3255 వార్తలు


నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటములను వెనక్కు నెట్టి విజయ్ పార్టీ ముందంజలో ఉంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎవరి మద్దతు లేకుండా సొంతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీవీకే జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ (Felix Gerald) చెప్పారు.తమ నాయకుడు విజయ్పై ప్రజలు విశ్వాసం ఉంచారని, అందుకే ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామన్నారు. దోపిడీ, అవినీతి, బంధుప్రీతి, […] The post స్పష్టమైన తీర్పు..ఎలాంటి పొత్తులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు appeared first on Navatelangana.




చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తమిళనాడులో నటుడు విజయ్ దళపతి పార్టీ టివికె ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ 104 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ టివికె విజయ్ ట్రెండింగ్లో ఉంది. తమిళనాడులో టివికె (104), డిఎంకె(58), అన్నాడిఎంకె(72) స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో అతడి పెద్ద పార్టీగా టివికె అవతరించింది. డిఎంకె కూటమి మూడో స్థానానికి పరిమితమైంది. ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్లు వెనుకంజలో ఉన్నారు. ట్విట్టర్లో యాస్ ట్యాగ్ లు ఎలక్షన్ రిజల్ట్, తలపతి, త్రిష, హిమంతాబుల్డోజడ్ కాంగ్రెస్, జన నయగన్ అనే ట్యాగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి.
నవతెలంగాణ తమిళనాడు : తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే సత్తా చాటుతోంది. విజయఢంకా మోగేందుకు సిద్ధమవుతోన్న వేళ …టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంటి వద్ద అధికారులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు నేతలు విజయ్ ఇంటి వద్ద క్యూ కట్టారు. ప్రస్తుతం విజయ్ పార్టీ 108 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటి వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి తొక్కిసలాటలు […] The post సత్తా చాటుతున్న టీవీకే…విజయ్కి హై సెక్యూరిటీని ఏర్పాటు appeared first on Navatelangana.


నటుడిగా కెరీర్ ప్రారంభించి, టాలీవుడ్ బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట ఇప్పుడు పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. ఆయన ముద్దుల కుమార్తె జనని బండ్ల నిశ్చితార్థ వేడుక ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. సూర్యతేజ చిలుకూరితో జనని వివాహం నిశ్చయమైంది. ఈ ఎంగేజ్మెంట్ ఈవెంట్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని కాబోయే దంపతులకు తమ ఆశీస్సులు అందించారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నారా చంద్రబాబు నాయుడు లాంటి దిగ్గజాలు విచ్చేయడంతో ప్రాంగణం కళకళలాడింది. వీరితో పాటు ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మైత్రీ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తదితరులు పాల్గొని వేడుకకు మరింత వన్నె తెచ్చారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వివాహ తేదీకి సంబంధించిన అధికారిక వివరాలను బండ్ల గణేష్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ మే 15న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వరక్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. మే 15న ఈ సినిమా శ్రీ వెంకట సాయి ఫిలమ్స్, ముత్యాల రామదాస్ డిస్ట్రిబ్యూషన్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్తో పాటు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నిజాయితీ గల అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఆ ప్రయాణం ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ హృద్యమైన కుటుంబ కథా చిత్రం సమ్మర్లో ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.
నవతెలంగాణ హైదరాబాద్: యాప్లో కిరాణా సామాను ఆర్డర్ చేయడం నుండి మొదలుకుని, క్యాబ్లు బుక్ చేసుకోవడం, యుటిలిటీ బిల్లులు చెల్లించడం, ఇంకా మరెన్నో పనులు చేయడం వరకూ – నేటి వినియోగదారుని జీవితమంతా ఆన్లైన్లోనే గడుస్తోంది. చెక్అవుట్ బటన్ చూస్తుండగానే క్యాష్ కౌంటర్గా మారిపోయింది, డిజిటల్ లావాదేవీలు మన సహజ లక్షణాలుగా మారిపోయాయి. అయితే, మనం ఖర్చు చేసే విధానం మారినప్పటికీ, మనకు లభించే ప్రయోజనాలు మాత్రం అందుకు తగ్గట్లుగా మారలేదు. సాంప్రదాయ క్రెడిట్ కార్డ్ రివార్డ్ […] The post ఫోన్పే SBI కార్డ్: రోజువారీ పేమెంట్లతోనూ పొదుపు సాకారం appeared first on Navatelangana.

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో బిజెపి హవా కొనసాగుతోంది. తమిళనాడులో టివికె 101 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టివికె పార్టీ సెంచరీ స్థానాలలో ఆధిక్యంతో విజృంభిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (112), బిజెపి (174), కాంగ్రెస్(03), వామపక్షాలు(2), ఇతరులు(1) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో టివికె(101), డిఎంకె కూటమి (59), అన్నాడిఎంకె కూటమి(74), ఇతరులు(01), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (41), యుడిఎఫ్(98), ఎన్డిఎ (01) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(96), కాంగ్రెస్ కూటమి(26), ఇతరులు(03), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(17), కాంగ్రెస్ కూటమి(08), ఇతరులు(03) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 148 సీట్లు తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 118 సీట్లు కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 71 సీట్లు అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 64 సీట్ల
నవతెలంగాణ ఢిల్లీ: ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును బలోపేతం చేయడానికి, దేశ వ్యాప్తంగా తన కార్యకలాపాల నెట్వర్క్ను విస్తరించడానికి రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. వ్యాపార విస్తరణ, ఏఐ ఆధారిత డిజిటలీకరణ, ఎగుమతుల వృద్ధి, ఉద్యోగ కల్పన వంటి ఇతర చర్యలపై దృష్టి సారిస్తూ, 2030 నాటికి భారత్లో 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.26 లక్షల కోట్ల)కు పైగా పెట్టుబడి పెడతామని గతంలో కంపెనీ ప్రకటించిన ప్రణాళికలో […] The post అమెజాన్ ఇండియా రూ.2,800 కోట్ల పెట్టుబడి appeared first on Navatelangana.

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వ్యక్తిని తన కొడుకు తో కలిసి అతని గొంతు కోసి చంపారు. 10 సంవత్సరాలనుండి ఒక వ్యక్తి తో ఓ మహిళా సహజీవనం చేస్తుంది. అనుమానం రాకుండా మృతదేహాన్ని కవర్లో చుట్టి అర్ధరాత్రి శవాన్ని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. చింతల్ లోని అంబేద్కర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితులను పట్టుకున్నట్లు సమాచారం.







