21551 వార్తలు

నవతెలంగాణ-నవాబు పేటమండల పరిధిలోని రుద్రారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో పాటు గ్రామ సర్పంచ్ రవి ఉపసర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి సామూహిక భోజనం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది అని వారు అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల మౌలిక సదుపాయాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. The post విద్యార్థులతో సామూహిక భోజనం చేసిన సర్పంచ్ రవి appeared first on Navatelangana.

లండన్: ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు. బ్రెండన్ మెక్కల్లమ్ స్థానంలో ఫ్లెమింగ్ కోచ్గా వచ్చాడు. అంతే కాకుండా బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్థానంలో కొత్త సారథిగా జో రూట్ని నియమించారు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇంగ్లండ్ టెస్ట్ కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాను. ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మక కోచింగ్ పదవులలో ఇది ఒకటి. ఈ పదవికి ఎంపిక కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ప్రస్తుతం విజయాలు సాధించడమే మా ప్రధాన లక్ష్యం. అదే సమయంలో భవిష్యత్తులో జట్టు పటిష్టమైన స్థితిలో ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం ఇక్కడ ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారు. వారిలోని సామర్థ్యాన్ని వెలికి తీసి ప్రపంచస్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు.

నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ (మంజల్పూర్,ధాంతియ), బీహార్ (బంకిపూర్), గుజరాత్ (వడదోర)లో రాష్ట్రాల్లో జరుగుతున్న బైపోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్లలకు భారీగా తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వడదోర, మంజల్ పూర్ 34.35శాతం, బంకింపూర్ లో 33.57శాతం, ధాంతియలో 68.78 శాతం పోలింగ్ నమోదైంది. వచ్చే నెల ఆగష్టు 4న బైపోల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆయా నియోజక వర్గాల్లో ఎలాంటి […] The post ముగిసిన బైపోల్ appeared first on Navatelangana.

– మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి..నవతెలంగాణ – ఊరుకొండగత మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల నేపథ్యంలో ఊరుకొండ మండల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ.. మబ్బులు పట్టి వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు పాతబడిన, బలహీనమైన ఇళ్లలో […] The post అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.

– పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలి: డీఎస్పీ వెంకట్ రెడ్డినవతెలంగాణ – ఊరుకొండ పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని కల్వకుర్తి డిఎస్పి ఎస్.వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం ఊరుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కల్వకుర్తి డిఎస్పి వెంకట్ రెడ్డి కల్వకుర్తి సీఐ భీమ్ కుమార్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఊరుకొండ ఎస్సై రమాదేవి, […] The post విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌన్ ఆలేరు అండర్పాస్ దగ్గర కుంగిపోయిన రోడ్డును మరమ్మత్తులు చేపట్టాలని, ఆలేరు పట్టణ వాసులు బందెల సుభాష్, లక్కాకులు ఉప్పలయ్య, పాశికంటి కృష్ణ గురువారం సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అండర్పాస్ నిర్మాణ పనుల్లో భాగంగా కొలనపాక రోడ్డు నుంచి పోచమ్మ గుడి వైపు వెళ్లే రోడ్డు నాణ్యత లోపించి కుంగిపోయి భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. దీనివలన వర్షాకాలంలో నీళ్లు నిలిచి భారీ వాహనాలు వెళ్లడం వలన అండర్ పాస్ సైడ్ వాల్ గోడకు పగుళ్లు ఏర్పడి […] The post కుంగిపోయిన రోడ్డును మరమ్మత్తు పనులు చేపట్టాలి appeared first on Navatelangana.

జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణనవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవల నిర్వహణపై ఆరా తీశారు. రోజువారీగా వచ్చే బయటి రోగుల (ఓపీ) వివరాలు, ఇన్పేషెంట్ల సంఖ్య, ఆస్పత్రిలో జరుగుతున్న కాన్పుల వివరాలను వైద్యాధికారిణి డాక్టర్ స్వప్నను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సిబ్బంది హాజరు […] The post విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు appeared first on Navatelangana.

రాష్ట్రంలో అక్టోబర్లో నిర్వహించనున్న ఒపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) విడుదల చేసింది. దూర విద్యావిధానంలో ఎస్ఎస్ఎస్, ఇంటర్మీడియట్ చదువుతున్న అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 17 వరకు ఫీజు చెల్లించవచ్చని టాస్ డైరెక్టర్ కె.లింగయ్య తెలిపారు. ఆ తర్వాత ప్రతి పేపర్కు రూ.25 ఆలస్య రుసుముతో ఆగస్టు 24 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో ఆగస్టు 29 వరకు పరీక్షలు ఫీజు చెల్లించవచ్చని అన్నారు. అలాగే తత్కాల్ కింద ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు ద్వారా ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు టాస్ అధికారిక వెబ్సైట్, టిజిఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల ద్వారా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని అన్నారు. అక్టోబర్లో జరగనున్న ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.త్వరలో పరీక్షల టైం టేబుల్ విడుదల చేస్తామని తెలిపారు.

బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి నవతెలంగాణ-మిడ్జిల్పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ, విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లె తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, రాష్ట్రంలో దాదాపు […] The post పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి appeared first on Navatelangana.

తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ డిసిఎం ప్రమాదానికి గురైంది. యాపిల్ పండ్ల లోడ్తో వెళ్తున్న డిసిఎం వ్యాన్ మాటేడు గ్రామ స్టేజి వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో యాపిల్ పండ్లు తీసుకునేందుకు స్థానిక జనం ఎగబడ్డారు. కొందరు సంచుల్లో కిలోలకొద్దీ పండను నింపి పట్టుకెళ్లారు.

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్లో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు అర్హత సాధించారు. నీరజ్ చోప్రా 79.61 మీటర్లు, రోహిత్ యాదవ్ 78.37 మీటర్లు, యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరారు. ఫైనల్ శుక్రవారం రాత్రి 10.15 గంటలకు ప్రారంభం అవుతుంది. డైరెక్ట్ క్వాలిఫికేషన్ మార్క్(84 మీటర్లు)ను ఎవరూ అందుకోలేకపోయారు. గ్లాస్గోలో బలమైన గాలులతో కూడిన వాతావరణం అథ్లెట్లకు ప్రతికూలంగా మారింది. అత్యుత్తమంగా శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగె 82.84 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచారు. అండర్సన్ పీటర్స్ (81.29 మీ, గ్రెనెడా), డౌ స్మిత్ (80.64 మీ, సౌతాఫ్రికా), బెన్ ఈస్ట్ (80.38 మీ, ఇంగ్లండ్) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. నీరజ్ ఐదో స్థానంలో నిలవగా.. రోహిత్ యాదవ్ తొమ్మిది, యశ్ వీర్ సింగ్ పదోస్థానంలో నిలిచారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ (78.63 మీ) ఏడో స్థానంలో నిలిచాడు.







న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసణ జరిగినప్పటి నుంచి ప్రధాని మోడీ పేరిట పలు నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఇప్పటికే కేంద్రం ఖండిస్తూ వస్తోంది. అయినప్పటికీ ఏదో ఒక రకంగా ఈ నకిలీ వార్తలు వస్తున్నాయి. తాజాగా మోడీ సంతకం చేసిన లేఖ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రధాని రాజీనామా చేశారంటూ పలువురు నెటిజన్లు దీనిని షేర్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఆధ్వర్యంలోని పిఐబి ఫ్యాక్ట్చెక్ స్పష్టత ఇచ్చింది. ‘‘ప్రధాని మోడీ సంతకం చేసినట్టుగా ఉన్న లేఖ ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. అదొక నకిలీ లేఖ. ప్రధాని సంతకం చేసిన అలాంటి లెటర్ ఏదీ జారీ కాలేదు. ఏదైనా ప్రచారాన్ని నమ్మే ముందు.. అధికారికంగా ధృవీకరించుకోండి. ఏదైనా సమాచారం అనుమానస్పదంగా అనిపించినప్పుడు సమాచారం ఇవ్వండి’’ అని పిఐబి ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారంపై సంప్రదించేందుకు (91 8799711259, factcheck@pib.gov.in) ఫోన్ నంబర్, మొయిల్ ఐడిని షేర్ చేసింది.सोशल मीडिया पर प्रधानमंत्री नरेंद्र मोदी के हस्ताक्षर वाला एक पत्र प्रसारित किया जा रहा है।#PIBFactCheck❌ यह पत्र #फर्जी है।✅ प्रधानमंत्री द्वारा ऐसा कोई पत्र न




అమరావతి: శ్రీకాకుళంలో మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శిస్తున్నారో, ఎవరిని కాపాడుతున్నారో అందరికీ తెలుసు అని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బంధువులను పరామర్శించాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తరోడ్డు జంక్షన్ కు జగన్ చేరుకున్నారు. కాన్వాయ్ కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర భారీ బందోబస్తు, అంపోలు జంక్షన్ వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేశారని, జగన్ వెళ్లే దారిలోనే ప్రధాని మోడీ పర్యటన ఉందని తెలియజేశారు. ప్రధానికి భద్రత కల్పించే దారిలో ఆందోళనలు చేయకూడదని, జగన్ పర్యటనలో ధర్నాలు, ర్యాలీలు, సభకు అనుమతి లేదని పార్థసారధి సూచించారు. పోలీసులపై దాడి చేసే స్థాయికి వైసిపి నేతలు వెళ్లారని, వైసిపి వెంట వెళ్లే యువకుల తల్లిదండ్రులు భయపడుతున్నారని విమర్శించారు. కానిస్టేబుళ్లను దూరం జరిపి మరీ మహిళా ఎస్ఐపై దాడికి దిగారని, భయపెట్టి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదని పార్థసారధి హెచ్చరించారు.

న్యూఢిల్లీ: ‘వందేమాతరం’ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. వందేమాతర గేయాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971లో సవరణలు చేసింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారనుంది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.