5622 articles


ఇండీ కూటమికి డీఎంకే గుడ్బై చెప్పింది. ఇక కాంగ్రెస్డీఎంకే మధ్య పొత్తు ముగిసింది అని వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోక్సభలో తమ ఎంపీల సీట్ల కూర్పును మార్చాలని డీఎంకే పార్టీ శుక్రవారం స్పీకర్ను కోరింది. కాంగ్రెస్ సభ్యుల పక్కనే తమ ఎంపీలు కొనసాగడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సముచితం కాదని పార్టీ అభిప్రాయపడింది. డీఎంకే నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి తాజాగా లోక్సభ స్పీకర్ కు లేఖ రాశారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా డీఎంకే పార్లమెంటరీ పార్టీ సభ్యులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించేలా తగిన మార్పులు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డీఎంకే ఎంపీలకు సంబంధించిన సీట్ల కూర్పులో తగిన మార్పులు చేయాలని గౌరవపూర్వకంగా కోరుతున్నాను.కాంగ్రెస్తో మా పొత్తు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుత సీట్ల కూర్పులో కాంగ్రెస్ సభ్యుల పక్కనే కొనసాగడం సరైనది కాదని భావిస్తున్నాము అని ఆమె లేఖలో పేర్కొన్నారు.అలాగే, లోక్సభలో తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు డీఎంకే ఎంపీలకు వేర్వేరు సీట్లు కేటాయించాలని స్పీకర్ను కోరారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో టీవీకేకు మ

నవతెలంగాణ-కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లతో మంజూరు చేసిన జిల్లా ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. 2026 మే 25వ తేదీలోగా పనులను పూర్తి చేసి సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, మహిళా సాధికారతకు ఇందిరా మహిళా శక్తి […] The post ఇందిరా మహిళా శక్తి భవన పనులను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ appeared first on Navatelangana.

తనపై చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎవరూ ఊహించని విధంగా తనకు ఎంగేజ్మెంట్’ అయిపోయిందంటూ ప్రకటించి నటి అషురెడ్డి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒకవైపు పెళ్లి పేరుతో మోసం చేశారనే కేసులో విచారణకు బ్రేకులు వేయడానికి కోర్టు నిరాకరిం చడం. ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే తాను పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ఎంగేజ్మెంట్ వార్తను కన్ఫర్మ్ చేయడం ఇప్పుడు ఇండ స్ట్రీ సర్కి ల్స్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అసలు ఆమె ఎవరిని చేసుకోబోతోంది? ఇదంతా కేసుల నుంచి జనాల దృష్టి మళ్లించే వ్యూహమా? లేక ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే ఈ ఎంగేజ్మెంట్ జరిగిందా? అంటూ నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అషు రెడ్డికి నిజంగానే నిశ్చితార్థం జరిగిందా.? లేక ఏదైనా మూవీ షూటింగ్లో స్టిల్స్ షేర్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన సాయం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం ప్రజా భవన్లో మూసీ పునర్జీవన కెబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను మధుపార్క్ రిడ్జ్ (బి -బ్లాక్) రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ వినతులను మంత్రులకు సమర్పించారు. నివాసితులు వ్యక్తం చేసిన సందేహాలు, అపోహలను మంత్రులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ మధుపార్క్ రిడ్జ్ బి -బ్లాక్ నివాసితులందరి విషయంలో ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, వారికి మెరుగయిన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చదనం అందించేందుకు చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని వారిని డిప్యూటి సిఎం కోరారు. ప్రభుత్వ హామీ పట్ల అసోసియేషన్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. మూసీ పునర్జీవనానికి తమ

నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన సురేష్-ప్రవలిక, ప్రియాంక-రమేష్ దంపతులు వివాహలు శుక్రవారం అంగరంగావైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడ్వాల మహేష్ పాల్గొన్నారు. The post వధూవరులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య appeared first on Navatelangana.

రాష్ట్రంలో ‘సర్’ పేరుతో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మనందరం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని కోరారు. హైదరాబాద్లోని నాంపల్లి హజ్ హౌజ్లో శుక్రవారం హజ్ యాత్రికుల బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, టిజిఎంఆర్ఇఐఎస్ ప్రెసిడెంట్ ఫహీముద్దీన్ ఖురేషి, హజ్ కమిటీ చైర్మన్ గులామ్ అఫ్జల్ బియాబని, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, టిజిఎంఎఫ్సి చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిల్ హమద్, తదితరులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హౌజ్ హౌస్ వద్ద హజ్ యాత్రికుల బస్సులను జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ఛార్జీలు పెరిగాయని అన్నారు. దీంతో హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. అలాగే సంక్షేమంల

మార్చి 29న అక్షరాస్యత పరీక్షమండలంలో 1300 మంది హాజరు..ఇప్పటికీ ఫలితాలు ప్రకటించని వైనం..నవతెలంగాణ – మల్హర్ రావుపరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాలపై ఉత్కంఠ ఉంటుంది.బాగా రాసినవారు ఉత్సా హంగా కనిపిస్తారు. సరిగా రాయనివారు టెన్షన్ పడతారు. నిరక్షరాస్యత నిర్మూలతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఉల్లా ‘స్'(అమ్మకు అక్షరమాల) గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అక్షర జ్ఞానాన్ని అందించడానికి వంద రోజులు ప్రత్యేక రాత్రి బడులను నిర్వహించారు.విద్యాబుద్ధులు నేర్చుకున్న మహిళల సామర్థ్యాన్ని […] The post ‘ఉల్లాస్’.. ఉత్సాహం ఆవిరి.! appeared first on Navatelangana.


న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెకెఆర్.. డిసిని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి వచ్చిన ఢిల్లీకి ఓపెనర్లు రాహుల్, నిస్సాంకాలు శుభారంభం అందించారు. తొలి వికెట్కి 49 పరుగులు జోడించారు. అయితే కార్తీక్ త్యాగీ బౌలింగ్లో రాహుల్(23) ఔట్ అయ్యాడు. కానీ నిస్సాంక మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ, మరో ఎండ్ నుంచి అతనికి సరైన సహకారం అందండం లేదు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజ్లో నిస్సాంక(46), స్టబ్స్(0) ఉన్నారు.


నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు కూడా తమ మద్దుతును ప్రకటించాయి. దీంతో టీవీకే మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంది. ఇదే విషయాన్ని లోక్భవన్లో గవర్నర్తో సమావేశమైన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చర్చించారు. ఈ క్రమంలో తమకు 120 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని విజయ్ గవర్నర్కు లేఖలు అందజేశారు. కాంగ్రెస్, లెఫ్ట్, VCK, IUMLల మద్దతుతో […] The post సీఎంగా రేపే విజయ్ ప్రమాణ స్వీకారం appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతుల పాలిట శాపంగా మారాయని, ముఖ్యంగా వరి, జొన్న, మొక్కజొన్న, మామిడి పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి ఆగ్రహనికి గురవ్వడం పట్ల తెలంగాణ రైతు సంఘం డిమాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, మిల్లులకు ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని శుక్రవారం ప్రెస్నోట్లో పేర్కొంది. వర్షానికి తడిసిన, […] The post అకాల వర్షాలు..రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ బీటెక్ విద్యార్థి యావన్ హత్యను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈమేరకు శుక్రవారం ప్రెస్నోట్ విడుదల చేశారు. యావన్ను పక్క పథకం ప్రకారం రెక్కి నిర్వహించి ఇంతటి దారుణానికి పాల్పడ్డారని మండిపడింది. కులం, మతం పేరుతో జరుగుతున్న ‘కులదురహంకార హత్యలపై’ సమాజంలో చైతన్యం తేవడానికి, కులాంతర వివాహాల రక్షణకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. నిందితులను అందర్నీ వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్షించాలని […] The post బీటెక్ విద్యార్థి యావన్ హత్యను ఖండించిన సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై చర్చి పాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడడ్డాడు. కావమరపుకోట మండలం ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరం.. కామవరపుకోట మండలానికి చెందిన చౌటపల్లి రాంబాబు (42) అక్కడే చర్చి ఏర్పాటు చేసుకుని, ప్రార్థనలు చేసేవాడు. ఈ క్రమంలో కూలి పనులు చేసే ఓ కుటుంబం అతడి వద్దకు వచ్చేది. ఆ కుటుంబానికి చెందిన బాలిక(14)పై కన్నేసిన పాస్టర్ తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఎవరికి చెప్పకూడదు అంటూ ఆ బాలికను బెదిరించేవాడు. ఈ క్రమంలో బాలికకు నెలసరి రాకపోవటంతో గర్భనిరోధక మాత్రలను పాస్టర్ అధిక మోతాదులో వాడించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


డీఎస్పీ సత్తయ్య గౌడ్నవతెలంగాణ-కొండాపూర్కొండాపూర్ మండలం తోగర్పల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి పోలీసులపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ తెలిపారు. అలియాబాద్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారనే ఫిర్యాదుతో శ్రీధర్ రెడ్డిని స్టేషన్కు పిలిచామని చెప్పారు. మహిళా పోలీసు అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చర్యలు తీసుకున్నామని వివరించారు. సమస్యలు ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీధర్ రెడ్డిపై ఇప్పటికే ఐదు కేసులు ఉన్నాయని, చట్టవ్యతిరేక చర్యలకు […] The post పోలీసులపై ఆరోపణలు అవాస్తవం appeared first on Navatelangana.



నవతెలంగాణ-వర్ధన్నపేటవర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి తాను కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. వర్ధన్నపేట కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి స్థానిక ప్రజాప్రతినిధులు వారికి ఘనంగా సన్మానం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా సీడీఎఫ్, మున్సిపల్ నిధులతో రూ.4.99 లక్షలతో నిర్మిస్తున్న కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంతంలో విద్యుత్ దీపాల […] The post కట్టమైసమ్మ ఆలయ అభివృద్ధికి పాటుపడతా: ఎమ్మెల్యే appeared first on Navatelangana.

నవతెలంగాణ-కమ్మర్ పల్లి ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ ఊర చెరువు వద్ద కొనసాగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాస్టర్ రోల్ పరిశీలించి కూలీల హాజరు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. వేసవి ఎండలు అధికంగా ఉన్నందున ఉపాధి […] The post ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి appeared first on Navatelangana.


– వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం– కల్లాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ధాన్యం– రైస్ మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి– క్వింటాల్కు 10 కిలోల తరుగు తీయడం దోపిడీ– ముఖ్యమంత్రి వెంటనే సమీక్షా సమావేశం నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలి– బషీరాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డినవతెలంగాణ-కమ్మర్పల్లికాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంట కన్నీరు పెట్టిస్తుందని బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బషీరాబాద్ ధాన్యం […] The post రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం appeared first on Navatelangana.