
4063 వార్తలు

జాతీయ బిసి సంఘం జిల్లా ఇంఛార్జి సమ్మయ్యనవతెలంగాణ – మల్హర్ రావుఆర్టీసీ విషయంలో ప్రభుత్వానిది చారిత్రాత్మక నిర్ణయమని,ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా జాతీయ బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో పట్టించుకున్న దాఖల్లోలేవని,పోరాటంలో 56 మంది కార్మికులు చనిపోయి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారము కార్మికుల సమస్యలు ప్రభుత్వంలో […] The post ఆర్టీసీ విషయంలో ప్రభుత్వానిది చారిత్రక నిర్ణయం appeared first on Navatelangana.
నవతెలంగాణ – కామారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టరేట్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాత జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మొదటిసారి ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మధుమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి […] The post కలెక్టరేట్లో ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు appeared first on Navatelangana.
అడుగట్టిపోతున్న బోర్లు, ఎండిపోతున్న పంటలునవతెలంగాణ – మిరుదొడ్డి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రైతన్నలు సాగునీటి కష్టాలతో సతమతమవుతున్నారు. తీవ్ర ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు నీరందక వెలవెలబోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. మిరుదొడ్డి మండల వ్యాప్తంగా గత నెల రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీని ప్రభావం నేరుగా వ్యవసాయంపై పడింది. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి అడుగంటాయి. పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు రైతులు వేసిన బోర్లు […] The post మిరుదొడ్డిలో సాగునీటి గోస.. appeared first on Navatelangana.
జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లునవతెలంగాణ- అచ్చంపేటఅథ్లెటిక్స్ పై ఆసక్తి పెంచుకుంటే చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చు అని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ పోటీలను అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల మైదానంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి అడిషనల్ ఎస్పీ మాట్లాడారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు బాల్యం నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకుని ఆటల్లో లీనమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగి, నాయకత్వ లక్షణాలు […] The post క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చు appeared first on Navatelangana.
– బల్మూరు సీపీఐ(ఎం) పిలుపు – ఉత్సవాలకు హాజరుకారున్న రాష్ట్ర నాయకులునవతెలంగాణ – బల్మూరు ఎర్రజెండా అంటేనే కార్మికుల హక్కులు, ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు ముందుంటుందని బల్మూరు మండల సీపీఐ(ఎం) మండల కమిటీ పేర్కొన్నది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు శంకర్ నాయక్, లాల్ అహ్మద్ మాట్లాడుతూ.. మే 1 న ఉద్యమాలను గౌరవించే ఆధునిక అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని.. 1886లో చికాగోలోని హే మార్కెట్ లో జరిగిన దుస్సంఘటన జ్ఞాపకార్థం 1889లో ‘మే’ డే దినోత్సవాన్ని స్థాపించారని […] The post మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత ఏర్పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులోని పలు చోట్ల బంకుల వద్ద డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని చోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. మేడికొండూరు, పేరేచర్లతోపాటు పల్నాడులోని వివిధ మండలాల్లో డీజిల్ కొరత ఉంది. కొన్ని బంకుల్లో ఆటోల్లో రూ.200, కార్లలో రూ.500 డీజిల్ మాత్రమే కొడుతున్నారు. మరోవైపు మార్కాపురం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. యర్రగొండ పాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలోని బంకుల్లో కొరత ఉంది. వివిధ బంకుల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. కొరత ఏర్పడిందన్న ఉద్దేశంతో కొందరు వాహనదారులు అవసరానికి మించి ఇంధనం నింపుకుంటున్నారు.

ఉప్పల్: ఫ్లైఓవర్ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డులో తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్ టిసి అధికారులు ప్రకటించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద హన్మకొండ వైపు వెళ్ళే బస్సులు ఆగే బస్టాండ్ను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచే నల్లచెరువు వద్ద బస్సులు ఆగుతాయని అధికారుల ప్రకటించారు. బోడుప్పల్ వైపు నుండి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుండి భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ నుండి నాచారం ద్వారా చెంగిచర్ల చేరుకుని అక్కడి నుండి జాతీయ రహదారి చేరుకోవాలని, చిన్న వాహనాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుండి రహదారికి చేరుకోవాలని సూచించారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజులు ఉంటాయో, ఫ్లైఓవర్ పనులు ఎన్నటికి పూర్తి చేస్తారోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పనులకు శ్రీకారంనవతెలంగాణ – నాచారం నాచారం సర్కిల్ మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మల్లాపూర్ డివిజన్తో […] The post మల్లాపూర్లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి భూమిపూజ appeared first on Navatelangana.




హైదరాబాద్: బిగ్ బాస్ ఫేం, సినీ నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదయ్యాంది. పెళ్లి పేరుతో నమ్మించి రూ 9.5 కోట్లు మోసం చేసిందని ధర్మేంద్ర కుటుంబం ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫాట్లు, కారు, గిఫ్టుల రూపంలో రూ. 9.5 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. తన కుమారుడిని మోసం చేసిందని తన తండ్రి సత్యనారాయణ, అషురెడ్డి సోదరి దివ్యారెడ్డికి రూ. 50 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018 లో అషురెడ్డి, ధర్మేంద్రల మధ్య పరిచయం ఏర్పడింది. ఇరుకుటుంబాలు వేణుస్వామితో జాతకాలు సైతం చూపించారు. సడన్ గా ధర్మేంద్రతో పెళ్లికి నిరాకరించడంతో ధర్మేంద్ర డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అషురెడ్డి డబ్బులు ఇవ్వకపోగా తిరిగి కేసు పెడతానని బెదిరించి ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బాయ్ ఫ్రెండ్ జయంత్ తో కలిసి డ్రామా ఆడిందని బాధితుడు ధర్మేంద్ర అన్నారు. ఛీటింగ్ ఆరోపణలపై అషురెడ్డి స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని, పెళ్లి పేరుతో రూ. 9.83 కోట్లు కాజేశాననేది అవాస్తమని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని, ధర్మేంద్ర కుటుంబానికి అషురెడ్డి హెచ్చరించారు. అషురెడ్డిని ఆమె తల్లే



అమరావతి: అర్థరాత్రి అమ్మాయిపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేస్తుండగా పోలీసులు కాపాడారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ శివారలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. అర్థరాత్రి ఆమె విజయవాడ బస్టాండ్కు చేరుకుంది. రాత్రి సమయంలో నంబూరుకు వెళ్లడం మంచిది కాదని బస్టాండ్లో వెయిట్ చేస్తోంది. ఓ ఆటో డ్రైవర్ నంబూరుకు వెళ్తానని పలుమార్లు ఆమెను అడిగాడు. ఆటోలో వెళ్లడం సురక్షితం కాదని అక్కడే ఉండిపోయింది. ఆటో డ్రైవర్ మళ్లీ వచ్చి అడగడంతో సరేనని వెళ్లింది. అప్పటికే యువతి శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో ఆటో నంబర్ను యాఫ్ ఎంటర్ చేసింది. విజయవాడ నుంచి డిజిపి కార్యాలయం దాటిన వెంటనే ఆమెతో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసులు ఆటోను వెంబడించి పట్టుకున్నాడు. ఆటో డ్రైవర్ కొలను కొండకు చెందిన ఫణీంద్రగా గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో అతడి వ్యవహారశైలిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శక్తి యాప్ ద్వారా యువతిని పోలీసులు కాపాడడంతో మంత్రి నారా లోకేష్ మంగళగి


జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో ఓటమిని చవి చూసింది. సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. భారీ స్కోర్ సాధించినప్పటికీ.. ఛేజింగ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైంది. అయితే మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపాలు కావడానికి కారణాలను ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు. ఫీల్డింగ్లో తమ జట్టు విఫలమైందని.. కీలకమైన క్యాచ్లు వదిలేశామని పరాగ్ అన్నాడు. ‘‘నైపుణ్యం పరంగా మా ప్రణాళికలను సరిగ్గానే అమలు చేశాం. కానీ, కీలకమైన క్యాచ్లను వదిలేశాం. అదీనూ భారీ షాట్లు కొట్టే అభిషేక్ వంటి ప్లేయర్లు ఇచ్చిన క్యాచ్ను వదిలిపెట్టడం నష్టం చేసింది. ఇలాంటి వారి నుంచి రెండో ఛాన్స్ వస్తుందని ఆశించలేం. మ్యాచ్ను మా నుంచి లాగేశారు. మేం ఫీల్డింగ్లో ఇంకాస్త మెరుగు కావాల్సిన అవసరం ఉంది. గేమ్లో ఇదంతా భాగమే అయినా.. ఇంప్రూవ్ చేసుకుంటాం. తర్వాత మ్యాచ్ నాటికి సరి చేసుకుని బరిలోకి దిగుతాం. తొలుత మేం బ్యాటింగ్ో కనీసం మరో 15 పరుగులు చేయాల్సింది. ఆఖర్లో సన్రైజర్స్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. యార్కర్లను చక్కగా అమలు చేశారు’’ అని పరాగ్ తెలిపాడు.

అమరావతి: ఎపిలో డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలు ఇంధనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు పై పేర్ని నాని మండిపడ్డారు.ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు స్పహ లేకపోవడం దురదృష్టకరం అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారని, దేశంలో తనకంటే అనుభవమున్న సిఎం లేడని కోతలు కోస్తుంటారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరత వ్యాపారస్తులకు పండుగలా మారిందని ధ్వజమెత్తారు. పలుకుబడి ఉపయోగించి సమస్యను పరిష్కరించలేరా? అని తమ అనుభవం ఎందుకు? అని ప్రశ్నించారు. పెట్రోల్ అగచాట్ల మాటున పేద, మధ్యతరగతి ప్రజల బ్రతుకులు నలిగిపోతున్నాయని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవతెలంగాణ కంఠేశ్వర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ సర్వసభ్య సమావేశం ఆదివారం నిజామాబాదు నగరంలోని సందీప్ గార్డెన్స్ లో జరిగింది. ఈ సందర్భంగా 2026-27 సంవత్సరానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.క్లబ్ అధ్యక్షుడిగా పెట్టిగాడి రాఘవేందర్,కార్యదర్శిగా చింతల గంగాదాస్,కోశాధికారిగా అంకం రాజేందర్ ఎన్నికయ్యారు.ఎన్నికల అధికారిగా లయన్స్ జిల్లా అదనపు కోశాధికారి పి.లక్ష్మినారాయణ వ్యవహరించారు..లయన్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాఘవేందర్ ఈ సందర్భంగా చెప్పారు.కార్యక్రమంలో లయన్స్ జిల్లా కార్యదర్శులు డి.యాదగిరి,కె.రవీందర్,జోన్ చైర్మెన్ అబ్బాయి […] The post ఇందూర్ లయన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన ఒక కార్యక్రమం వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారన్న వార్త తనకు ఉపశమనం కలిగించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు జరిగింది. ఈ […] The post ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పులు..ఖండించిన ప్రధాని మోడీ appeared first on Navatelangana.

