
4053 వార్తలు
నవతెలంగాణ – ఉప్పునుంతల ఉప్పునుంతల మండల పరిధిలోని అయ్యవారిపల్లి గేటు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీకే తిరుమాపూర్ గ్రామానికి చెందిన జటగోని రాజేష్ (15) హోండా షైన్ ఏపీ 22 ఏ ఆర్ 1778 బైక్పై అమ్రాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తుండగా, హజీపూర్ నుంచి డిండి రోడ్డువైపు వస్తున్న జల్ తండాకు చెందిన ధర్మ నాయక్ హోండా గ్లామర్ టీఎస్ […] The post ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు అక్కడికక్కడే మృతి appeared first on Navatelangana.

హైదరాబాద్: తెలంగాణ పైన మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయని, అన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు, హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో కలిసి కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుటిల ప్రయత్నాలు, తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసినా ప్రజలు రానున్న శాసనసభ ఎన్నికల్లో కెసిఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు మారిన తర్వాత ఏ నాయకుడికి ఉనికి ఉండదని చెప్పారు. హుజూర్నగర్లో పార్టీ మారిన ఎంఎల్ఎ కనీసం తన సొంత గ్రామంలో సర్పంచ్ను కూడా గెలిపించుకోలేని పరిస్థితికి దిగజారిపోయారని పేర్కొన్నారు. హుజూర్నగర్ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి గులాబీ పార్టీలో చేరిన పిల్లుట్ల రఘుకి కెటిఆర్ అభినందనలు తెలిపారు. హుజూర్నగర్ నియో

తెలంగాణ అస్తిత్వాన్ని గాలికొదిలేసినోళ్లాఒరిజినల్ గురించి మాట్లాడేది బిఆర్ఎస్ నాయకులకు తెలంగాణ రాష్ట్ర సేనా నేతల కౌంటర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్ఎస్) ఏర్పాటుతో బిఆర్ఎస్ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిందని ఆ పార్టీ నాయకులు అన్నారు. కవిత ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్తో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎల్. రూప్ సింగ్, రంగు నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్, గొంగళ్ల రంజిత్ కుమార్, మంచాల వరలక్ష్మీ, నరేశ్ ప్రజాపతి మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ పేరుతో కవిత పార్టీ పేరు ప్రకటించగానే బిఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒరిజినల్, డూప్లికేట్ అంటూ చేసిన పోస్టులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్కు నిజమైన హక్కుదారు కవితక్కనే అని రంగు నవీన్ ఆచారి అన్నారు. బిఆర్ఎస్ వదిలేసిన తెలంగాణవాదాన్ని కవిత భుజాన ఎత్తుకున్నారని గుర్తు చేశారు. అధికారం వచ్చిన వెంటనే తెలంగాణవాదాన్ని, ఉద్యమకారులను వదిలేసిన చరిత్ర బిఆర్ఎస్ది కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణవాదులను లాఠీలతో కొట్ట

రాష్ట్రంలో జనగణన 2027 స్వీయ- నమోదు ప్రారంభంలోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా శ్రీకారం ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ పిలుపు మన తెలంగాణ / హైదరాబాద్ : జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో స్వీయ నమోదు ప్రక్రియను ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆన్లైన్ ద్వారా స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. జనాభా గణన ఒక కీలక జాతీయ కార్యక్రమమని పేర్కొన్నారు. ఇది దేశంలోని జనాభా, వారి సామాజిక-, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించడంతో పాటు, సమర్థవంతమైన ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాదిగా నిలుస్తుందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో విధానాల రూపకల్పనలో జనగణన ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు. కచ్చితమైన సమాచారంతో లక్ష్యిత సంక్షేమ పథకాలు రూపొందించడమే కాకుండా, దేశ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి ఇది సహకరిస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో ఇదే మొదటి జనాభా గణన కావ
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. సాయి సుదర్శన్ (87) దూకుడుగా ఆడడంతో 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ తడబడలేదు. […] The post సీఎస్కేపై ఈజీగా గెలిచిన గుజరాత్ appeared first on Navatelangana.
జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న జిల్లా కలెక్టర్నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లజన గణన 2027 లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. జన గణన 2027 లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10 వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయ గణన ప్రక్రియను జిల్లా […] The post స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలి appeared first on Navatelangana.
హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై శ్రీ వాసవి మాత చిత్ర పటానికి పుష్పమాల వేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ రాందాస్, సీపీఓ శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. The post శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు appeared first on Navatelangana.

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కె 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని జిటి 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటింగ్లో సాయి సుదర్శన్ 87 పరుగులతో రాణించాడు. బటర్ల్ (39 నాటౌట్), గిల్ (33) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో గుజరాత్ 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. చెన్నై ఒక స్థానం కోల్పోయి.. 6 స్థానానికి పడిపోయింది.
నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి మండలం మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి, దొంగిలించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చుక్కాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు ఇందూరి ఎల్లగౌడ్ తన స్కూటీ దొంగిలించబడిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తులసి ఆయిల్ మిల్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను […] The post ద్విచక్రవాహన దొంగ అరెస్ట్ appeared first on Navatelangana.




– కార్యక్రమ వివరాలు వెల్లడించిన కార్యాలయ సిబ్బందినవతెలంగాణ – అశ్వారావుపేటప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన కార్యాలయ సిబ్బంది కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఉదయం 9 గంటలకు తిరుమలకుంట గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు […] The post రేపు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె పర్యటన appeared first on Navatelangana.

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో కోల్కతా ఏడు మ్యాచులు ఆడితే రాజస్థాన్తో జరిగిన గత మ్యాచ్లో విజయం సాధించి.. గెలుపు ఖాతా తెరిచింది. దీంతో ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు లక్నో వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ మ్యాచ్లో విజయం లక్నోకి కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సిద్ధార్త్ స్థానంలో లిండే జట్టులోకి వచ్చాడు. కోల్కతా గత మ్యాచ్లోని జట్టునే కొనసాగిస్తోంది. తుది జట్లు: ఎల్ఎస్జి: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, ముకుల్ చౌదరీ, జార్జ్ లిండే, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, మోసిన్ ఖాన్. కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(కీపర్), కామరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రోమ్మెన్ పోవెల్, రింకూ సింగ్, సునీల్ సరైన్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ.

నవతెలంగాణ – న్యూఢిల్లీ : అశోక్ కుమార్ మిట్టల్, రాఘవ్ చద్దాతోపాటు ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో వీలైనమనట్లు శుక్రవారం ప్రకటించారు. తాజాగా ఈ ఎంపీలందరిపై అనర్హత వేటు వేయమని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ఆదివారం రాజ్యసభ ఛైర్మన్ సి. పి రాధాకృష్ణన్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఫిరాయింపులు ముఖ్యంగా పంజాబ్లో ప్రజల తీర్పుకు ద్రోహం చేయడమే కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని` ఆయన ఆరోపించారు. […] The post పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి: రాజ్యసభ ఛైర్మన్కు ఆప్ వినతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – పరకాల ఎండ తీవ్రత తాళలేక వడదెబ్బతో ఒక వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన పరకాల పట్టణంలోని చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు, పాలిటెక్నిక్ కాలేజీ వెనుక గల శాంతినగర్కు చెందిన కోకిల తిరుపతి (43) వృత్తిరీత్యా ఉప్పర పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారి పనిలో భాగంగా గత శుక్రవారం కూలీ పనికి వెళ్లిన తిరుపతి, తీవ్రమైన ఎండల కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చి […] The post వడదెబ్బతో వ్యక్తి మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – కామారెడ్డి పాల్వంచ మండలంలోని పోతారం గ్రామంలో ఆదివారం పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఎప్పుడూ అంకిత భావంతోనే పనిచేస్తుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తూ వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. “రైతు బాగుంటే దేశం […] The post పోతారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.
– బీఆర్ఎస్ నాయకులు సంపూర్ణ పార్టీ శ్రేణులకు పిలుపునవతెలంగాణ – అశ్వారావుపేట బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ అశ్వారావుపేట పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ పార్టీ శ్రేణులకు ఆదివారం పిలుపునిచ్చారు. సోమవారం నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో ని మూడు రోడ్ల ప్రధాన కూడలి లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున […] The post రజతోత్సవ ముగింపు వేడుకలు విజయవంతం చేద్దాం appeared first on Navatelangana.

హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్పై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. స్కైరూట్ కంపెనీ తాము తెస్తే.. ఈ సిఎం రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. బిఆర్ఎస్ బలం పెరిగిందని కెటిఆర్ అన్నారు. ‘‘మోసపు హామీలు నమ్మి.. ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారు. కాంగ్రెస్లో కమల్హాసన్ను మించిన నటులు ఉన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి? మూసీని దుర్గంధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రూ.3.70 లక్షల కోట్లు అప్పు చేశానని రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఢిల్లీకి మూటలు మోయటం తప్ప.. ఆయన చేసిందేమీ లేదు’’ అని కెటిఆర్ ఆరోపించారు.


మాస్కో: వాయువ్య రష్యాలో కీలకమైన ఎరువుల ప్లాంట్ ‘ఫోస్ ఆగ్రో’పై ఉక్రెయిన్ డ్రోన్తో దాడి చేసింది. ఏప్రిల్ నెలలో ఈ ప్లాంట్పై దాడి జరగడం ఇది రెండోసారి. రష్యా కీలక ఎగుమతి కేంద్రాలపై ఇటీవల కాలంలో ఉక్రెయిన్ దాడులు తీవ్రమయ్యాయి. ఈ ప్లాంట్లోని సల్ఫూరిక్ యాసిడ్ పంప్ చేసే హై ప్రెజర్ పైప్లైన్లను ఈ డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని వోలోగ్డా గవర్నర్ జార్జి ఫలిమొనోవ్ ధృవీకరించారు. కాకపోతే ఎటువంటి మంటలు లేదా లీకేజీకి ఈ దాడి కారణం కాలేదని వెల్లడించారు. పైప్లైన్కు వెంటనే మరమ్మతులు నిర్వహించినట్లు తెలిపారు. దీంతో ప్రమాదకర గ్యాస్లు కూడా ఏమీ లీక్ కాలేదని చెప్పారు. ‘ఫోస్ అగ్రో’ ప్రతినధి మాత్రం ఈ దాడిపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం పశ్చిమాసియా యు్ధం తీవ్రస్థాయిలో ఉండటంతో నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో పాటు రష్యా, చైనా దేశలు వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. రష్యా వంటి ఫాస్ఫరస్ ఆధారిత ఎరువులను భారత్కు ఎగువతి చేసే కంపెనీల్లో ఇది కూడా ఉంది.