5321 articles


దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటిల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను నిర్వహిస్తున్న ఐఐటి రూర్కీ సోమవారం అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష జరుగనున్నది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 2.30 గంటలకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు.

కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజాభవన్లో భట్టి విక్రమార్క అధ్యక్షతన కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు, ఎంపి వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. శాస్త్రీయంగా కనీస వేతనాల సవరణ చేపడతామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇతర రాష్ట్రాల కనీస వేతన విధానాలపై సమీక్షిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్ ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఉండాలని కమిటీ సభ్యులు తెలిపారు. కేవలం అంకెల్లో కాదని వాస్తవ అవసరాలకు తగ్గట్టే వేతనాలు ఉండాలని చెప్పుకొచ్చారు. దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. కార్మికుల పక్షపాతి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు లాభం చేకూరేలా చర్యలు చేపడతామన్నారు. అన్నివర్గాల అభిప్రాయాలతో త్

తెలంగాణలోని జర్నలిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేయనున్నట్లు సిఎం తెలిపారు. సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సిఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ నెల 21న మంత్రివర్గ సమావేశం ఉంటుందని, అదే రోజున జర్నలిస్టుల ఇళ్ళ పట్టాల అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. జూన్ 2వ తేదీ లోపు జర్నలిస్టుల ఇండ్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు."జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జర్నలిస్టులకు శుభవార్త చెబుతాం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. క్యాబినెట్ ఆమోదం ఉంటే చట్ట బద్దత ఉంటుంది" అని సిఎం పేర్కొన్నారు.



హైదరాబాద్: ప్రధాని మోడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బంగారం కొనవద్దని, విమానాల్లో ప్రయాణం చేయవద్దని ప్రధాని చెప్పడం వైఫల్యం అవుతుందని ఆయన అన్నారు. విదేశీ విధానంలో ప్రధాని విఫలమయ్యారని ఆయన విమర్శించారు. సోమవారం సిఎం రేవంత్ రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యం.. ప్రభుత్వ అసమర్థ విధానాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఈ విధంగా పిలుపు ఇచ్చారని, ఇది భాద్యతారాహిత్యమైందని విమర్శించారు. ఈ పరిస్థితుల గురించి తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరు నెలల క్రితమే హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల సూచనలను తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. దీనిపై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదని ఆయన విమర్శించారు.

ఐపిఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్నమ్యాచ్ లో పంజాబ్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(56), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(59)లు అర్ధశతకాలతో చెలరేగారు. కనోలి(38), సూర్యాంశ్(21 నాటౌట్)లు ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించారు. దీంతో పంజాబ్, ఢిల్లీకి 211 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది.



తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సిఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ హైకమండ్ చర్చలు జరుపుతోంది. రేపు(మే 12) సిఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సిఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) మాజీ అధ్యక్షులందరితో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంప్రదింపులు అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.కాగా, ముఖ్యమంత్రి పదవి రేసులో కెసి వేణుగోపాల్, వి.డి. సతీశన్, రమేష్ చెన్నితాల ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, మే 14న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగవచ్చని కూడా వర్గాలు తెలిపాయి. దశాబ్దాలలో కేరళ రాజకీయాల్లో చోటుచేసుకున్న అత్యంత కీలక పరిణామాలలో ఒకటిగా, 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘన విజయం సాధించి అధ

అస్సాం ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి హిమంత బిశ్వ శర్మ మంగళవారంనాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఖనపరలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో అట్టహాసంగా ఏర్పాట్లు శారు. ఉదయం 11.40గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రలు, బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలు, ఎన్డిఎ నేతలు హాజరుకానున్నారు. గత ఆదివారంనాడు గవర్నర్ ఎల్పి ఆచార్య, హిమంత బిశ్వశర్మను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 2021 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత శర్మ తొలిసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో అస్సాంలో పార్టీ తిరిగి అఖండ విజయం సాధించింది. తద్వారా బిజెపి హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో బిజెపి శాసనసభా పక్ష నేతగా ఇటీవల హిమంతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో 102 సీట్లను ఎన్డిఎ గెలుచుకుంది. వీటిలో బిజెపి సొంతంగా 82 గెలుచుకోగా, మిత్రపక్షాలైన ఏజీపీ, బిపిఎఫ్ 10 స్థానాల్లో విజయం సాధించాయి.

తమిళనాడు సిఎం విజయ్, నటి -త్రిష మధ్య సాన్నిహిత్యంపై కొంత కాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకోవడం, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నేపథ్యంలో తాజా ఘటన మరింత చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమం అనంతరం త్రిష తన ఇన్స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ‘ది లవ్ ఈస్ అల్వేస్ లౌడర్’(ప్రేమ ఎప్పుడూ గొప్పదే) అనే క్యాప్షన్ను జోడించారు. ఈ పోస్ట్ తాజాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వ్యాఖ్యను విజయ్తో అనుసంధానం చేస్తూ విస్తృతంగా చర్చిస్తున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష భావోద్వేగానికి గురైన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రసంగం సమయంలో ఆమె కళ్లలో ఆనందభాష్పాలు కనిపించిన సందర్భంపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నవతెలంగాణ – జుక్కల్ ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో జుక్కల్ మండల టాపర్ గా నిలిచినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – జుక్కల్ విద్యార్థిని జి. ముక్తేశ్వరికి బిసిటిఏ (బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్) వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మల్లు రవి ఎంపి నాగర్ కర్నూల్, ఆర్. కృష్ణయ్య , ఎంపి రాజ్యసభ, సీనియర్ నాయకులు వి. హన్మంత రావ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానాన్ని నిర్వహించడం జరిగింది. […] The post ఎస్ఎస్ సీ టాపర్ కు ఘన సన్మానం appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ అధ్యక్షతన ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి కూలీలకు అందించడం జరిగిందని జిపి కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఉదయం పూట ఆరు గంటల లోపే పని ప్రదేశానికి వెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత పెరిగినందువలన ప్రతి ఒక్కరు చల్లటి వాతావరణం లోనే […] The post ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్ నేటి నుండి మండలంలోని పలు గ్రామాలలో సెన్సెస్ సర్వే ప్రారంభిండం జరిగింది. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలో ని పడంపల్లి, నాగుల్ గావ్, బిజ్జల్వాడి , కత్తల్వాడి , చెండేగావ్, లొంగన్ మథురతాండ ,సోపూర్ , డోన్ గావ్, మహమ్మదాబాద్, గుల్లా తాండ, మాదాపూర్, చిన్నగుల్ల, పెద్ద ఏడ్గి, జుక్కల్, దోస్తుపల్లి, వజ్రకండి, ఖండేబల్లూర్, లాడే గావ్, హంగర్గ, ఆయా గ్రామాల గ్రామ సర్పంచ్ల అధ్యక్షతన సెన్సెస్ మొదటి రోజు సర్వే మ్యాప్ నిర్వహించడం […] The post నేటి నుండి గ్రామాలలో సెన్సెస్ సర్వే appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని చెండేగావ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ , ఉప సర్పంచ్ అంతేశ్వర్ అధ్యక్షతన గ్రామంలోని ఎస్సీ కాలనీలో తీవ్రంగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రామంలోని నీటి సమస్యలు గత కొంతకాలంగా తీవ్రం కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు కాలనీవాసులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులతో చర్చించి నీటి […] The post చెండేగావ్ సర్పంచ్ ఆధ్వర్యంలో నీటి సమస్య పరిష్కారం appeared first on Navatelangana.
బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ కు వినతినవతెలంగాణ – తిమ్మాజిపేటకేంద్ర మంత్రి బండి సంజయ్, కుమారుడు బండి భగీరథ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా […] The post చట్టం సామాన్యులకేనా.? appeared first on Navatelangana.


బంధువుల ఇంటికి వెళ్లొచ్చేసరికి దొంగలు ఇళ్లు ఖాళీ చేశారు. 30 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదుతో పరారయ్యారు. ఈ సంఘటన గోషామహల్ పోలీస్స్టేషన్ పరిధిలోని షాహినాయత్గంజ్ ముల్తానీపురాలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... బేగంబజార్లోని స్టీల్ దుకాణంలో సేల్స్మెన్గా పనిచేస్తున్న మహేష్ భార్యాపిల్లలతో కలిసి షాహినాయత్గంజ్ ముల్తానిపురాలోని 3వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. 2వ అంతస్తులో అతని తమ్ముడు, మొదటి అంతస్తులో తల్లి, గ్రౌండ్ ఫ్లోర్ను స్టోర్ రూమ్గా వాడుకుంటున్నారు. లంగర్హౌజ్లో బంధువుల వివాహం ఉండటంతో మహేష్ గత నాలుగు రోజులుగా ప్రతి రోజూ ఉదయం కుటుంబసభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లి, అర్దరాత్రి సమయానికి తిరిగి ఇంటికి వస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి పెళ్లికి వెళ్లిన మహేష్ స అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో ఇంటికివచ్చి చూడగా, ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించాడు. అనుమానంతో గబగబా మూడవ అంతస్తు పైకి చేరుకోగా ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. బీరువాలో గల 30 తులాల బ
విద్యార్థుల్లో సృజనాత్మకత వెలిక్కి తీయడంపాఠశాలలపై విశ్వాసం పెంచడంనవతెలంగాణ – మల్హర్ రావువిద్యా ప్రమాణాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 11 నుంచి 17 వరకు ఏడు రోజుల పాటు విద్యాశాఖ వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు.రోజుకో కార్యక్రమం చొప్పున అధికారులు ఏడు రకాల కార్యక్ర మాలు చేపడుతున్నారు. సర్కారు బడులపై విశ్వాసం పెంచడం, విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడం, తల్లిదండ్రులు,ప్రజా ప్రతినిధులను భాగసామ్యం చేయడమే […] The post సర్కారు బడుల్లో వారోత్సవాల సందడి షురూ appeared first on Navatelangana.

15 రోజుల్లో ప్రక్రియ పూర్తిఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమాలో చేరిక జూన్ 1 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సిఎం సువేందు అధికారి నేతృత్వంలో కేబినెట్ తొలి నిర్ణయాలు మేనిఫెస్టోలో హామీల అమలు దిశగా అడుగులు కోల్కతా : ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో సోమవారంనాడు జరిపిన పశ్చిమ బెంగాల్ తొలి మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ కోసం భూమిని బిఎస్ఎఫ్కు తక్షణమే స్వాధీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టి తీరుతామని బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రధానంగా హామీ ఇచ్చింది. ఈ హామీ అమలు దిశగా సువేందు సర్కార్ తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో సువేందు మాట్లాడుతూ.. -బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్కు అవసరమైన భూమి బిఎస్ఎఫ్ నియంత్రణలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. బిఎస్ఎఫ్కు భూమిని బదిలీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. సరిహద్దు ఫెన్సింగ్ను బిఎస్ఎఫ్ సాధ్యమైనంత