
4053 వార్తలు




‘ఇంతటితో మీ సేవా కాలంముగిసిందని’ఓ అనివార్యమైన విరమణ లేఖపాఠం మధ్యలోంచే నన్నునిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపింది..!ఇన్నాళ్ళూ.. నల్లబల్లపై వెలుగులు పూయించిననేను ఆ అధికారిక ఉత్తర్వుకి తలవంచాను..!కాలం ఒకేలా ఉండదు..!మనిషి దశలను బట్టే స్థితిగతులునేనిప్పుడు ఇంటిపట్టునే నాయేగడియ తీరికలేదు గవ్వ ఆదాయం లేదుపైగా నా నెత్తినతక్షణమే తీర్చాల్సిన అప్పుల చాంతాడుతోడుగా ఆనారోగ్య సమస్యలు.అప్పుడెప్పుడో..రేపటి కాలానికని రెక్కల కష్టాన్ని కొంతచీమలా పోగేసుకున్న..ఇప్పుడు.. వాటి విడుదల కోసం ఎదురు చూస్తున్నఏవీ..!? ఎంతకీ రావేవిరమణానంతర చెల్లింపులు..!గ్రాట్యుటీ అనేది జీవితానికి గౌరవ వందనం కోసంఅవి ఏళ్లకు […] The post మా కష్టార్జితం మా హక్కు appeared first on Navatelangana.
సమాజము- సాహిత్యము బింబ ప్రతిబింబ సమరూపాలనేది ఎవరు కాదనలేని సత్యం. వాస్తవికతకు అతి దగ్గరగా రచించే క్రమంలో కథా ప్రక్రియ కూడా మన అనుభూతులను అనుభవాలను వ్యక్తీకరించే సాధనంగా నిలిచింది. ప్రత్యేకించి కథా ప్రక్రియ ద్వారా సులభశైలిలో ప్రాంతీయ వైవిధ్యాన్ని చూపిస్తూ దేశకాల పరిస్థితులను ప్రజలకు అర్థం చేయించే పని సులభతరం అవుతుంది.మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలయి ఆత్మీయత అనురాగాలు అడుగంటిపోతున్నాయి. అందుకు కారణం మనుషుల మధ్య ప్రేమరాహిత్యం, సంపాదన, ఆస్తిపట్ల మమకారం వల్ల మానవత విలువలు […] The post చేతిలో చెయ్యేసి – సమకాలీన పరిస్థితులు appeared first on Navatelangana.

అధికార దాహం కోసం ఆత్మీయ బంధాలను, ఉద్యమ ఆశయాలను బలిపెడతారా..?కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ మహిళా నేతల ఆగ్రహంమనతెలంగాణ/హైదరాబాద్ : అధికార దాహం కోసం ఆత్మీయ బంధాలను, ఉద్యమ ఆశయాలను బలిపెడతారా..అంటూ కల్వకుంట్ల కవిత తీరుపై బిఆర్ఎస్ నాయకురాలు తుల ఉమ, ఇతర మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ, బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విభేదాలు సహజం.. కానీ, అవి వ్యక్తిగత స్వార్థం కోసం కన్నతండ్రిని, నడిపించిన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడే స్థాయికి దిగజారడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీపైన, కెసిఆర్పైన కవిత చేసిన ఆరోపణలు ఖండిస్తూ పార్టీ మహిళా నేతలు తుల ఉమ, హరి రమాదేవి, ఉబ్బపల్లి నిరోష ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కెసిఆర్ బిడ్డ కాకపోతే కవిత ఎవరు..ఆమెకు గుర్తింపు ఎక్కడిది..? అని ప్రశ్నించారు. ఇప్పుడు కెసిఆర్ బిడ్డ పార్టీ పెట్టింది అంటున్నారు తప్ప కవిత పార్టీ పెట్టారు అని అనడం లేదని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం, పదవుల కోసం కన్నతండ్రినే కాదనుకుని, ఆయనపైనే విమర్శలకు

న్యూఢిల్లీ ః ఏదేనీ కేసులో నిందితుడికి కోర్టులు యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించవచ్చు. అయితే ఆ వ్యక్తి సరెండర్ కావాలని ఆదేశించే అధికారం ట్రయల్ కోర్టుకు లేదు. ఈ నిర్థిష్ట ఆదేశాలను సుప్రీంకోర్టు వెలువరించింది. ఫోర్జరీ, చీటింగ్ కేసులో నిందితుడు అయిన ఓ వ్యక్తి దాఖలు చేసుకున్న పిటిషన్పై న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం ఈ రూలింగ్ ఇచ్చింది. పిటిషనర్ సరెండర్ కావాలని ఆదేశించే అధికారం దిగువ కోర్టులకు ఉండదని స్పష్టం చేశారు. సరెండర్ అధికారం ట్రయల్ కోర్టుల పరిధిలోకి వచ్చే అంశం కాదని తెలిపారు. ఈ కేసులో ఈ నిందితుడు తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దశలో హైకోర్టు ఆయన మందస్తు బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. ఇదే దశలో వెంటనే సరెండర్ కావాలని, తరువాత రెగ్యులర్ బెయిల్కు అప్పీలు చేసుకోవాలని ఆదేశించింది. ఈ చర్యను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

ఆధునిక విమర్శకులు, పరిశోధకులు పెక్కురు కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆదర్శంగా తీసుకొని, వాత్స్యాయనుడు కామసూత్రములను రచించినాడని తీర్మానించారు. అర్థశాస్త్రపు తొలి సంపాదకుడు రుద్రపట్నం శ్యామశాస్త్రి కౌటిల్యుని రచనలోనూ, వాత్య్సాయనుని కతిలోనూ ప్రయోగింపబడిన ఒకే రకపు పారిభాషిక శబ్దాలను, సమస్త పదాలను ఉదాహరించిన తీరును గమనిస్తే ,అర్థశాస్త్రం ముందుది. కామసూత్రాలు పిదపవి అని తేటతెల్లం అవుతుంది. కౌటిల్యుని అర్థశాస్త్ర రచన ప్రణాళికను వాత్స్యా యనుడు చక్కగా, చొక్కంగా అనుసరించాడు. కనుక కామసూత్రాలు క్రీస్తుశకం రెండవ శతకపు పూర్వార్ధం లోనిదని నిర్ధారించారు. […] The post కామకళాశాస్త్ర గ్రంథాల పరిచయం – చరిత్ర appeared first on Navatelangana.
కవికి కాలానికి వద్ధాప్యముండదుగాయాలను మాన్పుకుంటూ పయనించడమేఒక అప్రకటిత సందేశం!కాలానికి తెలుసుపరిణామ క్రమంలో వచ్చేహెచ్చుతగ్గులు దాని వెనుక దాగినచీకటి వెలుగులు!కవి గుండెకు తెలుసు సముద్రపు లోతులుఅట్టడుగున ఎగిసిపడేఆటుపోట్ల సుడిగుండాలు!కాలము సముద్రముఎప్పటికీ యవ్వనం కోల్పోనట్లేఅంతకుమించి కవి నిత్య యవ్వనోత్తేజుడు!మరణం వరించి వచ్చినాపద్యం నాలుగో పాదం పూర్తిగానిదేయముని మహిషపులోహ గంటలకు ప్రవేశం ఉండదు!కాలం కరిగిపోయినా, కవి ఒరిగిపోయినాచరిత్ర పుటల్లో ఆచంద్రార్కంఒదిగిపోయే జ్ఞాపకాలే!!– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261 The post ఒదిగిపోయే జ్ఞాపకాలు! appeared first on Navatelangana.

మనతెలంగాణ/హైదరాబాద్: జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. జనగణన సెన్సెస్ 2027 కార్యక్రమంలో సిఎం రేవంత్రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సెన్సెస్ అధికారులు వివరించారు. వైబ్సైట్ ద్వారా తన వివరాలను సిఎం రేవంత్రెడ్డి నమోదు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ ప్రియాంక అల, ఐ అండ్ పిఆర్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, ఇతర అధికారులు పాల్గొన్నారు.
యువ రచయితలకుకథా, కవితా రచనలపై కార్యశాలయువ రచయితల్లో సృజనాత్మక రచనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎస్వీ యూనివర్సిటీ ప్రాచ్యపరిశోధనా సంస్థ సౌజన్యంతో, సాహితీ స్రవంతి మరియు వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు ప్రత్యేక కార్యశాల ఎస్వీ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో నిర్వహిస్తారు. ఓ. వెంకటరమణ, ఆచార్య రాజేశ్వరమ్మ, కెంగార మోహన్, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, పలమనేరు బాలాజీ, మధురాంతకం నరేంద్ర, ఆచార్య పి.సి. […] The post సాహితీ వార్తలు appeared first on Navatelangana.

న్యూఢిల్లీ ః దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. స్విట్జర్లాండ్లోని జూరిచ్కు బయటుదేరిన స్విస్ విమానం ప్రమాదానికి గురైంది. విమానం టేకాఫ్ దశలో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీనితో సమయస్ఫూర్తితో వ్యవహరించిన పైలట్ టేకాఫ్ దశలోనే నిలిపివేశారు. అత్యవసర ద్వారాల నుంచి ప్రయాణికులను దింపారు. ఈ క్రమంలోనే కొందరికి గాయాలు అయినట్లు స్విస్ ఎయిర్లైన్స్ అధికారులు ధృవీకరించారు.
అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రప్రభావం చూపుతోంది. అంతకు ముందు గాజాపై జరిపిన యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితినే చవిచూశాము. అలాగే కొద్ది రోజులే అయినా గతేడాది భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఇలాంటి భయంకర వాతావరణాలు ప్రాణ, ఆస్తి నష్టాలకే పరిమితం కాకుండా, మనసు మీదా కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!మనం ప్రతిరోజూ ఆస్తి, ప్రాణ నష్టాల దృశ్యాలు, సోషల్ […] The post మనసు మీదా యుద్ధ భయం appeared first on Navatelangana.



మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 4 లేదా 5న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 16న పరీక్షలు విజయవంతంగా పూర్తి కావడంతో వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు 5,17,760 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 5,16,534 మంది(99.76 శాతం) హాజరయ్యారు. మార్చి 14న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు ఈనెల 14వ తేదీ వరకు కొనసాగాయి. పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే, ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థులకు త్వరగా ఫలితాలను అందించాలనే ఉద్దేశంతో పరీక్షలు పూర్తికాకముందే ఈనెల 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ నెల 23న జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయ్యింది. పేపర్ల స్కానింగ్ ముగిసిన వెంటనే మార్కుల క్రోడీకరణ చేపడతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఎటువంటి సాంకేతిక సమస్యలు లేని పక్షంలో మే 4 లేదా 5వ తేదీల్లో ఫలితాలను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.




మూడు రోజుల పాటు తీవ్రమయిన వడ గాలులురాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు మిశ్రమ వాతావరణం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం అయినా పెరగనున్న ఉష్ణోగ్రతలు వెల్లడించిన వాతావరణ శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి మహోగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం నుంచే తీవ్రమయిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచి భానుడు ప్రతాపం, మధ్యాహ్న సమయంలో విపరీతంగా వడగాల్పులు వీస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల పాటు తీవ్రమయిన వడగాలులు ఉంటాయని తెలంగాణ వెథర్మ్యాన్ హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 27 నుంచి దక్షిణ తెలంగాణలో ఉరుములతో వర్షాలు, ఏప్రిల్ 30 వరకు వడగాలులు ఉంటాయని తెలిపారు. కాగా, ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిలా మారాయని, ఆదివారం ఆదిలాబాద్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, హైదరాబాద్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యిందని, వచ్చే మూడు రోజులు వడగాలులు మరింత ఉధృతంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో రాబోయే మూడు రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల మధ్

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో అధికాక తృణమూల్ కాంగ్రెస్ భయానక పాలన సాగుతోందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేబ్దీప్ ఛటర్జీ ఇటీవలే దారుణ హత్యకు గురయ్యారు. టిఎంసి గూండాలే ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అధికార దర్పంతో వ్యవహరిస్తున్న టిఎంసి సంబంధిత వ్యక్తులు తమ పార్టీ కార్యకర్తపై దాడికి దిగి తీవ్రంగా గాయపర్చారని, తరువాత ఆయన చనిపోయ్యాడని రాహుల్ తెలిపారు. రాష్ట్రంలో టిఎంసి గూండాగిరి సాగుతోంది. దేశంలో కొనసాగుతూ వస్తోన్న అహింసాత్మక సంవిధానానాకి ఇటువంటి ఘటనలు మచ్చ తీసుకువస్తాయని రాహుల్ తెలిపారు. అసనోల్ నార్త్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా ఉన్న ప్రసేన్ జిత్ పుయితనిధికి అత్యంత నన్నిహితుడు అయిన కార్యకర్త ఛటర్జీ హత్య పై కాంగ్రెస్ నేత తీవ్రస్థాయిలో స్పందించారు బెంగాల్లో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదని, ఇక్కడ టిఎంసి భయోత్పాతక రాజ్యం సాగుతోందని తెలిపారు. తమ పార్టీ కాంగ్రెస్ ఎప్పుడూ హింసాత్మక చర్యలకు దిగలేదు. ఇకపై కూడా దిగబోదని స్పష్టం చేశారు. కార్యకర్తలంటే పార్టీలో ప్రాణంతో సమానం అని తెలిపారు.