21551 వార్తలు

మన తెలంగాణ/హైదరాబాద్: అధికారం, ఓట్లు ఎక్కువగా ఇచ్చే శాఖలపైనే సాధారణంగా అందరికీ మక్కువ ఉంటుందని, ఓట్లు రావని తెలిసినా విద్యార్థుల భవిష్యత్తు, సమాజంలో మార్పు కోస మే తాను విద్యా శాఖ తీసుకున్నానని ముఖ్యమం త్రి ఎ.రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కొందరు విద్యాశాఖకు మంత్రి లేడు అని, త్వరగా ఆ శాఖకు ఓ మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారని, అయితే ఏ కారణంతో తాను విద్యాశాఖకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూల్స్లో చేరుతున్న వారి సంఖ్య పెంచినందు కా.. నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకా..? అని ప్రశ్నించారు. టీచర్ల నియామకం, ప్రమోషన్లు సక్రమంగా చేపట్టినందుకా.. ఐటీఐలను ఎటిసిలుగా మార్చినందుకా.. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా.. ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గా నియమించినందుకా..? అని అడిగారు. తాను ఎందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలో వాళ్లు తెలపాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం, రాజకీయం కోసం తాను పని చేయడం లేదని సి ఎం స్పష్టం చేశారు. ప్రపంచంతో తెలంగాణ వి ద్యార్థులు పోటీ పడాలనేదే తన లక్ష్యం అని పేర్కొన్నార

మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్ నినో ప్రభావంతో నెర్రలు బారిన జలాశయం, వరద కాలువలు భారీ వర్షాలకు నీటి సవ్వడులతో సందడి చేస్తున్నాయి. వాగుల్లోకి, చెరువులు, చిన్నపాటి కుంటల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడా ది వర్షాకాలం వర్షాభావ పరిస్థితులకు బెంబేలెత్తిన ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రో జులుగా కురుస్తున్న వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వా యుగుండ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. మంత్రులు, అధికారులు వరుస సమీక్షలు నిర్వహించి అధికారులు అప్రమత్తం చేశారు. అ యితే తాజాగా కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తం గా 30శాతంగా ఉన్న లోటు వర్షపాతం, సాధారణ వర్షపాతానికి దగ్గరగా చేరుకుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్1 నుంచి ఈ నెల 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 353.5 మిల్లీ మీ టర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్ర స్తుతం 315.8 మిల్లీ మీటర్లతో 11 శాతం లోటు నమోదైంది. అయితే రానున్న

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, విస్తరణపై రాజకీ య వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతితో సమావేశం తరువాత రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత చి త్రాలను విడుదల చేసింది. రాష్ట్రపతి ముర్ము మాల్దోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దే శాల్లో వారం రోజుల పాటు పర్యటించిన తరువాత ఆదివారం తిరిగి వచ్చాక ఈ భేటీ జరిగిం ది. ఇరువురు చర్చించిన అంశాలపై ఎలాంటి వివరాలు విడుదల కాలేదు. కాగా, అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు సీనియర్ మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. గురువారంనాడు పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్,విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎరువులశాఖ మంత్రి జెపి నడ్డా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రె

న్యూఢిల్లీ: పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారు, అందులో భాగస్వాములైన వారిని కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించేందుకు ఉద్దేశించిన ‘పబ్లిక్ పరీక్షల (అనుచిత పద్ధతుల నివారణ) సవరణ బిల్లు 2026’కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు గురువారంనాడు రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్సభలోనూ బుధవారంనాడు సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఈ సవరణ బిల్లు ఆమోదం పొందింది. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లోనూ చట్టసవరణకు ఆ మోదం లభించినట్టయింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రభుత్వం పంపించనుంది. రాష్ట్రపతి ఆమోదం తెలపగానే బిల్లు చట్టరూపం సంతరించుకుంటుంది. పబ్లిక్ పరీక్షల (అనుచిత పద్ధతుల నివారణ) సవరణ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఏడు గంటల పాటు తెచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు మాత్రం కాదని అన్నారు. పేపర్ లీక్లు జరక్కుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై కేంద్రం వివరించ లేదని తప్పుపట్టారు. భారీ జరిమానాలు, కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. ప్రభుత్వం ఎలా పరీక్షలు నిర్వహిస్తుందనే దానిపైనే పేపర్ లీక్ల

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ యునానీ మందు ‘జిందా తిలిస్మాత్’ గురువారం పెద్దల సభలో మారు మోగింది. రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ప్రతి పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ‘జిందా తిలిస్మాత్’ గురించి ప్రస్తావించారు. హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ ఔషదం ‘జిందా తిలిస్మాత్’ను స ర్వరోగ నివారణిగా ప్రాచుర్యం పొందిందని వివరించారు. అచ్చంగా ఆ మందు మాదిరిగానే పార్లమెంట్లో ఏ సమస్య వచ్చినా బిజెపి ప్రభుత్వం జెపి నడ్డా, జితేంద్ర సింగ్ ఇద్దరు మంత్రులను రంగంలోకి దింపుతుందని ఖర్గే ఎద్దేవా చేశారు. ఈ సందర్భాంగా హైదరాబాద్లో ‘జిందా తిలిస్మాత్’ అనే ప్రసిద్ధి మందు ఒకటి ఉంటుందనిఅన్నారు. ఏ రోగాన్నిఅయినా తగ్గిస్తుందని పేరు రావడపంతో సర్వరోగ నివారిణిగా దానికి పేరు వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం కూడా ఏ అంశంపైనా అయినా సమస్య ఏదైనా ఈ ఇద్దరుమంత్రులనే రంగంలోకి దింపుతుందనిమల్లికార్జున్ ఖర్గే చమత్కరించారు. హైదరాబాదులో తయారయ్యే ప్రసిద్ధ యునానీ మందు జిందా తిలిస్మాత్ హైదరాబాదులో తయారయ్యే ప్రసిద్ధ యునానీ మందు. జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరం.. ఇల

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మ ధ్యాహ్నా భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కు వ దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఎక్స్టెన్షన్ అధికారులను నియమించి, సంబంధిత విభాగాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ సిఎంకు నివేదిక సమర్పణ గురువారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు కలిసి ఈ నివేదికను సిఎం రేవంత్రెడ్డికి సమర్పించార

పాశ్చాత్య దేశాల చట్టాలతోవిదేశీ నిధుల పారదర్శకత పేరుతో కేంద్రం వాదనకు ఆర్చ్బిషప్ జోసెఫ్ డిసౌజా ఖండనఅమెరికా, బ్రిటన్ చట్టాలు వివరాలకే పరిమితం..భారత్లో మాత్రం అనుమతి, నియంత్రణ, రద్దు అధికారాలన్నీ ప్రభుత్వానివేపౌర సమాజ సంస్థల స్వేచ్ఛపై ఎఫ్సీఆర్ఏ ఉచ్చు బిగుస్తోందని విమర్శ న్యూఢిల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)ను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రజాస్వామ్య దేశాల చట్టాలతో పోల్చడం వాస్తవాలను వక్రీకరించడమేనని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు, గుడ్ షెపర్డ్ […] The post ఎఫ్సీఆర్ఏ పోలిక సరికాదు appeared first on Navatelangana.

టీచర్లు, ఆయాలతో జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలి : మంత్రి సీతక్క ఆదేశాలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలనీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గతేడాదిలో అదనంగా 5,938 కేంద్రాలకు టాయిలెట్ సదుపాయం, 3,815 కేంద్రాలకు తాగునీటి సదుపాయం, 14,271 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించినందుకు అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. […] The post అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి appeared first on Navatelangana.

జాతీయ గీతం ‘వందేమాతరం’ బిల్లును లోక్సభ ఆమోదించింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు2026’ను రాజ్యసభ బుధవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. వందేమాతర గేయాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చేందుకు మార్గం సుగమమైంది.నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్య గురించి చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు లోక్సభలో ఆందోళన కొనసాగించారు. ఈ గందరగోళం మధ్యే బిల్లుపై కొద్దిసేపు చర్చించిన అనంతరం సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం1971’ పరిధిలోకి వందేమాతరాన్ని తీసుకురావడమే తాజా సవరణ బిల్లు ఉద్దేశం. ప్రస్తుతం రాజ్యాంగం, జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలను అవమానించిన వారికి ఈ చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తాజా సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత వందేమాతరాన్ని అవమానించినా, దాని ఆలాపనకు ఆటంకం కలిగించినా లేదా ఆలాపన సమయంలో ఉద్దేశపూర్వకంగా అ

నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలుశాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డిప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేర్చడంతో పాటు, ప్రజల కష్టాలు, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయడంలో నవతెలంగాణ దిన పత్రిక చేస్తున్న కృషి అభినందనీయం. ఆ పత్రికకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ‘నవతెలంగాణ’ మరింతగా అభివృద్ధి చెంది తెలంగాణ ప్రజల ఆదరణను చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులు, జర్నలిస్టులకు శుభాకాంక్షలు. The post ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచే పత్రిక appeared first on Navatelangana.

కైరో: ఇరాన్అమెరికా మధ్య జరుగుతున్న గల్ఫ్ యుద్ధం ఈజిప్ట్కు విస్తరించింది. ఈజిప్టులోని డమియెట్టా పోర్ట్లోని అమెరికాకు చెందిన గ్యాస్ ట్యాంకర్పై బుధవారం డ్రోన్ దాడి జరగడం పరిస్థితిని మరింత జఠిలం చేసింది. ఈ దాడులకు ఎవరు బాధ్యులనేది వెంటనే నిర్ధారణ కానప్పటికీ, ఈ దాడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, అయితే డ్రోన్ దాడి జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఈజిప్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దీంతో ఇంతకాలం ఇరాన్, గల్ఫ్ దేశాలకు పరిమితమైన యుద్ధం మరో టర్న్ తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. పర్యవసానంగా అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్యలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు గురువారంనాడు ఇరాన్పై అమెరికా శక్తివంతమైన దాడులతో విరుచుకుపడింది. ఖెష్మ్ ద్వీపంలోని గృహసముదాయంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు టెహ్రాన్ ధ్రువీకరించింది. జోర్డాన్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బుధవారంనాడు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో శక్తివంతమైన దాడులు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే దక్షిణ ఇరాన్లో శక్తివంతమై

వరద సహాయక చర్యలపైమంత్రి శ్రీధర్బాబు వీడియో కాన్ఫరెన్స్ నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోగోదావరిఖని, పెద్దపల్లి, సింగరేణి ఏరియాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయమైన నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారంనాడాయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ర్ట సచివాలయం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్కో సీఎండీ, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ […] The post పునరావాస చర్యలు తీసుకోండి appeared first on Navatelangana.

జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకుసీఎస్ సంజయ్ జాజు ఆదేశం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలపై గురువారం హైదరాబాద్లోని బీఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి డీజీపీ సీవీ. ఆనంద్తో కలిసి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు […] The post భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.

30 శాతం లోటు వర్షపాతం…అడుగంటిన భూగర్భజలంప్రత్యామ్నాయ పంటల సాగును క్షేత్రస్థాయిలో ప్రోత్సహించాలివిత్తనాలను 75 శాతం రాయితీపై ఇవ్వండిడ్రిప్ ఇరిగేషన్ను ప్రోత్సహించేందుకు రూ.402 కోట్లు కేటాయించండిప్రభుత్వానికి నివేదించిన నిపుణుల కమిటీ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తెలంగాణపై ఎల్నినో ప్రభావం తీవ్రస్థాయిలో ఉందనీ, నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు, రైతులను ఆదుకునేందుకు రూ.802.92 కోట్లను కేటాయించాలని ఎల్నినోపై డాక్టర్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో వేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి నివేదికను అందజేసింది. రాష్ట్రంలో 33 […] The post ఎల్నినో నష్టనివారణకు రూ.802.92 కోట్లు అవసరం appeared first on Navatelangana.

ఢిల్లీ ఘటనపై నోరు విప్పాలివిద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా? వారిపై లాఠీఛార్జ్కు ఆయనే బాధ్యుడుపేపర్ లీక్ను ఫాస్ట్ట్రాక్ కోర్టులు పరిష్కరించవు ప్రభుత్వం అప్రకటితఎమర్జెన్సీని విధించింది రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవా యువు కూడా ప్రయోగించారని తెలిపారు. పోలీసుల తీరుపై కేంద్రం హోం […] The post అమిత్ షా మౌనం దేనికి? appeared first on Navatelangana.

లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్న్యూఢిల్లీ : లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గురువారం ప్రీవిలేజ్ (సభా హక్కుల ఉల్లంఘన) నోటీసు, సభా ధిక్కరణ నోటీసును లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ‘అనుచితమైన, అవమానకరమైన భాషను ఉపయోగించడం, తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు చేయడం’ పై ఈ నోటీసులు ఇస్తున్నట్టు బీజేపీ ఎంపీ తెలిపారు. మూడు పేజీల […] The post రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీస్ appeared first on Navatelangana.

నాణ్యమైన విద్యకోసంఏం చేయాలో మీరే చెప్పండిఒక్కో విద్యార్థిపై రూ.1.8 లక్షలు ఖర్చు చేస్తున్నాతల్లిదండ్రులు ఎందుకు ప్రయివేటుకు పంపుతున్నారో ఆలోచించండిటీచర్ల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదేఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయ బృందంతోసీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందనీ, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సీఎం ఏ రేవంత్రెడ్డి అన్నారు. వారిద్దరి బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామనీ, అదే సమయంలో ఉపాధ్యాయ […] The post ఉపాధ్యాయులదే భావితరం బాధ్యత appeared first on Navatelangana.

విద్యార్థులపై దాడికి ఎవరు ఆదేశాలిచ్చారు?రామ మందిర దోపిడీపై కేంద్రం వివరణ ఇవ్వాలియూపీ ప్రభుత్వ విచారణ ఒక బూటకంపార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల వినూత్న ఆందోళననినాదాలతో హోరెత్తించిన ఎంపీలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోవిద్యార్థులపై పోలీసుల చర్య, అయోధ్యలోని రామ మందిరంలో చందాచోరీకి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. గురువారం ఉభయ సభల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మకర ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రామ మందిరంలో విరాళాల దొంగతనాన్ని తెలిపేలా… హుండీలో […] The post కేంద్ర హోం మంత్రి సభకు రావాలి appeared first on Navatelangana.

మేషంఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన ఋణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. మిధునం చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది. కర్కాటకం చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. సింహం ఋణదాతల ఒత్తిడులు చికాకు కలిగి

హైదరాబాద్లో పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేపట్టిన డోర్స్టెప్ ఫర్నిచర్ వ్యర్థాల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు 2,598 పాత ఫర్నిచర్ వస్తువులను అధికారులు సేకరించారు. రోడ్లు, ఖాళీ స్థలాలు, కాలువల్లో భారీ వ్యర్థాలు పడేయకుండా ప్రజలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఐఐటికె కొత్తగా ప్రారంభించిన బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బీటెక్ ప్రోగ్రామ్లో ప్రవేశం లభించని ఓ విద్యార్థి ఆ సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేసిన సంఘటన జరిగింది. ఆ వెబ్సైట్లో విద్యార్థి “నాకు కావలసిందల్లా నాకు న్యాయమైన అవకాశం.”పేర్కొన్నాడు. సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్లో తిరస్కరించిన తరువాత తాను కాన్పూర్, మద్రాస్ ఐఐటిల వెబ్సైట్లను హ్యాక్ చేసినట్టు వివరించాడు. ఇది హానికలిగించడానికి కాదని, తన సామర్ధాన్ని ప్రదర్శించడానికే అని చెబుతూ చొరబాటుకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఎక్స్, రెడ్డిట్ల్లో పంచుకున్నాడు. అతను దరఖాస్తు సమర్పించి, ఫీజును చెల్లించి, అవసరమైన అన్నిపత్రాలను సమర్పించినా తనకు అవకాశం కల్పించలేదని,ప్రవేశ ప్రక్రియలో భాగమైన హ్యాకథాన్లో కూడా నిరాకరించారని ఆరోపించాడు. అయితే సైబర్ సెక్యూరిటీలో ఆ విద్యార్థికి అనుభవం లేనందునే అతనిని షార్ట్లిస్టు చేయలేదని ఐఐటికె డైరెక్టర్ మునీంద్ర అగర్వాల్ వెల్లడించారు. ఈ విద్యాసంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ముగిసినందున ఇప్పుడు ప్రవేశం కుదరదన్నారు. అయినప్పటికీ ఆ విద్యార్థిని ఆహ్వానించి అతని సాంకేతిక నైపుణ్యాలను పరీక్షిస్తామని, సామర్థాన్ని నిరూపించుకుంట

పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు-2026పై చర్చ సందర్భంగా ‘అనుచిత వ్యాఖ్యలు’ చేశారంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ నోటీసును గురువారంనాడు ఆయన అందజేశారు. హోం మంత్రి అమిత్షాపై రాహుల్ నిరాధార ఆరోపణలు చేశారని, అభ్యంతకరమైన పదజాలం వాడారని మూడు పేజీల నోటీసులో అనూరాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కోసం దీనిని సభాహక్కుల కమిటీకి పంపాలని, తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. తన వ్యాఖ్యలపై హోం మంత్రికి, సభకు బేషరతుగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులతో మాట్లాడిన విషయాలను రాహుల్ లోక్సభలో ప్రస్తావిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అధికార పక్ష ఎంపీలు అభ్యంతరం తెలిపాయి. తీవ్ర గంగరగోళ పరిస్థితుల మధ్య రాహల్ వ్యాఖ్యలను సభా రికార్డులను తొలగించాలని స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు.

కన్న తండ్రే రక్షణ ఇవ్వకపోతే ఇక ఈ సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. కట్టుబాట్లను, మానవత్వ విలువలను కాలరాస్తూ సొంత ఇంట్లోనే ఇలాంటి అమానుషాలకు ఒడిగడుతుండటంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కన్న కూతురిపై ఓ తండ్రి అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మైనర్ కూతురిపై పలు మార్లు లైంగికదాడి పాల్పడిన ఓ తండ్రిని గురువారం వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మున్సిపాలిటీ పరిధిలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండో భార్యకు మగ్గురు పిల్లలు. రెండో భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో చిన్న కూతురిపై కన్న తండ్రే కామాంధుడిగా మారి మైనర్ కూతురు అని చూడకుండా పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. సదరు బాలిక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నది. తండ్రి లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని బయట ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. తండ్రి మాటలకు భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. హాస్టల్కు వెళ్లిన తరువాత తనకు కడ