19578 వార్తలు







కర్ణాటక: రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరని కర్ణాటక సిఎం డికె శివకుమార్ తెలిపారు. రాజీనామాలు రాజకీయాల్లో సహజమేనని అన్నారు. ఎమ్ఎల్ఎల రాజీనామాలపై డికె శివకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఉంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని తెలియజేశారు. థరమ్ సింగ్, సిద్దరామయ్య హయాంలో తనకు పదవి రాలేదని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని, అసంతప్తి పేరుతో ఒత్తిడి రాజకీయాలు చేయొద్దని డికె శివకుమార్ కోరారు.



హైదరాబాద్: కల్తీ మసాలాల కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేశామని హైదరబాద్ పోలీసు కమిషనర్ సిపి సజ్జనార్ తెలిపారు. సోదాలు నిర్వహించి 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. హైదరాబాద్ లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ మెరుపు దాడులు చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 13 మసాలా వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాల్లో తనిఖీ చేశామని, మైలార్ దేవ్ పల్లి, బాలాపూర్ పిఎస్ లో మూడు కేసులు నమోదు చేశామని సిపి సజ్జనార్ తెలియజేశారు. జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ గుర్తించామని, ఆహార భద్రత చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ పేర్కొన్నారు.








ఢిల్లీ: మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం వల్ల సింగరేణి సంస్థకు ఎంతో నష్టం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణికి ఎవరి హయాంలో చెడు జరిగిందో చర్చకు బిఆర్ఎస్ సిద్ధమా? అని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి రూ. 54 వేల కోట్లు బకాయిలు పెట్టి పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.54 వేల కోట్లు వసూలు చేస్తామని తెలియజేశారు. కొందరు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ..సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారని, అభ్యంతరకర వీడియోలపై ఇప్పటికే కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా..రెచ్చగొట్టే వీడియోలు పెట్టారని, మెటా ఇండియా ప్రతినిధిపై కూడా పోలీసులు కేసు పెట్టారని మండిపడ్డారు. హైదరాబాద్ లో బిజెపి కార్యకర్త సాయికిరణ్ గౌడ్ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసిన పోలీసులను ప్రభుత్వం బెదిరిస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.



హైదరాబాద్: పదేళ్లు పరిపాలించిన బిఆర్ఎస్ ను ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 2న బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తిరుచ్చి వెళ్లారని, దేని కోసం వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ హరీశ్ రావు వెళ్లిన ఫోటోలు బయటకు రాలేదని విమర్శించారు. ఎల్ నినో ఎంత ఘోరంగా ఉందో ఇప్పుడు చూస్తున్నామని, మాజీ సిఎం కెసిఆర్ పాలనలో ఎల్ నినో ప్రభావం కనిపించిందని.. అప్పుడు ఏం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని, తాము ఏం మాట్లాడిన కాంగ్రెస్ గురించి తప్పుగా అంటున్నారని మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ కు 39 సీట్లు ఇచ్చారని, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు సున్నా మెజారిటీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు ఎన్ని పూజలు చేసినా ఏం ఫలితం ఉండదని, క్షుద్రపూజలు చేయడం బిఆర్ఎస్ కు అలవాటేనని దుయ్యబట్టారు. ఊళ్లల్లో మంత్రాలు, తంత్రాలు ఉన్నాయని, ప్రజలే దేవుళ్లు..క్షుద్రపూజలు నడవవు అని సూచించారు. క్షుద్ర పూజల్ని

