21163 వార్తలు

కొలీజియం తీరుతోనే ఈ దుష్పరిణామాలు ఇలాంటి వారే ప్రజా సమూహాన్ని చీమలతో పోల్చుతారుసుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూ యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియం ప్రతిపాదనల్లో కారణాలను వెల్లడించకపోవడం న్యాయమూర్తులకు అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. ‘కొలీజియం గత మూడు రిజల్యూషన్లలో ఎలాంటి కారణాలను వెల్లడించకపోవడం గుర్తించాను. ఇది జవాబుదారీతనం నుంచి ఒక అడుగు వెనక్కి మళ్లడంగా అనుకోవచ్చా’ అని జస్టిస్ భూయాన్ ప్రశ్నించారు. లీగల్ థింగ్-ట్యాక్ విధి జల్దీ ఇనీషియేటివ్ శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన ప్యానల్ డిస్కషన్లో ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తుల పదోన్నతులకు కారణాలను వెల్లడించకపోవడం వల్ల న్యాయవ్యవస్థలోకి అవాంఛనీయ వ్యక్తులు ప్రవేశించడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. వారు ఆ తర్వాత ప్రజాసమూహాన్ని చీమలతో పోల్చవచ్చని, రా జ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేయవచ్చని వివరించారు. అలాంటి వ్యక్తులను న్యాయవ్యవస్థలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు

మేషంమేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వారాంతంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా గ్రహగతులు ఉన్నాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి. శుక్రవారం రోజున విష్ణుమూర్తికి తులసీమాల సమర్పించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.వృషభంవృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది దానికి తగినట్టుగా




మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఇతర అన్ని రకాల గురుకులాల్లో ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహించేందుకు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకు మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతించింది. ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రవేశాల గడువును మరో 15 రోజులపాటు ఇంటర్ బోర్డు పొడిగించింది.



మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. గతంలోనూ సిఎం దావోస్ పర్యటనకు వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగా, ప్రస్తుతం, మరోసారి తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చేలా సిఎం ప్రణాళికలు రూపొందించినట్టుగా తెలిసింది. గతంలో విదేశీ పర్యటనల సందర్భంగా పలు అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయా కంపెనీల ప్రతినిధులతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. పారిశ్రామిక రంగంతో పాటు విద్య, వినూత్న ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధికి సంబంధించి విదేశీ సాంకేతికత విధానాలపై సిఎం ప్రత్యేకంగా స్టడీ చేయనున్నట్టుగా తెలిసింది. ఐటీ, ఫార్మా మ్యానూఫ్యాక్చరింగ్ రంగాలు తెలంగాణ వైపు మొగ్గుచూపేలా ఈ పర్యటన సాగనుందని తెలిసింది. ఈనెల 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు వివిధ దేశాల్లో సిఎం పర్యటించనున్నట్టుగా సమాచారం. అమెరికా, యూకే సహా మరికొన్ని దేశాలకు ముఖ్యమంత్రి వెళ్లనున్నట్టుగా సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్


మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ద్వితీయ భాగం(ఆగస్టు, సెప్టెంబర్)లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తాజాగా విడుదల చేసిన ముందస్తు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ద్వితీయార్ధానికి చెందిన వాతావరణ నివేదికను శనివారం భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం సాధారణ స్థాయి కంటే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, జలాశయాలు, ప్రాజెక్టులు గణనీయంగా నిండాయి. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని, రాబోయే రెండు నెలల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశమున్నందున ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించింది. జాతీయ అంచనాల ప్రకారం ఆగస్టు, -సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పిఏ) కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంచనాలు చెబుతున్నాయి.బలపడుతున్న ఎల్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పిఎఫ్), అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టిఎస్ఎల్పిఆర్బి) చైర్మన్ వి. వి. శ్రీనివాస్రావు శనివారం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్ ప్రకటించారు. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గత నెల 29న విడుదల చేసిన నాలుగు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నామని, దరఖాస్తులు కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని, ఇతర మార్గాల్లో వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. సివిల్, రిజర్వ్, ఎస్పిఎఫ్ ఎస్సై, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతర అభ్యర్థులకు రూ.1,500 ఫీజు నిర్ణయించారు. అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టులకు కూడా ఇదే ఫీజు వర్తించనుంది. ఈ పోస్టులకు ప్రత్యేక సాంకేతిక పరీక్ష నిర్వహిస్తారు. సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్సిపిఎల్ పోల





ఛత్రపతిశంభాజీనగర్ (మహారాష్ట్ర): సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్ ఆయనకు విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు. మహారాష్ట్ర లోని ఛత్రపతి శంభాజీనగర్లో తన నివాసం వద్ద ప్రజలను కలుసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా అసౌకర్యం అనిపించి ఇంట్లోకి వెళ్లగానే ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయని డాక్టర్ చెప్పారు. శనివారం ఆయన నివాసం వద్ద పార్కింగ్ ఏరియాలో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఆయన కోసం ప్రజలు వేచి ఉండగా ఆయన వారిని కలుసుకోవడానికి ప్రయత్నించారు. అక్కడ వాంతులు కాగానే మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లిపోయారు.ఆ తరువాత డాక్టర్ వచ్చి పరీక్షించారని అభిజీత్ దీప్కే తండ్రి భగవాన్ దీప్కే వెల్లడించారు. దీప్కేను పరీక్షించిన డాక్టర్ విశాల్ లహనే దీప్కే ఆరోగ్య పరిస్థితి వివరించారు. దీప్కే రక్తపోటు స్వల్పంగా తక్కువ స్థాయిలో 100/60లో ఉందన్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఉదయం నుంచి ఆయనకు వికారంగా ఉందన్నారు. రెండుసార్లు ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయన్నారు. ఆయనకు ఇంట్రావీనస్ ద్రవాలు అందించడమైందని, రోజంతా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు డాక్టర్ చెప్పారు. ప్ర

న్యూఢిల్లీ : దేశంలో యుపిఐ లావాదేవీల జోరు కొనసాగుతూ... తాజాగా అది సరికొత్త రికార్డును సృష్టించింది. జులైలో రూ.29.88లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ మేరకు శనివరం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే 22శాతం అదనంగా లావాదేవీలు జరిగినట్లు ఎన్పిసిఐ వెల్లడించింది. అయితే విలువ పరంగా అది 19శాతంగా తెలిపింది. జులైలో రోజుకు సగటుగా 96వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. దేశంలో పట్టణాలు, నగరాల్లోనే కాకుండా గ్రామీణ స్థాయిలోకి సైతం యుపిఐ లావాదేవీలు చొచ్చుకు పోవడం వల్లే ఇది సాధ్యమైందని పేమెంట్స్ కార్పొరేషన్ ప్రకటనలో పేర్కొంది. రీఛార్జ్ల కోసం కూడా ప్రజలు డిజిటల్ లావాదేవీలనే ఉపయోగిస్తున్నారని వివరించింది.

కొచ్చి: కేరళ లోని కేరళ, ఇడుక్కి,కొట్టాయం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడి ముగ్గురు మరణించారు. వాగమాన్ జిల్లాలో కొండచరియలు విరిగి పడి ఒకరు మరణించారు. ప్రభాకరన్ నాయర్ అనే అతని మృతదేహం ఇంకా లభించలేదు. ఇడుక్కి జిల్లా లోని ఒక ఇంటిపై కొండ చరియలు విరిగి పడటంతో ఇంట్లో ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పూంజార్ ప్రాంతంలో ఒక ఇంటిపై కొండ చరియలు విరిగి పడటంతో ఇల్లు పూర్తగా ధ్వంసమై ఇద్దరు చిక్కుకున్నారు. రాష్ట్రం లోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. 183 జాతీయ రహదారి పై వంది పెరియార్ ప్రాంతం జలమయమైంది. ఎరాట్టుపేట, కంజిరాపల్లి, కూట్టిక్కల్, ఎరమెలి వంటి అనేక పట్టణాలు నీట మునిగాయి. వయనాడ్తో సహా అనేక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు.

న్యూఢిల్లీ : జిస్టి వసూళ్లలో దేశం మరింత పురోగతిని సాధించింది. జులై నెలకు సంబంధించిన వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ శనివారంనాడు విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం రూ.2.11 లక్షల కోట్ల జిఎస్టి వసూళ్లు నమోదైనట్లు వెల్లడించింది. గత ఏడాది జులైతో పోలిస్తే ఇది 15.4 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జిఎస్టి వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్క్ను దాటడం రెండోసారి. అంతకుముందు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2.43 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.దేశీయ వ్యాపార లావాదేవీల నుంచి వచ్చిన పన్ను ఆదాయం 10.1 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకుంది. అదే సమయంలో దిగుమతులపై లభించిన స్థూల పన్ను ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.66,511 కోట్లకు పెరిగింది. జులై నెలలో కేంద్ర జిఎస్టి రూ.39,835 కోట్లు, రాష్ట్ర జిఎస్టి రూ.47,881 కోట్లు, సమీకృత జిఎస్టి రూ.1.23 లక్షల కోట్లు నమోదయ్యాయి. జులై నెలలో మొత్తం రూ.29,968 కోట్ల రీఫండ్లు జారీ అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వాటిని మినహాయించిన తర్వాత నికర జిఎస్టి వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. తెలంగాణలో రూ.5,819 కోట్ల జిఎస్టి వసూళ్లు నమోదైనట్లు వెల్లడించింది. ఇది గత

వాణిజ్య సిలిండర్ ధర రూ.192 తగ్గింపుపెంచిన ధరలు క్రమంగా తగ్గిస్తూ వస్తున్న చమురు సంస్థలురెండు నెలల్లో ఇది రెండో భారీ తగ్గింపున్యూఢిల్లీ : హోటళ్లు, రెస్టారెంట్లు, తదితర వాణిజ్య సంస్థలకు ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్పై ధరలను రూ.192 తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా కొంతకాలంగా వరుసగా పెరిగిన ధరలు.. తాజాగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవలి కాలంలో కమర్షియల్ సిలిండర్పై ఇది వరుసగా రెండో తగ్గింపు కావడం విశేషం. జులైలో వాణిజ్య సిలింబర్ ధరలను రూ.183 తగ్గించిన సంగతి తెలిసిందే.శనివారం మరో రూ.192 రూపాయలను తగ్గించారు. దీంతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.202 తగ్గి రూ.2,728కు చేరింది. కోల్కతాలో రూ.209 తగ్గి రూ.2,872.50కి చేరింది. మరోవైపు ఐదు కిలోల మార్కెట్ ధరకు సరఫరా చేసే సిలిండర్ను రూ.808 నుంచి రూ.762కు తగ్గించారు. ముంబై, చెన్నై, హైదారాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లో కూడా గణనీయంగా ధరలు తగ్గాయి.అయితే ఈ తగ్గింపు వాణిజ్య వినియోగ సిలిండర్లకే పరిమితం. గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ

న్యూఢిల్లీ: జాతీయతను నిర్ధారించాకే విదేశీయులను వారి స్వదేశానికి డిపోర్ట్ చేస్తామని, ఎవరైనా వ్యక్తి జాతీయతను ధ్రువీకరించడానికి విదేశాలు అంగీకరించకుంటే వారిని బహిష్కరించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్ను సమర్పించింది. అస్సాంలో విదేశీయులుగా ప్రకటించిన కొందరిని స్వదేశాలకు పంపకుండా నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.ఒక విదేశీయుడికి శిక్ష కానీ కోర్టు విచారణ కానీ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి వద్ద చెల్లుబాటయ్యే ప్రయాణ పత్రం కానీ పాస్పోర్ట్ కానీ ఉండి, క్రిమినల్ కేసులో పెండింగ్లో లేకపోతే వారని దేశం నుంచి బహిష్కరించవచ్చని కేంద్రం తెలిపింది. విదేశీయులను దేశ నుంచి డిపోర్ట్ చేయాలంటే సంబంధిత దేశ రాయబార కార్యాలయం నుంచి జాతీయత ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని కేంద్రం ఆ అవిడవిట్లో వివరించింది.

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఘటన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దూషించిన బాలిక తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పింది. ప్రధానిని విమర్శించిన వారి మాటలకు ప్రభావితమై తాను సైతం అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. తన మాటలు క్షమించరానివని, అయితే ఇదే తన మొదటి తప్పు, చివరి తప్పు అని. ఇకపై అలా చేయనని చేతులు జోడించి మరీ క్షమాపణలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన పిల్లలను క్షమాస్తానని ప్రధానమంత్రి శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సందేశం నేపథ్యంలో బాలిక వీడియో వెలుగుచూసింది.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన క్లిప్ తాను పోస్ట్ చేయలేదని, ఆ వీడియో చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, సిగ్గుపడ్డానని బాలిక తెలిపింది. జూలైలో తాను మిత్రులతో కలిసి కన్నాట్ప్లేక్కు వెళ్లానని వెల్లడించింది. అక్కడ కొందరు ప్రధానని తిట్టారని, తనను కూడా విమర్శించమని ప్రోత్సహించడంతో తాను కూడా అదేపని చేశానని తెలిపింది. తన వ్యాఖ్యలకు సిగ్గుపడ