21246 వార్తలు



పద్దెనిమిదవ శతాబ్దంలో సైన్స్ పాఠాలు చెప్పిన జంతర్ మంతర్ ఇపుడు సామాజిక పాఠాలు చెప్తున్నది. అధికారపక్షానికి, ప్రతిపక్షాలకు రాజకీయ పాఠాలు కూడా. జంతర్ మంతర్ ఆందోళన ప్రస్తుత దశ ముగియవచ్చు. అయినా పాఠాలు కొనసాగుతున్నాయి. ఇది పరిశీలకులకు తోస్తున్న మాట మాత్రమే కాదు. కాక్రోచ్ జనతా పార్టీ పేరిట సరికొత్త చైతన్యాలు చూపిన యువతరం, తమ ఉద్యమం ఇంతటితో ముగియలేదని, భవిష్యత్తులోకి చాలా దూరం ప్రయాణించవలసి ఉన్నదని, ప్రయాణించగలమని, ప్రస్తుతానికి ఇది ఒక మజిలీ మాత్రమేనని స్వయంగా పదే పదే ప్రకటిస్తున్నారు. ప్రధానంగా విద్యారంగ సమస్యలతో ఆరంభించిన కాక్రోచ్ యువతరం, అందుకు మాత్రమే పరిమితం కాకుండా అనేక ఇతర సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తుండటం గమనార్హమైన విషయం. ఇటువంటి ధోరణి కొంతవరకు వామపక్ష విద్యార్థి సంఘాలలో ఉండటం తెలిసిందే కాగా, అటువంటి మొగ్గు ఏమీ ప్రకటిత రూపంలో లేని ఒక సరికొత్త వేదిక నాయకత్వాన కనిపించటం ఒకటైతే, అసలు మొత్తం విద్వార్థి లోకానికి, యువజన లోకానికి వ్యాపించి కనిపించటం గమనించదగ విశేషం. వారు ఒకవైపు విద్యా వ్యవస్థను, మరొక వైపు రాజకీయ వ్యవస్థను కూడా ప్రశ్నించటం గమనించదగ్గది. కాక్రోచ్ తక్షణ ఆందోళనకు ప్రే



స్నేహితునికి సహాయం చేసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు రహదారిలో ముష్టికుంట సమీపంలో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఆంద్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కొలికపోగు లక్ష్మణ్ (28) బైక్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు చేకూరి తిరుపతి రావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ లోని పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు. తిరుపతి రావు డ్యూటి అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు ఆటోలు, బస్సులు లేకపోవడంతో లక్ష్మణ్ కు ఫోన్ చేశాడు. దీంతో లక్ష్మణ్ తిరుపతి రావు ని తీసుకొని రావడానికి మరో స్నేహితుడు రాయల సైదులును ఎక్కించుకొని నాగులవంచకు వచ్చారు. ముగ్గురూ బైక్ పై వెళ్తుండగా ముష్టికుంట్ల బోనకల్లు మధ్య రోడ్డు మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి గాయపడ్డవారిని 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు లక్ష్మణ్ మృతిచెందినట్లు తెలిపారు. తిరుపతి రావు కోమాలో ఉండగా, సై




తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ మలివిడత ఉద్యమం కెసిఆర్ ఆధ్వర్యంలో ఆరంభమైన తరువాత ఓరుగల్లు తెలంగాణ భావజాల వ్యాప్తికి క్రియాశీలకంగా మారింది. ఓరుగల్లు ఉద్యమ పిడికిలి ఎత్తి గర్జిస్తే ఆనాటి తెలంగాణ పదిజిల్లాలో చైతన్యం నిండుకున్నది. తెలంగాణ మలివిడత ఉద్యమంలో కెసిఆర్తో నడిచిన ఉద్యమకారులలో ఓరుగల్లు స్థానం గొప్పది. అనేక ఉద్యమాలకు వరంగల్ వేదికగా నిలిచింది. అటువంటి వేదికలను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ మలివిడత ఉద్యమంలో వరంగల్లో గొప్ప గర్జనగా నర్సంపేట మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్రెడ్డి నిలిచారు. కెసిఆర్ ప్రారంభించిన ఉద్యమంలో మడమ తిప్పకుండా విశేష కృషి చేశారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో వరంగల్ వేదిక అనేక సభలకు వేదిక అయింది. అటువంటి వేదికల గర్జన వెనుక పెద్ది సుదర్శన్రెడ్డి విశేష కృషి ఉంది. తెలంగాణ ప్రాంతం ఏర్పాటు ఆకాంక్షనే ధ్యేయంగా కృషి చేసిన నాయకుడు. ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నేడు తెలంగాణ అంతా తల్లడిల్లుతూ ఆయనపై అభిమానాన్ని చాటుకుంది. తెలంగాణ ఉద్యమంలో మడమతిప్పని నాయకుడు.. ఓ దశలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరే వరకూ వ్యక్తిగత జీవితానికి పెళ్లి చేసుకోకుండా నిబద







హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిసిపి వి. అరవింద్ బాబును విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని నీట్ పేపర్ లీక్ ఆందోళన సందర్భంగా పిఎం మోడీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన, అభ్యంతరకరమైన కంటెంట్ను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై మెటా ఇండియా అధిపతితో పాటు పలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.





రిటైరయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయులకు త్వరితగతిన న్యాయం చేయాల్సిన కనీస ధర్మం, నైతిక బాధ్యత అధికారులపైనే ఉంది. పెన్షనరీ బెనిఫిట్స్ సకాలంలో రిటైర్డ్ ఉద్యోగికి అందాలంటే పెన్షన్ మంజూరు అధికారులు నాన్చుడు ధోరణికి వెంటనే స్వస్తి పలకాలి. రిటైరయ్యే రోజే పెన్షన్ మంజూరు పత్రాలు ఉద్యోగి చేతికి అందాలని ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయాలి. ఉద్యోగి రిటైర్ అవడానికి ఆరు నెలల ముందే పెన్షన్ పేపర్లను ప్రిపేర్ చేసి ఎజి ఆఫీస్కు పంపించవల్సిన పూర్తి బాధ్యత మంజూరు అధికారులదే. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. దశాబ్దాలపాటు ప్రభుత్వ సేవలోనే గడిపి, విశ్రాంతి తీసుకునే వయసులో వచ్చే పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు వారాలు, నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత విచారకరం! ముప్పై నలభై ఏళ్లపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ భుజాలపై మోసి, వ్యవస్థల పురోగతికి రక్తాన్ని చెమటగా మార్చిన విశ్రాంత ఉద్యోగులకు.. గౌరవంగా, సకాలంలో దక్కాల్సిన పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి రావడం వ్యవస్థకే అవమానకరం! కలం చేత పట్టి వేలాది మంది

ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో గిరిజన విద్యార్థినులు, మహిళలు చారిత్రాత్మక ఘనత సాధించారు. 13 వేల మంది గిరిజన బాలికలు, మహిళలు ఒకేసారి సాంప్రదాయ 'ధింసా' నృత్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శన విభాగంలో ఇది అధికారికంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో ఈ అద్భుత ప్రదర్శన జరిగింది. పిఎం మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న తరుణంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని తలపెట్టింది. గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థినులు, గిరిజన మహిళలు ఈ రికార్డులో భాగస్వాములయ్యారు.