
4053 వార్తలు






చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ చెన్నైని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై టాపార్డర్ గుజరాత్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్ అండగా నిలిచాడు. బౌలర్లను ఎదురుకుంటూ పరుగులు రాబట్టాడు. 49 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం పకడ్బందీగా బ్యాటింగ్ చేశాడు. 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలింగ్లో రబాడా 3, అర్షద్ 2, సిరాజ్, సుతార్ తలో వికెట్ తీశారు.


హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా సదాశివ పేట మండలం నందికంది దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తుండగా ఆటో డివైడర్ ను ఢీకొంది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు లావణ్య(39), రుక్మిణి(42) గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణం ఆటో డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


అమరావతి: పెట్రోల్, డీజిల్ సరఫరాలో చిన్న పాటి లోపాలు మాత్రమే ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇబ్బంది సమయంలో కంపెనీలు సమర్ధవంతంగా పనిచేయాలని అన్నారు. కొరత సృష్టించి వినియోగదారులకు అసౌకర్యం తగదని, చమురు కంపెనీలు, డీలర్లతో అధికారుల వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ కన్నబాబు, డీలర్ల సంఘం ప్రతినిధులు, చమురు కంపెనీలు పాల్గొన్నారు. రేపు ఉ.6 లోగా అన్ని పెట్రోల్ బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఎక్కడా సరఫరా లో సమస్యలు లేకుండా చూడాలని, అధిగమించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని సూచించారు. చమురు కంపెనీల డిపోల వద్దకు వెళ్లి జెసిలు తనిఖీ చేయాలని, సరఫరాలో ఎక్కడా ఆలస్యం లేకుండా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. సోషల్ మీడియాలో అనవసరమైన ప్రచారం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.




చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓ వైపు వరుస ఓటములతో సతమతమవుతున్న గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్పై భారీ తేడాతో విజయం సాధించిన చెన్నై ఫుల్ ఫామ్లో గుజరాత్ను ఢీకొనేందు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఒక్కో మార్పు చేశాయి. చెన్నై జట్టులోకి ఉర్విల్ రాగా, గుజరాత్లోకి అర్షద్ వచ్చాడు. తుది జట్లు: జిటి: సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్(కెప్టెన్), జాస్ బట్లర్(కీపర్), షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, మనవ్ సుతార్. సిఎస్కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తిక్ శర్మ, జెమీ ఓవర్టన్, అకీల్ హుసెన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్.

జాతీయ బిసి సంఘం జిల్లా ఇంఛార్జి సమ్మయ్యనవతెలంగాణ – మల్హర్ రావుఆర్టీసీ విషయంలో ప్రభుత్వానిది చారిత్రాత్మక నిర్ణయమని,ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా జాతీయ బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో పట్టించుకున్న దాఖల్లోలేవని,పోరాటంలో 56 మంది కార్మికులు చనిపోయి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారము కార్మికుల సమస్యలు ప్రభుత్వంలో […] The post ఆర్టీసీ విషయంలో ప్రభుత్వానిది చారిత్రక నిర్ణయం appeared first on Navatelangana.
నవతెలంగాణ – కామారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టరేట్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాత జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మొదటిసారి ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మధుమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి […] The post కలెక్టరేట్లో ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు appeared first on Navatelangana.
అడుగట్టిపోతున్న బోర్లు, ఎండిపోతున్న పంటలునవతెలంగాణ – మిరుదొడ్డి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రైతన్నలు సాగునీటి కష్టాలతో సతమతమవుతున్నారు. తీవ్ర ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు నీరందక వెలవెలబోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. మిరుదొడ్డి మండల వ్యాప్తంగా గత నెల రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీని ప్రభావం నేరుగా వ్యవసాయంపై పడింది. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి అడుగంటాయి. పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు రైతులు వేసిన బోర్లు […] The post మిరుదొడ్డిలో సాగునీటి గోస.. appeared first on Navatelangana.
జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లునవతెలంగాణ- అచ్చంపేటఅథ్లెటిక్స్ పై ఆసక్తి పెంచుకుంటే చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చు అని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ పోటీలను అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల మైదానంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి అడిషనల్ ఎస్పీ మాట్లాడారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు బాల్యం నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకుని ఆటల్లో లీనమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగి, నాయకత్వ లక్షణాలు […] The post క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చు appeared first on Navatelangana.
– బల్మూరు సీపీఐ(ఎం) పిలుపు – ఉత్సవాలకు హాజరుకారున్న రాష్ట్ర నాయకులునవతెలంగాణ – బల్మూరు ఎర్రజెండా అంటేనే కార్మికుల హక్కులు, ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు ముందుంటుందని బల్మూరు మండల సీపీఐ(ఎం) మండల కమిటీ పేర్కొన్నది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు శంకర్ నాయక్, లాల్ అహ్మద్ మాట్లాడుతూ.. మే 1 న ఉద్యమాలను గౌరవించే ఆధునిక అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని.. 1886లో చికాగోలోని హే మార్కెట్ లో జరిగిన దుస్సంఘటన జ్ఞాపకార్థం 1889లో ‘మే’ డే దినోత్సవాన్ని స్థాపించారని […] The post మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత ఏర్పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులోని పలు చోట్ల బంకుల వద్ద డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని చోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. మేడికొండూరు, పేరేచర్లతోపాటు పల్నాడులోని వివిధ మండలాల్లో డీజిల్ కొరత ఉంది. కొన్ని బంకుల్లో ఆటోల్లో రూ.200, కార్లలో రూ.500 డీజిల్ మాత్రమే కొడుతున్నారు. మరోవైపు మార్కాపురం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. యర్రగొండ పాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలోని బంకుల్లో కొరత ఉంది. వివిధ బంకుల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. కొరత ఏర్పడిందన్న ఉద్దేశంతో కొందరు వాహనదారులు అవసరానికి మించి ఇంధనం నింపుకుంటున్నారు.

ఉప్పల్: ఫ్లైఓవర్ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డులో తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్ టిసి అధికారులు ప్రకటించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద హన్మకొండ వైపు వెళ్ళే బస్సులు ఆగే బస్టాండ్ను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచే నల్లచెరువు వద్ద బస్సులు ఆగుతాయని అధికారుల ప్రకటించారు. బోడుప్పల్ వైపు నుండి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుండి భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ నుండి నాచారం ద్వారా చెంగిచర్ల చేరుకుని అక్కడి నుండి జాతీయ రహదారి చేరుకోవాలని, చిన్న వాహనాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుండి రహదారికి చేరుకోవాలని సూచించారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజులు ఉంటాయో, ఫ్లైఓవర్ పనులు ఎన్నటికి పూర్తి చేస్తారోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పనులకు శ్రీకారంనవతెలంగాణ – నాచారం నాచారం సర్కిల్ మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మల్లాపూర్ డివిజన్తో […] The post మల్లాపూర్లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి భూమిపూజ appeared first on Navatelangana.