
3255 వార్తలు

నువ్వు నాలోకి ఒరిగినప్పడు చిందిన అక్షరాలు తడిని అద్దుకున్నాయి నువ్వు దాటేసిన ఆ క్షణం అదే సిరా ఒలికి కొత్త భాష్యాలు నేర్పింది పాళీ నిట్టనిలువునా చీలిన చప్పుడు బద్దలైన హృదయానికి ప్రతీకగా నిలబడింది సరిగ్గా ఆ సమయంలో అప్పుడెప్పుడో వీచిన నీ ముంగురుల అలికిడి నాలో అలజడి రేపింది మోహం అనుకున్నావేమో అణువణువూ నిన్ను కలవరించిన దేహ విస్ఫోటనంలో వెతుకు మనసంటూ వుంటే కను కొసన ఓ బిందువైనా రాలుతుంది నీ శ్వాస నైనా అడుగు ఉచ్ఛ్వాస నిశ్వాసాల త్వరణ వ్యత్యాసాల లోగుట్టు నీ చెవినైనా అడుగు నా పాదాల సవ్వడిలోని మ్యూజింగ్స్ గుండె చప్పుడులో తప్పిన లయలనైనా పసిగట్టు ఊపిరి ఆగేలోపైనా మనిషిగా మసలుకో వసంతం శిశిరం శిథిలావస్థకు పునరుజ్జీవం పోస్తుంది - గిరి ప్రసాద్ చెలమల్లు

గాలి గుసగుస లాడుతూనే వుంది హృదయం మాత్రం నిశ్శబ్ద తీరాల కోసం ఆరాటపడుతుంది ప్రతి శ్వాసలోని సున్నితమైన తరంగాలు ఆత్మను గుర్తు చేస్తున్నాయి ఊపిరి సలపని పని నుండి కాస్సేపు నాకు సెలవు కావాలి ఎండిన ఆకుల చిరచిరలు గుండెను చికాకు పెడుతున్నా నా లోపల వసంతం ఇంకా పచ్చిగానే వుంది ఇప్పుడు కొంత సమయాన్ని దొరక బుచ్చుకోవాలి నిశ్చలంగా, నిశ్చయంగా నన్ను నేను పునరుద్ధరించుకునే క్షణాలు కావాలి - కుడికాల వంశీధర్
నవతెలంగాణ హైదరాబాద్: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఓరందూరు హైవేపై వేగంగా వెళ్తున్న అంబులెన్స్ లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అంబులెన్స్ కోల్కతా నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Assembly Elections The post ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి appeared first on Navatelangana.

నేను, నా సాహితీ యాత్ర: మనం ఏకాంతంగా కూర్చుని రాసినా, అది లోకంతో జరిపే సంభాష ణే. నా లోపల జరిగే అంతర్మథనం, బయట ప్రపంచం చూపే స్పం దనల సంఘర్షణే నా అక్షర ప్రయాణం. ఇండో-, చైనా యుద్ధ వాతావరణంలో పుట్టానని శాంతి ప్రబోధ అని పేరు పెట్టారు నాన్న. వరంగల్ జి ల్లా గణపురంలో పుట్టి, ఆదిలాబాద్ జిల్లాలోని కుగ్రామం బుద్దిపల్లిలో పెరిగాను. మంచిర్యాలలో డిగ్రీ పూర్తి చేశాక బిసిజె, సామాజిక శాస్త్రం, తెలు గు సాహిత్యం, ట్రాన్సిలేషన్లో పిజి డిప్లొమా చదివాను. పత్రికారంగంలో కొద్దికాలం, ఎక్కువ కాలం సామాజిక సేవారంగంలో క్రియాశీలంగా పనిచేశాను. క్షేత్రస్థాయిలో మనుషుల్ని, వారి కష్టాల్ని దగ్గరగా చూశాను. మనుషుల్ని, సమాజాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి నా కార్యరంగం బాగా ఉపయోగపడింది. వృత్తి రీత్యా మన దేశంతో పాటు అమెరికా, స్వీడన్, ఫిన్లాండ్ లలో పాల్గొన్న సదస్సులు, సామాజిక కార్యక్రమాలు, అధ్యయనం, మనుష్యులు, సంఘటనలు ప్రపంచాన్ని వివిధ కోణాల్లో అర్థం చేసుకోవడానికి దోహదమయ్యాయి.మాది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. నాన్న సామాజిక స్పృహ గల రచయిత. అమ్మ మంచి చదువరి. నా న్నమ్మకి సామాజిక చైతన్యం ఎక్కువ. ఆ వాతావరణమే పరోక్షంగా నా సాహితీ ప్రయాణ








నవతెలంగాణ హైద్రాబాద్ : తమిళనాడులో డీఎంకేని దాటేసి TVK పార్టీ దూసు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు TVK 63, డీఎంకే 50, AIADMK 39 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు పోటీ చేస్తున్న రెండు చోట్లా (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) TVK చీఫ్ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. The post తమిళనాడులో డీఎంకేని దాటేసిన విజయ్ పార్టీ appeared first on Navatelangana.


ఛాయా చిత్రకళ అనేది కేవలం దృశ్యాలను బంధించే సాంకేతిక ప్రక్రియ కాదు. అది వెలుగు, నీడ, భావం, సమయం కలిసిన ఒక సమగ్ర కళ. ఒక ఫోటోలో పైకి కనిపించేది కేవలం దృశ్యం మాత్రమే అయినా, దానిలో దాగి ఉండేది ఒక కథ, ఒక అనుభూతి, ఒక ఆలోచన. ఛాయా చిత్రకళలో కళాత్మకత అనేది చూడగలిగే దృష్టిలో ఉంటుంది. ఒకే దృశ్యాన్ని అనేక మంది చూస్తారు. కానీ, దాన్ని అర్థవంతంగా చూపించగలిగే చూపు చాలా కొద్ది మందికే చెల్లు. ఫోటోలో వెలుగు నీడల సమతుల్యత, ఆ క్షణాన్ని పట్టుకునే సమయం, ఒక భావాన్ని వ్యక్తీకరించే ఫ్రేమ్ ఇవి అన్నీ కలిసినప్పుడు ఫోటో ఒక చిత్రంగా కాకుండా ఒక భావస్పోరకమయిన కవితగా, కళాఖండంగా మారుతుంది. వెయ్యి పదాలకంటే అధికంగా మాట్లాడుతుంది. భారతదేశాన్ని ఫోటోలలో బంధించిన చాలామంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. కానీ భారతీయ సమాజాన్ని, ఆయా కాలాల్ని, అక్కడి అప్పటి మనుషుల అంతర్ముఖాన్ని ఒకే ఫ్రేమ్లో నిలిపినవారు చాలా కొద్దిమంది మాత్రమే. ఆ అరుదైన వారిలో ముఖ్యుడు రఘు రాయ్. ఆయన తన కెమేరాతో కేవలం చిత్రాలు మాత్రమే తీయలేదు. ఆయన కెమెరా కన్ను భారతానిని అర్థం చేసుకుంది, అనుభవించింది. మన కళ్ళ ముందు దృశ్యాలను సాక్షాత్కరింపజేసింది. ఒక ఫోటో పదాలు లేకుండా నే మ
నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆధిక్యాలు వెలువడుతోంది. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు. ఎడప్పాడిలో పళనిస్వామి.. పెరంబూరులో విజయ్…చేపాక్కం-తిరువల్లికేణిలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. The post Assembly Elections Result: కొళత్తూరులో స్టాలిన్…పెరంబూరులో విజయ్… ఆధిక్యం appeared first on Navatelangana.

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగుతోంది. తమిళనాడు డిఎంకె పార్టీ హవా కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ టిఎంసి ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (123), బిజెపి (97), కాంగ్రెస్(05) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకె కూటమి (67), అన్నాడిఎంకె కూటమి(34), టివికె(22), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (63), యుడిఎఫ్(71), ఎన్డిఎ (5) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(60), కాంగ్రెస్ కూటమి(30), ఇతరులు(02), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(19), కాంగ్రెస్ కూటమి(09), ఇతరులు(02) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. కేరళంలో తమిళనాడులో పశ్చిమబెంగాల్ అస్సాంలో పుదుచ్చేరిలో The post Assembly Results: కేరళంలో ఎల్ డీ ఎఫ్… appeared first on Navatelangana.

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (66), బిజెపి (55), కాంగ్రెస్(01) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకె కూటమి (55), అన్నాడిఎంకె కూటమి(16), టివికె(8), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (66), యుడిఎఫ్(56), ఎన్డిఎ (5) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(35), కాంగ్రెస్ కూటమి(18), ఇతరులు(02), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(10), కాంగ్రెస్ కూటమి(07), ఇతరులు(01) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
నవతెలంగాణ గూడూరు: గూడూరులో మొక్కజొన్న రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు. రోజుల తరబడిగా కాంటాలు వేయడం లేదని కాంటాలు వేసిన బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదని ఆరోపిస్తూ రైతులు ఆర్డిఓ రావాలని, అధికారులు రావాలని తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైటాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. The post గూడూరులో మరోసారి రోడ్డు ఎక్కిన మొక్కజొన్న రైతులు… appeared first on Navatelangana.

హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో కౌంటింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి, బిజెపి చెరో 16 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకె 10, అన్నాడిఎంకె 4, ఇతరలు 1, కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ 30, యుడిఎఫ్ 32, ఎన్డిఎ 3 స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి 11, కాంగ్రెస్ కూటమి 3 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బెంగాల్లో 77, తమిళనాడులో 62, కేరళంలో 43, అసోంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 148 సీట్లుతమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 118 సీట్లుకేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 71 సీట్లుఅసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 64 సీట్లుపుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 16 సీట్లు

నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. The post Assembly Elections: ప్రారంభమైన కౌంటింగ్ appeared first on Navatelangana.