19574 వార్తలు


న్యూఢిల్లీ: థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగళవారం ఉదయం గాల్లో తీవ్ర వాయు ప్రకంపనలకు (టర్బులెన్స్) గురైంది. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు కోల్పోవడంతో అందులో ప్రయాణిస్తున్న కనీసం 15 మంది గాయపడ్డారు. వీరిలో ఒక కేబిన్ సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఫుకెట్ నుంచి ఎఐ-2379 విమానంగా నడిచిన ఎయిర్ ఇండియా ఏ320 విమానం ఉదయం సుమారు 11.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 134 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 11 మంది ప్రయాణికులు, నలుగురు కేబిన్ సిబ్బంది సహా మొత్తం 15 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించారు. డీజీసీఏ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రయాణ మధ్యలో విమానం సుమారు 300 అడుగుల ఎత్తు ఒక్కసారిగా కోల్పోవడంతో ఒక కేబిన్ సిబ్బంది తీవ్రంగా, మరో కేబిన్ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. కొంతమంది ప్రయాణికులకూ స్వల్ప గాయాలయ

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. 'ఛత్రపతి' ఫేం ప్రదీప్ రావత్(74) గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, బ్లడ్ క్లాట్ అవడంతో చికిత్స పొందుతూ ప్రదీప్ రావత్ మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విలన్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రావత్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'సై', 'ఛత్రపతి' సినిమాతో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రదీప్ రావత్, దక్షిణాదిలో 70 సినిమాలకు పైగా నటించారు. ఇక, తెలుగులో ఆయన చివరిగా 'గాయపడ్డ సింహం' అనే సినిమాలో నటించారు.

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ రాయల్ అల్బర్ట్ హాల్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి(యూఎస్ఏ ఆఫ్ బిజెపి) ఆధ్వరంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాస భారతీయులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగిందని, మౌలిక సదుపాయాల కల్పనలో అపూర్యమైన పురోగతి సాధించిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 75 విమానాశ్రయాలు ఉండగా, ఎన్డీఏ పాలనలో వాటిని 150కు పెంచి ప్రపంచస్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేసింద న్నారు. రానున్న జీహెచ్ఎంసీ, శాసనసభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలన రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధా


న్యూఢిల్లీ: ఈ 20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని, దీని అమలును ఆపాలంటే భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి వచ్చి పోరాడాలని ఆప్ ఆద్మీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ 20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా సేకరించిన దాదాపు 2.30 లక్షల వినతి పత్రాలతో మంగళవారం ప్రధాని మోడీ నివాసం వైపు మార్చ్గా బయలుదేరిన తరువాత పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో ఫిరోజ్ షా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ20 ఇంధనం వద్దనుకుంటే భారీ ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడాలన్నారు. గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న తమ ఎమ్ఎల్ఎలు ఈ 20 విధానాన్ని ప్రశ్నిస్తారని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ ఎంపి సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఈ విధానాన్ని ప్రస్తావించగా అమలు చేస్తామని కేంద్రం వెల్లడించిందన్నారు. ఈ విధానం భారత రైతులకు కాకుండా అమెరికా రైతులకే ఎక్కువగా లాభం చేకూరుతుందన్నారు. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి నిలదొక్కుకుని అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతులు నిలిపివేసి భారత రైతుల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.




వాషింగ్టన్: వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తుండగా, సమీపం లోని వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. మంటలకు కారణమని భావిస్తున్న స్పోకేన్కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్ వ్యాప్తంగా 16 ప్రదేశాల్లో కార్చిచ్చు వ్యాపించింది. వందల భవనాలు అగ్నకి ఆహుతయ్యాయి. స్పోకేన్ ప్రాంతంలో మంటలు కొనసాగుతుండడంతో వాటిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నట్టు స్పోకేన్ మేయర్ లీసా బ్రౌన్ వెల్లడించారు.వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితి తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడిన తర్వాత వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు ఈ వారం ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధ

మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు డల్లాస్ నగరంలో నేడు ఘన స్వాగతం లభించింది. బాల్టిమోర్ నగరంలో గత మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ‘ఆట’ మహాసభల వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆ కార్యక్రమాల ముగింపు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి డల్లాస్ చేరుకున్నారు. డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు ఎన్ఆర్ఐ టీపీసీసీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు చేరుకుని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి తమ అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. కాగా డల్లాస్ నగరంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఉపకరించే విధంగా సింగరేణి అధికారుల బృందంతో కలిసి ఆయన ‘క్రిటికల్ మినరల్స్’ అంశంపై వివిధ బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. అత్యాధునిక సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఈ సమావేశాలు జరగనున్నాయి

25,300కిలోల కల్తీ మసాల దినుసులు స్వాధీనం13 ప్రాంతాల్లో హెచ్ఫాస్ట్ అధికారుల దాడులు ముగ్గురు నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన నగర సిపి విసి సజ్జనార్ మనతెలంగాణ /సిటిబ్యూరోః ప్రమాదకరమైన రసాయనాలతో మసాల దినుసులు తయారు చేస్తున్న ముఠాను హెచ్ఫాస్ట్( ది హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం), జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 25,300కిలోల వివిధ రకాల కల్తీ మసాల దినుసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ టిజిఐసిసిసిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, కాటేదాన్కు చెందిన రాహుల్ భాటి, బేగంబజార్కు చెందిన విశాల్ పన్వర్, దులిచంద్ కచ్చావార్ ప్రమాదకరమైన రసాయనాలతో మసాల దినుసులు తయారు చేస్తున్నారు. వాము, జిలకర, లవంగాలు, సాజీరా, సోంపు, ఆవాలు, జీరా డస్ట్, మెంతులు, నువ్వులు, షైనింగ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్కు ప్రమాదకరమైన రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన మసాలా దినుసులను ఎపి, తెలంగాణలోని పలువురికి విక్రయిస్తున్నారు. 13 వ


త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో విజయ్ ప్రభుత్వం చర్యలుబెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన డిఎంకె ప్రశ్నించి వదిలిపెడతామన్న ప్రభుత్వం, పోలీస్ స్టేషన్కు తరలింపు చెన్నై: నటి త్రిషపై ద్వంద్వార్థం వచ్చే రీతిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారంనాడు ఉదయం నీలంకరాయిలోని ఆయన నివాసంలో ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డిఎంకె కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయనిధి అరెస్ట్కు ముందు ఆయన భార్యతో పాటు పలువురు డిఎంకె నేతలకు పోలీసులు సమాచారమిచ్చారు. అనంతరం ఉదయనిధిని తంజావూరు సమీపంలోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్కు తరలించి ప్రశ్నిస్తున్నారు. ఉదయనిధిని అరెస్ట్ చేసిన డిఎంకె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరింది. నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఆయనను ప్రశ్నించి వదిలిపెడతామని అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఉదయనిధిని జ్యుడీషియల్ రిమాండ్కు తీసుకోవాలనే ఉద్దేశం పోలీసులకు లేదని, కేవలం విచారించి స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలనుకుంట


టెల్ అవీవ్: భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు అని, భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రపంచ వేదికపై ఇజ్రాయెల్కు బలమైన మద్దతు అందిస్తున్న దేశాల్లో భారత్ కీలకమైనదని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ ఒంటరిగా ఉందనే ప్రచారం వాస్తవం కాదని నెతన్యాహు స్పష్టం చేశారు. భారత్తో పాటు పలు దేశాలతో ఇజ్రాయెల్ దౌత్య, ఆర్థిక, సాంకేతిక, భద్రతా రంగాల్లో సహకారం పెరుగుతోందని చెప్పారు. ఇక, భారత్లో ఇజ్రాయెల్కు లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని ఆయన అన్నారు.



వాషింగ్టన్: సాధారణంగా 18 ఏళ్ల వయసు అంటే ఇంటర్మీడియట్.. మరీ ప్రతిభావంతుడైతే డిగ్రీ, పీజీ విద్యలోకి ప్రత్యేక అనుమతుల ద్వారా ప్రవేశిస్తుంటారు కొంత మంది విద్యార్థులు. కానీ అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ 18 ఏళ్ల వయసులో కళాశాల ప్రొఫెసర్గా మారి చరిత్ర సృష్టించాడు. కేవలం 18 సంవత్సరాల 346 రోజుల వయసులో అధ్యాపకుడయ్యారు. ప్రపంచంలోనే అతి పిన్న వయసు పురుష ప్రొఫెసర్గా గిన్నీస్ వరల్ రికార్డ్లో చోటు సంపాదించాడు. 306 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును బద్దలు కొట్టాడు. నాథన్ 10 ఏళ్లకే మియామి డేడ్ కాలేజీలో డ్యూయల్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం ద్వారా కళాశాలలో చేరాడు. అనంతరం ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు చేశాడు. ఆ తర్వాత మియామి డేడ్ కాలేజీలోనే ఇంజినీరింగ్ ఇన్స్ట్రక్టర్గా చేరి విద్యార్థులకు బోధించడం ప్రారంభించాడు. తనతో సమాన వయసు ఉన్న విద్యార్థులకు బోధిస్తున్నాడు. 1717లో స్కాట్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త కొలిన్ మెక్లారిన్ 19 ఏళ్ల వయసులో ప్రొఫెసర్గా నియమితులై రికార్డు సృష్టించగా ఇప్పుడు దాన్ని నాథన్ చెరిపేశాడు.



