
4291 వార్తలు





చిట్టగాంగ్: న్యూజిలాండ్తో గురువారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ల సిరీస్ను 21తో కైవసం చేసుకుం ది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (0), తన్జిద్ హసన్ (1) విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన సౌమ్య సర్కార్ (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఈ దశలో నజ్ముల్ హుస్సేన్ శాంటో, వికెట్ కీపర్ లిటన్ దాస్లు అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ తరచు బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. శాంటో,దాస్లు కలిసి నాలుగో వికెట్కు వేగంగా 160 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన లిటన్ దాస్ 76 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు శాంటో 9 ఫోర్లు, రెండు సిక్స్లతో 105 పరుగులు చేశాడు. తౌహిద్ హృదయ్ (33), కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (22) పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 44.5 ఓవర్లలో 210 పరుగులకే కుప్ప
నవతెలంగాణ – హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజుల పాటు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్ దృష్ట్యా ఇవాళ, రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. The post కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజులు పరీక్షలు వాయిదా appeared first on Navatelangana.

ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ‘వేదవ్యాస్’ చిత్రం బ్యానర్ ఆవిష్కరణ ఫిలిం నగర్ లోని సాయిబాబా దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగింది. మాజీ శాసనసభ్యులు, వ్యాపారవేత్త అయిన కొమ్మూరి ప్రతాపరెడ్డి తమ బ్యానర్కు ‘సాయి ప్రగతి ఫిలిమ్స్’ అని నామకరణం చేసుకొని చిత్ర దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకులు అచ్చిరెడ్డిలతో కలిసి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్యానర్ను ఆవిష్కరించారు. సకుటుంబ సమేత కథాంశంతో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వేదవ్యాస్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ ‘వేద వ్యాస్’ చిత్రం ద్వారా కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్ సెగ్మెంట్ ను తెలుగు తెరకు పరిచయం చేయటం విశేషం. ఇంకా ఈ చిత్రంలో సాయికుమార్, సుమన్, బాబు మోహన్, శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్, రఘు బాబు, అజయ్ ఘోష్ వంటి ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి ’గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని స మర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉ మేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ జేడి చక్రవర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. -ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక షేడ్, సెకండ్ హాఫ్లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్ లో కనిపించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.



నవతెలంగాణ – హైదరాబాద్: నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. “క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ […] The post ఆర్టీసీ డ్రైవర్ మృతి..సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి appeared first on Navatelangana.








హైదరాబాద్: ఓ సినిమాలో ఓ హీరో నితిన్ కు జోడిగా రితికా నాయక్ నటిస్తున్నారు. సితారా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు సమాచారం. నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వెల్లడించనున్నారు. టాలీవుడ్ లో వరుస పరాజయాలతో నితిన్ వెనుబడ్డాడు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే విషయం ఇంకా తెలియలేదు. రితికా నాయక్ నటిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అతి త్వరలో సినిమా యూనిట్ వెల్లడించనుంది. ఈ సినిమాలో నితిన్ ను భగ్నప్రేమికుడిగా చూపించనున్నట్టు సమాచారం.

హైదరాబాద్: ఆర్ టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన కుటుంబాని ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.... ఆర్ టిసి కార్మికులు ఎవరు తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. ఆర్ టిసి జెఎసి నాయకులతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబాన్ని దు:ఖంలో ముంచిందని బాధను వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆర్ టిసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం గమనిస్తోందని, వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని వివరించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాల్వాయిపాడులో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రటాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.
