే పేరున్న ఫలకాలు బాగా కండ పుష్టితో బలిసి ఉన్నాయి తెల్లని వాటి కళ్ళు కడుపు నిండా తిని త్రేన్చిన సంప్తృప్తితో మెరుస్తున్నాయి తరువాత ఒక పొడవైన తాఖీదు వాటికి చదివి వినిపిస్తారెవరో అవునూ ఉమర్? చచ్చిన చేపలకి చెవులుంటాయా ఏంటి? చూడెట్లా బాహుమూలాలు గీసుకున్నట్లు వాళ్ళు చెట్లను చెక్కేసారో శుభ్రంగా తవ్వబడిన నేల కూడా రోజూ బద్దలయ్యే అగ్నిపర్వతంగా మారిపోతుంది ఇక గత వెయ్యి రోజులుగా పార్లమెంట్ నటులే లేని ఒక రంగస్థలంగా మారిపోయింది ఇక మేమంతా,ప్రశ్నించే మా నాలుకలకి కనిపించని సంకెళ్ళతో, గోదాముల్లో నిలువ చేసే ఖైదీలుగా మారిపోయాము విచిత్రంగా ఈ మే నెలలో నా కూతురు ఒక ప్రశ్న అడిగింది ప్రభుత్వాన్ని షాజహాను నడుపుతున్నాడా ఏంటమ్మా అంటూ! ఉమర్! నాకు తెలిసిన వాళ

రమణ జీవి కవిత్వం వచన కవితా రంగంలో ఒక విలక్షణమైన ముద్రను కలిగి ఉంది. తాత్వికత, అంతర్మథనమే మూలస్తంభాలుగా సాగే ఆయన రచనల్లో వాస్తవానికి, ఊహకు మధ్య సరిహద్దులు చెరిగిపోయి అధివాస్తవికత తొంగిచూస్తుం ది. సాధారణ తర్కానికి అందని చిత్రణలతో జీవితం, మరణం, కాలం పట్ల ఆయనకు ఒక ప్రత్యేక దృష్టి ఉంది. తనను తాను సగం మౌనంగా, సగం వాక్యంగా భావిం చే రమణ జీవి, సామాజిక అంశాల నుండి వ్యక్తిగత అనుభూతుల వరకు కవిత్వ వస్తువును విస్తరించారు. ఆయన పద చిత్రాల్లో మనుషులకే కాక ప్రకృతిలోని ప్రతి చిన్న జీవికి చోటు ఉంటుంది. సాధారణ విషయాలను అసాధారణ ప్రతీకలతో చెప్పడం ఆయన శైలి. ‘పూర్తవడం’ కవితలో మనిషిలోని ద్వంద్వ స్వభావాన్ని, పరిపూర్ణత కోసం సాగే అన్వేషణను ఆవిష్కరించారు. మౌనానికి, మాటకు మధ్య ఉండే సందిగ్ధతను పక్షి కలలోని నిద్రతో పోల్చడం ఇందులో విశేషం. గమ్యం కంటే పయన మే ముఖ్యమని, అసంపూర్ణతలను అంగీకరించి కలుపుకున్నప్పు డే జీవితం నిజంగా పూర్తవుతుందని ఆయ న తాత్వికార్థాన్ని పలికించారు.రమణ జీవి రాసిన ‘ఇల్లు వూడవడానికి ముందు’ కవిత దైనందిన పనుల వెను క దాగి ఉండే అతీతమైన తా త్వికతను ఆవిష్కరిస్తుంది. మరణం తర్వాత వచ్చే ఉదయా న్ని ఊహిస్తూ, శ్రమ
నవతెలంగాణ- హైదరాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. టెర్మినల్ లోపల, ప్రయాణికుల లగేజీలో బాంబులు అమర్చినట్లు వచ్చిన ఈ-మెయిల్తో CISF, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో విమానాశ్రయం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీని పూర్తిగా పరిశీలిస్తూ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. The post రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు appeared first on Navatelangana.