21551 వార్తలు





జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు, పలు ప్రాంతాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు శుక్రవారం జూలై 31 స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సెలవుకు బదులుగా ఆగస్టు 8 రెండో శనివారం అన్ని విద్యాసంస్థలు సాధారణంగా పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు.


ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు అధ్యాపకులను కించపరిచేవిధంగా మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సీపీఎస్ ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు కనీసం దరఖాస్తు నింపడం రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పాఠశాలలో చదివే చిన్నపిల్లల ముందు సైతం బూతులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సమాధి చేశారన్నారు. కాంగ్రెస్ పాలన సగం కాలం దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్నారు. హక్కులపై ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసులు, దాడులు చేయడమే తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులను ఏసీబ

టీమిండియా స్టార్ క్రికెటర్ అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రహానె జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. రహానె సారథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించి పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా రహానెకు టీమిండియాలో చోటు దక్కడం లేదు. యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇక జాతీయ జట్టులో స్థానం లభించడం కష్టమని భావించిన రహానె ఆటకు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని రహానె సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేశాడు. “ప్రతి దానికి ఆరంభం.. ముగింపు ఉంటాయనేది జీవిత సత్యం. సరైన సమయంలో దాన్ని గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం. తాను కూడా ఈ విషయాన్ని గుర్తించి తగిన సమయంలో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించాను” అని పేర్కొన్నాడు. కాగా రహానె తన కెరీర్లో 85 టెస్టులు ఆడి 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, మరో 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 92 వన్డేలు ఆడి 2,962 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మరో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయ


పశ్చిమ బెంగాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఓ మాజీ డ్రైవర్ ఇంట్లో కళ్లు చెందిరే రీతిలో నగదు, బంగారం బయటపడటం చర్చకు దారితీసింది. బీర్భుమ్ జిల్లాలో మీనార్ మొండల్ అనే రిటైర్డ్ బస్సు డ్రైవర్ నివాసంలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.28 కోట్ల నగదు, 15 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నోట్ల కట్టలు భారీగా ఉండటంతో వాటిని లెక్కించే క్రమంలో 5 కౌంటింగ్ మెషీన్లు విఫలమైనట్టు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం, తులు మొండల్ అనే శిలల వ్యాపారికి మీనార్ మొండల్ బంధువు. తులు మొండల్ తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత అనుబ్రత మొండల్కు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో వీరు అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించగా రూ.5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారం లభించాయి. ఆ తర్వాత తనిఖీలు కొనసాగించడంతో నగదు మొత్తం సుమారు రూ.28 కోట్లకు చేరింది. ఈ ఘటనపై మీనార్ మొండల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని పోలీసులు వెల్లడించారు

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఇకపై వారానికి ఒకసారి విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని గురువారంనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ వెల్లడించారు. ప్రతిపాదనను ముఖ్యమంత్రి విజయ్కు సిఫారసు చేశామని, దీన్ని ఆయన పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకం కాలక్రమేణా అనేక మార్పులు చూసిందని మంత్రి రాజ్మోహన్ గుర్తుచేశారు. జస్టిస్ పార్టీ కాలంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కామరాజ్ విస్తరించారని, కరుణానిధి గుడ్లను ప్రవేశపెట్టారని తెలిపారు. ఇక ఎంజీఆర్, జయలలిత మరిన్ని పోషకాహార అంశాలను జోడించారని చెప్పారు. అదే తరహాలో విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలని తాను ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

దేశంలో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు పార్లమెంటులో ‘ప్రజా పరీక్షల (సవరణ) బిల్లు’ను ప్రవేశపెట్టడాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ స్వాగతించారు. ఈ సంస్కరణలు పరీక్షలకే పరిమితం కాకుండా మొత్తం విద్యావ్యవస్థలోనూ మార్పులకు దారితీయాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లద్దాఖ్కు వెళ్తున్న సమయంలో వాంగ్చుక్ ‘ఎక్స్’లో ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్కు వందేభారత్ రైలులో ప్రయాణించినట్లు తెలిపారు. చెనాబ్ రైలు వంతెన మీదుగా సాగిన ప్రయాణం ఎంతో అందమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. “భారతీయ రైల్వేలను చూసి ఎంతో గర్వపడుతున్నాను” అని పేర్కొన్నారు. తన బృందంతో కలిసి కశ్మీర్లో ఒక రోజు గడిపిన అనంతరం లద్దాఖ్కు వెళ్తామని తెలిపారు. పరీక్షల వ్యవస్థను మెరుగుపరిచేందుకు పార్లమెంటులో బిల్లు తీసుకురావడం సంతోషంగా ఉందని వాంగ్చుక్ పేర్కొన్నారు. “సంస్కరణలు పరీక్షల్లోనే కాకుండా విద్యావ్యవస్థలోనూ వస్తాయని ఆశిస్తున్నాను” అని అన్నారు.ఆందోళన ముగిసిన అనంతరం తనకు, కాక్ర

మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్కు ఆనుకుని ఉన్న దర్గా ఆవరణలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు గురువారంనాడు అనుమతించింది. వివాదాస్పద ప్రాంతానికి పక్కన ముస్లింలకు కొంత స్థలాన్ని ప్రార్థనల కోసం కేటాయించాలని, ఆ స్థలంలో శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. తమ అనుమతి లేకుండా వివాదాస్పద భోజ్శాల ఆలయ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పురావస్తు శాఖలు ఆదేశాలు జారీ చేసింది.శుక్రవారం నమాజ్లకు ధార్లోని వివాదాస్పద స్థలానికి పక్కన వేరే ఓపెన్ స్పేస్ కేటాయించాలని జూలై 14న బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రత్యామ్నాయ స్థలం విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ధార్ యంత్రాంగం పాటించలేదని, వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్కు్ 1.3 కిలోమీటర్ల దూరంలో స్థలం చూపించిందని ముస్లిం వర్గానికి చెందిన హాజీ మనీర్ అహ్మద్ సుప్రీంకోర్టు ఆశ్రయించా



శ్రీశైలం జలాశయానికి గురువారం జూరాల ప్రాజెక్టు నుంచి 85 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. ఎగువ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతమైన తెలుగు రాష్ట్రాలలో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రారంభమైంది. గత ఏడాదితో పోల్చుకుంటే రెండు నెలలు ఆలస్యమైన కృష్ణా నదికి వరద ప్రవాహం వస్తుండడం ఎల్ నీనో ప్రభావం ఉన్నవేళ వరదరావడం ఊరటగా చెప్పవచ్చు. ఎగువ కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండుకుండగా మారడంతో జూరాల ప్రాజెక్టుకు 94 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో 12 గేట్లను ఎత్తి 47 వేల 196 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా జూరాలలో జల విద్యుత్ ను ఉత్పత్తి చేసి మరో 38వేల225 సెక్కుల నీటిని దిగువ శ్రీశైలం వైపుకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను రెండు రోజులుగా వరద ప్రవాహం వస్తుండడంతో ఆరు టీఎంసీల మేరా నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంది దీంతో ప్రస్తుత నీటిమట్టం అడుగులలో 827. 30 అడుగులకు చేరుకుంది.215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 46. 8234 టీఎంసీల మేరా నీరు నిల్వ ఉంది.గత ఏడాది




మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్యాస్ గోదాం సమీపంలో ఓ ఇంటి ఆవరణలోకి సుమారు 12 అడుగులున్న కొండచిలువ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మహేందర్ అతి కష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.


నవతెలంగాణ-నవాబు పేటమండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలో బెల్టు షాపులను బంద్ చేయాలని మధ్యం నిషేధించాలని గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ పంచాయతీ కార్యదర్శి నరెందర్ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు యువత ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యవత అత్యధికంగా ఉదయం నుంచి రాత్రి వరకు సమయం సందర్భం లేకుండా విచ్చలవిడిగా మధ్యం సేవిస్తూ ఆర్థిక పరంగా కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా మద్యానికి బానిసై పూర్తిగా వ్యసనాలకు బానిసైపోతున్నారని తెలిపారు. అందుకే ఈ కఠినమైన […] The post బెల్టు షాపులను బంద్ చేయాలని తీగలపల్లి జీపీ ఏకగ్రీవ తీర్మానం appeared first on Navatelangana.

నవతెలంగాణ-నవాబు పేటనవాబు పేట మండల ఫోటో స్టూడియో వీడియో గ్రాఫర్ ల సంఘం ఆంజనేయులు అధ్యక్షుడిగా కుమ్మరి రాఘవేందర్ కార్యదర్శిగా కుమ్మరి రాజేంద్రప్రసాద్ కోశాధికారిగా బి. రమేష్ ఉపాధ్యక్షులుగా దొంగల రాజు జనరల్ సెక్రటరీగా రాజశేఖర్ రెడ్డి, బి.శేఖర్ యాదయ్య గౌరవాధ్యక్షులుగా సలహాదారులు, డి.యాదయ్య రాఘవేందర్ సలహాదారుగా బి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా రమేష్, శ్రీశైలం సిల్వర్, గోపాల్, మహేందర్, శ్రీకాంత్, లోకేష్, శ్రీశైలం, నరేష్, వెంకటేష్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. […] The post మండల ఫోటో, వీడియో గ్రాఫర్ నూతన కార్యవర్గం ఎన్నిక appeared first on Navatelangana.